Posts

Showing posts from August, 2021

RGV: సినీ నటితో మరో వీడియో.. తగ్గేదే లే! అలా రెచ్చిపోయిన రామ్ గోపాల్ వర్మ.. కామెంట్ల మోత

Image
కాంట్రవర్సీ అనే పదాన్ని తన పేరుకు పర్యాయపదంగా మార్చుకున్నారు . ముక్కుసూటి మనిషే అయినా గత కొంతకాలంగా ఆయన తీరు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఎవరేమనుకుంటే ఏంటి.. నాకు నచ్చింది నేను చేస్తా అంటూ వర్మ వెళుతున్న దారి, చేసే పనులు హాట్ టాపిక్ అవుతున్నాయి. వివాదంలో ఉంటూనే ఫ్రెష్ ఫీల్ కోసం వర్మ చేస్తున్న ఫీట్స్ షాకిస్తున్నాయి. ఇటీవలే ఇయన సుల్తానా అనే అప్‌కమింగ్ ఆర్టిస్ట్ బర్త్ డే వేడుకల్లో ఆయన చేసిన రచ్చ మాములుగా లేదు. సుల్తానాతో కలిసి చిందులేస్తూ ఏకంగా ఆమె పాదాలపై పడి దొర్లి దండం పెట్టడంతో అంతా షాకయ్యారు. ఇంతలోనే నటి జ్యోతితో మరో వీడియో బయటకు రావడం, దానిపై ఇటు ఆర్జీవీ అటు వివరణలు ఇవ్వడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా వర్మ, జ్యోతిలకు సంబంధించిన ఇంకో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను నటి జ్యోతి స్వయంగా తన ఇన్స్‌స్టాలో షేర్ చేస్తూ 'లవ్ యూ సర్.. వర్మ వైఖరి నాకు చాలా ఇష్టం' అని ట్యాగ్ చేసింది. 'సాగర సంగమం' సినిమాలోని ఫేమస్ సాంగ్ ‘తకిట తదిమి తందానా’ అనే పాటకు జ్యోతితో కలిసి చిందేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఇది చూసిన నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు

ముగిసిన ఈడీ విచారణ.. బండ్ల గణేష్ ఎంట్రీతో గందరగోళం.. పూరిపై ప్రశ్నల వర్షం

Image
టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు అందరిలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. నాలుగేళ్లు సుప్తావస్తలో ఉన్న ఈ కేసును ఇప్పుడు (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) పరుగులు పెట్టిస్తోంది. డ్రగ్స్ కేసులో భాగంగా మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై టాలీవుడ్ సెలెబ్రిటీలను విచారించేందుకు ఈడీ సిద్దమైంది. ఈక్రమంలోనే పూరి జగన్నాథ్‌ను నేడు (ఆగస్ట్ 31) ఉదయం నుంచి రాత్రి వరకు విచారించారు. ఈడీ కార్యాలయంలో పూరి విచారణ ఉదయం 10.17నుంచి రాత్రి 7.45 గంటల వరకు విచారణ కొనసాగింది. అయితే మళ్లీ పూరి జగన్నాథ్‌ను పిలిచి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో అరెస్ట్ అయిన నిందితుల స్టేట్ మెంట్ ఆధారంగా పూరి జగన్నాధ్ ను ప్రశ్నించారు. పూరీ కి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల తో ఉన్న సంబంధాల పై ఈడీ ఆరా తీశారు.. విదేశాల నుండి డ్రగ్స్ కొనుగోళ్లు ఏ రూపంలో జరిగాయని, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వివరాలు ఈడీ అధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. పూరీ జగన్నాధ్ కు సంబంధించి మూడు బ్యాంక్ ఎకౌంట్లను పరీశీలించినట్టు సమాచారం. పూరి జగన్నాధ్‌కు సంబంధించిన వైష్ణో బ్యానర్, పూరి కనెక్ట్స్ బ్యానర్ ఆడిట్ రీపోర్ట్‌లను ఈడీ అదుపులోకి తీసుకున్నట్టు

‘పుష్ప’ సినిమా నుంచి మరో అప్‌డేట్.. త్వరలో అక్కడ షూటింగ్ ప్రారంభం కానుందట..

Image
స్టైలిష్ స్టార్ , క్రియేటివ్ డైరెక్టర్ కాంబోలో రాబోతున్న భారీ సినిమా ''. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బన్నీ మాస్ అప్పీయరెన్స్ వెండితెరపై చూడాలని తహతహలాడుతున్నారు. అయితే తొలుత ఈ సినిమాను ఒక భాగంగానే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని అంతా భావించారు. కానీ, అభిమానులకు అంచనాలకు మంచి ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ మధ్యకాలంలోనే ప్రకటించింది. మొదటి భాగం ‘పుష్ప- ది రైజ్’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్లు అన్ని ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఉన్న విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ముఖ్యంగా ఆఖర్లో అల్లు అర్జున్ చెప్పిన ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ హైలైట్‌గా నిలిచాయి. ఇకపోతే.. ఈ సినిమాలో మలయాళం సూపర్‌స్టార్ ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. రీసెంట్‌గానే ఆయన ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు పుష్ప సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ సోషల్‌మీడియాలో వైరల్ అవు

ఈడీ కార్యాలయానికి బండ్ల గణేష్.. వక్క పొడి కూడా వేసుకోను.. నోటీసులెందుకు ఇస్తారంటూ నిర్మాత ఫైర్

Image
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నేడు కీలక మలుపు తిరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా దర్శకుడు విచారణకు హాజరయ్యారు. ఇక నేటి నుంచి వంతుల వారిగా ఒక్కోసెలెబ్రిటీ విచారణకు హాజరు అవుతుంటారు. ఈ తంతు సెప్టెంబర్ 22 వరకు కొనసాగుతూ ఉంటుంది. అయితే మొదటి రోజు పూరి జగన్నాథ్ వంతు వచ్చింది. పూరి జగన్నాథ్‌ను ఈడీ పలు రకాలుగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. 2015 నుంచి బ్యాంక్ లావాదేవీలను ఈడీ అడిగినట్టు.. పూరి జగన్నాథ్ వాటిని సమర్పించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం ఓ వైపు కొనసాగుతుంటే.. ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి నిర్మాత బండ్ల గణేష్ వచ్చారు. బండ్ల గణేష్ రాకతో అతని పాత్రపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈడీ కార్యాలయానికి చేరుకున్న బండ్ల గణేష్.. అక్కడికా రావడంపైనా క్లారిటీ ఇచ్చారు. నాకు ఎవరు నోటీసులు ఇవ్వలేదు. పూరీ జగన్నాథ్ కోసం ఇక్కడికి వచ్చాను. నాకెందుకు నోటీసులు ఇస్తారు అంటూ అక్కడి మీడియాతో బండ్ల గణేష్ మాట్లాడారు. ఇక తాజాగా ఆయన ట్వీట్ కూడా వేశారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాకు ఏ విధమైన సంబం

టుడే ఇన్‌స్టా హిట్స్: చూపుల్తో కవ్విస్తున్న శామ్.. నిహారికా గ్లామర్ ట్రీట్.. ఆయనతో ప్రగ్యా

Image
చూపుల్తో కవ్విస్తున్న కుందనపు బొమ్మ ‘కుందనపు బొమ్మ’ సమంత అందం చూస్తే ఫిదా అవ్వని వాళ్ల ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె గ్లామర్ అన్న.. అంతెందుకు ఆమె చూపులు చూసి కూడా ఫ్యాన్స్ పడిపోతారు. తాజాగా ఓ ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహించిన ఆమె.. తన చూపులతో కవ్విస్తూ.. ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఒకప్పుడు అలా ఉన్నాను అంటూ అమీ హీరోయిన్ .. చేసిన సినిమాలు కొన్నే ఆయినా.. తన అందాల ఆరబోతతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఈ బ్రిటీష్ ముద్దుగుమ్మ. రీసెంట్‌గానే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఈ సుందరి.. తల్లి అయినప్పటికీ.. అదే గ్లామర్ మెయింన్‌టేన్ చేస్తుంది. తాజా 90లలో తాను ఎలా ఉందో చెబుతూ కొన్ని పిక్స్‌ని అభిమానులతో పంచుకుంది. సోఫాలో నిహారికా గ్లామర్ ట్రీట్.. మెగా ప్రిన్సెస్ నిహారికా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో పెద్దగా సక్సెస్ రాకపోయినా.. పాపులారిటీ మాత్రం బాగానే సంపాదించుకుంది ఈ భామ. ఇక కొన్ని రోజుల క్రితమే నిహారికా వివాహం చేసుకుంది. తాజాగా సోఫాలో కూర్చొని.. గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఓ పిక్‌ని షేర్ చేసింది నిహారికా. రెహమాన్ పాటకు పాయల్ అభినయం ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ సోష

15 నిమిషాల సుఖం కోసం అలా చేయలేను!.. కదిలించేలా రేణూ దేశాయ్ పోస్ట్

Image
ప్రస్తుతం చాలా మంది శాకాహారులుగా మారిపోతోన్నారు. జీవ హింసకు వ్యతిరేకంగా, మూగ జీవుల హక్కులను గుర్తిస్తూ, వాటిపై అవగాహన తెచ్చుకుని కొంత మంది మాంసాహారాన్ని వదిలేస్తున్నారు. అయితే ఇందులో చాలా మంది వేగన్‌గా మారిపోవడానికి రకరకాల కారణాలుంటాయి. ఆ మధ్య ఆహా భోజనంబు షోలో ఆలీ గెస్టుగా వచ్చారు. తన భార్య మటన్ తినడం మానేసిందని దాని వెనుకున్న కథను చెప్పుకొచ్చారు. ఓ సారి మేకను ముక్కలు ముక్కలుగా కట్ చేయడం చూసిందని అప్పటి నుంచి మటన్ తినడం పూర్తిగా మానేసందని చెప్పుకొచ్చారు. అలా ఒక్కొక్కరు ఒక్కో సందర్భంలో రియలైజ్ అవుతుంటారు. అయితే కూడా వేగన్‌గా మారిపోయారట. చాలా మంది సెలెబ్రిటీలు ఇప్పుడు పూర్తిగా శాకాహారులుగా మారిపోయారు. ఇక రేణూ దేశాయ్ తాజాగా ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. జంతు పరిరక్షణకు సంబంధించిన ఓ సంస్థ చేసిన పోస్ట్‌ను రేణూ దేశాయ్ తిరిగి షేర్ చేశారు. అలా తన అభిప్రాయాన్ని కూడా చెప్పకనే చెప్పేశారు. నేను వేగన్‌గా ఎందుకు మారిపోయాను?.. ఎందుకంటే.. ఓ జంతువు జీవితకాలం మొత్తాన్ని, దాని భయం, దాని బాధ, నొప్పి ఇవన్నీ కూడా కేవలం నా పదిహేను నిమిషాల సుఖం, సంతోషానికి సరితూగదు అని తెలుసుకున్నాను. ఆ విషయాన్ని నేను రియలైజ్ అయ

