Posts

Showing posts from September, 2020

‘కరోనా వైరస్’ని రంగంలోకి దించిన ఆర్జీవీ.. రిలీజ్ అప్పుడేనట

Image
లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లు తెరుచుకునే సమయం ఆసన్నమైంది. అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పలువురు నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ కోవలోనే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ లాక్‌డౌన్ తర్వాత విడుదలయ్యే తొలి సినిమా తనదేనని ప్రకటించారు. Also Read: లాక్‌డౌన్ సమయంలో ఏటీటీల ద్వారా పలు సినిమాలను విడుదల చేసిన వర్మ ప్రస్తుతం `కరోనా వైరస్` పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. దీనికి అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో `కరోనా వైరస్`ను వర్మ విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. Also Read: `మొత్తానికి అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి సినిమాగా `కరోనా వైరస్` నిలుస్తుందని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది` అంటూ రామ్‌గోపాల్ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. Also Read:

Vijay Devarakonda: సౌత్ హీరోల్లో టాప్ లేపిన విజయ్... ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

Image
యంగ్ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. తనని తాను రౌడీగా ఫీలయ్యే ఈ సెన్సేషనల్ స్టార్ అభిమానులను ఎల్లప్పుడూ అలరిస్తూనే ఉంటాడు. రౌడీ బ్రాండ్‌‌తో కొంతకాలం క్రితం ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టిన ఆయన యూత్‌కి ఐకాన్‌గా మారిపోయాడు. బయటే కాదు సోషల్‌మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే విజయ్ తాజాగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. అదేంటో తెలుసా.. ఇన్‌స్టాగ్రామ్‌లో 9 మిలియన్ల ఫాలోవర్స్‌ సాధించుకున్నాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 9 మిలియన్ల ఫాలోవర్స్‌ని కలిగిన ఏకైక హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. Also Read: దక్షిణాది ఏ హీరోకూ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్న తమ అభిమాన హీరోని చూసి అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. 2018, మార్చి 7న త‌న అకౌంట్‌ని ప్రారంభించారు. ఇంత త‌క్కువ వ్యవధిలోనే 9 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకోవ‌డంతో ఆ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ రికార్డుగా చెబుతున్నారు. విజ‌య్ ప్రస్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో `ఫైట‌ర్‌` సినిమాలో నటిస్తున్నాడు. డైరెక్టర్‌ సుకుమార్‌‌తో చేసే క్రేజీ ప్రాజెక్టుపై కొద్దిరోజుల క్రితమే ప్రకటన వెలువడింది. Also Read:

పాన్ ఇండియా మూవీగా ‘సైనైడ్’ ... కీలక పాత్రలో ప్రియమణి

Image
మహిళలను ప్రేమ పేరుతో శారీరకంగా అనుభవించి ఆపై గర్భనిరోధక మాత్రలను నమ్మించి సైనైడ్‌ ఇచ్చి చంపేసిన మోహన్ అనే సైకో కిల్లర్ దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన మోహన్ ఏకంగా 2003 - 2009 కాలంలో ఏకంగా 20 మంది మహిళలను కనికరం లేకుండా చంపేశాడు. న్యాయస్థానం అతడికి ఆరు మరణశిక్షలు, 14 జీవితఖైదులు విధించింది. ఈ కేసు ఆధారంగా దర్శకుడు రాజేశ్‌ టచ్‌రివర్‌ ‘సైనైడ్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా హిందీలో పాన్‌ ఇండియా మూవీగా ప్రదీప్‌ నారాయణన్‌ నిర్మిస్తున్నారు. Also Read: ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటించనున్నారు. హిందీలో ఆ పాత్రను యశ్‌పాల్‌ శర్మ పోషిస్తారని దర్శకుడు రాజేశ్‌ తెలిపారు. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత ప్రదీప్‌ నారాయణన్‌ వెల్లడించారు. తనికెళ్ల భరణి, సమీర్‌, రోహిణి, చిత్రంజన్‌ గిరి తదితరులు నటించనున్న ఈ చిత్రానికి జార్జ్‌ జోసెఫ్‌ సంగీతం అందించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘సంచలనాత్మక కేసు ప్రేరణతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో ప్రియమణి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు’ అని త

కీర్తిసురేష్ సినిమాపై వివాదం... నట్టికుమార్ కొడుకు, కుమార్తెపై కేసు నమోదు

Image
సినీ నిర్మాత నట్టి కుమార్‌ కుమారుడు, కుమార్తెలపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నట్టిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత నట్టి క్రాంతి, క్విటీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన నట్టి లక్ష్మి కరుణ సినీ హక్కుల విషయంలో తనను మోసం చేశారంటూ ఫ్రెండ్లీ మూవీస్‌ యజమాని అడ్డాల చంటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు కథనం ప్రకారం.. సీనియర్ నటుడు నరేస్ తనయుడు నవీన్‌ విజయ కృష్ణ, కీర్తి సురేష్‌ జంటగా నటించిన ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమాకు సంబంధించి ప్రసార, శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులు అడ్డాల చంటి వద్ద ఉన్నాయి. Also Read: ఆ హక్కులను తమకు విక్రయించాలని నట్టి క్రాంతి, నట్టి లక్ష్మీకరుణ కొంతకాలం క్రితం చంటిని సంప్రదించారు. ఇందుకోసం రూ.45 లక్షలు మూడు వాయిదాల్లో చెల్లిస్తామని ఒప్పందం చేసుకుని మూడు చెక్కులిచ్చారు. అయితే చెక్కుల్లో ఉన్న అమౌంట్‌లో తేడా ఉండటంతో మరో మూడు చెక్కులు ఇస్తామని నమ్మించారు. ఎన్ని రోజులు గడుస్తున్నా వారి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో చంటి ఆ సినిమా హక్కుల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. Also Read: వారిద్దరిపై తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సైతం చంటి

‘డ్రగ్స్ అమ్ముకోవాల్సిన అవసరం మాకు లేదు’.. అధికారులపై హీరోయిన్ల ఫైర్

Image
డ్రగ్స్‌ కేసులో అరెస్టయి ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న కన్నడ హీరోయిన్లు సంజనా గల్రాని, రాగిణి ద్వివేదిలను ఈడీ అధికారులు బుధవారం కూడా విచారించారు. సంజనా పేరిట 11 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని, వాటిలో రూ.40లక్షల వరకు అమౌంట్ ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఆమె ఐఎంఏ సంస్థలో పెద్ద మొత్తంలో బంగారంపై పెట్టుబడి పెట్టినట్ల విచారణలో వెలుగులోకి వచ్చింది. సంజనాకు అరెస్ట్ చేయడానికి నాలుగు వారాల ముందు నుంచి అనేక బ్యాంక్ అకౌంట్లలోకి భారీగా నగదు ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించారు. Also Read: కూడా విదేశాల నుంచి డ్రగ్స్‌ తెప్పించుకుని చాలామందికి సరఫరా చేసిందన్న కోణంలో అధికారులు విచారించారు. వీరితో పాటు జైలులో ఉన్న ఇతర నిందితులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, సినిమాలు, షాపింగ్‌మాల్స్ ఓపెనింగ్స్, యాడ్స్‌ ద్వారానే ఆదాయం సంపాదించామని ఇద్దరు హీరోయిన్లు తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ అమ్ముకుని సొమ్ము చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని అధికారులతో వాదనకు దిగినట్లు సమాచారం. Also Read: అయితే నగదు బదిలీ, డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన ప్రశ్నలకు వారిద్దర

వాళ్లను కాపాడటానికి రక్తదానం ఒక్కటే పరిష్కారం : బాలకృష్ణ

Image
వైద్య రంగం ఎంతగా అభివృద్ధి చెందినా కృత్రిమంగా రక్తం తయారు చేయడం కుదరదని అన్నారు హీరో, హిందూపురం ఎమ్మెల్యే . అందువల్లే అందరూ రక్తదానం చేయాలని సూచించారు. ముఖ్యంగా వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. Also Read: ప్రస్తుతం దేశంలో సంవత్సరానికి 10-12వేల మంది తలసేమియా వ్యాధితో జన్మిస్తున్నారని, వారికి రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. వీరి కోసం కృత్రిమ రక్తాన్ని తయారు చేయలేం కాబట్టి.. రక్తదానం ఒక్కటే పరిష్కారమని తెలిపారు. ఎదుటివారికి రక్తదానం, ప్లాస్మా దానం చేయడం వల్ల మనకెలాంటి దుష్పరిణామాలు ఉండవని చెప్పారు. Also Read: అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తలసేమియా బాధితుల కోసం తెలంగాణా తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు బాలకృష్ణ తెలిపారు. నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. Also Read:

Unlock 5.0: థియేటర్లకు, సూళ్లకు గ్నీన్ సిగ్నల్..

Image
క రోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ ఆంక్షలను క్రమంగా తొలగిస్తూ వస్తున్న కేంద్రం.. తాజాగా మరిన్ని మినహాయింపులు ఇచ్చింది. , మల్టీప్లె్క్సులు, ఎగ్జిబిషన్ హాళ్లు, స్విమ్మింగ్‌పూల్స్ తెరుచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. పలు ఆంక్షలను విధించింది. బుధవారం (సెప్టెంబర్ 30) రాత్రి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాల మధ్య, అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని స్పష్టం చేసింది. ప్రయాణాలకు ఎలాంటి పాసులు అక్కర్లేదని పేర్కొంది. కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను అక్టోబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. మార్గరద్శకాలు.. ✧ కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరిచేందుకు అనుమతి. అయితే.. 50 శాతం సీట్ల సామర్థ్యంతోనే సినిమా హాళ్లను తెరుచుకోవాలి. ✧ అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు తెరుచుకోవచ్చు. ఆ నిర్ణయాధికారం పూర్తిగా రాష్ట్రాలదే. పిల్లలను పంపించే అంశంపై తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి. ✧ క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్ పూల్స్ తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్. ✧ కంటైన్‌మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.

