హైదరాబాద్‌ వచ్చేసిన రకుల్‌... ఆ కేసు నుంచి సేఫ్ అయినట్లేనా!

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఎన్జీబీ విచారణకు హాజరైన రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు కాస్త రిలీఫ్ దక్కినట్లుంది. రెండ్రోజుల పాటు ఎన్సీబీ అధికారుల అడిగిన ప్రశ్నల వర్షంలో తడిసి ముద్దయిన రకుల్ తన విచారణ పూర్తికాగానే ముంబయిని వదిలిపెట్టి హైదరాబాద్‌కు చేరుకుంది. డ్రగ్స్ కేసులో రకుల్ పేరు బయటికి రాగానే మీడియాలో రకరకాల కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో ఉక్కిరిబిక్కిరైన ఆమె తనపై కథనాలు ప్రసరించకుండా మీడియాను ఆదేశించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అనంతరం ఎన్సీబీ నోటీసులతో రకుల్‌ రెండ్రోజుల పాటు విచారణకు హాజరైంది. ఈ సందర్భంగా తన స్నేహితురాలు డ్రగ్స్ ఇస్తే తన ఇంట్లోనే దాచి పెట్టానని అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై రకుల్‌ గానీ, ఎన్సీబీ అధికారులు గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఆమె చేతిలో ఉన్న తెలుగు సినిమా షూటింగ్ నిమిత్తం సోమవారం హైదరాబాద్‌ చేరుకుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి వస్తుండగా తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