ఆ పని చేస్తున్న హీరో నాని.. ఇంకా కామెంట్స్ చేయాలి అంటూ అభిమానులకు సూచన

Image
హీరోగా నటించిన ‘’ సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 10న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ‘టక్ జగదీష్’ సినిమాను విడుదల చేయనున్నట్లు.. ఇటీవలే ప్రకటించారు. ‘‘నాయుడుగారి చిన్నబ్బాయి టక్ జగదీశ్ చెబుతున్నాడు.. మొదలెట్టండి’’ అనే డైలాగ్ ప్రోమోతో తేదీని ఖాయం చేశారు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలోని పాటలు సైతం ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నాని అభిమానులు.. ట్రైలర్ ఎప్పుడంటూ వెంటపడుతున్నారు. ఈ సందర్భంగా షైన్ స్క్రీన్ సంస్థ నాని వీడియోను పోస్ట్ చేసింది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్‌లో ఉండగా.. తాజాగా అమెజాన్ ప్రైజ్ ఓ ఆసక్తికర అప్‌డేట్‌ని పోస్ట్ చేసింది. హీరో నాని ‘టక్‌ జగదీష్’ సినిమాపై వస్తున్న కామెంట్లు అన్ని చూస్తున్నారు అంటూ అమెజాన్ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో నాని ఇంకా చేయండి.. అంటూ లేదా.. సినిమా త్వరగా చూసేయండి అంటూ అనే చెప్పే విధంగా సైగలు చేయడం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక టక్‌ జగదీష్ ఓటీటీ విడుదల విషయంలో చాలా వివాదా

డ్రగ్స్ కేసులో పురోగతి.. సగం విచారణలోనే పూరి నుంచి కీలక విషయాలు లాగేశారు

Image
టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మంగళవారం నుంచి విచారణ మొదలుపెట్టనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది సెలబ్రెటీలకు కొద్దిరోజుల క్రితమే నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేటి(ఆగస్టు 31) నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు వారందరినీ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో వేర్వేరుగా ప్రశ్నించనుంది. ఈ కేసులో ఈడీ ఫోకస్ మొత్తం డ్రగ్స్‌ లావాదేవీల్లో జరిగిన మనీ లాండరింగ్‌పైనే ఉంది. దీంతో ఆ కోణంలోనే సెలబ్రెటీలపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశముంది. ఇక తాజాగా ఈ కేసులో మొట్టమొదలు దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణకు హాజరు అయ్యారు. మంగళవారం.. ఆయన ఈడీ కార్యాలయంకి వచ్చి విచారణలో పాల్గొన్నారు. ఆయన్ని 10.30కు విచారణకు రావాలని ఆహ్వానించగా.. పూరీ కాస్త ముందుగానే 10.05కే విచారణకు వచ్చారు. ఇక ఈడీ కార్యాలయం ముందు ఉన్న మీడియా ప్రతినిధులు ఆయనను కొన్ని ప్రశ్నలు అడగ్గా.. ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఈడీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పటికే పూరితో జరిగిన విచారణలో అధికారులకు పలు కీలక అంశాలు తెలిసినట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. అలాగే విదేశీ లావాదేవిలపై కూడా ఆరా తీసినట్ల

ఆయనతో గడపడమంటే చాలా ఇష్టం.. శాంతనుతో రిలేషన్! పెళ్లిపై శృతి హాసన్ ఓపెన్ కామెంట్స్

Image
స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ గడపతొక్కి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది . ఎక్కువగా మోడ్రన్ కల్చర్ ఇష్టపడే ఆమె సోషల్ మీడియాలో చాలా విషయాలపై ఓపెన్ అవుతుంటుంది. ముఖ్యంగా తన లవ్ మ్యాటర్స్ మాత్రం అస్సలు దాచుకోని ఆమె.. గతంలో తన ప్రియుడు మైఖేల్‌ కోర్సలేతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పేసి డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో క్లోజ్ రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తుండటంతో వాళ్ళిద్దరిపై రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. శాంతనుతో ఎక్కువ సమయం గడుపుతూ.. అతనితో కలిసున్న ఫొటోలను తరచూ సోషల్‌ మీడియాతో షేర్‌ చేస్తూ హల్చల్ చేస్తోంది. చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ డేటింగ్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దీంతో శృతి పెళ్లిపై తెగ రూమర్స్ పుట్టుకొచ్చాయి. శాంతనుతో శృతి ప్రేమాయణం నడుపుతోందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ప్రశ్న ఎదురుకావడంతో ఆసక్తికరంగా స్పందించింది శృతి. పెళ్లి చేసుకోవాలని అనిపించిన వెంటనే ఆ విషయం అందరికీ చెప్పేస్తానని, ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు లేవని చెప్పుకొచ్చింది. పెళ్లిక

Aamani అలా ఇంద్రజ ఇలా.. చిన్నప్పటి నుంచి అదే పిచ్చి!

Image
ఆమని, ఇంద్రజలు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాలం గురించి అందరికీ తెలిసిందే. ఈవీవీ, బాపు, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దిగ్గజ దర్శకుల చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్లుగా మారిపోయారు. , ఇంద్రజలు కలిసి దాదాపు మూడు నాలుగు సినిమాల్లో నటించారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చాక తామిద్దరం ఫ్రెండ్స్ అయ్యామని చెబుతూ.. ఎన్నో పర్సనల్ విషయాలను పంచుకున్నారు. తాజాగా ఈ ఇద్దరూ ఆలీతో సరదాగా షోలో తమ సినీ, పర్సనల్ జీవితం గురించి నోరు విప్పారు. ‘నాకు చిన్నప్పటి నుంచి చదువంటే పిచ్చి.. చదువుకుంటాను అంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. నాకు ఇప్పటికే అది తలుచుకుంటే బాధగా ఉంటుంది. నాకు ఇద్దరు చెల్లెళ్లు. నాకు ఒక అన్నయ్య, తమ్ముడు ఉంటే బాధ్యతలు వారు చూసుకుంటూ నన్ను చదువుకొనిచ్చే వారేమోనని ఫీలవుతుంటాను. నేను చదువుల్లో ఫస్ట్. స్కూల్లో ఫస్ట్ వచ్చేదాన్ని. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. జర్నలిస్ట్ అయినా అయి ఉండేదాన్ని, లేదా సైంటిస్ట్ అయినా అయి ఉండేదాన్ని’ అంటూ తనకు చదువుల మీద ఉన్న పిచ్చిన చెప్పుకొచ్చారు. ఇంద్రజ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆమని చెప్పుకొచ్చార

Drug Peddling Case: సినీ నటి ఇంట్లో గంజాయి.. బాత్రూమ్‌లో దాక్కున్నా వదలని పోలీసులు!!

Image
సినీ ఇండస్ట్రీలో మరోసారి కేసు కలకలం సృష్టిస్తోంది. శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే సంజనా, రాగిణిలు అరెస్ట్ కావడం, సంచలన విషయాలు వెలుగులోకి రావడం జరగగా.. తాజాగా మరో నటి పేరు తెరపైకి రావడం హాట్ టాపిక్ అయింది. శాండల్‌వుడ్ నటి సోనియా అగర్వాల్ ఇంట్లో గంజాయి దొరికినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె పోలీస్ కస్టడీలో ఉంది. మాదక ద్రవ్యాలు విక్రయించే ముఠాలో ఒకరు సోనియా వివరాలు చెప్పడంతో ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారట. ఈ క్రమంలో 40 గ్రాముల గంజాయి దొరకడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. కాస్మెటిక్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న నటి సోనియా అగర్వాల్ కొందరు ప్రముఖులతో టచ్‌లో ఉంటూ ఈ డ్రగ్స్ పెడల్‌లో భాగమవుతోందని ఆరోపణలు రావడంతో పోలీసులు సోదాలు చేశారు. సోనియాతో పాటు ఇదే విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు వ్యాపారవేత్తలు డిజె వచన్ చిన్నప్ప, భరత్‌ను బెంగుళూరులోని గోవిందపుర పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల ఆకస్మిక దాడి గురించి ముందే సమాచారం అందుకుందట సోనియా అగర్వాల్. వెంటనే ఓ ప్రైవేట్ హోటల్‌లో బుక్ చేసుకొని హోటల్ గదిలోని వాష్‌రూమ్‌లో దాక్కుందని, అయిన సోనియా జాడ తెలుసుక

Seetimaarr Trailer : సౌత్ కా సత్తా సీటీమార్‌కే.. గోపీచంద్ మాస్ యాంగిల్!

Image
గోపీచంద్ కాంబినేషన్‌లో సంపత్ నంది తెరకెక్కించిన సినిమా సీటీమార్. కబడ్డీ ఆట నేపథ్యంలో రాబోతోన్న ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. కరోనా, లాక్డౌన్ వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమాకు ఎట్టకేలకే థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ సెప్టెంబర్ 10న విడుదల కాబోతోంది. తాజాగా ఉస్తాద్ హీరో ఇస్మార్ట్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. గోపీచంద్‌లోని మాస్ యాంగిల్ మొత్తానికి బయటకు తీసినట్టు కనిపిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్‌లకు నిజంగానే పడేట్టు కనిపిస్తోంది. ఇక సీటీమార్ ట్రైలర్ ఆద్యంతం మాస్ ప్రేక్షకులను మెప్పించేందుకు కట్ చేసినట్టుగా అనిపిస్తుంది. గోపీచంద్ మూవీ తరహాలోని భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు సీటీమార్‌లో కుప్పలు తెప్పలుగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఆటలు, ఆడవాళ్లు అంటూ ఎమోషనల్ సీన్లు కూడా కనిపిస్తున్నాయి. ఆడవాళ్లపై జరిగే వివక్ష, ఆటల్లో ఆడవారిని రానివ్వకుండా సమాజం ఎలాంటి అవమనాలు చేస్తుందో.. పొట్టి బట్టలపై ఎలాంటి కామెంట్లు చేస్తుందో ట్రైలర్‌లో చూపించారు. వారు వేసుకునే బట్టల సైజుతోనే వారి క్యారెక్టర్‌ను గుర్తిస్తారు అంటూ రాసిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. సీటీమార్‌లో

మీరు చేసింది దేశానికే ఆదర్శం.. ప్రతీ భారతీయుడు దాన్ని చూసి గర్వించాలి: చిరంజీవి

Image
ఈ ఏడాది టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది మెడల్స్ పంట పండిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో టేబుల్ టెన్నీస్ విభాగంలో భవీనా పటేల్ భారత్‌కు తొలి మెడల్ అందించారు. చైనాకు చెందిన క్రీడాకారిణితో పోటీ పడిన ఆమె.. ఓటమిపాలు అయినప్పటికీ.. రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత.. జావిలిన్ త్రో విభాగంలో సుమిత్, 10మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఈ అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ వీరిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచాల్సిందేనని నిరూపించి దివ్యాంగులలో గొప్పస్పూర్తిని నింపేలా పారాలంపిక్ క్రీడలలో దేశానికి పతకాలు అందించిన విజేతలకు అభినందనలు. ఈ విజయాలు ప్రతి భారతీయుడు గర్వించేవి’ అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక పారాలింపిక్స్‌లో తొలి స్వర్ణం సాధించిన భారత మహిళగా రికార్డు సృష్టించిన అవని లేఖరాకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆచార్య’ అనే సినిమ

Suriya భార్యగానా? జ్యోతికగానా?.. బాబోయ్ ఇదేం క్రేజ్.. గంటల్లోనే లక్షల మంది!

