‘నిజం చెప్పాలంటే నాకు అది కూడా చేతకాదు.. యువకులే నా కంటే బాగా చేస్తారు!!’ ఓపెన్ అయిన ప్రియమణి

ఒకప్పుడు తన అందచందాలతో తెలుగు సిల్వర్‌స్క్రీన్‌ని షేక్ చేసిన నటి . ‘పెళ్లైన కొత్తలో..’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ అయింది. తెలుగులోనే కాక.. తమిళం, కన్నడం, మలయాళం ఇండస్ట్రీలో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. అంతేకాక.. ‘పరుత్తివీరన్’ సినిమాతో జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది ప్రియమణి. కెరీర్‌‌ కాస్త స్లో కావడంతో సినిమాలకు కొంతకాలం బ్రేక్ వేసింది. ఇప్పుడ సెకండ్ ఇన్నింగ్స్‌ను పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటుంది ప్రియమణి. సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ‘హిజ్ స్టోరీ’ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. సత్యదీప్ మిశ్రా ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సిరీస్‌లో ప్రియామణి చెఫ్ పాత్రలో మనకి కనిపిస్తుంది. ఈ నెల 25న విడుదలైన ఈ సిరీస్‌కి ప్రేక్షకుల ఆదరణ లభించింది. అయితే దీని గురించి మాట్లాడుతూ.. ప్రియమణి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వెబ్‌సిరీస్‌లో చెఫ్‌గా నటించిన ఆమెకు నిజానికి వంట చేయడం అస్సలు రాదట. ‘నాకు కోడిగుడ్డు ఉడికించడం కూడా రాదు. సెట్‌లో ఉన్న యువకులు నా కంటే బాగా వంట చేసేవాళ్లు. నేను వంట చేసే ప్రయత్నం చేస్తే.. వాళ్లు నవ్వుకునే వాళ్లు.. నాపై జోకులు వేసేవాళ్లు. కానీ, వెబ్‌సిరీస్‌లో చెఫ్‌గా నా నటనపై ప్రశంసలు వస్తుంటే చాలా సంతోషంగా ఉంది’ అని ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రియమణి ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్‌సిరీస్ చేస్తోంది. ఇందులో సమంత కీలక పాత్రలో కనిపించనుంది. దీంతో పాటు తెలుగులో ‘విరాటపర్వం’, ‘నారప్ప’ సినిమాల్లో నటిస్తోంది ప్రియమణి. హిందీలో అజయ్ దేవ్‌గన్‌తో కలిసి ‘మైదాన్’ అనే సినిమాలో నటిస్తోంది ఆమె.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