‘పుష్ప’ సినిమా నుంచి మరో అప్డేట్.. త్వరలో అక్కడ షూటింగ్ ప్రారంభం కానుందట..

స్టైలిష్ స్టార్ , క్రియేటివ్ డైరెక్టర్ కాంబోలో రాబోతున్న భారీ సినిమా ''. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బన్నీ మాస్ అప్పీయరెన్స్ వెండితెరపై చూడాలని తహతహలాడుతున్నారు. అయితే తొలుత ఈ సినిమాను ఒక భాగంగానే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని అంతా భావించారు. కానీ, అభిమానులకు అంచనాలకు మంచి ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ మధ్యకాలంలోనే ప్రకటించింది. మొదటి భాగం ‘పుష్ప- ది రైజ్’ అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్లు అన్ని ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా టీజర్ని చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఉన్న విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ముఖ్యంగా ఆఖర్లో అల్లు అర్జున్ చెప్పిన ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ హైలైట్గా నిలిచాయి. ఇకపోతే.. ఈ సినిమాలో మలయాళం సూపర్స్టార్ ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. రీసెంట్గానే ఆయన ఫస్ట్లుక్ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు పుష్ప సినిమాకు సంబంధించి మరో అప్డేట్ సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. ముఖ్యంగా సినిమా రెండో భాగం కోసం ఈ షెడ్యూల్లో సన్నివేశాలు షూటింగ్ చేయనున్నారని తెలిసుస్తోంది. వీలైనంత త్వరగా ఈ షూటింగ్ని పూర్తి చేసి.. ఆ తర్వాత మిగితా పనులు ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. నటుడు సునీల్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Comments
Post a Comment