Image
గురించి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటిగా, హీరోయిన్‌గా జ్యోతిక చేసిన సినిమాలో ఆమె గురించి చెబుతాయి. ఇక స్టార్ హీరోల సరసన నటించిన జ్యోతికకు కోలీవుడ్‌లోనే ఎక్కువ క్రేజ్, అవకాశాలు వచ్చాయి. ఇక అక్కడే హీరో సూర్యతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తరువాత జ్యోతికి సినీ కెరీర్‌కు కాస్త విరామం ఇచ్చారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో జ్యోతిక దుమ్ములేపుతున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు జ్యోతిక కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. ఆమె నటించిన ఎన్నో సినిమాలు సక్సెస్ అయ్యాయి. సూర్య, జ్యోతిక కలిసి కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు. జ్యోతికి చివరగా కార్తీతో కలిసి వచ్చారు. కానీ ఆ మూవీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. అయితే తాజాగా జ్యోతికి ఇన్ స్టాగ్రాంలోకి అడుగుపెట్టేశారు. ఇక అలా ఎంట్రీ ఇచ్చారో లేదో ఇలా క్షణాల్లో ఫాలోవర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వచ్చింది. గంటల్లోనే మిలియన్ ఫాలోవర్లను క్రాస్ చేసేశారు. ప్రస్తుతం జ్యోతికకు ఇప్పుడు దాదాపు 13 లక్షల మంది ఫాలోవర్లు వచ్చారు. ఆమె చేసిన ఫస్ట్ పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ట్రెక్కింగ్‌కు వెళ్లిన జ్యోతికి అక్కడి వ

Sitara Ghattamaneni : పెద్దవాడివి అయిపోయావ్.. నిన్ను ఇక రకరకాలుగా ఏడిపిస్తా.. గౌతమ్‌పై సితార

Image
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. సితార టైపులో ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించరు. మహేష్ బాబుకు మల్లే కాస్త ఈ హడావిడి ప్రపంచానికి దూరంగా ఉంటారు. నమ్రత, సితార షేర్ చేసే ఫోటోల్లో గౌతమ్ కనిపిస్తాడు. అంతే తప్పా.. తనకు ఇంత వరకు స్పెషల్ అకౌంట్లు లేనే లేవు. సోషల్ మీడియాకు గౌతమ్ వీలైనంత దూరంగా ఉంటుంటారు. అయితే వెకేషన్స్ కోసం బయటకు వెళ్లినప్పుడు మాత్రం ఫ్యామిలీ పిక్స్‌లో గౌతమ్ మెరుస్తుంటారు. ఇక వన్ సినిమాలో గౌతమ్ నటన గురించి అందరికీ తెలిసిందే. వన్ సినిమా ఘట్టమేనేని అభిమానుకు ఎంతో ప్రత్యేకం. మహేష్ బాబు, గౌతమ్ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారు. అలా ఆ సినిమా వారికి ఎంతో స్పెషల్‌గా మారిపోయింది. నేడు (ఆగస్ట్ 31) గౌతమ్ పుట్టినరోజు. గౌతమ్ పదిహేనవ ఏటలోకి అడుగుపెట్టడంతో మహేష్ బాబు, నమ్రత స్పెషల్‌గా విష్ చేశారు. ఇక చిట్టి చెల్లి సితారా మాత్రం తన స్టైల్లో ఆట పట్టేసింది. గౌతమ్‌ను సితార, మహేష్ బాబు ఎలా ఆడుకుంటారో.. ఆ ఆటల్లో వారు గౌతమ్‌ను ఎలా మోసం చేస్తుంటారో నమ్రత చెబుతుంటారు. ఇక తాజాగా గౌతమ్‌కు సితార విషెస్ చెబుతూ.. హ్యాపీ బర్త్ డే అన్నయ్య. నన్ను ఎప్పుడూ

ఆ పండుగకు వస్తున్న మాస్ మహరాజ.. ఇక ఆ విషయంలో ఎలాంటి డౌట్లు లేవు

Image
ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు రవితేజ. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో, శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మాస్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లలో దూసుకుపోయింది. ఈ సినిమా చేస్తూనే రవితేజా మరో రెండు సినిమాలు సైన్ చేశాడు. అందులో ‘ఖిలాడి’ ఒకటి. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలా కాలమే అయింది. అయినప్పటికీ సినిమా గురించి సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలాకాలమే అయింది. అయినా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌‌డేట్ రాలేదు. ఇక రవితేజ అభిమానులు ఈ సినిమా నుంచి ఎప్పుడు.. అప్‌డేట్ వస్తుందా.. తమ అభిమాన హీరోను స్క్రీన్‌పై మళ్లీ ఎప్పుడు చూస్తామా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రవితేజా నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఓ ఆసక్తికర వ్యార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదల కానుంది అంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. జయంతిలాల్‌ గడ సమర్పణలో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ‘ప

తనయుల బర్త్ డేపై బండ్ల గణేష్.. బండ్లన్న వారసులు మామూలుగా లేరు కదా!

Image
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా చేతనైన సాయం చేస్తుంటారు. అలా బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ప్రదర్శించే దూకుడుకు అందరూ ఫిదా అవుతుంటారు. ఇక బండ్లన్న ఈ మధ్య తన ఫ్యామిలీని కూడా ఫేమస్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ మధ్య ఓంకార్ షోలో బండ్లన్న తన కూతురిని పరిచయం చేశారు. ఇక ఈ మధ్య తన కొడుకులను రంగంలోకి దించుతున్నారు. ఆ మధ్య తన పెద్ద కొడుకు హితేష్ అంటూ పరిచయం చేస్తూ వదిలిన ఫోటో అందరినీ ఆశ్చర్యపరచింది. జూనియర్ బండ్ల గణేష్ అంటూ హితేష్ మీద ప్రశంసలు కురిపించారు. పైగా బండ్లన్న గతంలో వేసుకున్న షర్ట్‌లోనే హితేష్ కనిపించాడు. అలా మొత్తానికి జూనియర్ బండ్ల గణేష్‌గా హితేష్‌కు మంచి క్రేజ్ వచ్చేసింది. అయితే తాజాగా బండ్లన్న తన కొడుకులిద్దరి ఫోటోలను షేర్ చేశారు. తన కుమారుల పుట్టినరోజు అంటూ బండ్లన్న ఎమోషనల్ అయ్యారు. తన తనయుల (, ) బర్త్ డే అని చెబుతూ అందరి బ్లెస్సింగ్స్ కావాలని బండ్ల గణేష్ కోరారు. ఇక బండ్లన్న ట్వీట్‌కు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు సైతం విషెస్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఇలా అందరూ కూడా బండ్లన్న వార

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ హవా.. బన్నీ రేర్ ఫీట్.. సౌత్ ఇండస్ట్రీలోనే తొలి హీరోగా రికార్డు

Image
రాను రాను సోషల్ మీడియా ప్రభావం పెరుగుతోంది. నిత్యం సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో టచ్‌లో ఉండే సెలబ్రిటీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. చిరంజీవి, మోహన్ బాబు లాంటి సీనియర్ హీరోలు సైతం ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ ఖాతాల్లో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన సమాచారాన్ని అందరి ముందుకు తెస్తున్నారు. ఇక నేటితరం హీరోహీరోయిన్ల హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ నేపథ్యంలోనే స్టైలిష్ స్టార్ తాజాగా అరుదైన ఫీట్ సాధించారు. సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఫాలోయింగ్ పెంచుకొని సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఐకాన్ స్టార్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 13 మిలియన్ ఫాలోవర్స్ చేరిపోయారు. అంటే కోటి 30 లక్షల మంది అల్లు అర్జున్ అకౌంట్ ఫాలో అవుతున్నారన్నమాట. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో ఈయనే కావడం విశేషం. 2017, నవంబర్‌లో అధికారికంగా ఇన్‌స్టాలోకి వచ్చిన బన్నీ, క్రమం తప్పకుండా అభిమానులతో టచ్ లోకి వస్తూ అంచెలంచెలుగా ఫాలోవర్స్‌ని పెంచుకుంటూ వచ్చారు. అల్లు అర్జున్ 13 మిలియన్ మైలురాయిని అధిగమించడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతూ ఆయనకు కంగ్

ఆయనతో నాకు ఎలాంటి విబేధాలు లేవు.. ఆ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

Image
ఆయన సినిమాల్లో ఒకప్పుడు తన కామెడీతో అలరించారు. ఆ తర్వాత తన స్వార్జితంతో నిర్మాతగా మారారు. స్టార్ హీరోలతో కలిసి సినిమాలు నిర్మించారు. ఎంతో సక్సెస్ కూడా సాధించారు. ఆయనే .. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అయినా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయినా.. ఆయన రూపొందించిన సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాలి అంటే పవన్‌కళ్యాణ్‌తో తీసిని ‘గబ్బర్‌సింగ్’.. ఎన్టీఆర్‌తో‌ తీసిన ‘బాద్‌షా’.. ‘టెంపర్’ సినిమాలను చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్‌కి.. బండ్ల గణేష్ మధ్య విభేదాలు వచ్చాయి అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికి పడటం లేదంటూ సోషల్‌మీడియాలో ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాసుకుంటూ పోయారు. అయితే ఈ వార్తలపై తాజాగా బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఎన్టీఆర్‌కు ఎలాంటి విబేధాలు లేవు అంటూ ఆయన స్పష్టం చేశారు. ఎదో మిస్ కమ్మూనికేషన్ వల్ల అది జరిగింది. అని అయన పేర్కొన్నారు. అన్మదమ్ముల మద్య మనస్పర్థలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి.. కానీ సంబంధం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది అంటూ అర్థం వచ్చేలా ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్

