డ్రగ్స్ కేసులో పురోగతి.. సగం విచారణలోనే పూరి నుంచి కీలక విషయాలు లాగేశారు

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మంగళవారం నుంచి విచారణ మొదలుపెట్టనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది సెలబ్రెటీలకు కొద్దిరోజుల క్రితమే నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేటి(ఆగస్టు 31) నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు వారందరినీ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో వేర్వేరుగా ప్రశ్నించనుంది. ఈ కేసులో ఈడీ ఫోకస్ మొత్తం డ్రగ్స్‌ లావాదేవీల్లో జరిగిన మనీ లాండరింగ్‌పైనే ఉంది. దీంతో ఆ కోణంలోనే సెలబ్రెటీలపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశముంది. ఇక తాజాగా ఈ కేసులో మొట్టమొదలు దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణకు హాజరు అయ్యారు. మంగళవారం.. ఆయన ఈడీ కార్యాలయంకి వచ్చి విచారణలో పాల్గొన్నారు. ఆయన్ని 10.30కు విచారణకు రావాలని ఆహ్వానించగా.. పూరీ కాస్త ముందుగానే 10.05కే విచారణకు వచ్చారు. ఇక ఈడీ కార్యాలయం ముందు ఉన్న మీడియా ప్రతినిధులు ఆయనను కొన్ని ప్రశ్నలు అడగ్గా.. ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఈడీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పటికే పూరితో జరిగిన విచారణలో అధికారులకు పలు కీలక అంశాలు తెలిసినట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. అలాగే విదేశీ లావాదేవిలపై కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. దాదాపు 5 గంటల విచారణ తర్వాత భోజన విరామం ఇచ్చారు. భోజన విరామం అనంతరం పోలీసులు కేసుకు సంబంధించి మరిన్ని విషయాలపై పూరీని విచారిస్తున్నారు. ఈ విచారణ సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విచారణ పూర్తయ్యే సమయానికి కేసుకు సంబంధించి మరిన్ని అంశాలు బయటకు వస్తాయని అనిపిస్తోంది. ఇక ఈ కేసులో సెప్టెంబరు 2న చార్మీ, 6న రకుల్‌, 8న రానా, 9న రవితేజ, ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్‌, 13న నవదీప్‌, ఎఫ్‌-క్లబ్‌ పబ్‌ జనరల్‌ మేనేజర్‌, 15న ముమైత్‌ఖాన్‌, 17న తనీష్‌, 20న నందు, 22న తరుణ్‌ విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