Posts

Showing posts from April, 2020

నువ్వు దొంగ కృష్ణుడివి.. రామ్ చరణ్‌పై నానమ్మ కామెంట్స్.. వీడియో వైరల్!!

Image
ఎప్పుడూ వెండితెరపై హుందాగా కనిపించే సెలబ్రిటీలు తమ తమ రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారు? తమ తమ ఖాళీ సమయాన్ని ఇంట్లో ఎలా గడుపుతారు? ఈ విషయాలు తెలుసుకోవడం కోసం సగటు ప్రేక్షకుడు ఎప్పుడూ ఆరాటపడుతూనే ఉంటాడు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సెలబ్రిటీల హోమ్ క్వారంటైన్ సంగతులను, ఫ్యామిలీతో వాళ్ళు గడిపే క్షణాలను నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా షేర్ చేసిన ఓ వీడియో క్లిప్ మెగా అభిమానులను కనువిందు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న రామ్ చరణ్.. తాజాగా కిచెన్ పాఠాలు నేర్చుకునే పనిలో పడ్డారు. నాన్నమ్మ అంజనా దేవి దగ్గర వెన్న తయారు చేసే విధానాన్ని తెలుసుకుంటూ ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో కోడలు సురేఖకు, మనవడు రామ్ చరణ్‌కు వెన్న చిలికే విధానాన్ని నేర్పిస్తూ కనిపించింది చిరంజీవి తల్లి అంజనా దేవి. ఇక రామ్ చరణ్‌ని ఆమె కృష్ణుడిలా ఉన్నావని కామెంట్ చేయడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ఇలా రామ్ చరణ్, సురేఖ, అంజనా దేవి అంతా కలిసి ఆనందంగా కిచెన్‌లో ఎంజాయ్ చేస్తూ వెన్న చిలుకుతుండటం మెగా అభిమానులను కన

చిరంజీవిని కలిస్తే ఆ మాట అన్నారు.. ఆ సమయంలో నేను!! జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్

Image
ఇప్పుడిప్పుడిప్పుడే ఎదుగుతున్న నటీనటులు లాంటి టాప్ హీరోలని కలిస్తే ఆ ఆనందానికి అవధులు ఉంటాయా? చెప్పండి. అలాంటి ఆనందాన్నే పొందాడట జబర్దస్త్ కమెడియన్ . అంతేకాదు చిరంజీవి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నానని, ఆ క్షణాలు జీవితంలో మరచిపోలేనని అన్నాడు ఈ కమెడియన్. తాజాగా జరిగిన ఓ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో ఈ సంగతులు తెలుపుతూ ఉబ్బితబ్బిబైపోయాడు అదిరే అభి. జబర్దస్త్ వేదికపై అలరించిన కమెడియన్స్ తమ కెరీర్‌లో చాలా ముందుకెళ్తున్నారు. పొట్ట చెక్కలయ్యే కామెడీ పండించి మంచి పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. దీంతో వాళ్లకు సినిమా అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. సైడ్ క్యారెక్టర్స్, కమెడియన్ రోల్స్‌తో పాటు కథను బట్టి హీరోగా కూడా అవకాశమిస్తున్నారు నేటి దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో ఇప్పటికే సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర లాంటి జబర్దస్త్ కమెడియన్స్ వెండితెరపై రాణిస్తున్నారు. అదే బాటలో ఇప్పుడు మరో ఫేమస్ జబర్దస్త్ కమెడియన్ అదిరే అభికి కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ అంశం గురించి మాట్లాడిన అదిరే అభి తన కొత్త సినిమా సంగతులు చెప్పాడు. తాను 'పాయింట్ బ్లాంక్' అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటిం

Happy BirthDay Ajith: లాక్‌డౌన్‌లో అజిత్ పుట్టిన రోజు.. ఆయన కోరినట్లుగానే!

Image
తమ ఫేవరెట్ హీరో పుట్టిన రోజు వచ్చిందంటే అభిమానులకు అదో పండగ రోజు. భారీ కటౌట్స్, కేక్స్ కట్ చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు ఫ్యాన్స్. కానీ నేడు (మే 1) పుట్టినరోజున ఎలాంటి ఆడంబరాలు లేకుండానే ఆ కార్యక్రమం జరుగుతోంది. 1971 సంవత్సరం మే 1వ తేదీన తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లో జన్మించిన అజిత్.. ఈ రోజు 49వ ఏట అడుగిడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరో బర్త్ డేని ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు ఫ్యాన్స్. అయితే కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న ఈ టైమ్‌లో తన పుట్టినరోజు వేడుకలకు జరపకూడదని అజిత్ ఫ్యాన్స్‌కి తెలిపారు. దీంతో ఆయన కోరిక మేరకు ఎలాంటి ఆర్బాటం లేకుండా కేవలం సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతోంది అభిమాన లోకం. మరోవైపు ఆయన నటిస్తున్న తాజా సినిమా 'వలిమై' నుంచి బర్త్ డే సర్‌ప్రైజ్ ఉంటుందని భావించిన ప్రేక్షకులకు అక్కడ కూడా నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ సినిమా ప్రచార కార్యక్రమాలు నిర్వహించదలచుకోలేదని ఆ మూవీ యూనిట్ పేర్కొంది. సికింద్రాబాద్‌లో జన్మించిన అజిత్ తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగి అశేష పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆ

బాలకృష్ణ కోసం లైన్ రెడీ.. చిరంజీవి కూడా దానికోసమే చూస్తున్నారు: అనిల్ రావిపూడి

Image
ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు . పటాస్ సినిమాతో మెగాఫోన్ పట్టిన ఆయన ప్రేక్షకలోకాన్ని కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలతో తన టాలెంట్ బయటపెట్టి గతేడాది F2 సినిమాతో భారీ హిట్ సాధించారు. ఈ సినిమాతోనే కామెడీ పండించే నెంబర్ వన్ డైరెక్టర్‌గా గుర్తింపు పొంది ఈ ఏడాది ఆరంభంలోనే 'సరిలేరు నీకెవ్వరు' రూపంలో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. దీంతో అనిల్ రావిపూడి సినిమాలకు డిమాండ్ పెరిగింది. ఆయన తదుపరి ప్రాజెక్ట్స్ ఏంటి? మళ్ళీ ఎప్పుడు కడుపుబ్బా నవ్వుకోవాలని ఆతృతగా ఎదురుచూడటం మొదలుపెట్టారు తెలుగు ప్రేక్షకులు. అయితే ఇప్పటికే F2 సీక్వల్ F3 స్క్రిప్ట్ రెడీ చేస్తున్న ఆయన తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ బాలకృష్ణ, చిరంజీవిలతో ఉండే అవకాశాలున్నాయని అన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన అనిల్ రావిపూడి.. తాజాగా ఓ మీడియాతో ఆన్‌లైన్‌లో ముచ్చటించారు. ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో తర్వాత, ఆ తర్వాత చేయబోయే సినిమాల లైన్స్ కూడా రాసుకుంటున్నానని చెప్పారు. ఈ క్రమంలో నందమూరి నటసి

కరోనా ఎఫెక్ట్: WHO ఆన్‌లైన్ కోర్స్‌లో చేరిన డైరెక్టర్ తేజ

Image
కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఈ మహమ్మారిని చూసి చాలా దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్‌ను అరికట్టడానికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని ఎన్నో దేశాలు దీన్ని పాటిస్తున్నాయి. మన దేశంలోనూ 30 రోజులుగా పైగా ఈ లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయితే, ఈ కరోనా డైరెక్టర్ తేజలో ఒక కొత్త ఆలోచనను పుట్టించింది. అదే WHO ఆన్‌లైన్ కోర్స్. శ్వాసకోశపై ప్రభావం చూపించే కరోనా లాంటి వైరస్‌లు భవిష్యత్తులో వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో ఈ కోర్స్ ద్వారా తేజ నేర్చుకుంటున్నారు. ఈ కోర్సులో భాగంగా అంటువ్యాధులు, వేగంగా ప్రమాదానికి గురయ్యే శరీర భాగాలు వాటి గురించి తేజ తెలుసుకుంటున్నారు. ఈ కోర్స్ పూర్తయిన తరవాత తేజ ఆన్‌లైన్ టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుందట. ఈ టెస్ట్‌లో పాసయితే WHO వాలంటీర్‌‌గా పనిచేసే అవకాశం కూడా కల్పిస్తారు. ఈ కోర్సు నేర్చుకుని అంటు వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై తన చుట్టూ ఉన్న వాళ్లకు తేజ అవగాహన కల్పించనున్నారు. లాక్‌డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమలో ఉపాధి కోల్పోయిన రోజువారీ వేతన కార్మికులను ఆదుకోవడానికి ఇండస్ట్రీ పెద్దలు ఎంతో చేస్తు్న్నారు. అలాగే, తనవంతుగా ఈ వ్యాధులపై వారికి అవగాహన కల్పించాలని తే

‘పవన్ కళ్యాణ్ తప్పిపోయాడు, దొరికితే పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పండి’.. ఔనా! ఏం పాపం చేశాడట!

Image
జనసేన అధినేత పవర్ స్టార్ తప్పిపోవడం ఏంటి?? ఆయనేమైనా చిన్నపిల్లోడా.. తప్పిపోవడానికి..? తేడాలొస్తే.. ఆయన భాషలోనే చెప్పాలంటే తాట తీసే వ్యక్తి. పైగా ఆయన ఓ పార్టీకి అధినేత.. ఇండస్ట్రీలో బాక్సాఫీస్ కా బాప్. ఈ మధ్య ‘వకీల్ సాబ్’ అంటూ రీ ఎంట్రీ కూడా ఇచ్చారు. అటు సినిమాలు, ఇటు రాజకీయం అంటూ క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపేస్తున్న పవన్ కళ్యాణ్ తప్పిపోయాడు అంటూ సంచలన పోస్ట్ పెట్టింది. ఏయ్.. ఎవరా కారు కూతులు కూసింది.. మా నాయకుడు పారిపోవడం ఏంటి?? అని జనసైనికులు కస్సున లేవడం ఖాయమే.. అయితే ఇలాంటి కామెంట్స్ చేసేది ఇంకెవరు శ్రీరెడ్డే. పవన్ కళ్యాణ్ పేరు చెప్పినా.. జనసైనికులు ఊసెత్తినా ఒత్తు వెలిగించి వదిలిన థౌజండ్ వాలాలా పటా పటా పేలిపోయే .. మరోమారు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వరుస పోస్ట్‌లను పెట్టింది. ‘పవన్ కళ్యాణ్ తప్పిపోయాడు.. దొరికితే దగ్గరల్లో ఉన్న పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పండి ప్లీజ్’ అంటూ తెగ బ్రతిమిలాడుతోంది శ్రీరెడ్డి. మరి ఆయన పారిపోతే ఈమె ఎందుకు ప్రాధేయపడుతుందో తెలియదు కాని జనసైనికులకు ఎప్పటిలాగే ఆగ్రహం తెప్పించే పోస్ట్‌లు పెట్టింది. ‘డొక్కా సీతమ్మ గారిని ఆదర్శంగా తీసుకుంటే కనీసం ఒక ర

చిరంజీవికీ తప్పలేదు.. ఇంత నీఛత్వమా? మీరు నన్నేం చేయలేరు.. మెగా వార్నింగ్

Image
కరోనా వైరస్ వచ్చి కొన్నాళ్లే అవుతుంది కాని.. అంతకంటే ప్రమాదకరమైన వైరస్ వచ్చి చాలా ఏళ్లు అవుతుంది. అదే ట్రోలింగ్ వైరస్. సోషల్ మీడియా వేధికగా మనుషుల్ని మానసికంగా వేధించే ఈ వైరస్ బారిన పడని వారు ఉండరు. ఒకర్నొకరు దూషించుకోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, స్థాయి భేదం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం.. చేతిలో ఫోన్ ఉంది అందులో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సాధనాలు చేతిలో ఉండటంతో ఎవరితోనైనా ఏమైనా మాట్లాడగలుగుతున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం ఈ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు అందుబాటులో ఉండగలుగుతున్నారు. అసలే ముఖానికి రంగుపూసుకునే సెలబ్రిటీలంటే చిన్నచూపు ఉండనే ఉంది. ఇక వాళ్లు లైవ్‌లోకి వచ్చి మంచి చెడ్డలు మాట్లాడుతుంటే చెలరేగిపోతూ వాళ్లను ట్రోల్ చేస్తున్నారు కొంతమంది ట్రోలర్స్. ఇలాంటి వాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఉగాది రోజున మెగాస్టార్ ట్విట్టర్‌‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ‘మెగా’ట్వీట్స్‌తో హల్ చల్ చేస్తున్నారు చిరు. అయితే అందరిలాగే మెగాస్టార్‌ను ట్రోలర్స్ వదలడం లేదు. ఆయన

నరేష్ కొడుకు ఇలా అయిపోయాడేంటి.. ఈ హీరోని గుర్తుపట్టారా?

