తమ టార్గెట్‌ను పూర్తి చేసుకున్న సినిమా ‘లక్ష్య’.. ఇక మిగిలింది అది ఒక్కటే..

హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్రలో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. ఆర్చరీ క్రీడా ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య మాజీ ఆర్చరీ ప్లేయర్ పాత్రలో కనిపించనున్నారు. కరోనా సెకండ్ వేవ్‌కి ముందు ఈ ఏడాది జవనరిలో సినిమా షూటింగ్‌ని మళ్లీ ప్రారంభించినట్లు ప్రకటించిన చిత్ర యూనిట్. కొద్ది రోజుల తర్వాత సినిమా టీజర్‌ని కూడా విడుదల చేసింది. ఈ టీజర్‌లో నాగశౌర్య లుక్స్.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. తదితర విషయాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘’ షూటింగ్ టార్గెట్ పూర్తి చేయబడింది.. త్వరలో థియేటర్లలోకి వచ్చి మీ హృదయాలను గెలుచుకోవాలనేదే తదుపరి లక్ష్యం అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. చిత్రీకరణ కంప్లీట్ అవడంతో ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. అతి త్వరలోనే మిగితా పనులన్నీ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరి ఈ ‘లక్ష్య’ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజు వేచి చూడాలి.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