‘వరుడు కావలెను’ టీజర్.. అతను ప్రతి బాల్ సిక్స్ కొడితే.. ఆమె అన్ని బాల్స్ నోబాల్ ఇస్తుందట

Image
తెలుగులో డిఫెరెంట్ సినిమాలు చేయడంలో హీరో ఎప్పుడూ ముందుటారు. ఆయన సినిమాలు అంటేనే అందులో ఎదో విలక్షణత ఉంటుంది. ప్రతీ సినిమాలో ఏదో డిఫరెంట్ రోల్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు నాగశౌర్య. అలా వినోదం మాత్రమే కాదు.. మంచి సందేశం ఉన్న సినిమాలు చేస్తుంటారు నాగశౌర్య. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలు ‘లక్ష్య’, ‘వరుడు కావలెను’. లక్ష్య స్పోర్ట్స్ డ్రామా కాగా.. వరుడు కావలెను ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. లక్ష్యలో ఆయన మాజీ ఆర్చరీ ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఇక వరుడు కావలెను సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ విడుదల అయింది. ఇక ‘వరుడు కావలెను’ సినిమా నుంచి తాజాగా ప్రేక్షకులకు మరో ట్రీట్ లభించింది. ఈ సినిమా టీజర్‌ని తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ .. వరుడు కోసం ఎదురుచూస్తున్న అమ్మాయిలా.. అంతకు మంచి చాలా యాటిట్యూడ్ ఉన్న అమ్మయాలా మనకు టీజర్‌లో కనిపిస్తోంది. ఎన్ని సంబంధాలు వచ్చిన ఆమె యాటిట్యూట్ కారణంగా అవి చెడిపోవడం అనేది టీజర్‌లో మనం చూడొచ్చు. ఇక నాగశౌర్య విదేశాల నుంచి వచ్చి.. రితూ వర్మను చూసి ప్రేమలో పడతారు అని టీజర్ చూస్తే మనకి అర్థం అవుతోంది. టీజర్ ఆరంభంలో నటి నదియా,

Drugs Case: ఈడీ కార్యాలయానికి పూరీ జగన్నాథ్.. అనుకున్న సమయం కంటే ముందుగానే..

Image
నాలుగు సంవత్సరాల క్రితం టాలీవుడ్‌ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఎంతో మంది సెలబ్రిటీలను ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ చేసింది. ఇందులో ప్రధానంగా దర్శకుడు , రవితేజ, నవదీప్, హీరోయిన్ ఛార్మి తదితరులు అప్పుడు విచారణకు హాజరు అయ్యారు. పలువురు టెక్నిషన్ల కూడా ఈ విచారణకు హాజరయ్యారు. ఇందులో ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అప్పుడు ఆరోపణలు ఎదురుకున్న సెలబ్రిటీలు అందరికీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరక్టరేట్(ఈడీ) రీసెంట్‌గా సమన్లు పంపించింది. ఈ కేసుపై నేటి(ఆగస్టు 31) నుంచి విచారణ చేపట్టనుంది. ఈ కేసులో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నటులు రానా, రవితేజ తదితరులకు సైతం ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత దర్శకుడు పూరి జగన్నాథ్‌ను విచారణకు అహ్వానించింది ఈడీ. ఆయన్ని 10.30కు విచారణకు రావాలని ఆహ్వానించగా.. పూరీ కాస్త ముందుగానే 10.05కే విచారణకు వచ్చారు. ఇక ఈడీ కార్యాలయం ముందు ఉన్న మీడియా ప్రతినిధులు ఆయనను కొన్ని ప్రశ్నలు అడగ్గా.. ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఈడీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు. ఈ విచారణ దాదాపు మధ్యాహ్నం వరకూ కొనసాగనుంది. ఇక ఈ కే

NBK 47 Years: అఖండ విజయాలందుకున్న లెజెండ్ ఈ నటసింహం.. బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిన నందమూరి హీరో!!

Image
నటవారసత్వం అనేది సినీ ఎంట్రీ సమయంలో ఇచ్చే బూస్టింగ్ మాత్రమేనని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఏదో ఒకటి రెండు సినిమాల వరకు స్టార్ కిడ్స్ అనే ముద్రతో ఆదరణ లభిస్తుంది కానీ ఆ తర్వాత సదరు స్టార్ కిడ్ టాలెంట్‌పైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇలా ఈ కేటగిరీలోనే సినీ ఎంట్రీ ఇచ్చి రికార్డులు చెరిపేస్తూ సంచలనాలకు మారుపేరయ్యారు నందమూరి . ఆయన సినిమాల్లోకి వచ్చి 47 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన '' విజయాలను నెమరు వేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నందమూరి ఫ్యాన్స్. 'తాతమ్మకల'. 1974 సంవత్సరంలో ఈ సినిమాను నందమూరి తారక రామారావు డైరెక్ట్ చేయడమే కాకుండా స్వయంగా నిర్మించారు కూడా. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు భానుమతి, హరికృష్ణ, బాలకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయం సాధించింది. 'తాతమ్మ కల' సినిమా తర్వాత అదే ఏడాది 'రామ్ రహీమ్' అనే మరో సినిమాతో సక్సెస్ అందుకొని 1975లో అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి అనే సినిమాలు చేశారు బాలయ్య. చైల్డ్ ఆర్టిస్టుగా ఎక్కువగా తన తండ్రితో స్క్రీన్ ష

నమ్రత శిరోద్కర్ న్యూ లుక్ వైరల్.. ఒకే ఒక్క మాటతో మహేష్ బాబు కామెంట్

Image
సూపర్ స్టార్ సతీమణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ అనేది మనందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు మహేష్ మూవీ ముచ్చట్లతో పాటు ఫ్యామిలీ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన లేటెస్ట్ లుక్ షేర్ చేసి షాకిచ్చింది నమ్రత. ఇందులో నమ్రత మునుపెప్పుడూ లేనివిధంగా డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్, ఇటీవల గోవాలో జరిగిన 'సర్కారు వారి పాట' షెడ్యూల్‌లో కూడా నమ్రత శిరోద్కర్‌ని ప్రత్యేకంగా కొన్ని ఫొటోస్ తీశారు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. ''చిన్నూ అక్క మీరంటే నాకు ఎంతో అభిమానం ఇష్టం, మీరు ఎల్లప్పుడూ బాగుండాలి, ఈ పిక్స్ నేను ఇప్పటివరకు తీసిన అద్భుతమైన పిక్స్‌లో ఇవి కొన్ని'' అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు నమ్రత కూడా ఈ ఫొటోని తన ఇన్స్‌స్టా పేజీలో షేర్ చేస్తూ ఈ ఫోటోషూట్‌లో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. ''ఆ రోజు ఏదో సరదాగా మహేష్ జాకెట్ తీసుకుని మేకప్ లేకుండా దిగిన ఈ ఫోటోలను ఇంత బాగా మీరు క్యాప్చర్ చేస్తారని ఊహించలేదు బ్రదర్'' అని ఆమె పేర్కొంది. ఈ ఫొటో

తమ టార్గెట్‌ను పూర్తి చేసుకున్న సినిమా ‘లక్ష్య’.. ఇక మిగిలింది అది ఒక్కటే..

Image
హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్రలో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. ఆర్చరీ క్రీడా ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య మాజీ ఆర్చరీ ప్లేయర్ పాత్రలో కనిపించనున్నారు. కరోనా సెకండ్ వేవ్‌కి ముందు ఈ ఏడాది జవనరిలో సినిమా షూటింగ్‌ని మళ్లీ ప్రారంభించినట్లు ప్రకటించిన చిత్ర యూనిట్. కొద్ది రోజుల తర్వాత సినిమా టీజర్‌ని కూడా విడుదల చేసింది. ఈ టీజర్‌లో నాగశౌర్య లుక్స్.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. తదితర విషయాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘’ షూటింగ్ టార్గెట్ పూర్తి చేయబడింది.. త్వరలో థియేటర్లలోకి వచ్చి మీ హృదయాలను గెలుచుకోవాలనేదే తదుపరి లక్ష్యం అంటూ చిత

టుడే ఇన్‌స్టా హిట్స్: అలా సిగ్గుపడుతూ కియారా.. క్రేజీ లుక్‌లో అదా.. అక్కడ నిలుచున్న ఆలియా

Image
సిగ్గుపడుతూ కియారా గ్లామర్ షో ‘భరత్ అను నేను’, ‘వినయ విధేయ రామా’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి . ఇక ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్‌గా సాంప్రదాయ దుస్తుల్లో సిగ్గు ఒలకబోస్తూ.. తన గ్లామర్ చూపిస్తూ కొన్ని పిక్స్ షేర్ చేసింది ఈ బ్యూటీ. మిల్క్‌షేక్ కావాలా అంటున్న సన్నీ పోర్న్‌స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్‌గా మారిన నటి . ఆమె గతం ఎలా ఉన్నప్పటికీ.. తన నటనతో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ఈ భామ. తాజాగా రంగురంగుల దస్తులు ధరించి మీకు మిల్క్‌షేక్ కావాలా..? అంటూ కొన్ని పిక్స్ షేర్ చేసింది ఈ హాట్ బ్యూటీ. క్రేజీ లుక్‌లో .. నితిన్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘హార్ట్‌ ఎటాక్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి అదా శర్మ. సినిమాలో సాఫ్ట్‌గా కనిపించిన ఈ భామ.. బయట మాత్రం చాలా వైల్డ్ అని కొంతకాలంలోనే ప్రూవ్ చేసుకుంది. మిగితా హీరోయిన్లతో పోలిస్తే ఈ భామ పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. తాజాగా ఓ విభిన్నమైన లుక్‌లో కొన్ని పిక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. అయన భుజంపై విశ్రాంతి తీసుకుంటున్న నిక్

Tollywood Drugs Case : దూకుడు పెంచిన ఈడీ.. పూరి వస్తాడా?