ఆ ఘనతకు 21ఏళ్లు.. జ్ఞాపకాల్లో మునిగి తేలుతున్న త్రిష

Image
తమిళ, తెలుగు భాషల్లో సుమారు దశాబ్దం పాటు అగ్ర హీరోయిన్‌గా కొనసాగింది చెన్నై బ్యూటీ త్రిష. రెండు భాషల్లోనూ స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ ఆడిపాడింది. అయితే సినిమాల్లోకి రాకముందు ‘మిస్ చెన్నై’ ఎంపికైన సంగతి అందరికీ తెలిసిందే. సరిగ్గా 21ఏళ్ల క్రితం అంటే 30-09-1999వ తేదీన ఆమె ఈ టైటిల్ గెలుచుకుంది. Also Read: ఆ సందర్భాన్ని త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా గుర్తుచేసుకుంది. `మిస్ చెన్నై`గా నిలిచినప్పటి ఫొటోను షేర్ చేసింది. ‘30-09-1999.. ఆ రోజు నా జీవితం మారిపోయింది. ‘మిస్ చెన్నై 1999’ అంటూ కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు త్రిషను అభినందనలతో ముంచెత్తుతున్నారు. Also Read:

కొడతావా కొట్రా.. సొహైల్‌-రాజశేఖర్ ‘బిగ్’ ఫైట్

Image
ప్రోమోల్లో ఉన్నంత పస.. బిగ్ బాస్ ఆటలో ఉండటం లేదు కానీ.. రోజూ మాదిరే ఈరోజు కూడా బిగ్ బాస్ ఎపిసోడ్‌కి సంబంధించి మంటపుట్టించే ప్రోమో వదిలారు. కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం ‘కిల్లర్ కాయిన్స్’ అనే టాస్క్ బిగ్ బాస్ హౌస్‌లో మంచి హీట్ మీద సాగుతోంది. పై నుంచి కాయిన్స్ విసరడం.. కింద నుంచి వీళ్లు ఏడుకోవడం.. అడ్డువచ్చినోడ్ని పక్కకు నెట్టేయడం.. తేడాలొస్తే కొట్టేయడం.. ఒళ్లుహూనం అయ్యేలా ఆ కాయిన్స్ కోసం ఇంటి సభ్యులు కొట్టుకుచస్తున్నారు. ఇక ఈవారం ఎలిమినేషన్‌లో ఉన్నానని ఫ్రష్ట్రేషన్ అవుతున్నాడో ఏమో కాని.. సొహైల్ ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నాడు. ఇప్పటికే అభి, దివి, సుజాతలతో గొడవ వేసుకోగా.. నేటి రాత్రి ఎపిసోడ్‌లో రాజశేఖర్ మాస్టర్‌‌ని ఎక్కువ మాట్లాడితే రెండు పీకుతా అన్నట్టుగా దూసుకుపోతున్నాడు. ఈ గేమ్‌లో దివి-రాజశేఖర్ మాస్టర్ కంబైండ్‌గా ఆటాడుతుండటంతో వాళ్లని నిలువరించే ప్రయత్నం చేస్తున్నాడు సొహైల్. ఏమైందో ఏమో కాని.. ఒకర్నే టార్గెట్ చేసి ఆట ఆడితే కథ వేరేలా ఉంటుందని రాజశేఖర్ మాస్టర్‌కి హెచ్చరించడంతో.. రాజశేఖర్ మాస్టర్ ఏంట్రా కథ వేరే ఉండేది అంటూ దూసుకుని వచ్చాడు.. వద్దు మాస్టర్ వద్దు.. సొహైల్ మీదికి రావడంతో

బీచ్‌‌లో చెమటోడుస్తున్న రష్మిక... వైరల్‌గా మారిన వర్కవుట్‌ వీడియో

Image
‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదా దక్కించుకుంది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్న రష్మిక తాజాగా... సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. దీంతో పాటు మెగాస్టార్ ‘ఆచార్య’లో రామ్‌చరణ్ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది. Also Read: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉండే ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఓ ఇంట్రస్టింగ్ వీడియో పోస్ట్ చేసింది. తొలిసారి బీ‌చ్‌లో వర్కవుట్స్ చేస్తూ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘ఇది నేను చేసిన మొదటి బీచ్‌ వర్కవుట్‌ వీడియో. సముద్ర అలల శబ్దం, మట్టి వాసన, సూర్యాస్తమయం, నా పాదాల వ్యతిరేకంగా ఇసుక, ఇది ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంది. భవిష్యత్‌లో కూడా ఇలాంటి వర్కవుట్ చేస్తూ వీడియో తయారు చేయాలనుకుంటున్నా’ అంటూ వీడియోతో పాటు మెసేజ్ పోస్ట్ చేసింది రష్మిక. Also Read:

‘నా తప్పు ఏమున్నదబ్బా’.. స్టెప్పులతో మతిపోగొట్టిన ఊర్వశి రౌటేలా

Image
మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ హీరోయిన్ తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం ‘బ్లాక్ రోజ్’. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ సాంగ్‌ను యూనిట్ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. `నా తప్పు ఏమున్నదబ్బా` అంటూ సాగే ఈ పాటలో ఊర్వశి దుమ్మురేపే డ్యాన్సులతో మతి పోగొడుతోంది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్ పతాకంపై తెరకెక్కుతున్న ‘బ్లాక్ రోజ్’ సినిమాలో ఊర్వశి టైటిల్ రోల్ పోషిస్తోంది. Also Read: ఏమైంది ఈవేళ, రచ్చ , బెంగాల్ టైగర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. షేక్‌ స్పియ‌ర్‌ రచించిన “ది మర్చంట్ ఆఫ్ వెనిస్`` లోని జ్యూయిష్ మనీ లెండర్ షైలాక్ పాత్ర ఆధారంగా ఫిమేల్ ఓరియెంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనేక సూపర్ హిట్ చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత శ్రీనివాసా చిట్టూరి పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్ నెం:4గా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్నేహ గీతం, దొంగాట చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసిన మోహన్ భరద్వాజ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. Also

బెడ్రూమ్ సీన్స్ ఆఫర్లే ఎక్కువగా వస్తున్నాయి: ఆండ్రియా

Image
తమిళ సినీ పరిశ్రమలో సింగర్‌గా అడుగుపెట్టి నటిగా మారింది జెరెమియా. 'కండనాల్‌ ముదల్‌' అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత 'పచ్చైకిళి ముత్తుచరం'లో శరత్‌కుమార్‌కు జంటగా నటించింది. కార్తీతో 'ఆయిరత్తిల్‌ ఒరువన్'(యుగానికొక్కడు) చిత్రంలో నటించి తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కమల్‌తో ‘విశ్వరూపం’ చిత్రంలో నటించింది. ఆమె నటించిన సినిమాల్లో చాలావరకు తెలుగులోనూ డబ్ కావడంతో టాలీవుడ్ ప్రేక్షకులకూ ఆమె సుపరిచితమే. Also Read: గతంలో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో రొమాన్స్ చేసిన ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. యాక్టింగ్‌తో పాటు హాట్‌ హాట్ సీన్లలోనూ ఆండ్రియా ఇతర హీరోయిన్లకు పోటీ పడుతుంటుంది. ఈ కోవలోనే ‘వడచెన్నై’ సినిమాలో బెడ్రూమ్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. అయితే ఆ సీన్లలో చాలావరకు ఎడిటింగ్‌లో తీసేశారు. కానీ అవన్నీ ఆ తర్వాత సోషల్‌మీడియాలో లీక్ కావడంతో ఆండ్రియా దిగ్భ్రాంతి చెందింది. Also Read: ఈ సందర్భంగా ఆండ్రియా మాట్లాడుతూ ‘వడచెన్నై’ చిత్రంలో పడక సీన్లలో నటించి తప్పుచేశానని, అప్పటి నుంచి బెడ్‌రూమ్‌ సీన్లతో ఉన్న సినిమాల్లో నటి

వ్యభిచారం కోసం వాట్సాప్ గ్రూపు.. మరిన్ని చిక్కుల్లో రాగిణి, సంజనా

Image
డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలు జీవితం గడుపుతున్న కన్నడ హీరోయిన్లు , మరో వివాదంలో చిక్కుకున్నారు. కేసులు చాలవన్నట్లు కొత్తగా సెక్స్ రాకెట్‌‌ వ్యవహారంలో వీరిపై ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించడంతో రాగిణి, సంజన దాని నుంచి బయటపడే మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ సమయంలోనే వారిపై సెక్స్ రాకెట్‌ ఆరోపణలు రావడం కలకలం రేపింది. Also Read: డ్రగ్స్ కేసు విచారణలో హీరోయిన్లను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సీసీబీ పోలీసులు వారి మొబైల్ ఫోన్స్ పరిశీలించారు. వాటిలో ఇతర అమ్మాయిల అశ్లీల వీడియోలు, అర్ధనగ్న ఫోటోలు కనిపించడంతో పోలీసులు కంగుతిన్నారు. వీరికి సెక్స్ రాకెట్‌తో సంబంధాలున్నాయన్న అనుమానాలు రావడంతో మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. Also Read: వ్యభిచారంతో పాటు బ్లూ ఫిలిమ్స్‌ రాకెట్లకు సంబంధించి రాగిణి, సంజనా ఓ ప్రత్యేక వాట్సాప్ గ్రూపు నిర్వహించేవారని, డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆ గ్రూప్‌ను డిలీట్ చేశారని పోలీసులు గుర్తించారు. సాంకేతిక నిపుణుల సాయంతో ఆ వాట్సాప్‌ గ్రూపులో సమాచారాన్ని రికవరీ చేసిన సీసీబీ పోలీసులు ఆ గ్రూపులో సభ్యులుగా ఉన్న వారందరికీ నోలీసులు

ఒక రోజు ముందుగానే ‘ఒరేయ్ బుజ్జిగా’ విడుదల.. పొట్టచెక్కలైపోయే కామెడీ!

