కరోనా రాకుండా ఒకే ఒక ఆయుధం.. ఆధారం.. ఔషదం ఇదే: చంద్రబోస్

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో ప్రజలు ప్రాణాలకు గుప్పెట్లో పెట్టుకుని బతుకున్నారు. కరోనాకి బలయ్యే వారి సంఖ్య గంట గంటకూ పెరిగిపోతుంది. ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాయి. ఈ తరుణంలో ఈ వ్యాధి బారిన పడకుంటా ఎవరి ప్రాణాలను వారు రక్షించుకోవాల్సిన వచ్చింది. ఈ తరుణంలో వ్యాధి బారిన పడిన తరువాత చికిత్స చేయించుకోవడం కంటే.. వ్యాధి రాకుండా నివారణే ఉత్తమమైన మార్గం అని అంటున్నారు సినీ రచయిత . ఈ తరుణంలో ప్రాణాలను రక్షించుకోవడానికి మాస్క్ ఒక్కటే సంజీవని అని అంటున్నారు. అందరూ క్షేమంగా ఉండాలని తెలియజేస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు చంద్రబోస్. కరోనా మహమ్మారి విపరీతంగా విజృంభిస్తున్న వేళ.. వ్యాధి వచ్చిన తరువాత జరగబోయే చికిత్స కంటే.. వ్యాధి రాకుండా నివారణే ఉత్తమ మార్గం. ఈ సమయంలో సందర్భంలో మన ప్రాణాన్ని ఆరోగ్యాన్ని రక్షించే ఒకే ఒక్క సాధనం మాస్క్. ఒకే ఒక్క ఆయుధం మాస్క్. ఒకే ఒక్క ఆధారం మాస్క్. ఒకే ఒక్క ఔషదం మాస్క్. మాస్క్ ధరించండి.. కరోనాను ధరిచేరనివ్వకండి’ అంటూ సందేశం ఇచ్చారు రచయిత చంద్రబోస్. గతంలో కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ కరోనాపై పాటను రాశారు చంద్రబోస్.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