Image
టాలీవుడ్ విచారణను ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అధికారులు ముమ్మరం చేసేశారు. ఇందులో భాగంగా సిట్‌ అధికారి శ్రీనివాస్‌ నుంచి మరిన్ని వివరాలు సేకరించారని తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ.. టాలీవుడ్ సెలెబ్రిటీలకు నోటీసులను పంపించింది. ఇందులో భాగంగా రేపటి నుంచి దఫాల వారిగా ఒక్కొక్కరినీ ఈడీ విచారించనుంది. ఈ క్రమంలో రేపు దర్శకుడు పూరి జగన్నాథ్‌ను ప్రశ్నించనుంది. అయితే హాజరు అవుతారా? అన్నది ప్రశ్న. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉండటం లేదు. గత ఏడాది కరోనా, లాక్డౌన్ నుంచి ముంబైలోనే ఉంటున్నారు. మరి ఆయన ఈడీ నోటీసుల మేరకు రేపు విచారణకు హాజరు అవుతారా? అన్నది అనుమానమే. మామూలుగా అయితే ఆగస్టు 31న ప్రారంభమయ్యే ఈ విచారణ సెప్టెంబర్ 22వ తేదీ వరకూ కొనసాగనుంది. సినీ రంగానికి చెందిన 12మందికి ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆగస్ట్ 31న పూరి జగన్నాథ్, సెప్టెంబర్ 2న ఛార్మీ, సెప్టెంబర్ 6న రకుల్, సెప్టెంబర్ 8న రానా, సెప్టెంబర్ 9న రవితేజ, సెప్టెంబర్ 9న రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, సెప్టెంబర్ 13న నవదీప్, సెప్టెంబర్ 13న ఎఫ్ క్లబ్ జీఎం, సెప్టెంబర్ 15న ముమైత్ ఖాన్, సెప్టెంబర్ 17న తనీష్, సెప్టెంబర్ 2

అసిస్టెంట్ డైరెక్టర్‌తో ప్రేమ వ్యవహారం.. త్వరలో తల్లి కాబోతున్న నటి ఆనంది

Image
కొందరు హీరోయన్లకు తెలుగులో గుర్తింపు రాకపోవడంతో వాళ్లు ఇతర ఇండస్ట్రీల చెంతకు చేరుతారు. ఇక్కడ ఒకటి, రెండు సినిమాలు చేసి.. ఆ తర్వాత గుర్తింపు రాలేదని బయటకు వెళ్లిపోతారు. అలా టాలీవుడ్‌లో సినిమాలు చేసినప్పటికీ.. తగిన గుర్తింపు రాకపోవడంతో.. కోలీవుడ్ బాట పట్టింది నటి . తెలుగులో ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ వంటి చిత్రాల్లో నటించింది ఆనంది. అయితే ఈ సినిమాల ద్వారా ఆమెకు తగినంత గుర్తింపు రాలేదు. దీంతో కోలీవుడ్‌కి వెళ్లిపోయింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ పలు సినిమాలు చేస్తూ.. తన గ్లామర్‌తో ప్రేక్షకులను అలరించింది. అక్కడ ఆమె చేసిన సినిమాలు మంచి హిట్లు కావడంతో ఈ భామకు కూడా కావాల్సిన సక్సెస్ లభించింది. ఇక ఆనందికి తమిళంలో క్రేజ్ పెరిగిపోవడంతో మరోసారి తెలుగు దర్శకుల చూపు ఆమెపై పడింది. దీంతో యువ హీరో తేజా నటించిన ‘జాంబీ రెడ్డి’ సినిమాతో ఆమెను మళ్లీ తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇక రీసెంట్‌గా సుధీర్‌‌బాబు హీరోగా.. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘’ అనే సినిమాలో ఆమె నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంది సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమా

Bheemla Nayak First Single : రచ్చ మొదలయ్యేది ఆరోజే!

Image
పవర్ స్టార్ అభిమానులు ఇప్పుడు అసలైన పండుగను సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డేను గ్రాండ్ లెవెల్‌లో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక సినిమా అప్డేట్లతో సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోయేలా ఉంది. అసలే భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు అప్డేట్లు రెడీగా ఉన్నాయి. ఇక హరీష్ శంకర్ మూవీ అప్డేట్ కూడా రాబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఆ విషయం కాసేపు పక్కన బెడితే తాజాగా ఓ అప్డేట్ వచ్చేసింది. నుంచి చిత్రయూనిట్ అదిరిపోయే వార్త ఒకటి చెప్పేసింది. ఇప్పటికే వదిలిన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ ఫీవర్ ఇంకా వదల్లేదు. గల గల భీమ్లా అంటూ జనాల చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉంది. అలా తమన్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. అప్పటి నుంచి భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ గురించి అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 2న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందన్న సంగతిని తమన్ ఇది వరకే రివీల్ చేసేశారు. కానీ తాజాగా ఆ ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు. ఏ సమయానికి పాట రాబోతోందనే తాజాగా ప్రకటించారు. సెప్టెంబర్ 2న ఉదయం పదకొండు గంటల 16 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ రాబోతోందని ప్రకటించారు.

Taapsee Pannu: Annabelle Sethupathi : పాత కథల్నే తిప్ప తిప్పి చెబుతున్నారు!

Image
నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దక్షిణాదిలో విజయ్ సేతుపతి హవా ఇప్పుడు ఓ రేంజ్‌లో ఉంది. ఇక అదే సమయంలో క్రేజ్ దేశ వ్యాప్తంగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తాప్సీ కేరాఫ్ అడ్రస్‌గా మారారు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. హిందీ, తమిళ,తెలుగు, కన్నడ,మళయాలీ భాషల్లో అనే చిత్రం రాబోతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను అన్ని భాషల్లో ఒకే సారి విడుదల చేశారు. కరోనా, లాక్డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ మూవీ షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్దంగా ఉంది. నేరుగా ఓటీటీలోనే ఈ మూవీ సెప్టెంబర్ 17న రాబోతోందట. డిస్నీ హాట్ స్టార్‌లో ఈ మూవీ విడుదల కాబోతోన్నట్టు ప్రకటించారు. ఇక ఇందులో అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులున్నారు. రాజేంద్ర ప్రసాద్, సురేఖా వాణి, రాధిక, యోగి బాబు ఇలా తెర అంతా నిండుగానే కనిపిస్తోంది. 1948లోని ఓ రాజమహల్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. చంద్రముఖి, ఆనందో బ్రహ్మ వంటి సినిమాలను కలిసి కొట్టేసినట్టుగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ట్రైలర్‌ చివర్లో ఓ డైలాగ్ పెట్టేశారు. కొత్త కథలు చెప్పకు అని తాప్సీ అనడం.. దానికి రివర్స్ కౌంటర్‌ ఇస్తూ యోగిబాబ

Bhanumathi Reddy కోసం వచ్చిన ఎంపీ భరత్.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్

Image
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ప్రజలతో ఆయన మమేకయ్యే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. సినీ పరిచయం ఉన్న తాజాగా ఓ చిన్న చిత్రం కోసం కదిలివచ్చారు. బాలు, అప్స‌ర హీరో , హీరోయిన్లుగా స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో డైమండ్ హౌస్ బ్యాన‌ర్‌పై రామ్‌ప్ర‌సాద్ రెడ్డి వ‌ట్ర‌పు నిర్మిస్తోన్న చిత్రం ‘భానుమ‌తి రెడ్డి’. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఎం.భ‌ర‌త్ రామ్ విడుద‌ల చేశారు. గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ప్రేమ‌క‌థా చిత్రానికి ఎంపీ సాయమందించారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఎంపీ భరత్ విడుదల చేస్తూ.. పెద్ద స‌క్సెస్ కావాల‌ని, న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కు మంచి పేరు రావాల‌ని, నిర్మాత రామ్ ప్ర‌సాద్ రెడ్డికి సినిమా అన్ని ర‌కాలుగా పెద్ద స‌క్సెస్ కావాల‌ని అభినంద‌న‌లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ద‌ర్శ‌కుడు స‌త్య మాట్లాడుతూ.. భానుమ‌తి రెడ్డి అనే సినిమా గ్రామీణ నేప‌థ్యంలో రూపొందుతోన్న ల‌వ్‌స్టోరి. ఫైన‌ల్ స్టేజ్ షూటింగ్‌కు చేరుకున్నాం. సినిమా అనుకున్న‌ట్లు బాగా వస్తోంది. రాజ‌మండ్రి ఎం.పి భ‌ర‌త్ రామ్‌గారు మా సినిమా ఫ‌స్ట్ లుక్‌ను వి

హైదరాబాద్ వీధుల్లో ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ.. నడి రోడ్డుపై ఆమెతో కలిసి రచ్చ రచ్చ

Image
‘బాహుబలి’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న మరో భారీ పాన్ ఇండియా చిత్రం ‘’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ హీరోలుగా నటిస్తున్నారు. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వ్యాప్తి కారణంగా రెండు సార్లు వాయిదాపడటం.. ఈ క్రమంలో సినిమా విడుదల కూడా వాయిపడటం అభిమానులను నిరాశపరిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ సజావుగా జరిగిన పూర్తి అయింది. ఒక రెండు పికప్ షాట్లు మినహా మిగితా సినిమా అంతా పూర్తి అయింది అని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తికావడంతో చిత్ర నటీనటులు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ నటి హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్‌కు ఆమె జోడీగా కనపించనుంది. ఈ సినిమాలో ఆమె బ్రిటీష్ యువరాణి పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. ఇ

Pawan Kalyan ఫామ్ హౌస్‌కి వెళ్లే లక్కీ ఛాన్స్ నాకు దక్కింది.. నా ఫస్ట్ క్రష్.. ఆ కళ్లు చూస్తే: మిర్చి ఆర్జే భార్గవి

Image
రేడియో మిర్చి శ్రోతలందరికీ పరిచయమే. అనేక మంది సెలబ్రిటీలు.. రాజకీయ ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసి.. సుమారు 4000 వేలకు పైగా ఇంటర్వ్యూలతో ఆర్జే భార్గవి పాపులర్ అయ్యారు. అయితే తన ఫస్ట్ క్రష్ అంటూ ఓపెన్ అయిన భార్గవి.. పవన్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. భార్గవి మాట్లాడుతూ.. ‘‘నా ఫస్ట్ క్రష్.. ఎవరంటే ఆయన ఆరడుగుల బుల్లెట్.. పవన్ కళ్యాణ్ నా ఫస్ట్ క్రష్.. ఖుషీ సినిమా దగ్గర నుంచి ఆయన స్టైల్.. డైలాగ్స్.. ముఖ్యంగా ఆయన కళ్లు చూస్తే ఆహా!! పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి లైఫ్‌లో ఉంటే ఎంత బావుండు అనిపిస్తుంది. ఆయన్ని చూస్తుంటే ఈరోజుకి కూడా చాలా థ్రిల్‌‌గా ఉంటుంది. వకీల్ సాబ్ చూస్తుంటే కళ్లలో నీళ్లు వచ్చాయి. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి.. ఫస్ట్ క్రష్ పవన్ కళ్యాణ్. నేను చాలామందితో ఇంటర్వ్యూలు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న సింప్లిసిటీ అంటే నాకు చాలా ఇష్టం. అజ్ఞాతవాసి సినిమా టైంలో.. త్రివిక్రమ్ గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ రావడం.. పవన్ కళ్యాణ్‌గారిని ఇంటర్వ్యూ చేయాలని చెప్పడం.. ఇది నిజమా కలా అని నన్ను నేను గిల్లుకుని చూసుకున్నా.. రాత్రి మొత్తం మోల్కొని.. ఆయన ఫామ్ హౌస్‌కి వెళ్లే లక్కీ ఛాన్స్ నాకు దక్కింది.