Image
సీనియర్ నటుడు 90ల్లో కామెడీ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. విజయనిర్మల కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనా తనకంటూ ఒక ఇమేజ్‌ను ఏర్పరుచుకోగలిగారు. కొంతకాలం వెండితెరకు దూరమైన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే, నరేష్ కుమారుడు నవీన్ విజయ్‌కృష్ణ నాలుగేళ్ల క్రితం ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. నిజానికి ఆయన ఎడిటర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ, హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే, హీరోగా ఆయనకు కలిసిరాలేదు. దీంతో మళ్లీ తనకు ఇష్టమైన ఎడిటింగ్ వైపే వెళ్లిపోయారు. ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాలో నవీన్ స్లిమ్‌గా, చాలా అందంగా కనిపించారు. అయితే, ఆయన్ని ఆ సినిమాలో చూసినవారు ఇప్పుడు చూస్తే.. ఎవరితను? అని కచ్చితంగా అంటారు. ఎందుకంటే, ఆయన అంతలా లావెక్కారు. Also Read: నరేష్ తాజాగా ట్విట్టర్‌ ద్వారా తన కొడుకు ఫొటోను షేర్ చేశారు. కొడుకుతో తీసుకున్న సెల్ఫీని ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో నవీన్ చాలా లావుగా కనిపిస్తున్నారు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు.. ఏంటి ఇంత లావయ్యాడు? అని ఆశ

‘నాగేశ్వరరావు’ ఆగిపోలేదు.. చైతూ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ: పరశురామ్

Image
‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత డైరెక్టర్ పరశురామ్.. అక్కినేని హీరోగా సినిమాను ప్రకటించారు. 14 రీల్స్ బ్యానర్‌లో ఈ సినిమాను ప్రారంభించారు. ఇది నాగచైతన్యకు 20వ సినిమా. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని అప్పట్లో ప్రకటించారు. అయితే, - నాగచైతన్య సినిమా ఆగిపోయిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబుతో సినిమాను పరశురామ్‌ అంగీకరించడంతో నాగచైతన్యతో చేయాల్సిన మూవీ నుంచి ఆయన తప్పుకున్నారని వదంతులు వచ్చాయి. పరశురామ్ తీసుకున్న నిర్ణయంతో నాగార్జున కూడా కోపంగా ఉన్నారని కూడా అన్నారు. అయితే, ఈ వదంతుల్లో నిజంలేదని పరశురామ్ స్పష్టం చేశారు. Also Read: ‘‘నాగచైతన్యతో సినిమా రద్దుకాలేదు. ‘నాగేశ్వరరావు’ అని టైటిల్ పెట్టాం. మేమిద్దరం ఆ సినిమా కచ్చితంగా చేస్తాం. చైతూ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుంది. ఆ సినిమా విషయంలో మేం వెనక్కి తగ్గం’’ అని పరశురామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, ఈ సినిమా బాలీవుడ్ హిట్ మూవీ ‘చిచోర్’కు రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మాత్రం పరశురామ్ స్పందించలేదు. ఇదిలా ఉంటే, పరశురామ్‌తో సినిమా చేయడానికి ముందు నాగచైతన్య మరో రెండు సినిమాలు చే

శ్రీరెడ్డి అరాచకానికి అద్దమే అదురుతోంది.. ‘కుక్కలు కుళ్లిన బొక్కలెతుకుతాయ్.. సింహం తాజా మేకనే’..

Image
ఓరి సాంబో రాస్కోరా.. అన్నంత రేంజ్‌లో కొటేషన్ ఇచ్చి అద్దాన్ని హడలెత్తించే ఫొటో వదిలింది హాట్ బాంబ్ శ్రీరెడ్డి. అద్దం ఏంటి? హదలెత్తించడం ఏంటి అంటే ఆ ఫొటోపై లుక్కేస్తే ఈపాటికి మీకు సీన్ అర్థమైపోయే ఉంటుంది. ఫేస్ బుక్‌లో ఉన్న ఆరు మిలియన్ల మంది ఫాలోవర్స్‌ని ఆకర్షించాలి.. మరికొంతమందిని రాబట్టాలి అంటే తన ఫేస్ బుక్‌లో ఇలాంటి మాస్ మసాలా సరుకుని అద్దుతూనే ఉంటుంది శ్రీరెడ్డి. ప్రతిరోజు కూడా ఏదో విధంగా మినిమమ్ ఒక వివాదాస్పద మైన పోస్ట్ లేకుండా తన ఫేస్ బుక్‌ వాల్‌ని నిద్రపోనీయదు శ్రీరెడ్డి. ఇక తనకు తిక్క లేచిందంటే ఎవరో ఒకర్ని టార్గెట్ చేస్తూ బూతులు కురిపిస్తుంటుంది. లేదంటే మంచి మసాలా దట్టించి ఇదిగో ఇలాంటి హాట్ హాట్ ఫొటోలను వదులుతూ ఉంటుంది. తాజాగా అద్దంలో తన బ్యాక్ పార్ట్‌ను చూసికుని తెగ మురిపోతూ ఉన్న ఫొటోను వదిలింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి భారీ అందాలకు అద్దమే బెంబేలెత్తెపోయేట్టుగా ఉన్న ఈ ఫొటోకు ‘కుక్కలు కుళ్లిన బొక్కలెతుకాయ్.. సింహం తాజా మేకనే తింటుంది’.. అనే కొటేషన్‌ని కూడా పెట్టింది శ్రీరెడ్డి. ఇక భారీ దేహపు అందాన్ని చూసి కొంతమంది బాప్ రే శ్రీ.. ‘నా శ్రీ.. ఒక అందాల ప్రకృతి, నాకు చాలా ఇష్టం నీ శరీర