Image
యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మించారు. రొమ్‌కామ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న ‘ఆహా’లో విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే, అంతకన్నా ముందుగానే అంటే రేపు (అక్టోబ‌ర్ 1న) సాయంత్రం 6 గంట‌లకే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రకటించారు. ఈ ఈవెంట్‌ మంగళవారం రాత్రి హైద‌రాబాద్‌లోని ట్రైడెంట్ హోట‌ల్‌లో జ‌రిగింది. ఈ వేడుకలో కమెడియన్ స‌ప్తగిరి మా‌ట్లాడుతూ.. ‘‘ఐదు నెలల డార్క్ డేస్‌ త‌ర్వాత ఈ స్టేజి మీద నిల‌బ‌డి మాట్లాడ‌డం చాలా బాగుంది. ఈ సినిమాలో ఒక సీక్వెన్స్‌తో మిమ్మల్నంద‌రిని హిలేరియ‌స్‌గా న‌వ్వించ‌బోతున్నాం. బాస్ బామ్మర్ది అనే క్యారెక్టర్లో ఈ సినిమాలో క‌న‌ప‌డ‌బోతున్నాను. నేను, రాజ్‌త‌రుణ్‌, పోసాని, మాళ‌విక‌, న‌రేష్‌గారు చేసిన ఆ సీక్వెన్స్ మిమ్మల్ని క‌డుపుబ్బా న‌వ్వించి ప‌దే ప‌దే మాట్లాడుకునే విధంగా ఉంటుంది. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన విజ‌య్ గారికి

బాబీ.. బీజేపీలోకి వచ్చేస్తున్నా!!: కరాటే కళ్యాణి పొలిటికల్ ఎంట్రీ, జగన్‌పై ఎటాక్

Image
బాబీ పించేశావ్... అంటూ అనేక వ్యాంప్ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించిన .. ఇటీవల బిగ్ బాస్ హౌస్‌కి రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. అయితే సినిమాలు, సీరియల్స్, హరికథ, బిగ్ బాస్ మాత్రమే కాకుండా త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుందంటూ ప్రకటన చేసింది కరాటే కళ్యాణి. ఆమె మాట్లాడుతూ.. ‘బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలని నాకు మంచి ఆఫర్ వచ్చింది.. దాన్ని నేను వదులుకోలేదు.. ఆ పార్టీలో జాయిన్ అవుతా అని అనౌన్స్ కూడా చేశా. నన్ను అందరూ అడిగే వారు.. మీరు ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అవుతున్నారు అని.. అందుకే బీజేపీలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యా. నిజంగా బిగ్ బాస్‌కి వెళ్లకముందే బీజేపీలో జాయిన్ అయ్యి ఉంటే నాకూ ఓటు బ్యాంక్‌గా ఉపయోగపడేది. కాని బిగ్ బాస్ రూల్స్ ప్రకారం పార్టీలో చేరొచ్చో లేదోనన్న డైలమాలో ఉన్నా. నిజంగానే పార్టీ జాయిన్ అయ్యి ఉంటే.. ఒకే వర్గం ముద్ర పడుతుందని ఇన్ డైరెక్ట్‌గా అన్నారు. మీరు జాయిన్ కావొచ్చు కాని.. ఇప్పుడు కాదు అన్నట్టుగా హింట్ ఇచ్చారు. బీజేపీ అనగానే హిందుత్వం అనే ఫీల్‌లో ఉన్నారు. కాని బిగ్ బాస్ చూసేశాళ్లు వేరే మతం వాళ్లు కూడా ఉంటారని ఆలోచించా. కాని ఇప్పుడు ఎందుకు బీజేపీ పార్ట

కృష్ణా నదికి వరదలు.. కొట్టుకుపోయిన హీరో శర్వానంద్ తాత ఇల్లు

Image
కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. వరద నీరు ముంచెత్తడంతో నదీ పరివాహక ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. దీంతో అనేక గ్రామాలు వరద నీటిలో మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లా సమీపంలోని ఎడ్లలంక గ్రామం కూడా ముంపులో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో అదే గ్రామంలో ఉన్న హీరో తాత, భారత మాజీ అణు శాస్త్రవేత్త డాక్టర్ మైనేని హరిప్రసాద్ ఇల్లు కొట్టుకుపోయింది. Also Read: పాతకాలం నాటి ఇల్లు కావడంతో వరద నీటికి పునాదులు కదిలి ఇల్లు మొత్తం నదిలో కలిసిపోయింది. శర్వానంద్ అవనిగడ్డ వచ్చినప్పుడల్లా ఇదే ఇంట్లో ఉండేవారట. ఆయన్ని కలిసేందుకు చాలా మంది అభిమానులు ఆ ఇంటికి వచ్చేవారు. ప్రస్తుతం వరద నీటిలో శర్వానంద్ తాత ఇల్లు కొట్టుకుపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శర్వానంద్ ప్రస్తుతం ‘మహాసముద్రం’ అనే సినిమాలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. Also Read:

‘షాదీ ముబారక్‌’ ఫస్ట్‌ లుక్‌: లవర్ బోయ్‌గా మారిన ఆర్కే నాయుడు

Image
బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘మొగలిరేకులు’ సీరియల్‌లో ఆర్కే నాయుడు పాత్రను ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచిపోలేరు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సాగర్‌ను ఇప్పటికీ ఆర్కే నాయుడుగానే ఫేమస్. ఈ ఒక్క పాత్రతో సాగర్‌కు హీరోకి వచ్చినంత క్రేజ్ వచ్చింది. ఈ పాత్ర ద్వారా వచ్చిన క్రేజ్‌తో సినిమాల్లోకి కూడా అడుగుపెట్టారు . 2011లో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా కనిపించారు. ఆ తరవాత ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సినిమాతో హీరోగా మారారు. కానీ, పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. 2016లో ‘సిద్ధార్థ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తరవాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. సుమారు ఐదేళ్ల విరామం తరవాత ఇప్పుడు మరోసారి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు సాగర్. అది కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌లో. , శిరీష్ నిర్మాతలు. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు ‘షాదీ ముబారక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సాగర్ లవర్ బోయ్‌లా కనిపిస్తున్నారు. సాగర్‌ సరసన దృశ్యా రఘునాథ్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ

Devi Nagavalli: పవన్ ఫ్యాన్స్ కులాన్ని తీసుకువస్తారు కానీ.. దాసరి మా తాతని నేను చెప్పుకోలేదు: దేవి నాగవల్లి

Image
బిగ్ బాస్ సీజన్ 4లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లిని ఎలిమినేట్ కావడం బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఆమెకు ఓట్లు వచ్చినా కావాలనే ఎలిమినేట్ చేశారనే ఆరోపణలతో పాటు.. ఆమె టీవీ 9 ఛానల్‌ యాంకర్ కావడం వల్లే ఎలిమినేట్ అయ్యిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో జనసేన అధినేత పవర్ స్టార్ ఫ్యాన్స్ దేవి నాగవల్లికి ఓట్లు పడకుండా చేశారని ప్రచారం నడుస్తోంది. శ్రీరెడ్డి ఇష్యూతో పాటు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి డ్యామేజ్ చేసేలా టీవీ 9లో చాలా వార్తలు ప్రసారం చేశారని.. ఆ వార్తలు చదివింది.. ఇంటర్వ్యూలు చేసింది కావడంతో ఆమెను పనికట్టుకుని ఎలిమినేట్ చేశారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీటిపై స్పందించారు దేవి నాగవల్లి. ఈ తరుణంలో తను దాసరి మనవరాలు అనే విషయాన్ని సీక్రెట్‌గా ఎందుకు ఉంచాల్సి వచ్చిందో తెలియజేశారు దేవి నాగవల్లి. ప్రొఫెషన్ పరంగా కాకుండా వ్యక్తిగా చూశారు.. ఇప్పుడు నేనేంటో అందరికీ అర్థమైంది కాబట్టి ఆట పరంగా ఓడించి.. వ్యక్తిత్వపరంగా నన్ను గెలిపించిన వాళ్లకి చాలా థాంక్స్. బిగ్ బాస్ వాళ్లు నాకు ఓట్లు తక్కువ వచ్చాయని చెప్పారు.. నేను వాళ్లని నమ

వితికా షెరు కొత్త ఇన్నింగ్స్: కల నెరవేరింది.. సుమ, అనసూయల పోటీ తట్టుకోగలదా!!

Image
హీరో వరుణ్ సందేశ్ తన భార్య వితికా షెరుతో కలిసి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. వరుణ్ సందేశ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే అయినా వితిక పెద్దగా ఎవరికీ తెలీదు. ఆమె కూడా హీరోయిన్‌గా సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ, బిగ్ బాస్‌ షోలో పాల్గొన్న తరవాత వితికాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తరవాత ఇంటర్వ్యూలతో బిజీ అయిపోవడమే కాకుండా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న సుమారు ఏడాదిన్నర తరవాత ఇప్పుడు వితికా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు. అది కూడా తనకు ఎంతో ఇష్టమైన యాంకర్‌గా. యాంకరింగ్ అంటే తనకు చాలా ఇష్టమని, యాంకర్ కావడం తన గోల్ అని గత ఇంటర్వ్యూలలో వితిక చెప్పారు. ఇప్పుడు ఆ కలను ఆమె నెరవేర్చుకున్నారు. ఈటీవీలో ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రసారం కానున్న ‘సామజవరగమన’ షోకి వితిక యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఆదివారం (అక్టోబర్ 4) నుంచి ఈ షో ప్రసారం కానుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం యాంకర్ సుమ, అనసూయ బుల్లితెరను ఏలుతున్నారు. శ్రీముఖి, రష్మి కూడా సత్తా చాటుతున్నారు. వీళ్ల మధ్య పోటీని తట్టుకోగలరా లేదా చూడాలి. వీళ్

‘మోసగాళ్ళు’ స్కామ్‌ను బయటపెట్టనున్న అల్లు అర్జున్!