సాయి బాబా విగ్రహం నుంచి విబూది!.. ఇంట్లో జరిగిన అద్భుతంపై హిమజ

Image
విగ్రహం పాలు తాగిందని, విగ్రహం నుంచి నీళ్లు కారుతున్నాయని, సాయి బాబా చిత్రపటం నుంచి విబూది రాలుతోందని, విగ్రహం నుంచి విబూది రాలుతుందనే వార్తలు అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. వీటిని కొంత మంది నమ్ముతారు. ఇంకొంత మంది నమ్మరు. దేవుడిపై నమ్మకం ఉన్న వారు అలాంటి విషయాలను ఎక్కువగా నమ్ముతుంటారు. అయితే తాజాగా బిగ్ బాస్ ఫేమ్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో తన ఇంట్లో జరిగిన ఓ అద్భుతం గురించి చెప్పుకొచ్చారు. ఇది తాను ఎవ్వరినో నమ్మించాలనే ఉద్దేశ్యంతో చేయడం లేదని, తన ఫీలింగ్‌ను చెప్పుకునేందుకు మాత్రమే వీడియో చేస్తున్నానని హిమజ తెలిపారు. హిమజ ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్ మీద శ్రద్ద పెట్టినట్టు కనిపిస్తోంది. ఓ వైపు బుల్లితెరపై షోలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. మరో వైపు భారీ ప్రాజెక్ట్‌లో చాన్సులు కొట్టేస్తున్నారు. హరిహర వీరమల్లు, వరుడు కావలెను వంటి చిత్రాల్లో హిమజ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇలా ఎంత బిజీగా ఉన్నా కూడా యూట్యూబ్‌లో నిత్యం వెరైటీ వీడియోలను పెడుతూనే ఉంటారు. తాజాగా హిమజ తన ఇంట్లో జరిగిన అద్భుతం గురించి చెప్పారు. తమ ఇంట్లో సాయి బాబా విగ్రహం ఉందని, తానే చిన్నప్పుడు దాన్ని ఎంతో అందంగా డిజైన్ చేశానని హిమజ

Super Star Krishna : Mahesh Babu విషయంలో ఆమె పాత్ర అంతే!.. నమ్రతపై సూపర్ స్టార్ కృష్ణ

Image
వ్యవహారాలన్నీ కూడా దగ్గరుండి మరీ చూసుకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు వ్యాపార ప్రకటనలు, ఇతర బిజినెస్‌లు, రెమ్యూనరేషన్ విషయాలు, జీఎంబీ వ్యవహారాలు అన్నీ కూడా నమత్రే చూసుకుంటుందనే టాక్ వినిపిస్తూ ఉంటుంది. మహేష్ బాబు తన సినీ కెరీర్ మీద ఫోకస్ పెడితే.. నమ్రత మాత్రం ఆర్థిక వ్యవహారాలను చక్కబెడుతూ ఉంటుందనే అందరూ అనుకునే వారు. కానీ తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చారు. తన కొడుకు, కోడలి సంసారం గురించి కృష్ణ మాట్లాడారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. రమేష్ బాబు, మహేష్ బాబు సినీ కెరీర్‌లు, నమత్ర విషయాలపై స్పందించారు. మధ్యలో కొన్ని బ్యాడ్ సబ్జెక్ట్‌లు పడటం, సినిమాలు ఆడకపోవడంతో రమేష్ బాబుకు పూర్తిగా ఆసక్తిపోయిందని, అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాడని కృష్ణ తెలిపారు. అందుకే హీరోగా కాకుండా.. నిర్మాతగా మారిపోయారని తెలిపారు. మహేష్ బాబు వ్యవహారాలన్నీ కూడా నమ్రత చూసుకుంటారని అంతా అంటారు కదా? అని కృష్ణను అడిగితే.. అందరూ ఆశ్చర్యపోయే సమాధానం చెప్పారు. అలాంటిదేమీ లేదు.. నమ్రత ఎప్పుడూ ఇల్లాలి పని మాత్రమే చేస్తారన్నట్టుగా చెప్పుకొచ్చారు.

మాజీ ప్రియుడిపై అంత పగా?.. తమన్నాతో చెప్పి మంత్రం వేయిస్తోన్న శ్రీముఖి!

Image
బుల్లితెరపై, వెండితెరపై తనకంటూ ఓ గుర్తింపును ఏర్పర్చుకున్నారు. మరీ ముఖ్యంగా స్మాల్ స్క్రీన్ మీద శ్రీముఖికి ఉన్న ఫాలోయింగ్ వేరే లెవెల్. బుల్లితెర రాములమ్మగా శ్రీముఖి క్రేజ్ మామూల్ది కాదు. అయితే బిగ్ బాస్ షోతో శ్రీముఖి క్రేజ్ కాస్త తగ్గినట్టు అయింది. ఆమె కోరి తెచ్చుకున్న నెగెటివిటీతో చివరకు బిగ్ బాస్ విజేతగా కానివ్వలేదు. అలా మూడో సీజన్ రన్నర్‌గానే శ్రీముఖి మిగిలిపోయారు. బిగ్ బాస్ షో కంటే ముందుగా శ్రీముఖి బుల్లితెరపై ఫుల్ బిజీగా ఉండేవారు. కానీ షో ముగిసి బయటకు వచ్చాక శ్రీముఖికి అంతగా ఆఫర్లు రాలేదు. బుల్లితెరపై శ్రీముఖి హవా మధ్యలో కాస్త తగ్గింది. స్టార్ట్ మ్యూజిక్ అంటూ చేసిన ఓ షో అట్టర్ ఫ్లాప్ అయింది. మధ్యలో కొన్ని రోజులు ఎలాంటి షోలు కూడా శ్రీముఖి చేయలేదు. ఇక వెండితెరపైనా శ్రీముఖికి అంతగా అవకాశాలేవీ రాలేదు. కానీ ఈ మధ్యే క్రేజీ అంకుల్స్ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా దారుణంగా బెడిసికొట్టేసింది. అలాంటి బీ గ్రేడ్, నాసిరకం సినిమాలో శ్రీముఖి నటించడంతో ఆమె అభిమానులు సైతం హర్ట్ అయ్యారు. అలా మరోసారి వెండితెరపై తన ప్రయత్నం బెడిసికొట్టేసింది. హీరోయిన్‌గా సక్సెస్ అవుదామని చూసిన శ్రీముఖికి చే

పీనియర్ హీరో విజయ్‌కి తీవ్ర అనారోగ్యం.. ఆందోళనలో అభిమానులు.. అమెరికాలో చికిత్స

Image
డిఫెరెంట్ స్టైల్‌లో సినిమాలు తీయడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. ఆయన సినిమాలు అంటేనే అందులో కావాల్సినంత వినోదం ఉంటుంది. ఆయనే తమిళ హీరో విజయకాంత్. సినిమాల్లోనే కాదు ఆయన బయట కూడా విభిన్నంగానే ఉంటారు. ఆయన మాట్లాడే మాటలు, చేతలు ఎన్నో వివాదాలకు దారి తీస్తాయి. అయినప్పటికీ.. తన తీరు మార్చుకోకుండా ముందుకు వెళ్తురు విజయకాంత్. తమిళంతో పాటు పలు డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఇక రాజకీయాల విషయానికి వస్తే.. ఆయన తమిళనాడు డీఎండీకే పార్టీ తరపున శాసనసభలో 2011 నుండి 2016 వరకు ప్రతిపక్ష నాయకునిగా భాద్యతలను చేపట్టారు. అయితే ప్రస్తుతం ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గత ఏడాది విజయకాంత్ కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే ఆ తర్వాత ఐసోలేషన్‌లో ఉన్న ఆయన.. త్వరగానే కోలుకున్నారు. తాజాగా మరోసారి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనకు తొలుత చెన్నైలోనే చికిత్స అందించారు. కానీ, ఇక్కడి వైద్య సౌకర్యాలు ఆయనకు వైద్యం ఇచ్చేందుకు సరిపోలేదు. దీంతో ఆయన్ను దుబాయ్‌కి తరలించారు. అక్కడి వైద్యలు ఆయనకు చికిత్స అందించారు. అయితే అంతా మెరుగు పడుతుంది అనుకుంటున్న సమయంలో మరోసారి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంత

చివరి క్షణం వరకు చేస్తూనే ఉంటాను.. సుడిగాలి సుధీర్ కామెంట్స్

Image
సుడిగాలి బుల్లితెర, వెండితెరపై చేసే అల్లరి అందరికీ తెలిసిందే. నటుడిగా, మెజిషీయన్, సింగర్, డ్యాన్సర్స, యాక్షన్ ఇలా అన్నింట్లోనూ సుధీర్ తనకు తాను సాటి అని నిరూపించుకున్నారు. అలాంటి సుధీర్ వెండితెరపై హీరోగానూ సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెండు సినిమాలతో సుధీర్ హీరోగా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ అంటూ సుధీర్ సిల్వర్ స్క్రీన్ మీద రచ్చ చేశారు. అయితే బుల్లితెరపై సక్సెస్ అయినట్టుగా వెండితెరపై తన మ్యాజిక్‌ను చూపించలేకపోయారు సుధీర్. కానీ ఎలాగైనా సరే వెండితెరపై హీరోగా తన స్టామినాను నిరూపించుకునేందుకు సుధీర్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాలింగ్ సహస్ర అనే ఓ సినిమాను చేస్తున్నారు. లాక్డౌన్, కరోనా వల్ల ఆ చిత్రం వాయిదా పడుతూనే వస్తోంది. ఇక గాలోడు అనే మరో సినిమాలోనూ సుధీర్ నటిస్తున్నారు. అలా మొత్తానికి బిగ్ స్క్రీన్ మీద సుధీర్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలా అని బుల్లితెరను నిర్లక్ష్యం ఏమీ చేయడం లేదు. ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటూ ప్రతీ రోజూ ఎంటర్టైన్ చేస్తూనే వస్తున్నారు. ఇక స్పెషల్ ఈవెంట్లు, పండుగ ప్రో