‘ఒక్కడు’ చూసి ఇండస్ట్రీకి వచ్చా.. నా కల నెరవేరుతోంది: పరశురామ్

Image
‘యువత’ సినిమాతో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమయ్యారు పరశురామ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరవాత ‘ఆంజనేయులు’, ‘సోలో’ సినిమాలు దర్శకుడిగా పరశురామ్‌కు ఒక ప్రత్యేక శైలి ఉందనే గుర్తింపును ఇచ్చాయి. అయితే, ఎన్నో ఆశలతో రూపొందించిన ‘సారొచ్చారు’ సినిమా పరశురామ్‌కు షాక్ ఇచ్చింది. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో స్పీడుకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. ఈ సినిమా తరవాత పరశురామ్‌కు మరో అవకాశం దక్కడానికి నాలుగేళ్లు పట్టింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇచ్చిన అవకాశాన్ని పరశురామ్ అందిపుచ్చుకున్నారు. అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠీలను హీరోహీరోయిన్లుగా పెట్టి ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఆ వెంటనే ఇదే గీతా ఆర్ట్స్ సంస్థలో ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్‌కు దర్శకత్వం వహించారు. ఈ ఒక్క సినిమాతో పరశురామ్ మరోసారి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేయబోతున్నారు. మహేష్‌తో పరశురామ్ చేయనున్నట్టు చాలా రోజులుగా వార్తలు వస్తు్న్నాయి. వాటిని తాజాగా పరశురామ్ ఖరారు చేశారు. Als

అప్పుడు సురేఖావాణి ఇప్పుడు స్టార్ క్రికెటర్.. అది కూడా భార్యతో కలిసి! వైరల్ వీడియో

Image
ప్రపంచమంతా కరోనా చేస్తున్న విలయతాండవం అందరినీ ఇంట్లోనే ఉంచేసింది. దేశవిదేశాల్లో లాక్‌డౌన్ అమలు చేయడంతో సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకూ అందరికీ ఒకేసారి ఖాళీ సమయం దొరికింది. దీంతో ఎవ్వరికి తోచినవిధంగా వారు ఎంజాయ్ చేస్తున్నారు. తమలో దాగిఉన్న టాలెంట్ బయటపెట్టేందుకు సరదా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిక్ టాక్ సెన్సేషన్‌గా మారిన బుట్టబొమ్మ పాటను ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ట్రయల్ చేశారు. నడుము, చేతులు తిప్పుతూ సిగ్నేచర్ స్టెప్ ఎంజాయ్ చేశారు. గతంలో టాలీవుడ్ నటి సురేఖావాణి, తన కూతురుతో కలిసి ఈ పాటకు స్టెప్పులేయడంతో అది సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఇప్పుడు అదే పాటకు లయబద్దంగా స్టెప్పులేసి డేవిడ్ వార్నర్, ఆయన భార్య ఇరగదీశారు. ఈ వీడియోను ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. మన సంగీతం ఖండాలు దాటివెళ్లిందని, కొన్ని బిలియన్ల మంది ఈ పాటకు ఫిదా అయ్యారని పేర్కొన్నారు. డేవిడ్ వార్నర్, ఆయన భార్

Rashmi Gautam: లాక్ డౌన్‌లో రష్మి బర్త్ డే.. అదే కేక్, వాళ్లే అతిథులు

Image
తన జీవితంలోనే గుర్తుండిపోయే పుట్టినరోజు జరపుకున్నారు జబర్దస్త్ గౌతమ్. సెలబ్రిటీ బర్త్ డే అంటే పార్టీలు, కేక్‌లు, ఫ్రెండ్స్ ఇలా మామూలు హంగామా ఉండదు. ఇక కాస్తా పబ్లిక్ ఫిగర్ అయితే ఏర్పాట్లు గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇలాంటి విందు, వినోదాలు, ఆర్భాటాలను లాక్ చేసి పారేసింది కరోనా. దీంతో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఇంట్లోనే హోమ్ మేడ్ కేక్‌తో సింపుల్‌గా కానిచ్చేస్తున్నారు. తాజాగా యాంకర్ వేడుకను నిరాడంబరంగా జరుపున్న వీడియోను షేర్ చేసింది. మూడు రోజుల క్రితమే రష్మి బర్త్ వేడుకలు జరుపుకోగా ఈ వీడియోను ఇప్పుడు షేర్ చేసింది రష్మి. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న రష్మి తన తల్లితో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నారు. అయితే కనీసం కేక్ కూడా లేకుండా తనకు ఎంతో ఇష్టమైన హల్వానే కేక్‌గా మార్చుకుని.. ‘హ్యాపీ బర్త్ డే మీ’.. హ్యాపీ బర్త్ డే మీ’ అంటూ తనకి తాను విషెష్ చెప్పుకుండా హల్వా‌ను కట్ చేసి.. ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది రష్మి. తన బర్త్ డేకి హల్వానే కేక్‌గా మారగా.. తన తల్లి, తను ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్కపిల్ల అతిథులయ్యారు. అయితే బర్త్ డే నాకు తనకు ఇష్టమైన హల్వాతో పాటు..