Image
మంచు విష్ణు హీరోగా నటిస్తూ ఆయనే స్వయంగా నిర్మిస్తోన్న చిత్రం ‘మోసగాళ్ళు’. కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, మోషన్ పోస్టర్, థీమ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఈ సినిమాను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మంచు విష్ణు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీని కోసం స్టైలిష్ స్టార్ సహాయం తీసుకుంటున్నారు విష్ణు. ఇంత‌కుముందు టైటిల్ కీ థీమ్ మ్యూజిక్‌ను విక్టరీ వెంక‌టేష్ రిలీజ్ చేయ‌గా.. దానికి అనూహ్యమైన స్పందన వ‌చ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ ప‌నిత‌నానికి స‌ర్వత్రా ప్రశంస‌లు ల‌భించాయి. ఇప్పుడు ‘మోస‌గాళ్ళు’ చేసిన స్కామ్ ఏ స్థాయిలో ఉందో బ‌య‌ట‌పెట్టేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. అక్టోబ‌ర్ 3న‌ ఈ విష‌యాన్ని ఆయ‌న వెల్లడించ‌నున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. భారీ బ‌డ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ క్రాస్-ఓవ‌ర్ ఫిల్మ్‌ను విల‌క్షణంగా, విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు. భార‌త్‌లో మొద‌లై, అమెరికాను వ‌ణికించిన చ‌రిత్రలోనే అతి పెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో వాస్

‘పుష్ప’ విలన్ రూమర్స్.. కొట్టిపారేసిన సీనియర్ నటుడు

Image
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూడో చిత్రమింది. రష్మికా మందన హీరోయిన్. ‘పుష్ప’ ద్వారా హిందీ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ‘పుష్ప’ను పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరున్న ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేకోవర్ సైతం కొత్తగా ఉంది. అయితే, కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ముందుకు కదలడం లేదు. అడవుల్లో షూటింగ్ చేయడానికి సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం కేరళ వెళ్తున్నట్టు ఇప్పటికే రూమర్లు వచ్చాయి. నిజానికి ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచీ ఏదో రూమర్ వస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో విలన్‌కు సంబంధించి ఒక వదంతు చక్కర్లు కొడుతోంది. సీనియర్ హీరో ఆర్.మాధవన్.. బన్నీకి విలన్‌గా నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ రూమర్‌పై మాధవన్ స్పందిం

డ్రగ్ కేసు: బెయిల్ నిరాకరణ.. హైకోర్టుకు వెళ్తున్న హీరోయిన్లు

Image
కన్నడ సినీ పరిశ్రమలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో హీరోయిన్లు గల్రాని, ద్వివేది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వీరి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సంజన, రాగిణికి బెయిల్ మంజూరు చేయడానికి ప్రత్యేక (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సస్ యాక్ట్) కోర్టు నిరాకరించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరికొంత మంది బెయిల్ పిటిషన్లను ఈరోజు (సెప్టెంబర్ 30న) కోర్టు విచారించనుంది. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివప్రకాష్, వినయ్ కుమార్‌ల యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. అలాగే, ఈవెంట్ మేనేజర్ విరేన్ ఖన్నా, వ్యాపారవేత్త ప్రశాంత్ రంక, టెకీ ప్రతీక్ శెట్టి, మోడల్ నియాస్ మహమ్మద్, బులియన్ ట్రేడర్ వైభవ్ జైన్‌ల బెయిల్ పిటిషన్లను కోర్టు వాయిదా వేసింది. ఖన్నా బెయిల్ పిటిషన్‌ విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేయగా మిగిలిన వారందరి పిటిషన్లను ఈరోజు విచారించనుంది. కాగా, బెయిల్ కోసం సంజన, రాగిణి హైకోర్టుకు వెళ్లనున్నట్టు డిఫెన్స్ అడ్వకేట్స్ వెల్లడించారు. ‘‘ఆర్డర్స్ కాపీల కోసం మేం దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించిన తరవాత కొన్ని రోజుల్లో హైకోర్టును ఆశ్రయిస్తాం’’

YS Jagan క్రిస్టియన్.. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు.. హిందువుల జోలికొస్తే ఊరుకోం: కరాటే కళ్యాణి సంచలన కామెంట్స్

Image
ఇటీవల బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన సినీ, బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యే వ్యాఖ్యలు చేశారు. తిరుమల డిక్లరేషన్ విషయంలో వైఎస్ జగన్‌ తప్పు చేశారంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఆయన సీఎం.. కావొచ్చు పీఎం కావొచ్చు కాని.. తిరుమల రూల్స్‌ని బ్రేక్ చేసే హక్కులేదని.. ప్రశ్నించడం తన హక్కు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్ ముఖ్యమంత్రి కాబట్టి ఎవరూ ఆపరని తిరుమలకి వెళ్లారా?? ఆయన క్రిస్టియన్ అని అందరికీ తెలుసు.. మధ్యలో ఆయన హిందూమతం తీసుకున్నారని.. శారదా పీఠం దగ్గర గంగలో మునిగారు అని ఫొటోల్లో చూశాం కానీ.. నాకు తెలుసు మొదటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న రూల్‌ని బ్రేక్ చేయడం తప్పు. అది ఎవరైనా కావచ్చు.. సీఎం అవ్వొచ్చు.. పీఎం అవ్వచ్చు. డిక్లరేషన్ ఇచ్చి గుడిలోకి వెళ్లాలి కదా.. ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు. ఆయన ఆంధ్రాకి సీఎం కావచ్చు.. అయితే నేను ఎలాగైనా దర్శనానికి వెళిపోతా అంటే కుదరదు కదా.. ఎవరికి వాళ్లు రూల్స్ పెట్టేసుకుంటే అంతకు ముందు వరకూ ఉన్న రూల్స్‌ని బ్రేక్ చేసినట్టే కదా. సీఎం జగన్ చేస్తున్నది తప్పు.. డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా వ

బిగ్ బాస్.. వెంట్రుక ఊడితే కోరిక తీరుతుందా? ఉఫ్.. ఉఫ్.. స్వాతి దీక్షిత్

Image
సోమవారం నాడు హాట్ హాట్ డిస్కషన్స్‌తో నామినేషన్స్ టాస్క్ కంప్లీట్ కాగా.. నాలుగోవారం నామినేషన్స్‌లో హారిక, స్వాతి దీక్షిత్, అభిజిత్, లాస్య, మెహబూబ్, కుమార్ సాయి, సొహైల్‌ ఉన్నారు. కుమార్ సాయి వచ్చిన తొలివారం నుంచే ఎలిమినేషన్స్‌లో ఉంటుండగా.. లాస్య, మెహబూబ్, హారికలకు వరుసగా రెండో నామినేషన్. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చిన స్వాతి దీక్షిత్ తొలివారమే నామినేట్ అయ్యింది.. ఆమెకు హౌస్‌లో తోడుగా ఉంటున్న అభిజిత్ నామినేషన్స్‌లో కూడా తోడుగా ఉన్నాడు. మరి ఈ నామినేషన్స్ హీట్ చల్లారిందా లేదా?? హౌస్‌లో పరిస్థితి ఏంటో మంగళవారం నాటి 24వ ఎపిసోడ్‌లో చూసేద్దాం.. రోజూ మాదిరే మార్నింగ్ వేకప్ సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులు వేశారు కంటెస్టెంట్లు. అరియానా నాభి అందాల సోయగం చేసింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్‌తో పులిహోర కలుపుతూ సీజన్ 4 పులిహోర రాజా ట్యాగ్ కోసం అభికి గట్టి పోటీ ఇస్తున్నాడు అఖిల్. అప్పటికే మోనాల్‌తో ముచ్చట్లు పెట్టిన అఖిల్.. స్వాతి దీక్షిత్ పాట అందుకుంటే దానికి శృతి కలిపాడు. ఇంత అందంగా ఎలా ఉండగలగుతున్నారు.. నేనూ తెలసుకోవాలనుకుంటున్నాను అంటూ తనదైన శైలిలో పులిహోర కల

‘ఆదిపురుష్’లో సీతగా అనుష్క.. రూమర్స్‌కు చెక్ పెట్టిన దేవసేన

Image
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, ఓం రౌత్‌ దర్శకత్వంలో త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనున్న పాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్‌'. ఈ సినిమాలో సీత పాత్రలో నటించే హీరోయిన్ గురించి కొద్దిరోజులుగా అనేక పుకార్లు వస్తూ ఉన్నాయి. కీర్తి సురేష్‌, కియారా అద్వానీ, ప్రియాంకా చోప్రా, శర్మ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క పేరు ప్రముఖంగా వినిపించింది. బాహుబలి సినిమాలో అలరించిన ఈ జంట ‘’ మళ్లీ జతకట్టనుందన్న వార్తలో అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. Also Read: తన తాజా సినిమా ‘నిశ్శబ్దం’ అక్టోబర్ 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్లాట్‌పామ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా అనుష్క ప్రమోషన్లలో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష్‌కు సంబంధించి వస్తున్న రూమర్‌పై ఆమె స్పందించారు. ‘''నాకు అలాంటి ఆఫర్‌ ఏమీ రాలేదు. నేను ఆదిపురుష్ చిత్రంలో నటించడం లేదు. ఆ వార్తల్లో నిజం లేదు.." అని అనుష్క తెలిపారు. దీంతో ఈ సినిమాపై వస్తున్న రూమర్లకు అనుష్క చెక్ పెట్టేసింది. Also Read: టాలీవుడ్‌లో బెస్ట్ పెయిర్లలో , అనుష్కది అగ్రస్థానం. వీరిద్దరు కలిసి బిల్లా, మిర

అమ్మాయిలు చాలా క్లియర్.. వాళ్లనే ప్రేమిస్తారు.. దమ్ముంటే నీ సత్తా చూపించు: పూరి జగన్నాథ్

Image
మగాడు అన్నాక పనిచేయాలని, సంపాదించాలని, సత్తా చాటాలని అంటున్నారు ప్రముఖ దర్శకుడు . పూరి మ్యూజింగ్స్ ద్వారా రోజుకో అంశంపై మాట్లాడుతున్న పూరి జగన్నాథ్.. మంగళవారం మగాడు ఎలా ఉండాలి అనే అంశపై మాట్లాడారు. మగాడు ఎలా ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారో చెప్పారు. మగాడికి ఎలాంటి లక్ష్యం ఉండాలో వెల్లడించారు. ప్రతి మగాడు తన బ్యాంక్ బ్యాలెన్స్ అతడి మొబైల్ నంబర్ అంత అయ్యేలా కష్టపడాలని అన్నారు. ఈ క్రమంలో తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పూరి. ‘‘అందమైన ఆడపిల్లలను చూస్తే ఎవరికైనా ఇష్టమే. అందుకే అందరూ వాళ్లతో ప్రేమలో పడిపోతుంటారు. కానీ, మగాళ్లను మాత్రం చూడగానే ఎవరూ లవ్ చేయరు. ఎవరూ ఎత్తుకోరు, ఎవరూ ముద్దుపెట్టుకోరు. సో స్వీట్ అని మన బుగ్గ పట్టుకుని ఎవరూ గిల్లరు. ఎందుకు.. అంటే సమాధానం లేదు. మగాడు ఏదైనా చేయాలి, ఏదైనా తేవాలి, ఏదైనా ఇవ్వాలి లేదా ఏమైనా అయిపోవాలి. ఏమీ చేయకుండా మనల్ని ఎవ్వరూ ఎత్తుకోరు. ముద్దు పెట్టుకోరు. అందుకే ఏదైనా చేయండి. ఖాళీగా ఉండొద్దు. నువ్వు ఎంత అందగాడివైనా ఏ అమ్మాయి నీ మొహం చూడదు. నీకు సిక్స్ ప్యాక్ ఉన్నా నీ ఫోన్ నంబర్ అడగదు. అమ్మాయిలు చాలా క్లియర్‌గా ఉంటారు. సత్తా ఉన్నవాడినే ప్రేమిస్తారు.