Vijayashantiని అందుకే తొక్కేశారు.. ఆమెను ‘మా’ బ్యాన్ చేసింది : సీవీఎల్ నరసింహారావు

Image
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. మా అధ్యక్ష పీఠానికి పోటీ పడే వారి సంఖ్య ఎంతకు చేరిందో అందరికీ తెలిసిందే. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్, సీవీఎల్ నరసింహారావులు అధ్యక్ష బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించేశారు. వీరిలో ప్రకాష్ రాజ్ అందరికంటే ముందున్నారు. ప్రకాష్ రాజ్ తన ప్యానల్‌ను ప్రకటించేశారు. ఇక మంచు విష్ణు అయితే మా బిల్డింగ్ తానే కట్టేస్తానంటూ వీడియోలు కూడా వదులుతున్నారు. నరేష్ మీద, ‘మా’ మీద ఆరోపణలు చేసిందని హేమకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చేశారు. తెలంగాణ నుంచి మా సంస్థకు అధ్యక్షుడు కావాలని సీవీఎల్ నరసింహారావు తన గొంతును లేవనెత్తారు. సినిమా పరిశ్రమంలో తెలంగాణ వాదాన్ని రగిల్చేందుకు సీవీఎల్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా సీవీఎల్ ఓ ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో జరుగుతున్న అన్యాయాలు, మా ఎన్నికల వ్యవహారాలపై నోరు విప్పారు. విభజన చట్టం గురించి చెబుతూ.. ఎన్నో విషయాలను బయటపెట్టేశారు. చిత్రపురి కాలనీలో జరిగిన అన్యాయాలు, అక్రమాల గురించి సీవీఎల్ మాట్లాడారు. పద్మాలయ, రాఘవేంద్ర రావు స్టూడియోల్లోనూ తెలంగాణకు భాగస్వామ్యం ఉందని అన్నారు. సినిమా అభివృద్ది

అది చేయాలి అంటూ అసభ్య సందేశాలు.. నటికి ఫేక్ దర్శకుడి నుంచి తిప్పలు

Image
వాడకం పెరిగిపోయిన తర్వాత ఎన్ని ప్రయోజనాలు జరుగుతున్నాయో.. అన్ని నష్టాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సోషల్‌మీడియా వల్ల ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. ప్రధానంగా సోషల్‌మీడియా ద్వారా వేధించడం.. ఫేక్ ఫోటోలు సృష్టించడం.. వంటి ఎన్నో దరిద్రపు అనుభవాలను ఎదురుకుంటున్నారు అమ్మాయిలు. తాజాగా ఓ నటికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తాను డైరెక్టర్‌ని అంటూ నటి పాయల్ సర్కార్‌కు అసభ్య మెసెజ్‌లు పంపించాడు ఓ వ్యక్తి. బెంగాల్‌లో పుట్టిన డజనుకుపైగా సినిమాల్లో నటించింది. అయితే సినిమాల్లోనే కాక.. రాజకీయాల్లోనే ఆమె తన సత్తా చాటింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది. ఇక దీంతో పాటు ఆమె పలు టీవీషోలలో కూడా ఆమె ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. అయితే తాజాగా ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమాలో ప్రధాన పాత్ర ఇస్తాను అంటూ.. తాను సీనియర్ దర్శకుడిని అంటూ ఓ వ్యక్తి ఆమెని దారుణంగా మోసం చేశాడు. అంతేకాక.. ఆమె అసభ్యంగా సందేశాలు పంపించాడు. దీంతో ఆమె వెంటనే ముందడుగు వేసింది. ఆ మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. అతని ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అతను రవి కినాగి అంటూ ఫోటోలు క

Maestro: నితిన్ 'మాస్ట్రో' నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్.. కృష్ణాష్టమి స్పెషల్ గిఫ్ట్

Image
ఈ ఏడాది వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన యంగ్ హీరో ఇటీవలే 'చెక్' సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకొని ఆ వెంటనే 'రంగ్ దే' మూవీతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు 'మ్యాస్ట్రో' అంటూ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూపర్ హిట్ మూవీ ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌‌గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. , హీరోయిన్లుగా నటిస్తున్నారు. నితిన్ సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో నితిన్ అంధుడిగా కనిపించనుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసిన చిత్రయూనిట్.. ఓటీటీ వేదిక హాట్ స్టార్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా కృష్ణాష్టమి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. '' స్నీక్ పీక్‌ అంటూ నితిన్‌ ఇంట్రెస్టింగ్ వీడియో వదిలారు. నితిన్ కెరీర్

‘అందుకోసం ఎంతో కష్టపడాలి’.. షర్ట్ తీసేసి స్టంట్ చేసిన సుధీర్ బాబు

Image
డైనమిక్ హీరో హీరోగా.. ‘పలాస 1978’ ఫేమ్ క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా ‘’. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం మంచి టాక్‌తో రన్‌ అవుతోంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు పాజిటివ్ రివ్యూనే ఇస్తున్నారు. సినిమాలో యాక్షన్‌తో పాటు సెంటిమెంట్‌ కూడా అదిరిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ హీరో నరేష్ ప్రధాన పాత్ర పోషించారు. ఓ విషాదమైన ప్రేమగాథ అయినప్పటికీ.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా.. ప్రేక్షకులను అలరిస్తోంది. కలం, మలం అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా రూపొందింది. అయితే ఈ సినిమా కోసం హీరో మాత్రం చాలా కష్టపడ్డారు. తన ఇమేజ్‌ని పక్కన పెట్టిన ఆయన ఎన్నె ఫీట్లు చేశారు. తాజా ఈ సినిమాలో తన షర్ట్ విప్పేసి.. ఫైటింగ్ స్టంట్స్ చేస్తూ ఓ వీడియోని సుధీర్‌బాబు ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమా విషయానికొస్తే.. ఆనంది ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ‘శ్రీదేవి సోడా సెంటర్’. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం మంచి టాక్‌తో రన్‌ అవుతోంది. సినిమా చూస

Prabhas: కృష్ణాష్టమి స్పెషల్ ట్రీట్.. 'రాధే శ్యామ్' నుంచి సర్‌ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్

Image
యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ''. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో వరల్డ్ వైడ్ ప్రభాస్ అభిమానుల్లో ఆతృత నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా స్పెషల్ ట్రీట్ ఇస్తూ 'రాధే శ్యామ్' నుంచి మరో సర్‌ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్నఈ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్యగా, డాక్టర్‌ ప్రేరణగా నటిస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరి స్టిల్ రిలీజ్ చేస్తూ సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌ని తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ప్రభాస్.. తన అభిమానులకు, ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో హీరోహీరోయిన్లు ప్రభాస్, పూజా హెగ్డేల లుక్ ఎంతో అట్రాక్ట్ చేస్తుండటంతో నెట్టింట వైరల్ అవుతోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల చేయబోతున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల స

అషు రెడ్డితో మాట్లాడింది సె** గురించే.. ఎట్టకేలకు ఆర్జీవీ ఓపెన్! మరో హాట్ యాంగిల్‌తో రచ్చ

Image
మనసులో ఎలాంటి దాపరికం అనేది లేకుండా ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం రామ్ గోపాల్ వర్మది. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో వర్మ రూటే సపరేటు. నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ అలజడి రేపే ఆయన రీసెంట్‌గా ఇయన సుల్తానా, జ్యోతిలతో చేసిన రచ్చ అంతాఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు తెగ హల్చల్ చేస్తుండగానే.. మరోవైపు బిగ్ బాస్ బ్యూటీ హాట్ యాంగిల్స్ పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు వర్మ. కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నారో కూడా ఎవ్వరికీ అర్థం కాకుండా మాట్లాడే .. రీసెంట్‌గా అషు రెడ్డి హాట్ యాంగిల్స్ పోస్ట్ చేస్తూ బుకాయించారు. ఈ ఫొటోలో ఉంది అషు రెడ్డి కాదని అంటూనే వైరల్ చేసే ప్రయత్నం చేశారు. ఎలా వెళ్ళామన్నది కాదు ముఖ్యం ఎంతమంది అట్రాక్ట్ అయ్యారు అన్నదే ముఖ్యం అన్నట్లుగా వర్మ దూసుకెళ్తున్నట్లు ఆయన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు చూస్తుంటే అర్థమవుతోంది. ఎలాగైతేనేం కావాల్సినంత ప్రమోషన్ అయితే దక్కిందని అనుకున్నారో ఏమో రీసెంట్‌గా పోస్ట్ చేసిన అషు రెడ్డి హాట్ యాంగిల్స్ విషయంలో ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు వర్మ. అరియానాలాగా అషుతో ఇంటర్వ్యూ చేయడం లేదని, అసలు ఈ వీడియో ఏమిటో తనకు అర్థం కావడం లేదు అన్నట్లుగా మాట్ల

Chiranjeevi: దిగ్గజ క్రికెటర్‌తో చిరు దంపతుల మీట్.. ఇది చాలా స్పెషల్ అంటూ మెగాస్టార్ మెసేజ్

Image
టాలీవుడ్ సీనియర్ హీరో, మెగాస్టార్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ మధ్యే సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్ షేర్ చేస్తూ మెగా అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా గ్యాప్ తర్వాత తన పాత మిత్రుడిని కలిశానని తెలుపుతూ చిరంజీవి పెట్టిన పోస్ట్ ఆన్ లైన్ వేదికలపై హంగామా చేస్తోంది. భారత దేశ కీర్తి పతాకం ప్రపంచ దేశాలు చూసేలా తొలి క్రికెట్ వరల్డ్ కప్ అందించిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‌తో చిరంజీవికి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అయితే రీసెంట్‌గా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన ఓ వేడుకకు చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి హాజరు కాగా.. అదే వేడుకకు వచ్చిన కపిల్ దేవ్‌ని చూస చిరు ఒక్కసారిగా సంతోషంతో ఉప్పొంగిపోయారు. చిరంజీవి, ఆయన భార్య సురేఖ కలిసి కాసేపు కపిల్ దేవ్‌తో సరదాగా ముచ్చటించారు. ఈ ఫోటోలకు ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన చిరంజీవి.. ''చాలా రోజుల తర్వాత పాత మిత్రుడు కపిల్‌దేవ్‌ను కలవడం ఆనందంగా ఉంది. ఇందుకు ఫలక్‌నుమా ప్యాలెస్‌ మరింత శోభనిచ్చింది. ఎన్నో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గతంలోకి వెళ్లి వచ్చాము. దేశానికి మొట్టమొదటి ప్రపంచకప్ అందించ