మనుషులు ఇంకా మారలేదా అనిపిస్తోంది.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

Image
ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటం, మనసులో ఉన్నది బయటపెట్టేయడం విలక్షణ నటుడు మంచు నైజం. అందుకే ఆయన మాట్లాడిన మాటలు కొన్ని సందర్భాల్లో వివాదాలకు కారణంగా మారుతుంటాయి. అయినప్పటికీ తాను చెప్పాలనుకున్నది నిర్మొహమాటంగా చెబుతుంటారు ఈ డైలాగ్ కింగ్. ఈ క్రమంలోనే కరోనా కల్లోలం సృష్టిస్తున్న ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రజలు వ్యవహరిస్తున్న తీరు, పోలీసు చర్యల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌‌డౌన్ ఆదేశాలు జారీ చేశాయి. ప్రజలు ఎవ్వరూ బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటూ కరోనా బాధితులకు వైద్యసహకారం అందిస్తున్నాయి. పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు ప్రతీ క్షణం శ్రమిస్తూ కరోనా కళ్లెం వేస్తున్నారు. అయితే కొన్ని ఏరియాల్లోని ప్రజలు ఏదో ఒక సాకుతో పోలీసులు, డాక్టర్లు చేస్తున్న కృషికి అడ్డుపడుతూ రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. డాక్టర్లపై చేయి చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఇష్యూలపై స్పందించిన మోహన్ బాబు ప్రజలకు కాస్త ఘాటుగానే మాట్లాడారు. ''మనం దైవాలుగా భావించవల్సిన డాక్టర్లపై, నర్సులపై అక్కడక్కడా కొందరు దా

అప్పటినుంచే ఆ హీరో అంటే క్రష్.. మనసులో మాట బయటపెట్టిన అనసూయ

Image
న్యూస్ ప్రెజెంటర్‌గా కెమెరా ముందుకొచ్చిన ఆ తర్వాత బుల్లితెర, వెండితెర ప్రయాణాలు చేస్తూ ఫుల్ పాపులర్ అయింది. హీరోయిన్లతో సమానమైన క్రేజ్ కొట్టేసి జనం నోళ్ళలో నానుతూ ఉంది. అయితే ఆమె కెరీర్‌కి పునాది వేసి, టర్న్ చేసింది మాత్రం ఒక్క జబర్దస్త్ షో అనే చెప్పుకోవాలి. అందుకే అనసూయను అంతా జబర్దస్త్ బ్యూటీ అని ముద్దుగా పిలుచుకుంటారు. అలాగే ఆమెకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఫేవరేట్ హీరో, ఆ హీరోతోనే క్రష్ అని అనసూయ స్వయంగా చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న అనసూయ భరద్వాజ్ రెగ్యలర్‌గా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తన ట్విట్టర్, ఇన్స్‌స్టా ఖాతాల ద్వారా అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేస్తూ తన కెరీర్, వ్యక్తిగత విషయాలను బయటపెడుతోంది. ఈ మేరకు తాజాగా జరిగిన చిట్‌చాట్‌లో మీకు నచ్చిన హీరో ఎవరు అనే ప్రశ్నపై బదులిచ్చిన అనసూయ.. తనకు హీరో అర్జున్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జెంటిల్ మెన్’ మూవీ చూసిన తర్వాత ఆయన అభిమానిగా మారిపోయానని, ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సినిమా చూడగానే ఆయనంటే క్రష్ ఏర్ప

యాంకర్ సుమ కన్నీటి పర్యంతం.. చేతిలెత్తి మొక్కుతూ భావోద్వేగ వీడియో

Image
‘‘మనం బాగున్నాం.. మనం సంతోషంగా ఉన్నాం అని మాత్రమే కాకుండా ఎదుటి వారికి కూడా సాయం చేయాలని ముందుకు వస్తున్న మీ పెద్ద మనసులకు శతకోటి వందనాలు’’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు యాంకర్ సుమ కనకాల. లాక్ డౌన్ కారణంగా తిండిలేక ఇబ్బందులు పడుతున్న అనేక మందికి తన వంతు సాయం అందించిన సుమ కనకాల మరో అడుగు ముందుకు వేశారు. ప్రతిరోజు ఎంతో మంది పేదలకు అన్నం పెడుతూ వారి ఆకలి తీర్చుతున్న ‘అక్షయపాత్ర’ స్వచ్ఛంద సేవా సంస్థకు ఫండ్ అందించే కార్యక్రమానికి పిలుపునిచ్చారు సుమ. సుమ ఫండ్ రైజర్ ఫర్ అక్షయ పాత్ర పేరుతో ఫేస్ బుక్ ద్వారా ఆమె అభిమానుల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఐదు లక్షల టార్గెట్‌గా ఆమె ఈ విరాళాల సేకరణ ప్రారంభించగా.. ఒక్కరోజులోనే సుమ ఫండ్ రైజర్‌కు ఇప్పటి వరకూ ₹561,350 రావడంతో ఆమె టార్గెట్‌ను రీచ్ అయ్యారు. ఈ సందర్భంగా తన పిలుపుకు గౌరవం ఇస్తూ విరాళాలు ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు యాంకర్ సుమ. తన కన్నీటి నుంచి వచ్చే ఈ కన్నీళ్లు ఆనందంలో వచ్చేవని చెప్తూ.. ‘సుమ ఫండ్ రైజర్ ఫర్ అక్షయ పాత్ర’కు డొనేషన్లు పంపినవారి పేర్లు ఒక్కొక్కటిగా చదివి వినిపించారు సుమ. ఇక అక్షయపాత్ర సేవా సంస

రిషి, ఇర్ఫాన్‌ల మృతిపై బాలకృష్ణ రియాక్షన్.. ఇది తీరని లోటు అంటూ ఆవేదన

Image
వరుసగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని కుదిపేసే సంఘటనలు చోటు చేసుకున్నాయి. దిగ్గజ నటులు ఇర్ఫాన్ ఖాన్, ఒక్క రోజు తేడాలో తిరిగిరాని లోకాలకు వెళ్లడం యావత్ సినీ లోకాన్ని షాక్‌కి గురిచేసింది. అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 29న బాలీవుడ్ నటుడు మరణించగా, ఆ మరుసటి రోజే అనగా నేడు (ఏప్రిల్ 30) మరో విలక్షణ నటుడు రిషి కపూర్ కన్నుమూయడం జీర్ణించుకోలేక పోతున్నారు సినీ ప్రముఖులు. ఈ నమ్మలేని విషయాలపై రియాక్ట్ అవుతూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని పెద్ద ఎత్తున ట్వీట్స్ పెడుతున్నారు. ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మహేష్ బాబు, అల్లు అర్జున్, తమన్నా, అనసూయ, తాప్సి, నిధి అగర్వాల్ లాంటి ఎందరో తారలు రిషి మృతిపట్ల తమ తమ ప్రగాఢ సానుభూతి తెలపగా, తాజాగా నందమూరి రియాక్ట్ అవుతూ ఆవేదన చెందారు. ''రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి ఇద్దరు నట దిగ్గజాలు మనకు దూరమవడం చాలా బాధాకరం. భారతీయ సినిమాకు ఇది తీరని లోటు.వారి చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను''

