టాలీవుడ్‌లో విషాదం.. కరోనాతో దర్శకుడు కన్నుమూత

ప్రస్తుతం కరోనా ఉధృతి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. కరోనా సోకి టాలీవుడ్ డైరెక్టర్ మరణించారు. కరోనాతో పోరాడి ఓడిన డైరెక్టర్ తుది శ్వాస విడిచారు. కుమార్ వట్టి అనే సినిమాతో దర్శకుడిగా మారారు. శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ఈ మూవీతోనే కుమార్ వట్టి దర్శకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ఈయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. కుమార్ వట్టి మొదటగా పరుశురాం వద్ద అసిస్టెంట్‌గా పని చేశారు. యువత సినిమా కోసం పరుశురాం వద్ద కుమార్ వట్టి పని చేశారు. ఆ తరువాత సోలో సినిమాకు కూడా పనిచేశారు. ఆ సందర్భంలోనే శ్రీ విష్ణుతో పరిచయం జరగడం, తాను దర్శకుడిగా మారితే తన హీరో కచ్చితంగా అని అప్పుడే ఫిక్స్ అయ్యారట కుమార్ వట్టి. అలా మొత్తానికి మా అబ్బాయి సినిమాతో కుమార్ వట్టి దర్శకుడిగా మారారు. వట్టి కుమార్ శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటకు చెందిన వారు. అవివాహితుడైన ఆయన వయసు 39 సంవత్సరాలు. ఎంతో ఎత్తుకు ఎదుగుదామని ఆ డైరెక్టర్‌ను కన్న కలలను కరోనా వైరస్ కబళించింది. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న కుమార్ వట్టి నేడు కన్నుమూశారు. గురువారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్లాస్మా ఎక్కించారు. ఆ క్రమంలోనే ఆయన మరణించినట్టు స్నేహితులు తెలిపారు. ప్రస్తుతం సర్కారు వారీ పాట సినిమాకు అసోసియేట్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు పోస్ట్‌లు చేస్తున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