Posts

Showing posts from April, 2021

‘వకీల్‌సాబ్’ టైటిల్ కార్డులో ఇంత అర్థం ఉందా.. వేణు శ్రీరామ్ నువ్వు మామూలోడివి కాదు!

Image
రాజకీయాల కోసం సినిమాలకు దూరమైన పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్.. మళ్లీ ‘’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. హిందీలో సూపర్‌హిట్ సాధించిన ‘పింక్’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. పవర్‌స్టార్‌ని ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో చూసి.. అభిమానులు పండుగ చేసుకున్నారు. స్వతహాగా పవన్‌కళ్యాణ్ అభిమాని అయిన వేణు శ్రీరామ్ ఒక ఫ్యాన్ తన ఫేవరేట్ హీరోని ఎలా చూపించాలో సినిమాలో పవన్‌కళ్యాణ్‌ని అలాగే చూపించాడు. పవర్‌స్టార్ ఇమేజ్‌కి తగ్గట్లు స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి.. ఫ్యాన్స్‌కి ఫీస్ట్ అందించాడు. మాస్ యాంగిల్‌లో ఓ రేంజ్ ఎలివేషన్లతో పవర్‌స్టార్‌ రీఎంట్రీ అదిరిపోయేలా సినిమాని రూపొందించాడు దర్శకుడు. ఇక బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘వకీల్‌సాబ్’ తాజాగా ఓటీటీలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్ టైటి

Happy Birthday Ajith: తెలుగు సినిమాతో కెరీర్‌ స్టార్ట్.. తలనెరిసినా తగ్గని క్రేజ్.. సౌతిండియాకే ట్రెండ్ సెట్టర్‌

Image
స్టార్ హీరో అంటే ఇలాగే ఉండాలి.. అనే కొలమానాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. స్మార్ట్ లుక్స్, స్టైలిష్ డ్రెస్సింగ్ ఇలా చెప్పుకుంటూపోతే బొలెడన్ని క్వాలిటీస్ ఉంటేనే అతన్ని హీరోగా గుర్తిస్తారు. కానీ, అలాంటి అడ్డుగోడలు అన్ని బద్దలుకొట్టారు . తల, గడ్డెం నెరిసినా.. కనీసం రంగు కూడా వేసుకోకుండా యాక్టింగ్ చేస్తూ.. సౌతిండాలోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. సినిమా రంగంలోనే కాదు.. రేసింగ్‌లోనూ తన ప్రతిభ చూపిస్తూ.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. నేడు(మే 1వ తేదీ) ‘తలా’ 50వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు కొన్ని తెలుసుకుందాం. అజిత్ 1971, మే 1వ తేదీన సికింద్రాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం కేరళకి చెందిన వ్యక్తి, తల్లి సింధిది కోల్‌కతా. పదవ తరగతిలో చదువు మానేసిన ఆయన.. ఆ తర్వాత ఓ మిత్రుడి ద్వారా కొంతకాలం రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో మెకానిక్‌గా పని చేశారు. ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే ఆయన మోడలింగ్, చేయడం కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీ.సీ.శ్రీరామ్ ఆయనను గుర్తించి.. సినిమా రంగంవైపు అడుగులు వేయించారు. ఇక దివంగత గాయకుడు ఎస్పీ బాలస

ఎమ్మెస్ నారాయణ సెట్‌కి తాగి వచ్చి నన్ను గదిలోకి లాక్కుపోయాడు.. నేను అలా చేసేసరికి..: నటి పద్మ జయంతి

Image
సీనియర్ ఆర్టిస్ట్ చాలా చిత్రాల్లో కనిపిస్తూనే ఉంటుంది. దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించిన పద్మ జయంతి.. తల్లిగా.. వదినగా.. ఇతర పాత్రల్లో కనిపించింది. అయితే తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ టాలీవుడ్ ఇండస్ట్రీపైన సీనియర్ నటులపైన షాకింగ్ కామెంట్స్ చేసింది.. తాను 350 చిత్రాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులు సరిగా గుర్తుపట్టడం లేదంటే.. దాదాపు 200 సినిమాల్లో తనని ఎదగనీయకుండా దొక్కేయడమే కారణం అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా చలపతిరావు, చంద్రమోహన్ తదితరులు సీనియర్ నటులపై తీవ్ర ఆరోపణలు చేయగా.. దివంగత నటుడు, స్టార్ కమెడియన్ తనతో తాగి వచ్చి మిస్ బిహేవ్ చేశారంటూ నాడు సెట్ ఆయన ఎలా ప్రవర్తించాడో చెప్పుకొచ్చింది. నేను ఇండస్ట్రీలో ఎన్ని బాధలు పడ్డానో.. నేను ఏడ్వడం కాదు.. ఎదుటి వాళ్లు ఏడుస్తారు. కానీ బయటకు చెప్పుకోలేను. ఎందుకుంటే.. నన్ను చూసి నా వెనుక చాలామంది ఏడుస్తారు. నన్ను చాలామంది చాలా రకాలుగా హింసించారు. సీనియర్ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ గారు సెట్స్‌లోనే నాతో అసభ్యకరంగా ప్రవర్తించారు. మేం ఇద్దరం కలిసి ఓ సినిమాకి చేస్తున్నాం.. అప్పటికి నా పరిస్థితి ఏంటి అంటే మా అత్తగ

వామ్మో కల్పిక.. గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా.. మోనోకినీలో తెలుగు అమ్మాయి అందాలు..!

Image
టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలాంటి చాలాకాలంలో ఓ తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలో నెట్టుకొస్తుంది అంటే అది ఎంతో గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ‘ప్రయాణం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన కల్పిక.. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ‘జులాయి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలలో తన నటనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇక సోషల్‌మీడియాలో ఈ భామ విపరీతంగా యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాల్లో గ్లామర్ షోకి పూర్తి దూరంగా ఉండే ఆమె.. సోషల్‌మీడియాలో మాత్రం రెచ్చిపోతుంటుంది. హాట్ ఫోటోషూట్‌లు చేస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ గ్లామర్ డోస్ బాగానే పెంచేసింది. ఆమె సినిమాల్లో చేసేది సపోర్టింగ్ పాత్రలే అయినా.. హీరోయిన్స్‌లా శరీరాకృతి మెయింటేన్ చేస్తుంది. అంతేకాదు.. హీరోయిన్లకు తాను ఏ మాత్రం తీసిపోనూ అనే రేంజ్‌లో సోషల్‌మీడియాలో ఫోటోలు పెడుతుంది. తాజాగా ఏకంగా ఓ మోనోకిని ధరించి ఆ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసింది. ఇంకేముంది కొంత సమయంలోనే ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కల్పిక ఈ ఏడాది ‘సీత ఆన్

టాలీవుడ్‌లో విషాదం.. కరోనాతో దర్శకుడు కన్నుమూత

Image
ప్రస్తుతం కరోనా ఉధృతి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. కరోనా సోకి టాలీవుడ్ డైరెక్టర్ మరణించారు. కరోనాతో పోరాడి ఓడిన డైరెక్టర్ తుది శ్వాస విడిచారు. కుమార్ వట్టి అనే సినిమాతో దర్శకుడిగా మారారు. శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ఈ మూవీతోనే కుమార్ వట్టి దర్శకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ఈయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. కుమార్ వట్టి మొదటగా పరుశురాం వద్ద అసిస్టెంట్‌గా పని చేశారు. యువత సినిమా కోసం పరుశురాం వద్ద కుమార్ వట్టి పని చేశారు. ఆ తరువాత సోలో సినిమాకు కూడా పనిచేశారు. ఆ సందర్భంలోనే శ్రీ విష్ణుతో పరిచయం జరగడం, తాను దర్శకుడిగా మారితే తన హీరో కచ్చితంగా అని అప్పుడే ఫిక్స్ అయ్యారట కుమార్ వట్టి. అలా మొత్తానికి మా అబ్బాయి సినిమాతో కుమార్ వట్టి దర్శకుడిగా మారారు. వట్టి కుమార్ శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటకు చెందిన వారు. అవివాహితుడైన ఆయన వయసు 39 సంవత్సరాలు. ఎంతో ఎత్తుకు ఎదుగుదామని ఆ డైరెక్టర్‌ను కన్న కలలను కరోనా వైరస్ కబళించింది. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న కుమార్ వట్టి నేడు కన్నుమూశారు. గురువారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్లాస్మా ఎక్కించారు. ఆ క్రమంలోనే

వాటి తరువాత నేను హ్యాంగ్ అయ్యేది అక్కడే.. అల్లు శిరీష్ మామూలోడు కాదు!

Image
సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. వెండితెరపై కనిపించే అల్లు శిరీష్‌కు.. సోషల్ మీడియాలో పంచ్‌లు వేస్తూ సరదాగా ఉండే అల్లు శిరీష్‌కు ఎంతో తేడా ఉంటుంది. సోషల్ మీడియాలో తన మీద వచ్చే ట్రోలింగ్‌పైనా అల్లు శిరీష్ సెటైర్లు వేస్తుంటారు. నెగెటివ్ కామెంట్లపై అల్లు శిరీష్ కాస్త గరంగరం అవుతుంటారు. అయిత అల్లు శిరీష్‌కు ఎక్కువగా తన తదుపరి ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ప్రశ్నలే ఎదురువుతుంటాయి. ఏబీసీడీ సినిమా తరువాత అల్లు శిరీష్ మళ్లీ తెరమీదకు రాలేకపోయారు. అప్పటి నుంచి ఓ సినిమాను కూడా లైన్‌లో పెట్టలేకపోయారు. ప్రతీసారి ఏదో ఒక అడ్డంకి రావడంతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. మొత్తానికి అల్లు శిరీష్ తన కొత్త సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. అను ఇమాన్యుయేల్ హీరోయిన్‌గా రాబోతోన్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. అయితే అల్లు శిరీష్ ఇప్పుడు ఫుల్ హ్యాంగ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. మామూలుగా అల్లు వారబ్బాయికి కాఫీ షాప్, బుక్ షాప్స్ అంటే మహా ఇష్టం. అయితే అవి రెండూ కాకుండా మరో చోటు అంటే కూడా ఇష్టమట. తన ఇంటిలోని గార్డెన్ ఏరియాలో అల్లు శిరీష్ హ్యాంగ్ అవుతాడట. ఈ విషయాన్ని తాజాగ

‘సిద్ధార్త్ ఒక నేరస్థుడు, అతనిపై కోర్టులో కేసు నడుస్తుంది’ బీజేపీ స్పోక్స్‌పర్సన్ సెన్సేషనల్ కామెంట్స్