Rishi Kapoor Death: ట్రూ లెజెండ్.. రిషి కపూర్ మృతిపై చిరంజీవి, మోహన్ బాబు స్పందన

Image
దివంగత దిగ్గజ నటుడు రాజ్ కపూర్ తనయుడు రిషి కపూర్ (67) మరణం యావత్ సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టేసింది. నిన్న (బుధవారం) బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం, ఆ వెంటనే నేడు (గురువారం) మరో నటుడు రిషి కపూర్ కన్నుమూయడం జీర్ణించుకోలేకపోతోంది సినీ లోకం. రిషి కపూర్ మరణవార్త తెలిసి మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా రియాక్ట్ అయ్యారు. ''రిషి కపూర్ మరణించారనే వార్త వినగానే గుండె పగిలింది. సినిమా ప్రపంచంలో మరో పూడ్చలేని నష్టం జరిగింది. ట్రూ లెజెండ్, అత్యంత ప్రతిభావంతుడైన నటుడు రిషి కపూర్ మరణం కలచివేసింది. రణబీర్, అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతూ రిషి కపూర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా'' అని మహేష్ బాబు పేర్కొన్నారు. ''చిత్రసీమకు ఇది భయంకరమైన వారం. పూడ్చలేని నష్టం జరిగింది. లెజెండరీ రిషీ కపూర్, టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మరణాలు నష్టాన్ని మిగిల్చాయి. ఆ రెండు కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'' అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. గొప్ప యాక్టర్, మంచి స్నేహితుడు రిషి

చెడ్డీతో అనసూయ డాన్స్ వైరల్.. ఫ్యాంట్ వేసుకోమంటూ నెటిజన్స్ ట్రోల్స్

Image
అంతే.. వాళ్లకు తిట్టడం ఇష్టం, ఈమెకు వాళ్లను మరింత రెచ్చగొట్టటం ఇష్టం. యాంకర్ వస్త్రధారణ విషయంలో తరచూ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తూ ఉంటుంది. ఆమె పొట్టిపొట్టి బట్టలు వేసుకుని కవ్విస్తూ అందాలను ఆరబోస్తుంటే.. కాస్తైనా ఉండక్కర్లే.. ఇద్దరు బిడ్డలు తల్లివి ఇలాగేనే ఉండేది? ఇదేనా మన సంస్కృతి.. ఇలా విప్పుకుంటూ పోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ ఉంటారు. మామూలుగా ఓ మోస్తరు బట్టలు వేసుకున్నా.. ఆమెను ఏకిపారేస్తుంటారు నెటిజన్లు. ఇక అసలు మీరెవరూ.. నాకు బట్టలు గురించి మాట్లాడటానికి..? చూపించే నాకు కాదు.. చూసే మీకు సిగ్గు ఉండాలి? మీలో ఆ కామపు చూపుని ముందు చంపేయాలి.. ముందు మీ ఆలోచన మార్చుకోండి. నా భర్తకు పిల్లలకు లేని అభ్యంతరం మీకు ఎందుకు?? ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసే వాళ్లను ఏం చేసిన పాపం లేదు అంటూ ట్రోలర్స్ గట్టి కౌంటర్స్ ఇస్తూనే ఉంటుంది అనసూయ. ఇక అనసూయ వర్సెస్ ట్రోలర్స్ ఇష్యూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకూ వెళ్లిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ ట్రోలర్స్‌కి మరింత పని కల్పించే వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది అనసూయ. బుల్లి

Rishi Kapoor Death: రిషి కపూర్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

Image
బాలీవుడ్ నటుడు రిషి కపూర్ (67) ఆకస్మిక మరణవార్త యావత్ సినీ లోకాన్ని షాక్‌కి గురి చేసింది. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనను గత రాత్రి ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. రిషి కపూర్ మరణ వార్త తెలిసి బాలీవుడ్, టాలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. దేవుడా.. మీరు ఏం చేస్తున్నారు? భారతీయ సినిమా పరిశ్రమ ఓ రత్నాన్ని కోల్పోయింది. రిషి కపూర్ మరణించారనే భయంకరమైన వార్తతో మేల్కొన్నాను. భారత దేశమంతా అన్ని జెనెరేషన్స్ ఫాలోయింగ్ కూడగట్టుకున్న గొప్పనటుడు ఆయన. రిషి కపూర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా- అనసూయ భరద్వాజ్. నా ప్రియ మిత్రుడు రిషి కపూర్ మరణించారని తెలిసి గుండె పగిలింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా- రజినీకాంత్. ఏదో వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నా మనస్సు, చేతులు సహకరించడంలేదు. రిషికపూర్ లేరనే విషయాన్ని నా హృదయం అర్థం చేసుకోలేకపోతుంది. ఆ నవ్వు, ఆ హాస్యం, నిజాయితీ అన్నీ కోల్పోయాం. మీలాంటి మనిషి ఇంకెవరూ లేరు- తాప్సి రిషి కపూర్ ల

పవన్ జోలికొస్తే చెప్పుతో కొడతాం.. శ్రీ రెడ్డి టాపిక్ తీస్తూ తమన్నా సంచలన వ్యాఖ్యలు

