‘రాధేశ్యామ్’ ఇంట్రస్టింగ్ అప్డేట్.. పూజా పాత్రపై ఆ వార్త నిజమేనా?
టాలీవుడ్ అగ్ర కథానాయికగా కొనసాగుతున్న ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమాలో ప్రభాస్తో రొమాన్స్ చేస్తోంది. పీరియాడికల్ లవ్స్టోరిగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజా పాత్రకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. Also Read: ‘రాధేశ్యామ్’లో పూజా హెగ్డే డ్యూయెల్రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ పాత్ర క్లాసికల్ డ్యాన్సర్ కాగా.. మరో పాత్రపై క్లారిటీ రాలేదు. అయితే పూజా డ్యుయెల్ రోల్ వార్తపై కూడా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. చిత్ర యూనిట్ స్పందిస్తేనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్యాన్ ఇండియా రేంజ్లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. Also Read: 1970 దశాబ్దంలో యూరప్లో జరిగిన ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కథ ప్రకారం 50శాతం షూటింగ్ యూరప్లోనే చిత్రీకరించాలని ప్లాన్ వేసుకున్నారు. అయితే కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో యూనిట్ తన నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్లోనే యూరోప్ సెట్ వేసి షూటింగ్ చేయాలని ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ రెండో వార్తలో రీస్టార్ కానుంది. Also Read:
Comments
Post a Comment