Image
తమిళనాడు బీజేపీకి చెందిన కొందరు తన ఫోన్‌ నెంబర్‌ని లీక్ చేయడంతో వందల సంఖ్యలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ నటుడు గురువారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తనని తన కుటుంబాన్ని చంపేస్తామంటూ వాళ్లు బెదిరిస్తున్నారని అతను పేర్కొన్నాడు. అంతేకాక.. అత్యాచారం చేస్తామని కూడా బెదిరింపులు వచ్చాయని.. అన్ని కాల్స్‌ని రికార్డు చేసి పోలీసులకు అందజేస్తానని అతను ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీంతో పాటు తనకు వచ్చిన వేధింపులకు సంబంధించిన వాటిలో ఒకదాని స్క్రీన్ షాట్ తీసి అతను పోస్ట్ చేశాడు. దేశానికి వైరస్ నుంచి విముక్తి వస్తుంది కానీ.. ఇలాంటి వాళ్ల నుంచి విముక్తి రాదంటూ అతను వ్యాఖ్యానించాడు. తాను చేసిన ట్వీట్‌లో సిద్ధార్త్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కూడా ట్యాగ్ చేశాడు. దీంతో దీన్ని తీవ్రంగా పరిణామించింది. సిద్దార్త్ తన ట్వీట్ల ద్వారా మోదీ, అమిత్ షాలను అవమానించాడు అంటూ తమిళనాడు బీజేపీ స్పోక్స్‌పర్సన్ నారాయణన్ తిరుపతి అన్నారు. ‘సిద్ధార్త్ అనే వ్యక్తి తరచూ నేరాలకు పాల్పడుతూ ఉంటాడు. గతంలో అతనిపై నేనే కేసు పెట్టాను.. ఆ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. తాజాగా అతను ప్రధాని మోదీ, హోం మంత్రి సీ

సాయి ధరమ్ తేజ్ పేరుతో మోసం.. డబ్బు వసూళ్లతో దందా.. రంగంలోకి సుప్రీం హీరో

Image
ఒక్కోసారి కొన్ని వార్తలు వింటే నవ్వు వస్తుంటుంది. అయితే చివరకు అవే వార్తలు ఎంతో సీరియస్‌గా మారుతుంటాయి. ఆ మధ్య సోషల్ మీడియాలో ఓ మోసం కంటిన్యూగా జరుగుతూ వచ్చేది. ఫేస్ బుక్‌లో నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి.. సదరు ఖాతాలోని ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న వారిని డబ్బు సాయం చేయాల్సిందిగా కోరేవారు. అడిగేది తమ స్నేహితుడే అని కొందరు పొరబాటు పడి డబ్బులు కూడా పంపేవారు. అలాంటి మోసాల గురించి ఎన్నో చదివి ఉంటారు. ఇలాంటి ఘటనలన్నీ సాధారణ వ్యక్తుల విషయాల్లో జరుగుతుంటాయి. కానీ సుప్రీమ్ హీరో విషయంలోనూ జరగడం ఆశ్చర్యకరం. సాయి ధరమ్ తేజ్‌కు అవసరం పడి తన తోటీ నటీనటులను 15 వేలు అడగడం ఏంటో గానీ.. ఈ విషయంపై సాయి ధరమ్ తేజ్ వెంటనే స్పందించి పోలీసుల సాయం తీసుకున్నారు. ఈ మేరకు అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ సాయి ధరమ్ తేజ్ ఓ ప్రెస్ నోట్ వదిలారు. నా పేరు మీదుగా నేను నటించిన కో ఆర్టిస్ట్, ఇతర సభ్యుల దగ్గర డబ్బులు వసూళ్లు చేస్తున్నారని నాకు తెలిసింది. నాకు ఆర్థిక సాయం కావాలని వారిని డబ్బులు అడుగుతున్నానట. ఈ విషయంపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను. మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి.. అలాంటి వాటిని నమ్మకండి.. నా పేరు మీద వచ్చే మెసె

‘ఆ సినిమా రీమేక్ చేస్తే.. ఉన్న పరువు పోతుంది’.. బెల్లంకొండ బ్రదర్స్‌పై ట్రోల్స్

Image
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడిగా తెలుగు తెరకి పరిచయమైన బిగ్గెస్ట్ సక్సెస్‌ని అందుకోలేకపోతున్నాడు. స్టార్ హీరోయిన్లు, టాప్ డైరక్టర్లు, భారీ బడ్జెట్‌తో సినిమా చేసినా.. ఈ హీరో ఖాతాలో ఒక్క సూపర్ హిట్ కూడా లేదు. లేటెస్ట్‌గా ‘అల్లుడు అదుర్స్’ అంటూ శ్రీనివాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఎలాగైనా టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాలని అతను పట్టుదలతో ఉన్నాడు. దీంతో లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ చిత్రం ‘’ తెలుగు రీమేక్‌లో అతను నటించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ కోసం రెడీ అవుతున్నాడు. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌హిట్ చిత్రం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో అతను నటిస్తున్నాడు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుందని టాక్. బాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గట్టు సినిమా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి రూపొందిస్తున్నారట. ఈ సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లో హిట్ అందుకోవడం ఖాయమని సన్నిహితులు అంటున్నారు. అయితే తెలుగులోనే అతనికి ఇప్పట

బాహుబలికి అయ్యలా ఫీల్ అవుతున్నాడు.. ఆ అధికారిపై ఆర్జీవీ కామెంట్స్ వైరల్

Image
రామ్ గోపాల్ ఎప్పుడు ఎవరి మీద పడతాడో ఎవ్వరికీ తెలియదు. గత కొన్ని రోజులుగా వరుస ట్వీట్లతో హల్చల్ చేస్తున్నారు. ఇండియా, కరోనా, ప్రధాని మోదీ, ప్రపంచ దేశాలు అంటూ అన్ని టాపిక్స్ మీదా కామెంట్లు చేస్తున్నారు. అయితే వర్మ సంధించే ప్రశ్నలు అందరిలోనూ ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ప్రధాని మోదీపై విమర్శించేలా చేస్తోన్న ఈ ట్వీట్లు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా ధాటికి అతలాకుతలం అవుతోంది. సరైన వైద్యం అందక, ఆస్పత్రిలో సౌకర్యాలు లేక, ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు. శవాలను కాల్చడానికి కూడా క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనాతో ఎన్నో శవాలు దిక్కులేనివిగా అలా పడి ఉన్నాయి. వాటన్నంటిపైనా ఆర్జీవీ తన స్టైల్లో స్పందించారు. ఇక ఢిల్లీలో ఆక్సిజన్ కొరతపై ఓ వీడియోను షేర్ చేశారు.అందులో భయంకరమైన దృశ్యాలున్నాయి. రోడ్డు మీదే ఆటో, కారులో ఇలా ఎక్కడబడితే అక్కడ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు. ఇంతకంటే ఘోరమైన సన్నివేశాలను ఏ దర్శకుడైనా తెరకెక్కించగలరా? అని ఆర్జీవీ ప్రశ్నించారు. ఇక రెండ

మరో ప్రయోగానికి సిద్ధమైన రావు రమేశ్.. త్వరలో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు..

Image
1980-90 కాలంలో టాలీవుడ్‌లో విలన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు రావు గోపాల్ రావుదే. ఎన్నో సినిమాల్లో అద్భుతంగా విలనిజం పండించిన ఆయన తెలుగు ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిలో నిలిచిపోయారు. విలనిజంతో పాటు.. అటు సపోర్టింగ్ పాత్ర అయినా.. కామెడీ పాత్ర అయినా.. ఆయన చేస్తే ఆ పాత్రకే వన్నె వచ్చేది. అయితే అంత గొప్ప నటడి వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు . ప్రస్తుతం ఉన్న సపోర్టింగ్ నటులలో ఆయన తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నారు. విభిన్నమైన బాడీ లాంగ్వేజీ, డైలాగ్ డెలివరీతో ఆయన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన క్షణం నుంచి తండ్రి తగ్గ తనయుడు అని అనిపించుకోవాలని రావు రమేశ్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆయనకి ఆ గుర్తింపు కూడా లభించింది. కానీ, ఆయన ప్రయోగాలు చేయడం మాత్రం మానేయలేదు. సినిమా సినిమాకి తన నటనలో వేరియేషన్ చూపిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తన రాబోయే సినిమాలో ఓ సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందు వచ్చేందుకు సిద్ధమవుతున్నారట ఆయన. శర్వానంద్ హీరోగా ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెల

2022లో ఒక్కరు కూడా మిగలరు! అమ్మాయి టీ- షర్ట్ చూపిస్తూ ఆర్‌జీవీ షాకింగ్ కామెంట్స్

Image
దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఉదృతంగా పెరిగిపోతున్నాయి. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. బయటకు వచ్చినా.. మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటిస్తున్నారు. ఒకవేళ పొరపాటున కరోనా నిబంధనలు పాటించకపోతే.. వెంటనే వైరస్ అంటుకుంటుంది. ఇక వైరస్ సోకిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆస్పత్రిలో సరైన వైద్య సౌకర్యాలు అందక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశానవాటికల్లో చోటు లభించకపోవడం మరో దురదృష్టకర విషయం. వివాదాస్పద దర్శకుడు ఈ మధ్య తన రూటు మార్చారు. ఆ మధ్యకాలంలో కేవలం సినిమాలపై సినిమాకు సంబంధించిన వ్యక్తులపైనే ట్వీట్ చేసిన ఆయన గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా కేసులపై ట్వీట్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఉత్తరాఖండ్‌లో జరిగిన కుంభమేళాపై వర్మ చేసిన ట్వీట్లు తీవ్ర దుమారం రేపాయి. కరోనా తీవ్రంగా వ్యాపిస్తుంటే.. కుంభమేళకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరుకావడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈసారి వైరస్ వ్యాప్తికి కుంభమేళనే కారణం అవుతుందని ఆయన పరోక్షంగా వ్యాఖ

అంబులెన్స్ డ్రైవర్‌గా మారిన నటుడు.. కారణం అదే.. సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం

Image
రెండో దశలో కరోనా వ్యాప్తి దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు మరణిస్తున్నారు. ఈ భయంకర పరిస్థితుల్లో సెలబ్రిటీలు ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎవరికి తోచిన పద్దతిలో వాళ్లు సహాయం అందిస్తున్నారు. అయితే కన్నడ నటుడు ఈ విపత్కర పరిస్థితుల్లో ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుత పరిస్థితులను లెక్క చేయకుండా కొందరు సెలబ్రిటీలు విదేశాలకు విహారయాత్రకు వెళ్తున్నారు. మరికొందరు ఫ్యాన్సీ ఫోటోషూట్‌లు చేస్తూ.. వాటిని సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో అలాంటి సెలబ్రిటీలపై విమర్శల వర్షం కురుస్తోంది. అయితే అర్జున్ గౌడ చేసిన పనిని మెచ్చుకొని వాళ్లు లేరు అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. కోవిడ్‌ రోగులను తరలించడానికి అతను అంబులెన్స్ డ్రైవర్ అవతారం ఎత్తాడు. అతను గత రెండు రోజులుగా కోవిడ్ రోగులకు సేవలు అందిస్తున్నాడు. ఈ విషయంపై అతను మాట్లాడుతూ.. ‘‘గత రెండు రోజులుగా నేను రోడ్డు మీదే ఉన్నా