ఓటీటీ డ్రాబ్యాక్ అదే.. ఆ క్వాలిటీని ఆడియన్స్ మిస్ అవుతారు: అనుష్క

Image
‘నిశ్శబ్దం’ సినిమా కోసం ప్రేక్షకులకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ థ్రిల్లర్ మూవీని థియేటర్‌లో చూద్దామని ఆశపడిన ప్రేక్షకులు మొత్తానికి ఈ కరోనా టైమ్‌లో ఇంట్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడబోతున్నారు. అక్టోబర్ 2న నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. చిత్ర విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచారంలో భాగంగా అనుష్క మంగళవారం మీడియా ముందుకు వచ్చారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ ముచ్చట్లే ఇవి.. ✦ మీ ‘నిశ్శబ్దం’ ఎలా మైద‌లైంది? ‘భాగ‌మ‌తి’ త‌రువాత కావాల‌ని గ్యాప్ తీసుకున్నా. ఆ స‌మయంలో కోన‌ వెంక‌ట్ గారు హేమంత్ గారితో ఈ స్టోరీ నెరేష‌న్ ఇప్పించారు. ఇందులో నా క్యారెక్టర్ ఢిప‌రెంట్‌గా ఉండ‌టంతో పాటు సినిమా కూడా వ‌ర్కౌట్ అవుతుంద‌ని నాకు బ‌లంగా అనిపించింది. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో న‌టించ‌డానికి ఒప్పుకున్నాను. అనుకోకుండా నా ద‌గ్గర‌కు వ‌చ్చిన స్టోరీ ఇది. అంతే

ముమైత్ ఖాన్ నన్ను మోసం చేసింది: హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ ఆరోపణలు

Image
టాలీవుడ్‌లో నటిగా, డ్యాన్సర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకుంది. ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందని హైదరాబాద్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజు ఆరోపిస్తున్నాడు. మూడు రోజుల ట్రిప్ కోసం తీసుకెళ్లి తనకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా మోసం చేసిందని అంటున్నాడు. ఈ మేరకు క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్‌కు రాజు ఫిర్యాదు చేశాడు. అసోసియేషన్‌లో చర్చించిన తరవాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అంటున్నాడు. రాజు ఆరోపణలు.. ముమైత్ ఖాన్ మూడు రోజుల గోవా ట్రిప్ కోసం కారు బుక్ చేసుకుంది. గోవాకు వెళ్ళిన తర్వాత ముమైత్ ఖాన్ మూడు రోజుల ట్రిప్‌ను ఎనిమిది రోజులకు పొడిగించింది. ఈ ఎనిమిది రోజులపాటు గోవా మొత్తం తిరిగినా ఎక్కడా టోల్ గేట్‌కు, డ్రైవర్ వసతికి డబ్బులు ఇవ్వలేదు. ఈ మొత్తం కలిపి రూ.15 వేల వరకు ముమైత్ ఇవ్వాలని రాజు ఆరోపిస్తున్నాడు. మరో డ్రైవర్‌కు ఇలా జరగకూడదన్న ఉద్దేశంతోనే తాను ఈ విషయాన్ని క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్‌కు తెలియజేశానని రాజు వెల్లడించాడు. అసోసియేషన్ సభ్యుల సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నాడు. కాగా, ‘పోకిరి’ సినిమాలో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ పాటతో ముమైత

‘హీరోలతో దెబ్బలు తింటేనే డబ్బులొస్తాయ్’.. 20ఏళ్ల సినీ కెరీర్‌‌పై అజయ్ స్పందన

Image
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు అజయ్. హీరో ఫ్రెండ్‌గా, కమెడియన్‌గా, విలన్‌గా.. ఇలా అన్ని పాత్రల్లో ఒదిగిపోయే నటుడాయన. ‘కౌరవుడు’తో సినీ రంగ ప్రవేశం చేసిన ఇటీవలే 20ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి ఆయన వివరించారు. Also Read: ‘‘విజయవాడలో పుట్టి పెరిగిన నేను చదువు మధ్యలో ఆపేసి ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూల్‌లో చేరిపోయా. 2000 సంవత్సరంలో వచ్చిన కౌరవుడు సినిమాలో ఎంట్రీ ఇచ్చాను. ఆ మరుసటి ఏడాది వచ్చిన ఖుషీ, స్టూడెంట్ నం.1 చిత్రాలతో ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలనన్న నమ్మకం వచ్చింది. ఆ తర్వాత ఒక్కడు, వర్షం, సై సినిమాలు మంచిపేరు తెచ్చాయి. ఎస్ఎస్ రాజమౌళి, రవితేజ కాంబినేషన్లో వచ్చిన ‘విక్రమార్కుడు’లో విలన్‌గా నటించడం మరిచిపోలేని విషయం. టిట్లా పాత్ర కోసం నేను పడిన కష్టం కంటే ఎక్కువ పేరు తెచ్చిందా సినిమా. Also Read: ఈ సినీ ప్రయాణంలో నా తల్లిదండ్రులు, భార్య శ్వేత ప్రోత్సాహం ఎంతో ఉంది. మాకు ఇద్దరు అబ్బాయిలు. వారు నా సినిమాలు చూసినప్పుడల్లా.. డాడీ ఎందుకు హీరోలతో ఎప్పుడూ దెబ్బలు తింటుంటావు? అని అడుగుంటారు. మా చిన్నబ్బాయి ఇ

Casting Couch: ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సీరత్ కపూర్ షాకింగ్ రియాక్షన్.. అమ్మడి టార్గెట్ హీరోయిన్లే!

Image
సినీ ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారంటూ ఎంతోమంది హీరోయిన్స్ ఓపెన్‌గా చెప్పేశారు. దీనిపై క్యాస్టింగ్ కౌచ్, మీటూ లాంటి ఉద్యమాలు కూడా తీసుకొచ్చి పలువురు హీరోయిన్లు తమకు జరిగిన అన్యాయాలను బయటపెట్టారు. దీంతో ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా అంశం తెరపైకి వస్తోంది. అయితే లైంగిక దాడుల విషయమై కొందరు నటీమణులు ఆధారాలు లేని కామెంట్స్ చేయడంతో ఇదో పబ్లిసిటీ స్టంట్ అనే విమర్శలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై హాట్ హీరోయిన్ స్పందిస్తూ నటీమణులకే చురకలంటించింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు ప్రతిచోట ఉందని అంటోంది సీరత్ కపూర్. కాకపోతే సెలబ్రెటీలకు ఉన్న పాపులారిటీ కారణంగా సినిమా ఇండస్ట్రీలో నే క్యాస్టింగ్ కౌచ్ అనేది ఫోకస్ అవుతూ ఉంటుందంటూ తనదైన కోణంలో వివరణ ఇచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలపై ఇష్టమొచ్చినట్లు అరిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ లైంగిక ఆరోపణలు చేస్తున్న నటీమణులపైనే సెటైర్స్ వేసింది. Also Read: తమపై లైంగిక దాడి జరిగిందని ఊరికే ఆరోపణలు చేస్తే లాభం లేదని, సందర్భం ఏదైనా క్యాస్టింగ్ కౌచ్ ఎదురైనప్పుడు ఆ అనుభవం

సోనూ సూద్‌కు ప్రతిష్టాత్మక అవార్డు: సేవలకు గుర్తింపు.. దిగ్గజాల సరసన చోటు

Image
కరోనా భయానక పరిస్థితుల్లో నిస్వార్థంతో కొన్ని లక్షల మంది వలస కార్మికులను వారి ఇళ్లకు పంపడమే కాకుండా ఆపదలో ఉన్నాం ఆదుకోండి అని అడిగిన ప్రతి ఒక్కరికీ సాయం చేసిన ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూ సూద్‌ను ఐక్యరాజ్య సమితి గౌరవించింది. ప్రతిష్టాత్మక ‘ఎస్‌డీజీ స్పెషల్ హ్యుమనిటేరియన్ యాక్షన్’ అవార్డును యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ () సోనూ సూద్‌కు ప్రకటించింది. ఈ అవార్డును సోమవారం (సెప్టెంబర్ 29న) ఆన్‌లైన్‌లో నిర్వహించిన వేడుక ద్వారా సోనూ సూద్‌కు అందజేసింది. ఈ అవార్డును స్వీకరించడం ద్వారా ఏంజెలినా జూలీ, డేవిడ్ బెక్‌హామ్, లీయోనార్డో డికాప్రియో, ఎమ్మా వాట్సన్, లియామ్ నీసన్, కేట్ బ్లాంకెట్, ఆంటోనియో బాండెరస్, నికోలెస్ కిడ్మన్, ప్రియాంక చోప్రా సరసన నిలిచారు. సినిమా, క్రీడలు తదితర రంగాలకు చెందిన ఈ దిగ్గజాలు పలు యూఎన్ బాడీస్ నుంచి ఇలాంటి గౌరవాన్నే పొందారు. కాగా, యూఎన్ అవార్డును పొందడంపై సోనూ సూద్ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఇది అరుదైన గౌరవం. యూఎన్ గుర్తింపు అనేది ఎంతో ప్రత్యేకం. ఏమీ ఆశించకుండా నా దేశ ప్రజలకు నాకు తోచినంత సాయం చేశాను. ఆ సేవలకు గుర్తింపు రావడం, అవార్డు తీసుకోవడం చాలా గొప్పగా అనిప

నాని ఫుల్ బిజీ: టాలెంటెడ్ డైరెక్టర్స్‌తో సినిమాలు.. 2021 చివరి వరకు షెడ్యూల్ ఇదే!