Image
సినీ రంగానికి, రాజకీయ రంగానికి ఎంతో తారతమ్యం ఉంటుంది. సినిమా అనేదే ఎంటర్‌టైనింగ్ రంగం కాబట్టి ఓ సినిమా పోతే మరో సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. కానీ రాజకీయం అలా కాదు.. ఎన్ని పనులు చేస్తూ వెళ్లినా, జనంతో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో పాలు పంచుకుంటున్నా కూడా ఏదో ఒక మూల నుంచి విమర్శలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తనపై ఎన్ని విమర్శలొచ్చినా ఏ మాత్రం జంకకుండా పార్టీని ముందుకు నడిపిస్తూ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు జనసేన అధినేత . ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌ని విమర్శించే వారికి వార్నింగ్ ఇచ్చింది ట్రాన్స్‌జెండర్ . ఓ మీడియాతో ఆన్‌‌లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. జనసేనకు మద్దతుగా మాట్లాడింది. పవన్ కళ్యాణ్ వెంట తామున్నామని, ఆయనను విమర్శిస్తూ ఎవ్వరైనా పవన్ జోలికొస్తే తాట తీస్తామని చెప్పింది. కొందరు తమ పేరును పాపులర్ చేసుకునేందుకు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారని, అలాంటి కుక్కలకు సమాధానం చెబుతామని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది తమన్నా. రాకేష్ మాస్టర్, శ్రీరెడ్డి లాంటి వారితో పాటు ఇంకొందరు తమ పాపులారిటీ కోసమే విమర్శలు చేస్తున్నారని ఆమె పేర్కొంది. పవన్ తిట్టి వార్తల్లో నిలవాలని, అలా తమ పేరు

Be The Real Man: ప్రత్యేకత చాటుకున్న దేవిశ్రీ.. బన్నీ సహా ఐదుగురికి ఛాలెంజ్

Image
ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రారంభించిన ఈ ఛాలెంజ్.. రాజమౌళి లాంటి దర్శకధీరుడు ద్వారా పాపులర్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు ఈ ఛాలెంజ్‌లో పాలుపంచుకోవడంతో ఈ లాక్‌డౌన్ సమయంలో ఈ ఛాలెంజ్ తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతోంది. ఇన్ని రోజులూ తెరపైన, తెర వెనుక ఉంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన టాలీవుడ్ స్టార్లు.. ఇప్పుడు ఇళ్లలో పనులు చేస్తూ అలరిస్తున్నారు. ఈ ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ దర్శకుడు సుకుమార్.. తనకు ఎంతో ఇష్టమైన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ను నామినేట్ చేశారు. సుకుమార్ ఛాలెంజ్‌ను స్వీకరించిన దేవి.. బుధవారం తన వీడియోను ట్వీట్ చేశారు. అయితే, ఈ వీడియో కాస్త వెరైటీగా ఉంది. దేవిశ్రీ స్టైల్‌లో చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. వీడియో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. అన్నిటికీ మించి ఈ వీడియోలో దేవి తన మేనల్లుడిని భాగం చేయడం ఆసక్తికరం. నిద్రపోతున్న మావయ్యను లేపి మరీ పనులు చేయించాడు దేవి మేనల్లుడు తనవ్ సత్య. Also Read: దేవిశ్రీ చీపురుతో ఇల్లు

ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు.. ఇర్ఫాన్ మృతిపై చిరంజీవి

Image
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడిన ఆయన బుధవారం మధ్యాహ్నం ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. ఇర్ఫాన్‌కు భార్య సుతాప, ఇద్దరు కుమారులు బబిల్, అయాన్ ఉన్నారు. ఇర్ఫాన్ మృతితో చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేవలం బాలీవుడ్ ప్రముఖులే కాకుండా అన్ని సినీ పరిశ్రమల ప్రముఖులు ఇర్ఫాన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇప్పటికే మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి ‘సైనికుడు’ సినిమాలో మహేష్ నటించారు. అయితే, తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఇర్ఫాన్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు. Also Read: ‘‘ఇర్ఫాన్ ఖాన్ మృతిచెందారనే ఘోరమైన వార్త విని చాలా బాధపడ్డాను. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గొప్ప నటుడు ఆయన. ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. ఆయన మంచి ప్రవర్తన మన హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుంది. ప్రియమైన ఇర్ఫాన్, మేం మిమ్మల్ని కోల్పోతున్నాం. మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోలేం’’ అని చిర

గొప్ప నటుడ్ని కోల్పోయాం.. ‘సైనికుడు’ నటుడి మరణంపై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

Image
బాలీవుడ్ విలక్షణ నటుడు అకాల మరణంపై సూపర్ స్టార్ స్పందిస్తూ.. ఎమోషనల్ ట్వీట్ చేశారు. గత కొన్నాళ్లుగా న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) తో పోరాడుతున్న ఇర్ఫాన్ ఖాన్ బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణంపై మహేష్ బాబు స్పందిస్తూ.. ‘ఇంత బ్రిలియంట్ యాక్టర్‌ని ఇంత త్వరగా కోల్పోతాం అని ఊహించలేదని.. ఆయన అకాల మరణ వార్తతో చాలా బాధపడ్డా’ అన్నారు మహేష్ బాబు. అతన్ని మిస్ అయ్యాం ఇర్ఫాన్ ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నా అన్నారు మహేష్ బాబు. బాలీవుడ్‌లో ‘సలామ్ బాంబే’, ‘కఖ్బూల్’, ‘పాన్ సింగ్ తోమార్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్.. ‘స్లమ్‌డామ్ మిలియనీర్’, ‘ఇన్ఫెర్నో’, ‘లైఫ్ ఆఫ్ పై’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో సైతం నటించారు. తెలుగులో ఆయన నటించిన ఒకే ఒక్క సినిమా మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సైనికుడు’. ఈ చిత్రంలో పప్పు యాదవ్‌గా విలన్‌గా నటించి తన విలక్షణ నటనను చూపించారు. ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి నటించిన మహేష్ బాబుకి ఆయనతో మంచి అనుబంధం ఉండటంతో ట్విట్టర్‌లో స్పందించారు మహేష్ బాబు. మహేష్ బాబుతో పాటు సాయి పల్లవి, హన్సిక, కార్తికేయ తదితర ట

Allu Arjun: ‘పుష్ప’లో ఐటెం పుష్పం.. అ అంటే అమలాపురం రేంజ్‌లో అల్లాడిస్తోందట!