భవిష్యత్ తలచుకుంటే బాధేస్తోంది.. ఆ రూల్ తీసుకురండి.. ప్రభుత్వాలకు సోనూసూద్‌ విజ్ఞప్తి

Image
కష్టకాలంలో రియల్ హీరో అనిపించుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్న సినీ నటుడు సోనూసూద్ దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. పల్లె, పట్నం అనే తేడాలేకుండా మహమ్మారి వైరస్ వీరవిహారం చేస్తోంది. ఎంతోమంది కరోనా కాటుకు బలవుతుండటం ఆందోళన కలిగితోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు ఓ విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలబడాలని కోరారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో వీడియో ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహా ఎన్‌జీఓలకు ఆయన రిక్వెస్ట్ చేశారు. ''8 నుంచి 12 సంవత్సరాలు వయసున్న ఎంతోమంది చిన్నారులు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోతున్నారు. చాలా కుటుంబాల్లో తల్లో, తండ్రో లేకపోతే ఇద్దరూ చనిపోయి పిల్లలు అనాథలవుతున్నారు. ''అలాంటి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నాకెంతో బాధేస్తోంది. కాబట్టి అలాంటి పిల్లలకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌జీవోలు ఇలాంటి పిల్లలకు అండగా నిలబడి వారికి ప్రాథమిక విద్య నుంచి కాలేజీ విద్య వరకు ఉచితంగా అందించాలి. ఇలా ప్రభుత్వాలు ఓ రూల్‌ను తీస

సౌత్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డ్.. బాలయ్య ధాటికి చిరు ఖతం.. ‘అఖండ’విజయం ఖాయం

Image
రికార్డులు క్రియేట్ చేయాలన్నా.. వాటిని తిరగరాయాలన్నా మేమే అంటూ సింహా సినిమాలో నందమూరి బాలకృష్ణ చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది ఎవరి గురించి చెప్పారు.. ఎందుకు చెప్పారు అనే విషయం కూడా పరోక్షంగా అందరికీ తెలిసిందే. అయితే రికార్డుల విషయంలో ఎప్పుడూ కూడా మెగా నందమూరి అభిమానుల మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ప్రతీ ఒక్కరికీ అంచనాలు అందనంత ఎత్తులో ఉంటాయి. నందమూరి అభిమానులే కాకుండా సగటు సినీ ప్రేక్షకులు సైతం ఆ కాంబో మీద ప్రత్యేక శ్రద్దను కనబరుస్తుంటారు. ఇప్పుడు ఈ కాంబోలో హ్యాట్రిక్ చిత్రం రాబోతోంది. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ల తరువాత ఈ కాంబో మళ్లీ బాక్సాఫీస్ మీద దాడి చేసేందుకు రాబోతోంది. అంటూ అఘోరాగా బాలయ్య విశ్వరూపాన్ని చూపించేందుకు బోయపాటి రెడీ అయ్యారు. ఈ మేరకు వదిలిన చిన్నపాటి టీజర్, టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనాలు నమోదు చేస్తున్నాయి. బాలయ్య దెబ్బకు యూట్యూబ్ మోత మోగిపోతోంది. మొత్తం సౌత్ సినీ ఇండస్ట్రీలోనే బాలయ్యకు తిరుగులేకుండా పోయింది. సీనియర్ హీరోల్లో యాభై మిలియన్ల వ్యూస

ఇలాంటి సమయంలోనే కలిసికట్టుగా ఉండాలి.. వారి కోసం సీపీ సజ్జనార్‌తో కలిసి సమంత అలా!

Image
ప్రస్తుతం దేశంలోని పరిస్థితి, వైద్య సదుపాయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు కరోనా దాడి చేస్తుంటే.. మరో వైపు వైద్య సదుపాయాలు లేక, ప్రాణవాయువు కరువై కొన్ని వేల మంది మరణిస్తున్నారు. దేశంలో ఇప్పుడు ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ఫ్యాక్టరీల మీద ఆధారపడ్డాయి. అయితే సరఫరా లేక ఎంతో మంది బతుకులు గాల్లో కలిసిపోతోన్నాయి. ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని నడి రోడ్డు మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరా లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారు. ఇలాంటి కష్టకాలంలో కొందరికైనా సాయపడాలి అంటూ ముందుకు వచ్చారు. సమంత తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చేసే సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. తాజాగా కోవిడ్ పేషెంట్స్ కోసం సమంత ముందుకు వచ్చారు. ఒక్కోసారి వింత పరిస్థితి, కష్ట కాలం వస్తుంటుంది.. అలాంటి సమయంలోనే మనమంతా కలిసి ముందుకు రావాలి.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలి. ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండర్స్ అవసరం ఉన్నవాళ్ల కోసం సాయం చేసేందుకు డొనేట్‌కేఆర్ట్ అనే సంస్థతో కలిసి ప్రత్యూష సంస్థ కూడా ముందుకు వచ్చింది. విరాళాలు సేకరిం

మరో పాన్ ఇండియా సినిమాను లైన్‌లో పెట్టిన రానా.. ఫుల్ జోష్‌లో దగ్గుబాటి వారసుడు

Image
వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు దగ్గుబాటి వారసుడు, స్టార్ హీరో . వైవిధ్యభరితమైన కథలను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు రావడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన 'లీడర్', 'కృష్ణంవందే జగద్గురుమ్', 'బాహుబలి', 'ఘాజీ', 'నేనే రాజు నేనే మంత్రి' లాంటి కొత్తదనంతో కూడిన కథలతో ఆకట్టుకున్నారు. అదే జోష్‌లో మరిన్ని విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్న రానా.. మరో పాన్ ఇండియా సినిమాకు కమిటయ్యారు. సీహెచ్ రాంబాబుతో కలిసి విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఈ సినిమా నిర్మించనున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా 'టాప్ హీరో', 'దేవుడు', ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 'జంబలకిడి పంబ', రాజేంద్రప్రసాద్ హీరోగా 'ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్' సినిమాలను ఆచంట గోపినాథ్ నిర్మించారు. నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్ 'ఇమైక్క నొడిగల్'ను తెలుగులో 'అంజలి సిబిఐ'గా విడుదల చేశారు. అయితే కొంత విరామం తర్వాత రానా దగ్గుబాటి హీరోగా ఈ భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారు ఆచంట గోపినాథ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా కాంబోలో తెరకెక్కుతున్న 

సమ్మర్ స్పెషల్.. అందుకే అలా మొత్తం ఫ్రీగా వదిలేశావా?.. పూజా హెగ్డే క్లీ వేజ్ షోపై నెటిజన్ల సెటైర్లు!

Image
ప్రస్తుతం క్వారంటైన్‌కు పరిమితమైన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ వచ్చిందంటూ గత వారం ఈ బుట్టబొమ్మ ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు.ఇక ఆమె అభిమానులు తెగ ఆందోళన చెందారు. త్వరగా కోలుకోవాలంటూ విష్ చేశారు.అయితే ఈ భామ క్వారంటైన్‌లో ఉంటూనే సెగలు రేపుతోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట్లో మంటలు పుట్టిస్తోంది. కొన్ని స్వల్ప లక్షణాలు కనిపించాయి. పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని తేలింది. గత రెండు మూడు రోజులుగా నన్ను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేయించుకోండి.. అందరూ జాగ్రత్తగా ఉండండి.. ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండండి అని పూజా హెగ్డే గత వారం ఓ పోస్ట్ చేశారు. ఇక పూజా హెగ్డే అప్పటి నుంచి స్వీయ నిర్భంధంలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. యోగా, ప్రాణాయామం ఎలా చేయాలి.. అది కరోనా నుంచి ఎలా కాపాడుతుందనే విషయాన్ని తన ఫాలోవర్లకు వివరించారు. ఇక నిన్న అల్లు అర్జున్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో పూజా హెగ్డే ఓ సెటైర్ వేశారు. అమూల్యకు కంపెనీ ఇచ్చేందుకు బంటు కూడా వచ్చాడు అని అల వైకుంఠపురములో సినిమాలోని పాత్రలను గుర్తుకు చేసుకున్నారు పూజా హెగ్

రూటు మార్చిన పాయల్.. అందాల ఆరబోతకు బ్రేక్.. ఓ డిఫరెంట్‌ రోల్‌లో అలరించేందుకు రెడీ!

Image
‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకోలేకపోయింది. అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనక్కి తగ్గకపోయినా.. ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పుకోవాలి. ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ సినిమాలతో స్టార్ హీరోలతో నటించిన.. ఆమెకు తగిన గుర్తింపు లభించలేదు. ఇక సోషల్‌మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ఫోటో షూట్‌లు నిర్వహిస్తూ.. కుర్రకారులో హీటు పుట్టుస్తుంటుంది. మొత్తానికి ఏదో విధంగా సరైన బ్రేక్ సంపాదించాలని పట్టుదలతో ఉంది పంజాబీ బ్యూటీ పాయల్. అయితే అందుకోసం తన రూటు మార్చాలనే యోచనలో పాయల్ ఉన్నట్లు సమాచారం. ఇంతకాలంలో తన అందాలతో ఎంత కనువిందు చేసినా ఛాన్స్‌లు రాలేదు. దీంతో కొంతకాలం ఈ అందాల ఆరబోతకు బ్రేక్ వేసి డిఫరెంట్ మాడ్యులేషన్ ఉండే పాత్రల్లో నటించి.. ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం ప్రారంభించిదట. గత ఏడాది లాక్‌డౌన్‌లో ‘అనగనగా ఒక అతిథి’ అనే సినిమాతో పలకరించింది పాయల్. తన కెరీర్‌లో తొలిసారిగా డీగ్లామర్ పాత్రలో కనిపించి.. మెప్పించింది. ప్రముఖ ఓటీటీ ‘’లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడ అదే రూట్‌లో మరోసారి వెళ

ఇంట్లోనే ఫ్రెండ్‌తో ప్రగతి రచ్చ.. హాట్ హాట్‌గా ఇద్దరూ కలిసి రెచ్చిపోయారు బాబోయ్! వీడియో వైరల్

Image
యాక్ట్రెస్ .. ఈ సినీ నటి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరమే లేదు. సినిమాల్లో ఎంత పాపులారిటీ సంపాదించిందో సోషల్ మీడియా ద్వారా అంతకుమించి అనేలా ఫేమ్ కూడగట్టుకుంది. ఈ మధ్యకాలంలో కాలంలో అయితే ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా దుమ్ముదులిపేస్తున్నాయి. హాట్ హాట్‌గా చిందులేస్తూ ఆయా వీడియోలతో రచ్చ చేస్తోంది ప్రగతి. దీంతో యువత చూపంతా ఈ నటీమణి సోషల్ మీడియా వాల్ పైనే ఉంటోంది. ఇప్పటికే చాలాసార్లు తన డాన్స్ వీడియోలతో స్పెషల్ కిక్కిచ్చిన ప్రగతి.. తాజాగా మరోసారి అదే సీన్ రిపీట్ చేస్తూ రచ్చ చేసింది. ఇరగదీసే స్టెప్పులేస్తూ దానికి గ్లామర్ డోస్‌ యాడ్ చేసి తనదైన ఎనర్జీతో ఆశ్చర్యపర్చింది. అంతేకాదు ఈ వీడియోలో ప్రగతి ఫ్రెండ్ కూడా ఆమెతో కలిసి చిందులేసింది. డ్రీముమ్ వేకుపమ్ అనే తమిళ పాటకు ఈ ఇద్దరూ కలిసి ఇంట్లోనే రెచ్చిపోయి డాన్స్ చేశారు. ఫాస్ట్ మూమెంట్స్‌కి తోడు ఇద్దరి గ్లామర్ డోస్ ఈ వీడియో వైరల్ కావడానికి ప్రధాన కారణమైంది. 44 ఏళ్ల వయసులో కూడా ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టేసి ప్రగతి చేస్తున్న హంగామా చూసి ఫిదా అవుతున్నారు తెలుగు ప్రేక్షకులు. ఆమె ఎనర్జీ, డాన్సింగ్ స్కిల్ చూసి ముక్కున వేలేసుకు

లాక్‌డౌన్‌లో నిఖిల్ కుటుంబం.. అతని మరణమే అందుకు కారణం.. హీరో సంచలన ప్రకటన

Image
రెండో దశలో వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్రంగా ఉంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని.. ఇప్పటికే సినిమా థియేటర్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు రాత్రి పూట కర్ఫ్యూ విధించడంతో పాటు.. త్వరలో పూర్తిస్థాయి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో తారలు మరోసారి పూర్తిస్థాయిలో ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో సిద్ధార్త్ ఓ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గే వరకూ తన కుటుంబం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటుందని అతను తెలిపాడు. నిఖిల్ ప్రస్తుతం.. ‘18 పేజెస్’, ‘కార్తీకేయ-2’ చిత్రాలలో నటిస్తున్నాడు. అయితే కరోనా కేసులు విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాల షూటింగ్‌లను ఆపేశామని నిఖిల్ తెలిపాడు. ‘‘నా రెండు సినిమాల షూటింగ్‌లు సజావుగా సాగుతున్నాయి. ఒక్కసారిగా ఇండస్ట్రీలో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. ఎక్కడ చూసిన వైరస్సే కనిపించింది. ప్రతీ ఒక్కరు తమ మిత్రుడికో లేక బంధువుకో కరోనా సోకిందని చెబుతున్నారు. దీంతో మేము మా సినిమాల షూటింగ్‌లను తాత్కాలికంగా వాయిదా వేశాము

సినిమా రౌండప్: హాట్‌ హాట్‌గా ఎన్టీఆర్‌ హీరోయిన్ ఎంట్రీ.. పవన్ కళ్యాణ్ రెడీ! ప్రియాంక ఆవేదన

Image
జోష్‌లో నందమూరి నటసింహం బాలకృష్ణ- బోయపాటి కాంబోలో రాబోతున్న 'అఖండ' మూవీ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. 'కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది..' అనే డైలాగ్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లుతోంది. ఇప్పటికే 'అఖండ' టీజర్‌ టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ 50మిలియ‌న్స్ వ్యూస్ సాధించిన టీజ‌ర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. అప్పట్లోనే ఊపేసిన హీరోయిన్ మరోసారి హాట్‌గా.. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'ఆది' సినిమాలో హీరోయిన్ కీర్తి చావ్లా గుర్తుందిగా. డెబ్యూ మూవీతోనే అందరి చూపు తనవైపు తిప్పుకున్న ఈ బ్యూటీ మళ్ళీ ఇన్నేళ్లకు మరింత హాట్‌గా వెండితెరపై కనిపించబోతోంది. ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ’ విడుదలకు సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ కోసం రెడీ! రీ- ఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు కమిటవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సినిమా ఓకే చేశారని తెలుస్తోంది. మహేష్ బాబుతో 'మహర్షి' రూపొందించిన వంశీ పైడిపల్లి పవన్ కోసం బలమైన కథ రెడీ చేసి దిల్ రాజుకు వినిపించారట. అతిత్వరలో దీనిపై పవన్ ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె. వి ఆనంద్ క‌న్నుమూత‌

Image
సినీ ఇండీస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి దాడి, మరోవైపు అనారోగ్యంతో పలువురు సినీ ప్రముఖుల మరణాలు ఇండీస్ట్రీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే తమిళ హాస్యనటుడు వివేక్ మరణం తాలూకు విషాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే కోలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె. వి ఆనంద్(54) గుండెపోటుతో కన్నుమూశారు. ఛాతిలో నొప్పి రావడంతో ఈ రోజు (ఏప్రిల్ 30) తెల్లవారుజామున చెన్నైలోకి ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆయన ఉదయం 3 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు. ఆయన మరణవార్తతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణం పట్ల పలువురు సినీ నటులు, దర్శకనిర్మాతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో పుట్టిన పెరిగిన కె.వి.ఆనంద్ ఫ్రీ లాన్స్ ఫొటో జ‌ర్న‌లిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. క‌ల్కి, ఇండియా టుడే దినప‌త్రిక‌ల్లో పని చేసిన ఆయన.. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్‌ వద్ద సినిమాటోగ్ర‌ఫీలో శిక్షణ పొందారు. ఆ తర్వాత ప్రేమ‌దేశం, ఒకేఒక్క‌డు, బాయ్స్, ర‌జినీకాంత్ శివాజీ లాంటి భారీ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా సేవలందించారు. క‌ణా కండేన్ సిని

మా అమ్మ ఎంతగానో భయపడింది.. అవన్నీ చూపించాను.. ఫోన్ నంబర్ లీక్‌పై సిద్దార్థ్

Image
హీరో సోషల్ మీడియాలో ఎంత దూకుడుగా ఉంటారో అందరికీ తెలిసిందే. సినిమాల పరంగా సిద్దార్థ్ ఇప్పుడు కాస్త స్లోగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటారు. బీజేపీ, నరేంద్రమోడీల మీద విమర్శనాస్త్రాలు సందిస్తూ ఎప్పుడూ ట్వీట్లు పెడుతూనే ఉంటారు. అయితే సిద్దార్థ్ అలా పెట్టే ట్వీట్లు ఒక్కోసారి వివాదాస్పదంగా మారుతుంటాయి. బీజేపీ నాయకులు, సిద్దార్థ్ మధ్య ఎప్పుడూ కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ క్రమంలో తాజాగా ఓ బీజేపీ నాయకురాలు సిద్దార్థ్ ఫోన్ నంబర్‌ను సోషల్ మీడియా వేదికగా లీక్ చేశారు. దీంతో సిద్దార్థ్ ఫోన్‌కు కొన్ని వందల కాల్స్, మెసెజ్‌లు వచ్చాయి. ఇందులో సిద్దార్థ్, అతని ఫ్యామిలీకి బెదిరింపులే వచ్చాయి. చంపేస్తాం, రేప్ చేసేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయని సిద్దార్థ్ తెలిపారు. అయితే అన్నింటిని రికార్డ్ చేశానని ఏ ఒక్కరినీ వదిలిపెట్టను అని సిద్దార్థ్ శపథం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయబోతోన్నానని చెప్పుకొచ్చారు. అయితే ఈ మేరకు తమిళనాడు పోలీసులు సిద్దార్థ్‌కు రక్షణ కల్పించేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సిద్దార్థ్ తమిళ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగడం, ఇలా అవ్వడం నా కుట

కరోనా ఎఫెక్ట్.. మై విలేజ్ షో అనిల్ వెరైటీ లగ్గం.. అంతా అందులోనే!

Image
ప్రస్తుతం కరోనా ధాటికి అందరూ వణికిపోతోన్నారు. ఇక ఇప్పుడు రోజుకు కొన్ని లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో అది మరింత స్థాయికి చేరుకునేలా ఉన్నాయి. మే నెలలో కొన్ని లక్షల సంఖ్యలో వివాహాలు జరగబోతోన్నాయి. వీటిపై ఇప్పటికే ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేశాయి. అయితే కొంత మంది మాత్రం పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ఇంకొంత మంది ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వివాహాలను జరపుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే తాజాగా కొత్త పద్దతిని ఎంచుకున్నారు. పెళ్లి శుభలేఖలోనే అన్నింటిని వివరించారు. లగ్గం ఏ పద్దతిలో జరుగుతుంది.. ఎలా జరుగుతుంది.. ఎలా వీక్షించాలి.. కట్నకానుకలు ఎలా చదివించాలో అన్నీ క్లియర్‌గా వెడ్డింగ్ కార్డ్‌లోనే వివరించారు. ప్రస్తుతం ఈ వెరైటీ వెడ్డింగ్ కార్డ్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు అంటూ ప్రారంభం కావాల్సిన శుభలేఖ.. శానిటైజర్ ఫస్టు.. మాస్క్ మస్టు.. సోషల్ డిస్టెన్స్ బెస్ట్ అంటూ కరోనా నిబంధనల గురించి రాసుకొచ్చారు. ఇక పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు చదువు సంధ్యల విషయం చెప్పాల్సిన చోట.. కరోనా నెగెటివ్ అంటూ పరీక్షల ఫలితాన్ని చెప్పుకొచ్చారు. పెండ్లిన

చెత్త రాజకీయాల్లో జరిగేది అదే.. వాళ్లే రియల్ హీరోలు.. మళ్లీ గెలికిన పూనమ్ కౌర్

Image
వేసే ట్వీట్లు ఒక్కోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలా ఆమె వేసే ట్వీట్లో ఎన్నో అర్థాలు నిగూఢంగా దాగి ఉంటాయి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుందో కూడా ఒక్కోసారి చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆమె వేసే పరోక్ష ట్వీట్లు అందరినీ ఆలోచించేలా చేస్తుంటాయి. ఆమె కేవలం వ్యక్తిగత విషయాల గురించే కాకుండా సమాజం, రాజకీయ వ్యవస్థ మీదా కామెంట్లు చేస్తుంటారు. తాజాగా పూనమ్ ప్రస్తుత పరిస్థితిపై కౌంటర్లు వేశారు. ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటూ చూసినా చావుకేకలు వినిపిస్తున్నాయి. కరోనా ధాటికి ప్రజలు అల్లాడిపోతోన్నారు. వైద్య సదుపాయాలు లేక, ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది ప్రాణాలు వదిలేస్తున్నారు. అయితే ఈ సమయంలోనూ రాజకీయాలు చేసేవారున్నారు. ప్రభుత్వ పాలక, ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకుంటూనే ఉన్నారు. అయితే తాజాగా పూనమ్ కౌర్ ప్రస్తుత పరిస్థితి, రాజకీయ నాయకులు చేసే పనుల గురించి కామెంట్ చేశారు. కొందరు బాధపడుతూ ఉంటే.. వాటి వల్ల ఇంకొందరు సుఖపడుతున్నారు.. కానీ బాధపడేవారి స్థితి గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి చెత్త రాజకీయాల్లో అలానే ఉంటుంది.. ఒకరి కష్టం మ