Image
‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలతో గతేడాదిని విజయవంతంగా ముగించిన నేచురల్ స్టార్ నాని.. ఈ ఏడాది ‘V’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కరోనా వల్ల థియేటర్లు మూతబడటంతో ఓటీటీ ద్వారా డైరెక్ట్‌గా ఆడియన్స్ ఇళ్లకే వచ్చేశారు అండ్ టీం. గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్త అవతారంలో ఈ సినిమాలో నాని కనిపించారు. రివేంజ్ తీర్చుకునే సీరియల్ కిల్లర్‌గా తనలోని మరో నటుడిని ఆవిష్కరించారు. ఈ సినిమాలో నటీనటులకు మంచి మార్కులు పడినా సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నాని ‘టక్ జగదీశ్’ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణ లాక్‌డౌన్‌కు ముందు చాలా వరకు పూర్తయింది. త్వరలోనే షూటింగ్‌ను తిరిగి ప్రారంభించి మిగిలిన భాగాన్ని పూర్తిచేయనున్నారు. ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2017లో వచ్చిన హిట్ మూవీ ‘నిన్ను కోరి’ తరవాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంలో ‘టక్ జగదీశ్’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. Also Read: ‘టక్ జగదీశ్’తో పాటు మరికొన్ని ఆసక్తికర ప్రాజెక్ట్‌ల

చిరంజీవితో ఆ ఛాన్స్ మిస్సయ్యా.. ఇప్పటికీ థ్యాంక్స్ చెబుతుంటా: ఎస్వీ కృష్ణారెడ్డి

Image
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలకు పెట్టింది పేరు . 1990 దశకంలో ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేశారు. మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, శుభలగ్నం, మావిచిగురు, యమలీల వంటి అద్భుతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. హీరోగా ఉగాది, అభిషేకం సినిమాల్లో మెరిశారు. తాను దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు ఆయనే సంగీతం అందించేవారు. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన ఆయన కొత్తతరం దర్శకులు రాకతో పూర్తిగా కనుమరుగైపోయారు. అయితే ఇన్నేళ్లైనా ఆయన సినిమాలు ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. Also Read: తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. 90వ దశకంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఎస్వీ కృష్ణారెడ్డి మ్యూజిక్ అందించేందుకు ప్రయత్నించారట రాఘవేంద్రరావు. చిరంజీవి-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన సినిమాకు సంగీతం అందించే తనకు ఛాన్స్ వచ్చిందని తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. అయితే అప్పట్లో తాను మ్యూజిక్‌తో పాటు అన్ని విభాగాల్లో వర్క్ చేయడం వల్ల చిరంజీవి సినిమాకు పనిచేసే ఛాన్స్ కోల్పోయానని ఆమె వెల్లడించారు. Also Read: "చిరంజీవి సినిమాకు మ

చిన్న సూదికే భయపడతా.. నన్ను ట్రోల్ చేయడం అన్యాయం: పాయల్ ఆవేదన

Image
తాను కొవిడ్-19 టెస్ట్ చేయించుకుంటున్న వీడియోను శనివారం సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమెను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఆరు నెలల తరవాత తిరిగి షూటింగ్‌లో పాల్గొన్న పాయల్.. సెట్స్‌లోకి వెళ్లడానికి ముందు తప్పనిసరి అయిన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అయితే, పాయల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఆమె టెస్ట్ చేయించుకోవడానికి భయపడిపోతూ ఏడ్చేశారు. పాయల్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే ఆమెపై ట్రోలింగ్ మొదలైపోయింది. పాయల్ ఓవరాక్టింగ్ చేస్తున్నారని, మరీ అంత అవసరమా అని కామెంట్లు పెట్టారు. అయితే, నెటిజన్లు తనను ట్రోల్ చేయడంపై పాయల్ స్పందించారు. తాను నిజంగానే భయపడ్డానని, నటించాల్సిన అవసరం తనకు లేదని తనను ట్రోల్ చేసిన వారికి గట్టిగానే సమాధానం చెప్పారు పాయల్. ఈ మేరకు ఆమె ‘హైదరాబాద్ టైమ్స్‌’తో మాట్లాడారు. ‘‘నాకు సూదులంటేనే భయం. మందులన్నా, ఇంజక్షన్ అన్నా ఆమడ దూరం పారిపోతా. అందుకే, కొవిడ్-19 కోసం చేసిన స్వాబ్ టెస్ట్ నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఈ మాత్రం దానికి నన్ను ట్రోల్ చేయడం అన్యాయం, దారుణం’’ అని పాయల్ వెల్లడించారు. పాయల్ రాజ్‌పుత్ శుక్రవారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో

Urvashi Rautela: అల్లు అర్జున్‌పై కన్నేసిన హాట్ బ్యూటీ.. ఆ తిప్పుడేంది బాబోయ్! వీడియో వైరల్

Image
డాన్స్ ఫ్లోర్స్‌పై చిందేయడంలో టాలీవుడ్ హీరోల్లోకెల్లా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పాట ఏదైనా సరే ఆయన వేసే స్టైలిష్ స్పెప్పులతో డాన్స్ ఫ్లోర్స్‌ దద్దరిల్లిపోవాల్సిందే. అందుకే బన్నీ డాన్స్ అంటే ఇటు ప్రేక్షకులతో పాటు అటు సినీ సెలబ్రిటీలు సైతం యమ లైక్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌పై కన్నేసింది హాట్ బ్యూటీ, మాజీ మిస్ యూనివర్స్ . డాన్సింగ్‌లో ఆయనే తనకు స్ఫూర్తి అని పేర్కొంటూ తన డాన్స్ వీడియో షేర్ చేసింది. తనకు తానే ‘లేడి అల్లు అర్జున్’ అని ప్రకటించుకుంటూ తన డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ వీడియోను ప్రేక్షకుల ముందుంచింది. తన కొత్త చిత్రం ‘బ్లాక్ రోజ్’ నుంచి సౌత్ ఇండియన్ డ్యాన్స్ స్టైల్‌ను మీకు పరిచయం చేస్తున్నా అంటూ ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో.. రెండు చేతులు ఫ్లోర్ మీద ఉంచి ఊర్వశి చేసిన మూమెంట్, ఆ తిప్పుడు చూసి షాకవుతున్నారు నెటిజన్లు. పైగా అల్లు అర్జున్ స్టైల్ అంటూ తెగ తిప్పేయడంతో ఈ వీడియో కూడా నెట్టింట అంతకుమించి తిరుగుతోంది. సరదాగా ఈ వీడియో షేర్ చేసుకుంటూ ఊర్వశి గ్లామర్ ట్రీట్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. Also Read: స‌న‌మ్‌రే, గ్రేట్ గ్ర

స్నేహారెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్: చుట్టూ అమ్మాయిలు.. మధ్యలో బన్నీ!

Image
నిన్న మొన్నటి వరకు సెలబ్రిటీలు పుట్టినరోజు వేడుకలను తమ కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకుంటున్నారు. దీనికి కారణం కరోనా. ఇప్పుడు కరోనా భయం కాస్త తగ్గడంతో స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో జరుపుకుంటున్నారు. సైతం భర్త అల్లు అర్జున్, స్నేహితురాళ్లు, కజిన్స్ సమక్షంలో తన 35వ పుట్టినరోజును సోమవారం అర్ధరాత్రి జరుపుకున్నారు. ఈ మేరకు తన భార్య కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తివైన నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. నీతో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో, మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే క్యూటీ’’ అని బన్నీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు స్నేహారెడ్డి కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫొటోలు షేర్ చేశారు. ఇవి చూస్తుంటే చుట్టూ స్నేహారెడ్డి గర్ల్ గ్యాంగ్.. మధ్యలో బన్నీ ఒక్కరే ఉన్నట్టు అనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్‌ చేసిన ఫొటోల్లో స్నేహారెడ్డి ట్రెండీ డ్రెస్‌లో మెరిసిపోతున్నారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఇటీవల నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ నిశ్చితార్థ

Bigg Boss: ఛీ ఛీ.. అదో బ్రతుకేనా? ఇంకొకరి మరుగుదొడ్లు కడుగుతూ! బిగ్‌ బాస్‌‌‌పై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Image
బుల్లితెర పాపులారిటీ షో బిగ్‌బాస్‌పై నెగెటివ్ కామెంట్స్ రావడం కొత్తేమీకాదు. కాస్టింగ్ కౌచ్ మొదలుకొని షోలో ఇచ్చే టాస్కుల వరకు ఎన్నో అంశాలు వివాదాస్పదం అయ్యాయి. బిగ్‌బాస్‌కి వెళ్లొచ్చిన కంటిస్టెంట్స్ సైతం ఆ షోపై దుమ్మెత్తిపోసిన సందర్భాలున్నాయి. ఇక షోలో పాల్గొనకుండానే బిగ్ బాస్‌‌‌పై విరుచుకుపడిన వారైతే చాలామందే ఉన్నారు. అదే బాటలో ఇప్పుడు తమిళ హీరోయిన్ బిగ్ బాస్‌‌‌పై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా, నెగెటివ్ కామెంట్స్ వచ్చినా తెలుగుతో పాటు పలు భాషల్లో బుల్లితెరపై హంగామా చేస్తూనే ఉంది బిగ్‌బాస్ ప్రోగ్రాం. ప్రతి ఏడాది కొత్త కొత్త పార్టిసిపెంట్స్, సరికొత్త టాస్కులతో అలరిస్తోంది. ఇప్పటికే తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 4 స్టార్ట్ కాగా.. తమిళ బిగ్‌బాస్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ కూడా సీజన్ 4 గానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ షోకు ఎప్పటిలాగే కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. Also Read: ఈ క్రమంలో తమిళ బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటిస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో హీరోయిన్

Sri Reddy: టాలీవుడ్‌పై ఉమ్మేసిన శ్రీ రెడ్డి.. బాలు చనిపోతే ఒక్కడైనా వచ్చాడ్రా? తూ.. శివాలెత్తిన హాట్ బాంబ్

Image
ఏ చిన్న అవకాశం దొరికినా టాలీవుడ్‌ పెద్దలపై విరుచుకుపడుతున్న హాట్ బాంబ్ మరోసారి రెచ్చిపోయింది. లెజెండరీ సింగర్ అంత్యక్రియలకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కాకపోవడాన్ని తప్పుబడుతూ శివాలెత్తిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోలు దొంగ కన్నీరు కార్చుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఉమ్మేస్తున్నారిక్కడ అంటూ ఆవేదన చెందిన శ్రీ రెడ్డి.. టాలీవుడ్ నటిని అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియో నెట్టింట రచ్చ చేస్తోంది. ఈ వీడియోలో శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. ''ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మూల స్తంభాన్ని కోల్పోయింది. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఆయన మరణం తర్వాత ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతూ అన్నయ్యా.. వెళ్లిపోయావా? అంటూ దొంగ కన్నీరు కార్చారు తప్ప కడసారి చూపు కోసం రాలేదు. ఆయన వాయిస్ లేనిదే మెగాస్టార్లు టాలీవుడ్‌లో అనేవాళ్ళే లేరు. ఆయన గాత్రంతోనే వాళ్ళను స్టార్స్ చేశారు. అయితే ఓ స్టేజ్ వచ్చాక అదే స్టార్స్ మళ్ళీ ఆయనను ఇబ్బందులు పెట్టడమే గాక.. ఆ గాన గంధర్వుడి మరణం తర్వాత టాలీవుడ్ నుంచి ఒక్కడు కూడా రాకపోవడం సిగ్గుచే

ఏపీ హైకోర్టులో కృష్ణంరాజు పిటిషన్.. ప్రభుత్వానికి నోటీసులు

Image
సినీ నటుడు, బీజేపీ నేత ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని కోర్టును ఆశ్రయించారు. తన 31 ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ఏఏఐ, ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం కృష్ణా జిల్లా కేసరపల్లిలో తమకున్న భూముల్లో ఉన్న నిర్మాణాలకు, పండ్ల తోటలకు ఎలాంటి పరిహారం చెల్లించకుండానే స్వాధీనం చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రయత్నిస్తోందని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇటు ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌ కింద తాను 39 ఎకరాలు ఇచ్చానని, ఆ సమయంలో ఎకరం ధర రూ.కోటి 54 లక్షలు ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ భూమికి సమానమైన అంతే విలువ కలిగిన భూమిని రాజధాని అమరావతిలో కేటాయిస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుందని గుర్తుచేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాజధానిని వేరే చోటికి తరలించాలని నిర్ణయించిందని

నామినేషన్ హీట్.. దివి టార్గెట్ అభిజిత్.. నిన్నే నామినేట్ చేస్తా ఇది క్లియర్

Image
ఆదివారం నాడు దేవి ఎలిమినేషన్‌తో చాలా మంది ఇంటి సభ్యులు షాక్‌లోనే ఉండిపోయారు. ఇక సోమవారం నాడు నాలుగో వారం నామినేషన్ హీట్ ఉండటంతో ఈవారంలో ఎవరు నామినేట్ అవుతారు?? ఇంటి సభ్యుల మధ్య రచ్చ ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తితో సోమవారం నాటి ఎపిసోడ్ ప్రారంభమైంది. సోమవారం నాటి 23 వ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. గోంగూర తోట కాడ కాపుకాశా.. అనే మాస్ బీట్‌ సాంగ్‌కి ఉదయాన్నే స్టెప్పులు వేశారు కంటెస్టెంట్లు. మార్నింగ్ మస్తీలో భాగంగా.. స్వాతి దీక్షిత్ నవరసాలు నేర్పించాలని ఆదేశించడంతో.. నవరసాల్లో భాగంగా మొదట శృంగార రసాన్ని అదీ కూడా అభిజిత్‌తోనే పంచుకుంది స్వాతి. ఆ తరువాత అన్ని రసాలను దట్టించికొట్టింది స్వాతి. కోపం రసాన్ని పిండటానికి రంగంలోకి దిగిన లాస్య-నోయల్‌లు ఆస్కార్ రేంజ్ పెర్ఫామెన్స్ ఇచ్చేశారు. ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకుని ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఇదే సీన్‌ని ప్రోమోలో జనాల్ని పిచ్చోళ్లని చేశాడు బిగ్ బాస్. ఇక మొనాల్-మెహబూబ్‌లు నామినేషన్స్ విషయంలో చర్చించి.. అభిని నామినేట్ చేయడానికి గట్టి రీజన్ ఉందని మాట్లాడుకున్నారు. అరియానా-అవినాష్‌లు వరసలు రొమాన్స్, కెమిస్ట్రీపై ఫన్నీ చర్చలు జరిపారు. ఇక కుమార్ సాయి

హైదరాబాద్‌ వచ్చేసిన రకుల్‌... ఆ కేసు నుంచి సేఫ్ అయినట్లేనా!

Image
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఎన్జీబీ విచారణకు హాజరైన రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు కాస్త రిలీఫ్ దక్కినట్లుంది. రెండ్రోజుల పాటు ఎన్సీబీ అధికారుల అడిగిన ప్రశ్నల వర్షంలో తడిసి ముద్దయిన రకుల్ తన విచారణ పూర్తికాగానే ముంబయిని వదిలిపెట్టి హైదరాబాద్‌కు చేరుకుంది. డ్రగ్స్ కేసులో రకుల్ పేరు బయటికి రాగానే మీడియాలో రకరకాల కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో ఉక్కిరిబిక్కిరైన ఆమె తనపై కథనాలు ప్రసరించకుండా మీడియాను ఆదేశించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. Also Read: అనంతరం ఎన్సీబీ నోటీసులతో రకుల్‌ రెండ్రోజుల పాటు విచారణకు హాజరైంది. ఈ సందర్భంగా తన స్నేహితురాలు డ్రగ్స్ ఇస్తే తన ఇంట్లోనే దాచి పెట్టానని అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై రకుల్‌ గానీ, ఎన్సీబీ అధికారులు గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఆమె చేతిలో ఉన్న తెలుగు సినిమా షూటింగ్ నిమిత్తం సోమవారం హైదరాబాద్‌ చేరుకుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి వస్తుండగా తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. Also Read:

53 ఏళ్ల వయసులో నటి హేమ కీలక నిర్ణయం.. ఆమెను అభినందిచాల్సిందే!

Image
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. కొన్ని వందల చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారామె. బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా ప్రస్తుతం యూత్‌లోనూ మంచి పాపులారిటీ సంపాదించారు. ఇన్నాళ్లు సినిమాలతో బిజీగా ఉన్న హేమ.. ఇప్పుడు చదువుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే, దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేసేందుకు ఆమె అర్హత పరీక్ష రాశారు. నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఇటీవల జరిగిన అర్హత పరీక్షకు ఆమె హాజరయ్యారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ద్వారా హేమ తన డిగ్రీని పూర్తి చేయనున్నారు. పరీక్ష ఫలితాలు ఆన్‌లైన్‌లో పెడతామని యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ధర్మానాయక్‌ తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు వెంటనే తమకు నచ్చిన అధ్యయన కేంద్రంలో ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్‌ పొందవచ్చని తెలిపారు. అంటే, హేమ త్వరలోనే డిగ్రీలో చేరతారన్నమాట. 53 ఏళ్ల వయసులోనూ చదువు కోసం ఆరాటపడుతోన్న హేమను అభినందించాల్సిందే. ప్రస్తుతం హేమ రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘కొండాపురం’ సినిమా చిత్రీకరణలో ఉన్నారు. అందుకే పరీక్ష కేంద్రంగా నల్గొం

హీరో సూర్య ఆఫీసుకు బాంబు బెదిరింపు.. చెన్నైలో కలకలం

Image
తమిళ‌ హీరోలను బాంబు బెదిరింపులు కలవరపరుస్తున్నాయి. ఇటీవల కాలంలో సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌, అజిత్‌, మ‌ణిర‌త్నం, విజ‌య్ త‌దిత‌రుల ఇళ్లు, ఆఫీసుల్లో బాంబులు పెట్టామంటూ పోలీసుల‌కు ఫోన్స్ వ‌చ్చాయి. దీంతో పోలీసులు వెంటనే అక్కడ తనిఖీలు చేయగా అవన్నీ ఫేక్ కాల్స్ అని తేలింది. ఈ నేపథ్యంలో తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ హీరోగా కొనసాగుతున్న సూర్యను కేటుగాళ్లు టార్గెట్ చేశారు. Also Read: చెన్నై అల్వార్‌పేట ప్రాంతంలో ఉన్న ఆఫీసులో బాంబు పెట్టినట్లు సోమవారం పోలీసులకు ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే డాగ్‌స్వ్కాడ్‌ను తీసుకెళ్లి తనిఖీలు చేశారు. ఆ ప్రాంతంలో ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో అది ఫేక్‌ కాల్ అని నిర్ధారించుకున్నారు. అయితే ఈ కాల్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారు అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. Also Read:

డ్రగ్స్ కేసులో ఇద్దరు హీరోయిన్లకు షాక్... అప్పటివరకు జైల్లోనే

Image
శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్లు , సంజనా గల్రానీలకు కోర్టు మరోసారి షాకిచ్చింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న వీరిద్దరి బెయిల్ పిటిషన్‌ను మరోసారి తిరస్కరించింది. దీంతో కొద్దిరోజులుగా జైల్లో ఉంటూ బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టాలని ఎదురుచూస్తున్న వారిపై ఆశలపై కోర్టు నీళ్లు చల్లింది. కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం సినీ పరిశ్రమనే కాకుండా, బుల్లితెరను కూడా తాకింది. కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీని మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. Also Read: సీసీబీ పోలీసుల విచారణలో మరికొంత మంది సెలబ్రెటీల పేర్లు వెలుగులోకి వస్తుండటంతో కన్నడ సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ సేకరించి వాటిని ఫైవ్‌స్టార్ హోటళ్లు, క్లబ్బులు, పబ్బుల్లో విక్రయించేదని ఆరోపణలున్నాయి. డ్రగ్స్‌ కేసులో రాగిణి ద్వివేదికి సెప్టెంబర్‌ 3న సమన్లు పంపిన సీసీబీ అధికారులు మరుసటి రోజే ఆమె ఇంట్లో సోదాలు జరిపారు. విచారణకు సహకరించడం లేదంటూ అదే రోజు ఆమెను అరెస్ట్ చేశారు. 8వ తేదీన సంజన ఇంట్లో కూడా సోదాలు జరిపి ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. Also Read:

Hemanth Avanti: రెడ్డోళ్లు లక్ష్మారెడ్డికి మద్దతుగా ర్యాలీ చేస్తే ఏం చేస్తారు? హేమంత్ కులోన్మాద హత్య‌పై మాధవీలత షాకింగ్ పోస్ట్

Image
కులరక్కసి కాటుకి ఒక్కో ప్రేమ జంట బలైపోతూనే ఉన్నారు.. తన కులం కాని వాడిని ప్రేమించిందనే కారణంతో ఆ ప్రేమ జంటను విడదీయడం.. కుదరకపోతే అల్లుడని కూడా చూడకుండా క్రూరంగా చంపేయడం. అప్పట్లో ప్రణయ్.. ఇప్పుడు హేమంత్. హైదరాబాద్ చందానగర్‌కు చెందిన హేమంత్.. అవంతిలు పెద్దల్ని ఎదిరించి కులాంతర వివాహం చేసుకోవడం.. కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో అవమానంగా భావించిన అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చన తీవ్ర మనోవేదన చెందారు. హేమంత్ మీద కక్ష పెంచుకున్నారు. గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న యువ జంటను కిడ్నాప్ చేసి దుండగులు సంగారెడ్డిలో భర్త హేమంత్‌ను దారుణంగా హతమార్చారు. జిల్లాలోని కొండాపూర్ మండలం కిష్టాయగూడెం శివాయలోని చెట్ల పొదల్లో హేమంత్ మృతదేహాన్ని పడేశారు. ఈ కులోన్మాద హత్య సంచలనంగా మారగా.. దీన్ని ఖండిస్తూ ఫేస్ బుక్‌లో షాకింగ్ పోస్ట్ పెట్టింది హీరోయిన్, బీజేపీ లీడర్ . ‘మరో పరువు హత్య.. అమ్మాయి తన కులం వాడినే ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపిన వారు ఉంటే.. చూపించండి నాకు.. కులం పరువు, హోదా, డబ్బు, దర్పం మనుషులుగా మరణించిన మృగాలు. ఈ భూమి మీద ఇప్పటి రాజ్యాంగం ప్రకారం మేజర్ అయ్యాక ఎవరి హక్కులు వారివే.. ఔను కొడుకు

‘మోస‌గాళ్ళు’ టైటిల్ థీమ్ మ్యూజిక్‌.. శ్యామ్ సిఎస్‌‌పై ప్రశంసల జల్లు

Image
విష్ణు హీరోగా న‌టిస్తోన్న ‘మోస‌గాళ్ళు’ టైటిల్ మోషన్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. ‘ద రైజ్ ఆఫ్ మోసగాళ్ళు’ పేరిట విడుదలైన ఈ మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకులను నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా మోషన్ పోస్టర్‌కు ఇచ్చిన థీమ్ మ్యూజిక్ చాలా బాగుందని కామెంట్స్ వచ్చాయి. ఆస‌క్తిక‌రంగా ఉన్న ఆ థీమ్ మ్యూజిక్ బాగా పాపుల‌ర్ అయ్యింది. ద‌క్షిణ భార‌త సినీ రంగంలోని ప్రముఖ సంగీత ద‌ర్శకుల్లో ఒక‌రిగా పేరుపొందిన శ్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. థీమ్ మ్యూజిక్‌తో అంద‌రి మ‌న‌సుల్నీ గెలుచుకున్న ఆయ‌న‌, ఆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు మ్యాచ్ అయ్యేలా ఈ సినిమాకు సంబంధించిన త‌దుప‌రి ప్రమోష‌న‌ల్ కంటెంట్‌కు వ‌ర్క్ చేస్తున్నారు. అలాగే సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. హీరోగా న‌టిస్తూ విష్ణు మంచు నిర్మిస్తోన్న ‘మోస‌గాళ్ళు’ సినిమాకు జెఫ్రీ గీ చిన్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. విష్ణు సోద‌రిగా ఆయ‌న పాత్రతో స‌మాన ప్రాధాన్యం ఉన్న పాత్రను కాజ‌ల్ అగ‌ర్వాల్ చేస్తున్నారు. భార‌త్‌లో మొద‌లై, అమెరికాను వ‌ణికించిన చ‌రిత్రలోనే అతి పెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో వాస్తవ ఘ‌ట‌న‌ల ఆధారంగా ‘మోస‌గాళ్ళు’ చిత్

‘రాధేశ్యామ్’ ‌ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. పూజా పాత్రపై ఆ వార్త నిజమేనా?

Image
టాలీవుడ్ అగ్ర కథానాయికగా కొనసాగుతున్న ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’ సినిమాలో ప్రభాస్‌తో రొమాన్స్ చేస్తోంది. పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజా పాత్రకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. Also Read: ‘రాధేశ్యామ్‌’లో పూజా హెగ్డే డ్యూయెల్‌రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ పాత్ర క్లాసికల్ డ్యాన్సర్ కాగా.. మరో పాత్రపై క్లారిటీ రాలేదు. అయితే పూజా డ్యుయెల్ రోల్ వార్తపై కూడా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. చిత్ర యూనిట్ స్పందిస్తేనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. Also Read: 1970 దశాబ్దంలో యూరప్‌లో జరిగిన ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కథ ప్రకారం 50శాతం షూటింగ్ యూరప్‌లోనే చిత్రీకరించాలని ప్లాన్ వేసుకున్నారు. అయితే కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో యూనిట్ తన నిర్ణయం మార్చుకున్నట్లు స

అఖిల్ ఆమెను మరీ ఈరేంజ్‌లో లవ్ చేస్తున్నాడా? ఎఫైర్ల కొంపలో పెద కుంపటి!

Image
బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్లు ఎవరో.. ముక్కూ మొహం తెలియని వాళ్లని పెట్టారనే విమర్శ వినిపించింది. అయితే మూడు వారాలు గడిచేటప్పటికి మెల్ల మెల్లగా కంటెస్టెంట్లు అందరూ అలవాటు అయ్యారు. అరియానా గ్లోరి, అఖిల్, మోనాల్, మెహబూబ్, సుజాత, హారిక, అభి, సొహైల్, దివి ఇలా దాదాపు అందరూ కొత్త వాళ్లే.. పెద్దగా ఎవరికీ తెలియని వాళ్లే. అయితే కొత్త ముఖాలను జనంలోకి బాగా వేగంగా గుర్తిండిపోయేలా వెళ్లాలంటే ఎంచుకున్న మార్గం ఎఫైర్స్. అవును బిగ్ బాస్ హౌస్ ఎఫైర్ల కొంపలా మారింది. తొలివారం గంగవ్వపైనే కెమెరా ఫోకస్ పెట్టి.. బాగానే రేటింగ్ అందుకున్నారు. ఇక రెండో వారంలో మొనాల్ గజ్జర్, అభిజిత్, అఖిల్‌ల మధ్య ఎఫైర్ నడుస్తున్నట్టుగా వారం మొత్తం చూపించారు. ఇక ఆదివారం నాడు నాగార్జున ఎంట్రీ ఇచ్చి.. గతంలో పునర్నవి-రాహుల్‌ల మధ్య ఏదో ఉందనే అనుమానాలకు బలాన్ని ఎలాగైతే ఇచ్చారో.. శనివారం నాటి ఎపిసోడ్‌లో మొనాల్ మనసులో ‘A’ ఉందని హింట్ ఇచ్చారు నాగార్జున. ఆ ‘A’ అంటే అఖిలా?? లేక అభిజిత్‌నా అన్నది మాత్రం చెప్పలేదు కాని.. అభిజిత్‌ని లైక్ చేస్తున్నట్టుగా అతని ముందే ఓపెన్ అయ్యింది మొనాల్. మనసులో ‘A’ ఉన్నాడు కదా అంటే అవును అంటూ తెగ సిగ్గుపడిప

51 రోజులు హాస్పిటల్‌లో.. బిడ్డ ఎంత అవస్తపడ్డాడో: కంటతడి పెట్టిన జానకమ్మ

Image
దిగ్గజ గాయకురాలు, పద్మ భూషణ్ ఎస్. జానకిని జానకమ్మ అని ప్రేమగా పిలిచేవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అందుకే ఆ బిడ్డ ఇక లేడు అన్న వార్తను ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మధ్యే తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాడని గుర్తుచేసుకుని బాధపడుతున్నారు. మృతికి సంతాపం తెలియజేస్తూ ఒక వీడియోను జానకి విడుదల చేశారు. ఈ వీడియోలో బాలసుబ్రహ్మణ్యంతో తన అనుబంధాన్ని, జ్ఞాపకాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ క్రమంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. ‘‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని నేను మొట్టమొదటి చూసింది నెల్లూరు దగ్గర గూడూరులో. ఒక కాంపిటీషన్‌లో చూశాను. అక్కడ పిల్లల కాంపిటీషన్ పెట్టారు.. అప్పటికి బాలు చిన్నవాడు. కాంపిటీషన్‌లో గెలిచినవారికి బహుమతి ఇవ్వడానికి నన్ను పిలిచారు. నేను మద్రాసు నుంచి గూడూరుకి వెళ్లాను. ఆ కాంపిటీషన్‌లో గెలిచిన వాళ్లను పాడించారు. బాలసుబ్రహ్మణ్యం చాలా బాగా పాడాడు. చాలా మంచి గొంతు. ఎంత బాగుందంటే.. ఎవరినీ కాపీ చేయకుండా చాలా నేచురల్‌గా ఉంది. తనకంటూ భగవంతుడు ఒక గొంతు ఇచ్చాడు కదా.. ఆ గొంతులోనే పాడాడు. ఎవరినీ కాపీ చేయలేదు. ఎవరినీ కాపీ చేయకుండా నీ గొంతులోనే నువ్వు పాడావు, చాలా బాగుంద

Charmy Kaur: నా కనురెప్ప పూరీ జగన్నాథ్‌! లవ్ యూ.. మాటిస్తున్నానంటూ ఓపెన్‌గా చెప్పేసిన ఛార్మి

Image
ఒకప్పుడు హీరోయిన్‌గా గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఓ ఊపు ఊపేసిన ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి.. ప్రస్తుతం నిర్మాతగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి ఈ బ్యానర్ మేనేజ్‌మెంట్ బాధ్యతలను పూర్తిగా భుజాలపై వేసుకున్న ఆమె అన్నీ తానై చూసుకుంటూ వరుస సినిమాలు నిర్మిస్తోంది. దీంతో పూరి- చాలా దగ్గరయ్యారు. ఎప్పుడు.. ఎక్కడ చూసినా ఈ జోడీ కలిసే కనిపిస్తోంది. పైగా పలుసార్లు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, అభిమానాలు కూడా వ్యక్తపరిచారు. ఈ చొరవతోనే నేడు (సెప్టెంబర్ 28) పూరి జగన్నాథ్ సంబర్భంగా లవ్ యూ అంటూ స్పెషల్ విషెస్ చెప్పింది ఛార్మి. తనకు పూరి కనురెప్ప లాంటి వారని పేర్కొంది. ''ప్రాణ స్నేహితుడు, ఎప్పుడూ నా క్షేమం గురించి ఆలోచించే వ్యక్తి, బెస్ట్ బిజినెస్ పార్ట్నర్ అయిన గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. లవ్ యూ. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. మీరు గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా. మున్ముందు ఇంకా దున్నేద్దాం'' అని ఛార్మి ట్వీట్ చేసింది. ఇటీవలే ఛార్మి- పూరి కలిసి సంయుక్తంగా నిర్మించిన 'ఇస్మ