బాబీ.. బీజేపీలోకి వచ్చేస్తున్నా!!: కరాటే కళ్యాణి పొలిటికల్ ఎంట్రీ, జగన్పై ఎటాక్

బాబీ పించేశావ్... అంటూ అనేక వ్యాంప్ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించిన .. ఇటీవల బిగ్ బాస్ హౌస్కి రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. అయితే సినిమాలు, సీరియల్స్, హరికథ, బిగ్ బాస్ మాత్రమే కాకుండా త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుందంటూ ప్రకటన చేసింది కరాటే కళ్యాణి. ఆమె మాట్లాడుతూ.. ‘బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలని నాకు మంచి ఆఫర్ వచ్చింది.. దాన్ని నేను వదులుకోలేదు.. ఆ పార్టీలో జాయిన్ అవుతా అని అనౌన్స్ కూడా చేశా. నన్ను అందరూ అడిగే వారు.. మీరు ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అవుతున్నారు అని.. అందుకే బీజేపీలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యా. నిజంగా బిగ్ బాస్కి వెళ్లకముందే బీజేపీలో జాయిన్ అయ్యి ఉంటే నాకూ ఓటు బ్యాంక్గా ఉపయోగపడేది. కాని బిగ్ బాస్ రూల్స్ ప్రకారం పార్టీలో చేరొచ్చో లేదోనన్న డైలమాలో ఉన్నా. నిజంగానే పార్టీ జాయిన్ అయ్యి ఉంటే.. ఒకే వర్గం ముద్ర పడుతుందని ఇన్ డైరెక్ట్గా అన్నారు. మీరు జాయిన్ కావొచ్చు కాని.. ఇప్పుడు కాదు అన్నట్టుగా హింట్ ఇచ్చారు. బీజేపీ అనగానే హిందుత్వం అనే ఫీల్లో ఉన్నారు. కాని బిగ్ బాస్ చూసేశాళ్లు వేరే మతం వాళ్లు కూడా ఉంటారని ఆలోచించా. కాని ఇప్పుడు ఎందుకు బీజేపీ పార్టీలోకి వెళ్లలేదా? అని ఫీల్ అవుతున్నాను. బీజేపీలో జాయిన్ అయ్యి బిగ్ బాస్కి వెళ్లి ఉంటే నాకు ఓట్లు బాగా పడేవి. హిందువులు కోట్లలో ఉన్నారు కాబట్టి.. మన పిల్ల అనే ఫీల్తో అయినా ఓట్లు వేసేవారు. హిందూ ధర్మంలో ఉన్న చాలామందికి బిగ్ బాస్ ఇష్టం ఉండదు.. వేస్ట్ షో.. సహజీవనాలు చేస్తున్నారు అంటూ కామెంట్ చేసేవారు ఉన్నారు. అయితే హిందూ ధర్మం కోసం పోరాడే నేను బీజేపీలో చేరి ఆ తరువాతనే బిగ్ బాస్కి వెళ్లాల్సింది. రెండు నెలల్లో జాయిన్ అవుతా చెప్పి బిగ్ బాస్కి వెళ్లాను. ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీలో జాయిన్ అవుతా.. ఎప్పుడా ఆ న్యూస్ వింటారు. ఎక్కడ జాయిన్ అవుతా ఎవరి సమక్షంలో అన్నది ఆలోచిస్తున్నా.. అయితే పార్టీలోకి రావడం అయితే పక్కా. నేను మొదటి నుంచి బీజేపీ అంటే ఇష్టపడతాను. మోడీ వచ్చాక బీజేపీపై బాగా ఇష్టం పెరిగిపోయింది. ఆయన ఏం చేసినా కట్టుబడి ఉంటా.. మనం హిందువులం కాబట్టి.. హిందూ ధర్మాన్ని ప్రోత్సహిస్తున్న పార్టీ ఒక్క బీజేపీ మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చారు కరాటే కళ్యాణి. అయితే కరాటే కళ్యాణి పార్టీలో జాయిన్ కాకుండానే ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారని.. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని.. డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల దర్శనానికి వెళ్ళడాన్ని ఖండించారు కరాటే కళ్యాణి. ఈ సందర్భంగా జగన్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారామె. ఈ పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
Comments
Post a Comment