‘ఎలాంటి సహాయం కావాలన్నా.. ఆ ట్విట్టర్ ఖాతాని ఫాలో కండి’.. నెటిజన్లకు రాజమౌళి సలహా

Image
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించిన అధికారిక ట్విట్టర్ ఖాతా గత కొంతకాలంగా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే అందులో వాళ్లు సినిమా అప్‌డేట్‌లు ఇవ్వడం లేదు. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదురుకుంటున్న వాళ్లకి తగిన సహాయం అందించేందుకు ఈ ట్విట్టర్ ఖాతా ద్వారా కృషి చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారి వివరాలను తెలుసుకొని.. వారికి తగిన సహాయం అందేలా చేస్తున్నారు. దర్శకధీరుడు కూడా కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు ఎలాంటి సహాయం కావాలన్న ‘ఆర్ఆర్ఆర్’ ట్విట్టర్ ఖాతాని ఫాలో కావాలని సూచించారు. రెండో దశలో వ్యాప్తి భయంకరంగా ఉంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఉపద్రవంలో ప్రజలకు సహాయం చేసేందుకు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో సోషల్‌మీడియా ద్వారా కష్టాల్లో ఉన్నవారి వివరాలు తెలుసుకొని.. తగిన సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో తమకు సహాయం చేయాలంటూ రాజమౌళిని చాలా మంది నెటిజన్లు కోరారు. దీనిపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో తగిన సహాయం అందించడానికి మా టీమ్ ప్రతీ క్షణం కష్టపడుతుంది. కర

లిప్ లాక్‌తో హీరోయిన్ రచ్చ.. ఆ జంతువుతో అలా కానిచ్చేస్తోన్న సదా

Image
కొందరికి ప్రకృతి అంటే ఇష్టం. ఇంకొందరికి పెంపుడు జంతువులు అంటే ఇష్టం. అలా సెలెబ్రిటీల్లో చాలా మంది పెట్స్ లవర్సే. దాదాపు అందరి ఇంట్లో పెంపుడు జంతువులుంటాయ్. అయితే వీటిల్లో ఎక్కువ మంది దగ్గర వెరైటీ డాగ్ బ్రీడ్స్ ఉంటాయ్. ప్రపంచ దేశాల్లోని మేలిమి జాతికి చెందిన బ్రీడ్ డాగ్స్‌ను తెచ్చి పెంచుకుంటారు. ఇంకొందరు పిల్లిలను ప్రేమగా పెంచుకుంటారు. ఈ కోవలోకి నాటి హీరోయిన్ కూడా చేరారు. జయం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సదా. వెళ్లవయ్యా వెళ్లు వెళ్లు అనే డైలాగ్‌తో రెండు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. ఇప్పటికీ సదాను అదే డైలాగ్‌తో గుర్తిస్తుంటారు. సదాకు కోలీవుడ్‌లోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే సదా మాత్రం ఎక్కువగా కాలం ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. ఆ తరువాత సదా వెండితెరకు దూరమైనా కూడా బుల్లితెర ద్వారా ప్రేక్షకులను పలకరిస్తూనే వచ్చారు. ఢీ షోలో సదా న్యాయ నిర్ణేత కొన్ని సీజన్లకు వ్యవహరించారు. ఆ సమయంలో సదా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉండేవారు. అయితే ఢీ నుంచి కూడా సదా తప్పుకున్నారు. ఇప్పుడు సదా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను అలరిస్తుంటారు. తాజ

మంచు విష్ణు కుటుంబంలో చిచ్చుపెట్టిన ఐపీఎల్.. ‘ఎవరైన సహాయం చేయండి’ అంటూ ట్వీట్

Image
భారత్‌లో క్రికెట్‌కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలా పనులన్ని మానుకొని టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయిన తర్వాత ఈ క్రేజ్ మరో లెవల్‌కి వెళ్లిపోయింది. ఇతర క్రికెట్ లీగ్‌లతో పోల్చుకుంటే.. ఐపీఎల్‌కి ఉండే ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఈ లీగ్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందా.. ఎవరు గెలుస్తారా.. అంటూ అభిమానులు ఎదురుచూస్తుంటారు. ఇక ప్రస్తుతం కరోనా కారణంగా ఏర్పడిన తీవ్ర సంక్షోభంలో ఐపీఎల్ కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది. గత ఏడాది కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్‌ను దుబాయ్‌లో నిర్వహించారు. అయితే పరిస్థితులు కాస్త మెరుగుకావడంతో ఈసారి భారత్‌లోనే మ్యాచులు జరుపుతున్నారు. పూర్తిస్థాయి కట్టుదిట్టమైన భద్రత మధ్యలో.. కరోనా నిబంధనలు పాటిస్తూ స్టేడియంలో అభిమానులు లేకుండానే మ్యాచులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఐపీఎల్ కారణంగా హీరో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయట. ఐపీఎల్ జరిగే సమయంలో తమ అభిమాన ఆటగాడు గొప్ప అంటూ.. ఇతర క్రికెటర్లను ట్రోల్ చేస్తుంటారు అభిమానులు. ముఖ్యంగా ధోనీ, కోహ్లీ అభిమానుల మధ్య తరచూ ఈ యుద్ధం జరుగుతుంటుం

బస్తీ బాయ్స్ కోసం అదిరిపోయే ప్లాన్.. ఐ ఫోన్‌తో వారికి గాలమేస్తోన్న నాగబాబు

Image
మెగా బ్రదర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్య తన ఫోకస్ అంతా కూడా యూట్యూబ్ మీదే పెట్టేశారు. ఇన్ స్టాగ్రాంలో నిత్యం తన ఫాలోవర్లతో టచ్‌లో ఉంటుంటారు. ఈ మధ్యే అంటూ నాగబాబు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత నాగబాబు నిర్మాణ రంగంలోకి మళ్లీ వచ్చారు. అదిరింది షోలో చేసిన కమెడియన్స్‌తో నాగబాబు ప్రయోగం చేసేందుకు ముందుకు వచ్చారు. జాతిరత్నాలు టైపులోనే సద్దాంను మెయిన్ లీడ్‌గా పెట్టి బస్తీ బాయ్స్ అంటూ వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మొదటి ఎపిసోడ్ విడుదలైంది. రెండ్రోజుల క్రితం విడుదలైన మొదటి ఎపిసోడ్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం, ఇంకా ట్రెండింగ్‌లోనే ఉండటం, తన యూట్యూబ్ చానెల్ సబ్ స్క్రైబర్స్ 500k దాటిపోవడంతో ఫుల్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే బస్తీ బాయ్స్‌ను ఇంకా ప్రమోట్ చేసేందుకు నాగబాబు మరింత యాక్టివ్ అయ్యారు. ఈ మేరకు మీమర్స్ సాయం తీసుకునేందుకు భారీ ప్లాన్ వేశారు. నాగబాబుకు మీమ్స్ అన్నా, మీమ్స్ వేసేవాళ్లన్నా ఎంతో ఇష్టం. ఇది వరకే మీమర్స్‌తో నాగబాబు స్పెషల్‌గా ఇన్ స్టాలో లైవ్ పెట్టేశారు.

‘నిజం చెప్పాలంటే నాకు అది కూడా చేతకాదు.. యువకులే నా కంటే బాగా చేస్తారు!!’ ఓపెన్ అయిన ప్రియమణి

Image
ఒకప్పుడు తన అందచందాలతో తెలుగు సిల్వర్‌స్క్రీన్‌ని షేక్ చేసిన నటి . ‘పెళ్లైన కొత్తలో..’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ అయింది. తెలుగులోనే కాక.. తమిళం, కన్నడం, మలయాళం ఇండస్ట్రీలో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. అంతేకాక.. ‘పరుత్తివీరన్’ సినిమాతో జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది ప్రియమణి. కెరీర్‌‌ కాస్త స్లో కావడంతో సినిమాలకు కొంతకాలం బ్రేక్ వేసింది. ఇప్పుడ సెకండ్ ఇన్నింగ్స్‌ను పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటుంది ప్రియమణి. సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ‘హిజ్ స్టోరీ’ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. సత్యదీప్ మిశ్రా ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సిరీస్‌లో ప్రియామణి చెఫ్ పాత్రలో మనకి కనిపిస్తుంది. ఈ నెల 25న విడుదలైన ఈ సిరీస్‌కి ప్రేక్షకుల ఆదరణ లభించింది. అయితే దీని గురించి మాట్లాడుతూ.. ప్రియమణి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వెబ్‌సిరీస్‌లో చెఫ్‌గా నటించిన ఆమెకు నిజానికి వంట చేయడం అస్సలు రాదట. ‘నాకు కోడిగుడ్డు ఉడికించడం కూడా రాదు

వేరే ఆలోచనలు పెట్టుకోకుండా వేయించుకోండి.. వరుణ్ తేజ్ పోస్ట్ వైరల్

Image
ప్రస్తుతం కరోనా కోరల్లో చిక్కుకుని మన దేశం ఎంతలా సతమతమవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాను చూసి ప్రపంచ దేశాలు గడగడవణికిపోతోన్నాయి. ఇప్పటికే మన దేశం మీద ఎన్నో ఆంక్షలను విధించింది. ఇక్కడి వారు తమ దేశాలకు రాకుండా నిబంధనలు పెట్టారు. అలా మనదేశంలో కరోనా ఉధృతికి అడ్డు కట్ట వేసేందుకు అందరికీ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలో కోవిన్ అనే యాప్, వెబ్ సైట్ ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేందుకు సెలెబ్రిటీలు రంగంలోకి దిగారు. వ్యాక్సిన్ మీదున్న అపోహలను తొలగిస్తూ ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగా ప్రిన్స్ ఓపోస్ట్ పెట్టారు. మే 1 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో అందరూ కూడా ఆన్ లైన్‌లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా వరుణ్ తేజ్ పోస్ట్ చేస్తూ.. ఎక్కువగా ఆలోచించకండి.. వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్పుకొచ్చారు. అందరూ కూడా http://cowin.gov

వాటి సైజు ఎంత అని అడిగారు.. నా టీనేజ్ నుంచే అవన్నీ! అయితే ఏంటంటూ ఇలియానా ఓపెన్ కామెంట్స్