40 ఏళ్ల క్రింద ఈ అమ్మాయి దొరికితే! ఖచ్చితంగా అదే చేసేవాడిని.. పబ్లిక్‌గా హీరోయిన్‌పై ఆర్జీవీ కామెంట్స్

Image
సంచలనాలకు మారు పేరు అని చెప్పుకోవచ్చు. ఆయన నోటివెంట ఎప్పుడు ఎలాంటి పదాలు వస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. తనదైన స్టైల్‌లో లాజిక్స్ మాట్లాడుతూ హీరోయిన్ల అందాలపై కామెంట్స్ చేయడంతో దిట్ట వర్మ. ఈ క్రమంలోనే పబ్లిక్‌గా ఓ వేదికపై తాజాగా యంగ్ హీరోయిన్ మేఘ ఆకాష్‌పై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మేఘ ఆకాష్‌, అరుణ్‌ అదిత్‌, అర్జున్‌ సోమయాజుల లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన కొత్త సినిమా ‘’. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అర్జున్‌ దాస్యన్‌ నిర్మాతగా వ్యవహరించారు. సెప్టెంబర్‌ 3న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రామ్ గోపాల్ వర్మ.. చిత్ర యూనిట్‌పై, ముఖ్యంగా హీరోయిన్ మేఘ ఆకాష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం నాకు ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే నేనిప్పుడు ఇలా ఉండేవాడిని కాదేమో.. నాకు డివోర్స్ అయి ఉండేవి కావేమో అంటూ ఆర్జీవీ చేసిన కామెంట్‌తో అంతా ఆశ్చర్యపోయారు. అంతటితో ఆగని వర్మ.. మేఘ చాలా స్వీట్‌గా ఉంటుందని, తనని కలిసిన వారికి డయాబెటిస్‌ కూడా వస్తుందంటూ తనదైన కోణంలో రి

Pawan Kalyan: పవర్‌స్టార్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి గ్రాండ్ ట్రీట్.. అప్‌డేట్ల సునామీనే

Image
ఆయన పేరు చెబితేనే అభిమానులు ఊగిపోతారు. ఆయన సినిమా విడుదల అయిందంటే చాలా ఆ థియేటర్‌ను పెళ్లికూతురిలా మస్తాబు చేశారు. కటౌట్లు.. దానికి పాలాభిషేకాలు చేస్తూ.. టపాసులు కాలుస్తూ నానా హంగామా సృష్టిస్తారు. ఇక ఆయన పుట్టినరోజు వచ్చిందంటే.. వాళ్లు చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఆయన పేరులో ఉన్న పవరే వేరు.. ఆయనే పవర్‌స్టార్‌స్టార్ సినిమాలు చేసినా.. రాజకీయాలు చేసినా.. ఆయనకు ఆయనే సాటి. ఆయన స్టైలే వేరు. ఈ మధ్యే పవన్ వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చారు. మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పవర్‌స్టార్ పవనకళ్యాణ్ లేటెస్ట్‌గా వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించిన.. ‘పింక్’ సినిమా రీమేక్‌గా రూపొందిన వకీల్‌సాబ్‌ సినిమాతో ఆయన మళ్లీ వెండితెరపై కనిపించారు. ఈ సినిమాలో పవన్‌ ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించడమే కాక.. బాక్సాఫీస్ వద్ద మరోసారి తన స్టామినాని నిరూపించుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్‌గా రూపొందుతున్న ‘భీమ్లా నాయక్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 2వ తేదీన పవర్‌స్టార్ పుట్టినరోజు రానుం

ముస్లింలా మారిపోయిన సునీల్.. సీరియస్‌ లుక్‌లో హల్‌చల్ చేస్తున్న పోస్టర్

Image
నవ్వించడం ఒక యోగం అనే మాట మనందరికీ తెలిసిందే. ఆ మాటను అక్షరాల నిజం చేశారు నటుడు . ఈ జనరేషన్‌ తెలుగు కమెడియన్లలో ‘హస్యబ్రహ్మ’ బ్రహ్మానందం తర్వాత తెలుగు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వించే హాస్యం పడింది.. మంచి గుర్తింపు సాధించారు ఆయన. ఆయనే సునీల్. తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆయన.. ఆ తర్వాత హీరోగా మారిపోయారు. అయితే హీరోగా ఆయనకు అంతగా కలిసి రాలేదు. బొద్దుగా ఉండే సునీల్.. ఏకంగా సిక్స్‌ ప్యాక్ చేసినా.. ప్రేక్షకులు ఆదరించలేదు. దీంతో మళ్లీ కమెడియన్‌గా మారిపోయారు సునీల్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత’ సినిమాతో కమెడియన్‌గా మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత విలన్‌గా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘డిస్కో రాజా’, ‘కలర్ ఫోటో’ వంటి సినిమాల్లో విలన్ పాత్రలో అద్భుతమైన ప్రదర్శన చేశారు సునీల్. దీంతో పాటు ఆయన పలు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న సినిమాల్లో ఒకటి.. ‘’. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. ఈ సినిమాలో చాందినీ అయ్యంగార్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా ఈ సినిమా నుంచి సునీల్ ఫస్ట్‌లుక్‌న

‘అతను చాలా కూల్‌గా ఉండే వ్యక్తి’.. నాగార్జునకు తన స్టైల్‌లో విషెస్ చెప్పిన మెగాస్టార్

Image
అందానికి కేరాఫ్ అడ్రస్ ఆయన.. ‘మన్మథుడు’ అనే పదానికి రూపం వస్తే అది ఆయన. ఆయనే ‘కింగ్’ వయస్సు పెరుగుతున్నా.. మరింత హ్యాండ్‌సమ్‌గా మారిపోతూ.. ప్రేక్షకుల మనస్సు దోచుకుంటున్నారు నాగార్జున. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చూస్తారు అభిమానులు. ఎందుకంటే అందులో కచ్చితంగా కావాల్సినంత వినోదం ఉంటుంది. ఇక ఆయన పుట్టినరోజు వచ్చింది అంటే అభిమానులు చేసే సందడి మామూలుగా ఉండదు. టపాసులు కాలుస్తూ.. కేకులు కట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తారు. కాగా, ఆదివారం నాగార్జున తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున విషెస్ తెలుపుతున్నారు అభిమానులు. ఫ్యాన్స్‌తో పాటు.. తోటి కళాకారులు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగాస్టార్ కూడా నాగార్జునకు తనదైన స్టైల్‌లో శుభాకాంక్షలు చెప్పారు. ‘ఆయన జీవితంలో వచ్చే ప్రతీ క్షణం ఎంతో ప్రశాంతంగా ఉండే మనిషి. హద్దులు లేకుండా నటనలో తరచూ ప్రయోగాలు చేస్తుంటాడు. అంతకంటే మించి.. ఎంతోకాలంగా నాకు ఎప్పటికీ ప్రియమైన మిత్రుడు నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ చిరు ట్వీట్ చేశారు. ఇక నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘బంగార్రాజు’ సినిమా పోస్ట

HBD Nagarjuna : పొలం కొనమని చెబితే అలా అన్నారు.. నాగార్జునపై బండ్ల గణేష్ కామెంట్

Image
టాలీవుడ్ కింగ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోయింది. నాగ్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్‌లో టాలీవుడ్ సెలెబ్రిటీలు సందడి చేశారు. ఈ మధ్య ట్విట్టర్ స్పేస్ అంటూ స్టార్‌ల బర్త్ డేలకు సెలెబ్రిటీలు ముచ్చట్లు పెడుతున్నారు. తమకు ఆ హీరోతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తాజాగా నాగార్జున బర్త్ డే సందర్భంగా కోన వెంకట్, బీవీఎస్ రవి, , చందూ మొండేటి, బ్రహ్మాజీ వంటివారు ముచ్చట్లు పెట్టారు. తమకు నాగార్జునతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. తాను నాగార్జునకు వీరాభిమానిని అని, ప్రతీ సినిమా గురించి పూసగుచ్చినట్టు వివరించారు బీవీఎస్ రవి. ఎప్పుడూ కూడా నాగార్జున చుట్టూ నెగెటివిటీ అనేది ఉండనే ఉండదు.. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటూనే ఉంటారు అని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. ఇక బండ్ల గణేష్ లైన్‌లోకి వచ్చారు. నాగార్జునతో ఉన్న అనుబంధం గురించి బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. డాన్ సినిమా సందర్భంలో ఓ సారి నాగార్జున గారిని పొలం కొనమని, షాద్ నగర్‌లో రేట్లు బాగున్నాయని బండ్ల గణేష్ సలహా ఇచ్చారట. అయితే దానికి నాగార్జున ఇచ్చిన సమాధానం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నాకు ఇప్పుడు 40 ఏళ్లు దాటాయ్.. ఇక వాటిన

‘వరుడు కావలెను’ అంటూ వచ్చేది ఆ రోజే.. లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్..

Image
విభిన్నమైన సినిమాలు చేయడంలో యంగ్ హీరో ఎప్పుడూ ముందుంటారు. ఒక సినిమాకు, మరో సినిమాకు కచ్చితమైన భిన్నత్వాన్ని ఆయన చూపిస్తూ ఉంటారు. అలా వినోదం మాత్రమే కాదు.. మంచి సందేశం ఉన్న సినిమాలు చేస్తుంటారు నాగశౌర్య. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలు ‘లక్ష్య’, ‘వరుడు కావలెను’. లక్ష్య స్పోర్ట్స్ డ్రామా కాగా.. ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. లక్ష్యలో ఆయన మాజీ ఆర్చరీ ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఇక వరుడు కావలెను సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ విడుదల అయింది. మొన్నటి వరకు వరుడు కావలెను సినిమా ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైంది. ‘దిగు దిగు నాగ’ అంటూ వదిలిన ఈ సాంగ్ కాంట్రవర్సీగా మారింది. భక్తి గీతాన్ని తీసుకొచ్చి ఇలా ఐటం పాటగా మార్చడంపై నెటిజన్లు భగ్గుమన్నారు. రాసిన అనంత్ శ్రీరామ్, కొట్టిన తమన్, కుప్పి గంతులు వేయించిన శేఖర్ మాస్టర్‌ను అందరూ ఏకిపారేశారు. అంత జరుగుతున్నా కూడా చిత్రయూనిట్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుంది. అయితే ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. సినిమా టీజర్‌ను ఎప్పుడు విడుదల చేస్తున్నారనే విషయాన్ని వెల్లడించింది చిత్ర యూనిట్. ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 31వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర