Unlock 5.0: థియేటర్లకు, సూళ్లకు గ్నీన్ సిగ్నల్..

రోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ ఆంక్షలను క్రమంగా తొలగిస్తూ వస్తున్న కేంద్రం.. తాజాగా మరిన్ని మినహాయింపులు ఇచ్చింది. , మల్టీప్లె్క్సులు, ఎగ్జిబిషన్ హాళ్లు, స్విమ్మింగ్‌పూల్స్ తెరుచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. పలు ఆంక్షలను విధించింది. బుధవారం (సెప్టెంబర్ 30) రాత్రి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాల మధ్య, అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని స్పష్టం చేసింది. ప్రయాణాలకు ఎలాంటి పాసులు అక్కర్లేదని పేర్కొంది. కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను అక్టోబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. మార్గరద్శకాలు.. ✧ కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరిచేందుకు అనుమతి. అయితే.. 50 శాతం సీట్ల సామర్థ్యంతోనే సినిమా హాళ్లను తెరుచుకోవాలి. ✧ అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు తెరుచుకోవచ్చు. ఆ నిర్ణయాధికారం పూర్తిగా రాష్ట్రాలదే. పిల్లలను పంపించే అంశంపై తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి. ✧ క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్ పూల్స్ తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్. ✧ కంటైన్‌మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు. ✧ వినోద పార్కులు మూసివేసే ఉంచాలి. ✧ చిన్నారులు, వయోవృద్ధులు ఇళ్లలోనే ఉండాలి. ✧ కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల 100 మందితో రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు నిర్వహించుకోవచ్చు. వీటిపై తుది నిర్ణయం రాష్ట్రాలదే. ✧ అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగింపు. హోం శాఖ ప్రత్యేక అనుమతితో అంతర్జాతీయ ప్రయాణాలు చేయవచ్చు. ✧ కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎలాంటి లాక్‌డౌన్‌లు విధించవచ్చు. ✧ రాష్ట్రాల మధ్య, అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దు. ప్రయాణాలకు ఎలాంటి పాసులు అక్కర్లేదు. విద్యా సంస్థలు, శిక్షణా సంస్థలు తెరిచే అంశాన్ని కేంద్రం తాజా మార్గదర్శకాల్లో ప్రత్యేకంగా పేర్కొంది. అక్టోబర్‌ 15 నుంచి స్కూళ్లు, కోచింగ్‌ సెంటర్లు దశలవారీగా తెరిచే అంశాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడిచిపెట్టింది. పిల్లలను పంపే అంశంపై తల్లిదండ్రుల లిఖిత పూర్వక అనుమతి తప్పనిసరని పునరుర్ఘాటించింది. ఈ విషయంలో రాష్ట్రాలు సొంతంగా మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగించుకోవచ్చని కేంద్రం తెలిపింది. కాలేజీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు తెరిచే అంశంపై నిర్ణయాధికారం ఉన్నత విద్యా విభాగాలకే విడిచిపెట్టింది. ఆన్‌లైన్‌ తరగతులకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. Also Read: Don't Miss:


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