Image
హీరోయిన్ల బాడీ షేమింగ్ గురించి నెటిజన్స్ కామెంట్స్ చేయడం కొత్తేమీ కాదు. టెక్నాలజీ ఎంత పెరుగుతుంటే సెలబ్రిటీలకు- సాధారణ ప్రజలకు మధ్యదూరం అంత తగ్గిపోతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా తమ మనసులో ఏముందో సెలబ్రిటీల ముందు పెట్టేసే అవకాశం ఉండటంతో కొంతమంది నెటిజన్స్ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల గురించి ఇబ్బందికర కామెంట్స్ చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. గోవా బ్యూటీ ఇలియానాకు ఇలాంటి అనుభవాలు లెక్కలేనన్ని ఉన్నాయట. తాజాగా ఈ విషయాన్ని బయటపెడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఇల్లీ బేబీ. తన శరీరాకృతి గురించి ఎన్నోసార్లు వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పింది. మానసిక వేదనకు గురైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయంటూ ఓపెన్ అయింది. తన టీనేజ్ నుంచే అలాంటి అనుభవాలను భరిస్తూ వస్తున్నానని, కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని కామెంట్స్ చూశానని చెప్పింది. ఏకంగా నీ పిరుదుల సైజు ఎంత? సర్జరీ చేయించుకోవచ్చుగా అని మెసేజ్ పెట్టేవారని చెప్పుకొచ్చింది. సామజిక మాధ్యమాల్లో రోజూ తనకు వచ్చే మెసేజ్‌లలో కనీసం 10 మెసేజ్‌లు ఇలాంటివే ఉంటాయని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని సందర్భాల్లో అలాంటి మెసేజీలు చూసి తన మీద తనకే అసహ్యం క

సిద్ధార్త్ నెంబర్ లీక్.. ‘తగ్గేదే లేదు.. అందరు ఆ పార్టీకి చెందిన వాళ్లే’.. అంటూ ట్వీట్

Image
‘బాయ్స్’, ‘బొమ్మరిల్లు’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు నటుడు సిద్ధార్త్. కూల్ లవ్ స్టోరీ సినిమాలతో లవర్‌ బాయ్ ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు అతను. కెరీర్ ఆరంభంలో సూపర్ హిట్ సినిమాలతో కొనసాగిన అతని హవా.. ఆ తర్వాత స్లో అయింది. వరుస ఫ్లాప్‌లతో అతను సతమలమవుతున్నాడు. అయితే సినిమాలను పక్కనపెడితే.. సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూనే.. సామాజిక అంశాలపై కూడా అతను స్పందిస్తుంటాడు. ప్రస్తుతం కరోనా కారణంగా దేశవ్యాప్తంగా భయంకర వాతావరణం నెలకొంది. రెండో దశలో లక్షలాది మంది వైరస్ బారిన పడుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సందర్భంలో సిద్ధార్త్ కేంద్రంలో అధికారంలో ఉన్న పని తీరును ప్రశ్నిస్తూ.. పలు ట్వీట్లు చేశారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఈ విపత్కర పరిస్థితులు నెలకొన్నాయంటూ అతను పేర్కొన్నాడు. దీంతో అతనికి ఆ పార్టీకి చెందిన వారి వైరం ఏర్పడింది. బీజేపీ పార్టీ శ్రేణులు సిద్ధార్త్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు, ట్వీట్లు చేశారు. అయితే తాజాగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతని ఫోన్ నెంబర్‌ని లీక్ చేశారట. దీంతో తనకి పెద్ద ఎత్తున బెదిరింపు కాల్స్ వస

‘ఉప్పెన’లాంటి టీఆర్పీ.. నేషనల్ వైడ్ ట్రెండ్.. దుమ్ములేపిన క‌ృతి శెట్టి-వైష్ణవ్ తేజ్

Image
సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఆడియో పరంగా సోషల్ మీడియాలో వందల మిలియన్లను కొల్లగొట్టేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టి దుమ్ములేపేసింది. అలా ఉప్పెన సినిమా ప్రతీ చోటా తన సత్తా చాటుకుంది. ఇప్పుడు బుల్లితెరపైనా తన హవాను చూపించింది. గత వారం బుల్లితెరపై వరల్డ్ ప్రీమియర్‌గా ప్రసారమైన ఉప్పెన అదిరిపోయే టీఆర్పీని సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు తాజాగా ఉప్పెన సినిమా నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అవుతోంది. మెగా హీరో అనే ఇమేజ్‌తో వచ్చినా కూడా ఉప్పెన సినిమాలోని కథ, అతని నటన సాధారణ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఇక ముఖ్యంగా ఉప్పెన సినిమాకు అందాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోతో సినిమా స్థాయి పెరిగింది. ఇక బుచ్చిబాబు సానా తెరకెక్కించిన విధానం, కథ, కథనం, మాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలకంగా మారింది. అలా అందరూ కలిసి ఉప్పెన సినిమాను అద్భుతంగా మలిచారు. కరోనా లాంటి సమయంలోనూ ఉప్పెనలాంటి కలెక్షన్లు వచ్చాయి. వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ఈ ఏడాదికి మొదటి బ్లాక్ బస్టర్ హ

ప్రభాస్ అలా అనడం జీవితంలో మర్చిపోలేను.. సీక్రెట్ బయటపెట్టిన 'బాహుబలి' యాక్టర్

Image
డార్లింగ్ ప్రభాస్.. స్టార్ వారసుడే అయినా సాధారణ స్థాయిలో వెండితెరపై ఆరంగేట్రం చేసి అంచెలంచెలుగా ఎదిగారాయన. టాలీవుడ్ స్టార్ హీరోగా కీర్తించబడుతూనే రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యారు. అయితే ప్రభాస్‌తో పని చేసిన ఏ వ్యక్తి అయినా ఆయన గురించి చెప్పేది ఒక్కటే. చాలా సింపుల్ పర్సన్. ఎంత క్రేజ్ ఉన్నా ఒదిగిఉండే అతి కొద్దిమంది నటుల్లో ఆయన ఒకరు. అతని వ్యక్తిత్వాన్ని దగ్గరి నుంచి చూసిన చాలామంది చెప్పే మాటిది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడారు డబ్బింగ్ ఆర్టిస్ట్ . ''బాహుబలిలో నేనో చిన్న రోల్ చేశాను. అందులో కాలకేయుడితో యుద్ధానికి వెళ్లే ముందు మేకను బలిచ్చే సన్నివేశంలో 'యుద్ధానికి వెళ్లకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది పెనుముప్పు తప్పదు యువరాజా' అనేది నా డైలాగ్‌. అయితే ఆ డైలాగ్‌ చెప్పేటప్పుడు చాలా గట్టిగా చెప్పాను. దీంతో ప్రభాస్ నా దగ్గరకు వచ్చి డార్లింగ్‌ ఏమనుకోకు.. డైలాగ్‌ కొంచెం మెల్లిగా చెప్పవా.. నా డైలాగ్ మరిచిపోతున్నాను అన్నారు. నా జీవితంలోనే ఈ ఫన్నీ ఇన్సిడెంట్ మర్చిపోలేను'' అని చెప్పారు ఆదిత్య. ప్రభాస్ ఎంతో మంచి

ప్రభాస్ దర్శకుడి కీలక నిర్ణయం.. ‘నేను సమ్మతిస్తున్నా..’ అంటూ అడివి శేష్ ట్వీట్

Image
రెండో దశలో కరోనా మహమ్మారి ప్రజలపై విరుచుకుపడుతుంది. కొంచం ఏమరపాటుగా ఉన్నా.. వైరస్ అంటుకుంటుంది. వైరస్ సోకిన రోగులు సరైన వైద్య సదుపాయాలు లేక.. ఆక్సిజన్ కొరతతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దశలో ప్రభుత్వం మరోసారి పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకూ స్పష్టమైన ప్రకటన లేదు. ప్రస్తుతానికైతే.. నైట్ కర్ఫ్య, వారాంతపు లాక్‌డౌన్‌తో సరిపెట్టేశారు. కానీ, వైరస్ కట్టడికి మాత్రం లాక్‌డౌనే సరైన మార్గం అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘మహానటి’ సినిమాతో సూపర్‌హిట్ అందుకొని.. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమా చేస్తున్న దర్శకుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినా.. విధించకపోయినా.. వచ్చే రెండు వారాలు తనకి తాను వ్యక్తిగతంగా లాక్‌డౌన్ విధించుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ‘‘ప్రభుత్వం ప్రకటించినా.. లేకున్నా.. వచ్చే రెండు వారాలు వ్యక్తిగతంగా లాక్‌డౌన్‌లో ఉండాలి. అయితే లాక్‌డౌన్ ఎందుకు అని ప్రశ్నించే ప్రతీ ఒక్కరు.. ఒకసారి హాస్పిటల్స్‌కు వెళ్లండి. దయచేసి గత నెల రోజులుగా అక్కడ వైద్యులు, సిబ్బంది పడుతున్న కష్టాలను

హీరోయన్‌‌ని ఫిక్స్ చేసిన శంకర్.. రామ్ చరణ్‌తో మరోసారి జతకట్టనున్న బాలీవుడ్ భామ

Image
రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌‌‌లో సినిమా గురించి ప్రేక్షకలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సినిమా అంటే కేవలం భారీ బడ్జెట్, పెద్ద సెట్టింగ్‌లు మాత్రమే కాదు.. ఓ మంచి సందేశం కూడా ఉంటుంది. ఇప్పడు రామ్ చరణ్‌తో చేసే సినిమాని కూడా ఓ సందేశాత్మక చిత్రంగా రూపొందించే పనిలో ఉన్నారట శంకర్. శివాజీ, భారతీయుడు స్టైల్‌లో అవినీతిపై యుద్ధం చేసే పాత్రలో రామ్ చరణ్‌ని చూపించనున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ని కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య.. ఈ మే 14న విడుదల కావాల్సింది. కానీ, రెండో దశలో కరోనా ఉదృతంగా వ్యాప్తి చెందుతుండటంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఈ సినిమా 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాల తర్వాత చరణ్, శంకర్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. సినిమాలో చరణ్ అవినీతిపై పోరాటం చేసే ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న

తప్పని పరిస్థితుల్లో వెనక్కి తగ్గిన వెంకటేష్.. నారప్ప రిలీజ్ వాయిదా.. అఫీషియల్ స్టేట్‌మెంట్

Image
ప్రస్తుతం దేశంలో నెలకొన్న భయానక పరిస్థితులు ప్రతి ఒక్కరిలో ఆందోళన నింపుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి అంతకంతకూ పెరుగుతూ వస్తుండటం దేశ ప్రజల్లో గుబులు పుట్టిస్తోంది. దీంతో ఇల్లు వదిలి బయటకు రాకపోవడం ఒక్కటే ఇందుకు నివారణ చర్య అని గడపదాటి ఎక్కడికీ వెళ్లడం లేదు జనం. ఈ పరిస్థితుల్లో థియేటర్స్ గేట్లకు మళ్ళీ తాళాలు పడ్డాయి. ఇప్పటికే పలు సినిమాల విడుదల వాయిదా వేశారు. తాజాగా ఆ లిస్టులో '' కూడా చేరింది. తమిళంలో ధనుష్ నటించిన 'అసురన్'కు రీమేక్‌గా తెలుగులో 'నారప్ప' మూవీ రూపొందిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తుండగా.. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వెంకీ కెరీర్‌లో 74వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని మే 14న రిలీజ్‌కి రెడీ అయింది. అయితే ఊహించని రీతిలో కరోనా దాడి మళ్ళీ ప్రారంభం కావడంతో 'నారప్ప' విడుదల వాయిదా

Pawan Kalyan: హరి హర వీరమల్లుపై అనుమానాలు.. ఇదే జరిగితే పవన్ ఫ్యాన్స్‌కి పండగే పండగ!!

Image
రీ- ఎంట్రీ తర్వాత పవర్ స్టార్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటికే 'వకీల్ సాబ్' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ఆయన వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. అందులో ఒకటి ''. జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. శరవేగంగా షూటింగ్ జరిపి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. అయితే దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉదృతి పెరగడంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అనుమానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ వీరవిహారం చేస్తుండటంతో పలు సినిమాల షూటింగ్స్ స్వచ్ఛందంగా వాయిదా వేశారు దర్శకనిర్మాతలు. కొన్ని సినిమాల విడుదల తేదీలను సైతం మార్చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా కూడా వాయిదా వేశారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించారు నిర్మాత ఎ.ఎం.రత్నం. ''అనుకున్నట్లుగా వచ్చే ఏడాది సంక్రాంతికే ఈ సినిమా తెరపైకి వస్తుంది. ఎన్ని అడ్డంకులొచ్చినా అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేస్తారు డైరెక్టర్ క్రిష్‌. పైగా సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ మూవీ రిలీజ్ గురించి అనుమానాలు అవసరం లేదు'' అని ఆయన చెప్పారు.

అర్ధరాత్రి వేళ కూతురుతో సురేఖా వాణి రచ్చ.. ఫుల్లుగా ఎంజాయ్! ఆయన ఫొటో ముందు పెట్టుకొని..

Image
సురేఖా వాణి.. అబ్బో! ఈ నటీమణి గురించి ఎంత చెప్పినా తక్కువేనండోయ్. పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ యాక్ట్రెస్. అక్క, వదిన, ఆంటీ పాత్రలతో వెండితెరపై అలరించడమే కాదు సోషల్ మీడియాను దున్నేస్తూ నేటితరం ఆడియన్స్‌కి కిక్కివ్వడమూ సురేఖా వాణికి తెలుసు. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ తన కూతురు సుప్రితతో కలిసి రచ్చ చేస్తుంటుంది సురేఖ. అందుకే ఆమె సోషల్ మీడియా ఖాతాలకు యమ డిమాండ్. నిత్యం తన లేటెస్ట్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూనే కూతురు సుప్రితతో దిగిన ఫొటోలు, డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంటుంది సురేఖావాణి. ఈ క్రమంలోనే గత రాత్రి ఇంట్లో చేసిన ఎంజాయ్ తాలూకు ఫొటోలు షేర్ చేసింది. నేడు (ఏప్రిల్ 29) తన పుట్టినరోజు సందర్భంగా కూతురు , అత్యంత సన్నిహితులతో కలిసి చిల్ అయింది . కూతురు సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది. అయితే ఈ వేడుకలో తనకెంతో ఇష్టమైన భర్త సురేష్ తేజను మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన ఫొటోను కేక్ ముందు పెట్టుకొని మరోసారి ప్రేమను చాటుకుంది. ఈ మేరకు తన పుట్టినరోజు ఏర్పాట్లన్నీ చేసి ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసినందుకు కూతురు స

సినిమా రౌండప్: రమ్యకృష్ణ సెకండ్ డోస్.. నయనతార డేరింగ్.. అజయ్ దేవ్‌గణ్ ఆపన్న హస్తం

Image
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగుతుంటే మరోవైపు దాని నివారణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. అయితే తాను కరోనా సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నానని తెలుపుతూ రమ్యకృష్ణ ట్వీట్ చేసింది. యంగ్ హీరోయిన్ ప్యాకప్ యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ షెడ్యూల్‌ పూర్తి చేసుకొని ప్యాకప్‌ చెప్పేసింది. ఈ మేరకు స్టైల్‌గా నడుస్తున్న పిక్ షేర్ చేసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. డేరింగ్ అంతా కరోనాకు భయపడి షూటింగ్స్ రద్దు చేస్తుంటే రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్ మాత్రం శరవేగంగా సాగుతోంది. ఈ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ చేరుకుంది నయనతార. కరోనా పరిస్థితుల్లో కూడా ఆమె హైదరాబాద్ ల్యాండ్ కావడం నిజంగా డేర్ అంటున్నారు నెటిజన్స్. రూటు మార్చిన సెలబ్రిటీలు తమ తమ సినిమాల ప్రమోషన్స్‌ కోసం సోషల్‌ మీడియాను ఉపయోగించుకునే సినీ సెలబ్రిటీలు రూటు మార్చారు. ప్రమోషన్‌ కన్నా ప్రజా సేవే మిన్న అని మూకుమ్మడిగా ముందుకు కదులుతున్నారు. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్‌, హాస్పిటల్ బెడ్స్‌, ప్లాస్మా తదితర విషయాల కోసం మాత్రమే తమ

Porn చూడటం బెటర్ అని ‘ఆ జీవి’ మొత్తుకునేది ఇందుకే: నటుడు హర్ష వర్ధన్ తాగేసి వరుస పోస్ట్‌లు.. కారణం ఇదే

Image
వింతజీవి ఆర్జీవీని ఎంతమంది తిట్టుకుంటారో.. అభిమానించే వాళ్లు అదే రేంజ్‌లో ఉంటారు. ఆయన్ని ఫాలో అవుతూ అతని బాటలో నడిచేవాళ్ల సంఖ్య కూడా చాలా ఎక్కువే. అందుకే వర్మ ఏదైనా పోస్ట్ పెట్టాడంటే నిమిషాల వ్యవధిలో వైరల్ అవుతుంటుంది. కొంతమంది వర్మకి పిచ్చి అని ఏవేవో అంటుంటారు కానీ.. ఆయన మాటల్లోనూ ట్వీటుల్లోనూ మ్యాటర్ ఉంటుందని అనే వారు బయటే కాదు.. ఇండస్ట్రీలోనూ చాలామందే ఉన్నారు. వర్మ తరచూ తనకి పోర్న్ వీడియోలు అంటే ఇష్టం అని ప్రతిరోజు పోర్న్ చూస్తానని బాహాటంగా చెప్తుంటారు. అయితే వర్మ ఎందుకు పోర్న్ చూడమంటారో ఇప్పుడు అర్థమైందా? అంటూ ప్రముఖ నటుడు హర్షవర్థన్ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈయనకు అర్జెంట్‌గా పోర్న్ మీదికి అవగతం కావడానికి కారణం ఏంటంటే చెన్నై-హైదరాబాద్ 20-20 మ్యాచ్. అవును.. కరోనా ముంచెత్తున్న టైంలోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు రంజుగా సాగుతున్నాయి. బుధవారం నాడు చెన్నై-హైదరాబాద్ మ్యాచ్ జరగ్గా.. తొలిత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు.. మూడు వికెట్ల నష్టానికి 171 పరుగుల చేశారు. 172 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. రుతురాజ్ గైక్వాడ్ (75: 44 బంతుల్లో 12x4), డుప్

నా దగ్గరి నుంచి అన్నీ లాగేసుకున్నావ్.. అక్కడ వాడేసుకున్నావ్.. కాపీ మాస్టర్ అంటూ శివాలెత్తిన పూనమ్ కౌర్

Image
ఎప్పుడు ఎవరి మీద కామెంట్లు చేస్తుంటారో చెప్పడం కష్టం. ఆమె వేసిన ట్వీట్లు ప్రత్యేకించి ఒకరిని ఉద్దేశించి చెప్పలేం. కానీ అవి ఎవరిని ఉద్దేశించి చేసిన కామెంట్లో పరోక్షంగా అందరికీ అర్థమవుతుంటాయి. కొన్ని సార్లు అయితే తలా తోకా లేకుండా ట్వీట్లు వేస్తుంటారు. అలాంటి సమయంలో నెటిజన్లు అందరూ కూడా తలలు పట్టుకుంటారు. పజిల్ లాంటి ఆ పోస్ట్‌ ఎవరి గురించా? అని అందరూ జుట్టు పీక్కుంటారు. తాజాగా పూనమ్ కౌర్ వేసిన ఓ ట్వీట్ అందరిలోనూ కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేసింది. అలా ప్రతీసారి పూనమ్ కౌర్ వేసే ట్వీట్లలో పవన్ కళ్యాణ్, రెఫరెన్స్ ఉంటుందని అందరూ అనుకుంటారు. తాజాగా వేసిన ట్వీట్‌లోనూ ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. గతంలో అయితే స్టార్ డైరెక్టర్, గురూజీ అంటూ నేరుగా అడ్రస్ చేసేశారు. కానీ ఈ సారి మాత్రం పూనమ్ కౌర్ ఎక్కడా కూడా సరైన హింట్ ఇవ్వలేదు. కానీ పదే పదే కాపీ అంటూ ఆ పదాన్ని వాడేశారు. అలా కాపీ అనే పదాన్ని ఎక్కువగా వాడటంతో అది త్రివిక్రమ్ గురించి అయి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. అయితే అది త్రివిక్రమ్ గురించా? లేదా? మరెవరి గురించో అని ఒక్క పూనమ్ కౌర్‌కే తెలియాలి. అయితే పూనమ్ వేసిన ట్వీట్ సారాంశం ఏంటో ఓ సారి చూద

బిగ్ బాస్ హరితేజ షాకింగ్ వీడియో: పాప పుట్టే టైంకి నాకు కరోనా.. డాక్టర్లు అబార్షన్ అన్నారు.. కానీ నా బేబీ

Image
ఫేమ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షాకింగ్ వీడియోను షేర్ చేసింది. ఇటీవల ఆడబిడ్డకి జన్మనిచ్చిన హరితేజ కోవిడ్ వల్ల పడిన ఇబ్బందుల్ని తెలియజేసింది. సరిగ్గా డెలివరీ టైంలో తనకి కరోనా సోకిందనే విషయాన్ని తెలిజేసింది. తనతో పాటు తన కుటుంబం మొత్తాన్ని కరోనా కమ్మేయడంతో ఎలా బయటపడింది. తన బేబీని ఎలా కాపాడుకుందో చెప్తూ ఎమోషనల్ అయ్యింది హరితేజ. ‘నాకు పాప పుట్టిందని చాలామంది విషెష్ అందించారు.. అందరికీ థాంక్స్. అయితే అందరికీ రిప్లై ఇచ్చే పరిస్థితిలో అప్పుడు నేను లేను. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. అయితే ఎందుకు నేను ఆ పరిస్థితిలో నేను అని చెప్పడానికి ఆ విషయాలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. నిజానికి పంచుకోవాల్సిన అవసరం లేదు కానీ.. బయట పరిస్థితులు చూస్తుంటే.. న్యూస్ చూస్తుంటే.. ఒక్కొక్కరు ఫోన్ చేసి కొన్ని కొన్ని ఇన్స్‌డెంట్స్ చెప్తూ ఉంటే.. నేను కూడా కొన్ని చెప్పాలని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు జరిగింది చెప్తే కొంతమంది అయినా మారతారేమో ఆలోచిస్తారేమో అని ఈ వీడియో చేస్తున్నా. నాకు తొమ్మిదోనెల ప్రెగ్నెన్సీలో చాలా జాగ్రత్తగా ఉన్నాను. మంచి ఫుడ్ తీసుకుంటూ యోగా చేస్తూ చాలా హెల్దీగా ఉన్నాను. డెలివరీకి వారం ముంద

నచ్చుతుందని ఆశిస్తున్నానంటూ పోస్ట్.. రాధిక న్యూ లుక్ వైరల్

Image
సీనియర్ నటి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే.బుల్లితెరపై ఓ సంచలనం. వెండితెరపై తన సత్తా చాటి స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయిన రాధిక.. బుల్లితెరనూ ఏలేశారు. ఇంకా దూసుకుపోతూనే ఉన్నారు. అయితే ఈ మధ్య మాత్రం బుల్లితెరకు కాస్త విరామం ఇచ్చారు. అది కూడా రాజకీయ ఎంట్రీతో వచ్చిన గ్యాప్. మొన్నటి తమిళ నాట ఎన్నికల్లో కమల్ హాసన్ తరుపున రాధిక బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అలా రాజకీయాలతో బిజీగా ఉండటంతో రాధిక పిన్ని 2 సీరియల్ నుంచి తప్పుకున్నారు. తమిళంలో చిట్టి సీరియల్ పిన్నిగా డబ్ అయి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే గత ఏడాదే పిన్ని 2 (చిట్టి 2) సీరియల్ ప్రారంభం అయింది. మంచి ఊపులో సీరియల్ సాగుతున్న తరుణంలో రాధిక తప్పుకున్నారు. అయితే ఇప్పుడు రాధిక తన అవతరాన్ని మార్చేశారు. రాధిక చివరగా ఓ చెక్ బౌన్స్ కేసులో వార్తల్లోకి ఎక్కారు. రాడాన్ సంస్థకు సంబంధించిన లావాదేవీల్లో చెక్ బౌన్స్ కేసులో రాధిక, శరత్ కుమార్ ఇద్దరికి కూడా జైలు శిక్ష పడింది. అయితే దీనిపై హైకోర్టులో కేసు వేస్తామని, మీడియా రాసే వార్తలను నమ్మకండని రాధిక సోషల్ మీడియాలో స్పందించారు. అయితే ఇప్పుడు తాజాగా రాధిక తన కొత్త ల

కరోనా రాకుండా ఒకే ఒక ఆయుధం.. ఆధారం.. ఔషదం ఇదే: చంద్రబోస్

Image
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో ప్రజలు ప్రాణాలకు గుప్పెట్లో పెట్టుకుని బతుకున్నారు. కరోనాకి బలయ్యే వారి సంఖ్య గంట గంటకూ పెరిగిపోతుంది. ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాయి. ఈ తరుణంలో ఈ వ్యాధి బారిన పడకుంటా ఎవరి ప్రాణాలను వారు రక్షించుకోవాల్సిన వచ్చింది. ఈ తరుణంలో వ్యాధి బారిన పడిన తరువాత చికిత్స చేయించుకోవడం కంటే.. వ్యాధి రాకుండా నివారణే ఉత్తమమైన మార్గం అని అంటున్నారు సినీ రచయిత . ఈ తరుణంలో ప్రాణాలను రక్షించుకోవడానికి మాస్క్ ఒక్కటే సంజీవని అని అంటున్నారు. అందరూ క్షేమంగా ఉండాలని తెలియజేస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు చంద్రబోస్. కరోనా మహమ్మారి విపరీతంగా విజృంభిస్తున్న వేళ.. వ్యాధి వచ్చిన తరువాత జరగబోయే చికిత్స కంటే.. వ్యాధి రాకుండా నివారణే ఉత్తమ మార్గం. ఈ సమయంలో సందర్భంలో మన ప్రాణాన్ని ఆరోగ్యాన్ని రక్షించే ఒకే ఒక్క సాధనం మాస్క్. ఒకే ఒక్క ఆయుధం మాస్క్. ఒకే ఒక్క ఆధారం మాస్క్. ఒకే ఒక్క ఔషదం మాస్క్. మాస్క్ ధరించండి.. కరోనాను ధరిచేరనివ్వకండి’ అంటూ సందేశం ఇచ్చారు రచయిత చంద్రబోస్. గతంలో కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ కరోనాపై పాటను రాశారు చంద్రబోస్.

అమ్మ బాబోయ్ అంత అర్థముందా?.. రష్మిక మందాన్న టాటూ సీక్రెట్ లీక్

Image
సెలెబ్రిటీలకు టాటూలు అంటే మహా పిచ్చి. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఏదో ఒక సూక్తి, జీవిత సత్యం గురించి చెప్పే మాటలను పచ్చబొట్లుగా పొడిపించుకుంటారు. లేదా ఇంకొందరు కొన్ని సింబల్స్‌ను టాటూలుగా వేయించుకుంటారు. అలా చేతికి కూడా ఓ టాటూ ఉంటుంది. ఆ టాటూ అర్థం ఏంటో ఇది వరకు ఎన్నో సార్లు చెప్పినా కూడా తాజాగా మరో క్లుప్తంగా వివరించేశారు. రష్మిక మందాన్న సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. తాజాగా రష్మిక మందాన్న తన ఇన్ స్టాగ్రాంలో లైవ్‌లోకి వచ్చారు. తన ఫాలోవర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధనాలు చెప్పారు. కొన్నింటికి తప్పించుకుంటూ తన తెలివిని ప్రదర్శించారు. అయితే కొన్ని మాత్రం చేయలేనని నిర్మొహమాటంగా చెప్పేశారు. అన్నింటి కంటే ముందు కరోనా గురించి తన అభిమానులకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ప్రస్తుతం మనమంతా దారుణమైన స్థితిలో ఉన్నామని, అవసరమైతే గానీ బయటకువెళ్లకండని సూచించారు. తాను ఇప్పుడు పుష్ప షూటింగ్‌లో ఉన్నానని అందుకే హైద్రాబాద్‌లో ఉన్నానని చెప్పుకొచ్చారు. షూటింగ్ లొకేషన్‌లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కానీ తాజాగా బన్నీకి కరోనా పాజిటివ్ వచ్చేసింది. అలా లైవ్‌లో అభిమా

Sri Reddy: వాళ్లంతా నా రంకు మొగుళ్లు.. ఏకంగా సీఎంపై కామెంట్స్.. అల్లు అర్జున్ ఫొటోతో నయా సెన్సేషన్

Image
సోషల్ మీడియాలో శ్రీరెడ్డి చేసే రచ్చ గురించి చెప్పుకుంటూ పోతే ఓ పుస్తకమే రాసేయొచ్చు. ఒకానొక సమయంలో కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో నడిరోడ్డు మీద అర్దనగ్న ప్రదర్శన చేసి దేశవ్యాప్త సంచలనం క్రియేట్ చేసిన ఈ లేడీ యాక్ట్రెస్.. వీలు కుదిరినప్పుడల్లా టాలీవుడ్, కోలీవుడ్ బడా బాబులకు టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం కాస్త ట్రాక్ మార్చి మీమ్ క్రియేటర్స్‌పై తన అస్త్రాన్ని వదిలింది . మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ అంటే అస్సలు పడని శ్రీ రెడ్డి ఏ చిన్న సందర్భం దొరికినా ఆయనను వదిలిపెట్టదు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్‌కి కరోనా సోకడంతో శ్రీ రెడ్డి చేసిన బోల్డ్ కామెంట్స్ అన్నీఇన్నీ కావండోయ్. పవర్ స్టార్‌కి కోవిడ్ అని తెలిసింది మొదలు నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చే వరకు ఆయనపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ శ్రీ రెడ్డిపై ఓ రేంజ్‌లో అటాక్ చేస్తూ విమర్శనాత్మకంగా మీమ్స్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఉన్నట్టుండి అల్లు హీరోలపై కామెంట్ వదలడం హాట్ ఇష్యూ అయింది. శ్రీ రెడ్డి భవిష్యవాణి అంటూ 'అల్లు గాడి కెరీర్ క్లోజ్ అయిపోయే రోజు వచ్చిందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది' అనే కామెం

అమూల్యకు బంటీ కంపెనీ.. బన్నీకి కరోనా రావడంపై పూజా హెగ్డే సెటైర్స్

Image
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ లేదా ఐకాన్ స్టార్ ఎలా పిలిచినా అందరికీ గుర్తొచ్చేది మాత్రం . బన్నీ ప్రస్తుతం ఐసోలేట్ అయ్యారు. కరోనా ఇంత ఉధృతంగా ఉన్నా కూడా సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే హైద్రాబాద్‌లోనే భారీ సెట్ వేసి పుష్ప షూటింగ్‌ను కానిచ్చేస్తున్నారు. కానీ ఇంత లోపే కరోనా అడ్డు కట్ట వేసేసింది. బన్నీకి కరోనా పాజిటివ్ రావడంతో అంతా తారుమారైంది. అనసూయ, రష్మిక మందాన్నలతో అదిరిపోయే సీన్లు తెరకెక్కిస్తోన్న సుకుమార్‌కు షాక్ తగిలినట్టైంది. ప్రస్తుతం అన్ని జాగ్రత్తలు తీసుకుని క్వారంటైన్ అయ్యాడు. డాక్టర్ల సలహా మేరకు ఐసోలేషన్‌లో ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తనను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేసుకోవాలని, అందరూ జాగ్రత్తగా ఉండాలని బన్నీ సూచించారు. బన్నీ ఇలా చేసిన ట్వీట్ మీద వెరైటీగా స్పందించారు. పూజా హెగ్డేకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వారం ప్రారంభంలోనే పూజా హెగ్డే కరోనా బారిన పడ్డారు. ఆమె కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంటున్నారు. అయితే బన్నీకి కూడా కరోనా రావడంపై పూజా హెగ్డే స్పందించారు. అల వైకుంఠపురములో సినిమాలోని పాత్రలను తలుచకుంటూ బంటూ (బన్న