Image
సుకుమార్ సినిమా అంటే మాస్ మసాలా ఐటం సాంగ్ మస్ట్. ఇక ఈయన క్రియేటివిటీకి దేవి శ్రీ ట్యూన్, బన్నీ డాన్స్ తోడు అయ్యిందంటే మాస్ ఆడియన్స్ థియేటర్స్‌లో చిందులేయాల్సింది. సుకుమార్ చిత్రాల్లో ఒక్క ‘నాన్నకు ప్రేమతో’ మినహా మిగతా అన్ని చిత్రాల్లోనూ ఐటం సాంగ్ కంపల్సరీ. అ అంటే అమలాపురం (ఆర్య).., రింగ రింగా (ఆర్య 2).., అప్పూ.. అప్పూ బ్రేకప్పూ.. (కుమారి 21 F).., డియాలో.. డియాలా ( 100% లవ్).., లండన్ బాబూ.. లండన్ బాబూ (నేనొక్కడినే).., జిల్ జిల్ జిగేలు రాణి (రంగస్థలం)., లాంటి పాటలు సుక్కు సినిమాల్లో ఐటం బాంబ్‌లలా పేలాయి. మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టాయి. ఇప్పుడు ఇదే ఐటం బాణాన్ని తన అప్ కమింగ్ మూవీలోనూ ప్రయోగిస్తున్నారు సుకుమార్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌-సుక్కూ కాంబోలో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో అదిరిపోయే మాస్ మసాలా ఐటం సాంగ్‌కి దేవి శ్రీ ట్యూన్స్ కట్టడం మొదలుపెట్టేశారట. అయితే ‘పుష్ప’ పక్కన ఆడిపాడే ఆ ఐటెం పుష్పం కోసం వెతుకులాట మొదలుపెట్టారట సుక్కూ. సుకుమార్ ఐటమ్ సాంగ్ చాలా స్పెషల్‌గా ఉంటాయి. ఐటం‌లోనే మంచి కంటెంట్‌ను మిక్స్ చేసి వదులుతుంటారు సుక్కూ. ఇందులో డాన్స్‌ స్కిల్స్‌తో పాటు పాపులర్ సెలబ్రిటీలనే

సుమకి ఇప్పటికీ ఐలవ్యూ, పెళ్లి చేసుకుంటా అని మెసేజ్‌లు వస్తుంటాయ్.. వైరల్ అవుతున్న రాజీవ్ కనకాల వీడియో

Image
యాంకర్ సుమ.. ఈ పేరు బుల్లితెర వర్గాల్లోనే కాదు, సినిమా ఇండస్ట్రీలోనూ ఓ ధీమా. ఆమె ఏ ప్రోగ్రామ్ చేసిన బంపర్ హిట్టే. హోస్ట్ చేసి కార్యక్రమం ఏదైనా ఏళ్లకు ఏళ్లు నడవాల్సిందే.. ఇక పెద్ద సినిమా ఫంక్షన్లకు సుమ యాంకర్‌గా ఉండాలనేది స్టార్ల అందరి కండిషన్ అంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక్కో టైంలో ఒక్కొక్కరి హవా నడుస్తుంటుంది. కాని సుమ హవా గత 15 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇక ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా టీవీ సీరియల్స్‌లోనే కాకుండా సినిమాల్లోనూ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ.. ప్రతినాయకుడిగానూ మెప్పిస్తున్నారు. సుమారు 22 ఏళ్లు అన్యోన్య దంపతులుగా ఉన్న ఈ ఇద్దరూ ఇటీవలే విడాకులు తీసుకున్నారే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమారు నాలుగేళ్లుగా ఈ ఇద్దరూ ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నారని వేరు వేరుగానే జీవిస్తున్నారంటూ మీడియా కథనాలు వచ్చాయి. అయితే వీటిపై ఈ ఇద్దరూ స్పందించాల్సి ఉండగా.. యూట్యూబ్‌లో వీరికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. Read also: ఈ ఇద్దరూ కలిసి ఓ మీడియా ఇంటర్వ్యూకి హాజరైన సందర్భంలో సుమను ఉద్దేశించి రాజీవ్ కనకాల సరదా వ్యాఖ్యలు చేశారు. ఇది పాత వీడియో అయ

తెలుగు సినిమాలపై తనికెళ్ల భరణి షాకింగ్ కామెంట్స్.. చిరుతో సహా అందరూ చేస్తారు కాని!!

Image
తెలుగు సినిమా స్థాయిపై షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రముఖ రచయిత, నటుడు . మిగతా ఇండస్ట్రీలతో తెలుగు సినిమా పోటీపడలేకపోవడానికి ప్రధాన కారణం డబ్బులు పెట్టే నిర్మాతలే అన్నారాయన. ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చిరంజీవితో సహా అందరికీ కూడా మంచి క్లాసిక్ సినిమా చేయాలని ఉంటుంది.. కాని సమస్య ఎక్కడ వస్తుందంటే.. నిర్మాతల దగ్గరే. కొన్ని కోట్ల రూపాయల డబ్బు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ఆ డబ్బు నాకు వెనక్కి వస్తుందా? రాదా? అనే లెక్కల్లోనే తేడా వస్తుంది. ఇంకా మలయాళ సినిమాలో ఉన్న స్టాండర్డ్స్ తెలుగు సినిమాలో చూస్తారా లేదా అన్న భయం అందుకే ఆ స్థాయిలో సినిమాలు ఉండటం లేదు. మనకి కొలిమి కారం తినడం అలవాటు అయిపోయింది.. కొత్తిమీర పచ్చడి తింటే చప్పగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొత్త వాళ్లు ఎంత మంచి కాన్సెప్ట్‌‌లు తీస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ రావడం వల్ల మనం ఏదైనా తీయొచ్చు అనే స్వేచ్ఛ వచ్చింది.. దీని వల్ల క్రియేటివిటీ పొంగులు తొక్కుందనేది నా అభిప్రాయం. దీనివల్ల మంచి జరగొచ్చు. ఇప్పుడు పారసైట్ సినిమా చూశాం అబ్బా.. ఆహా అనుకున్నాం.. కాని ఈ సినిమా మన విరాట పర్వమే. కాని తెరకెక్కించిన తీరు ఎంత బాగుంది. క

సినిమాలు ఇవ్వకపోయినా పర్లేదు.. ఆ పని మాత్రం చేయనని వారికి చెప్పా: దిగంగన

Image
ఇండస్ట్రీలో నటనతో దర్శక, నిర్మాతలకు ఆకట్టుకునే వారు కొందరైతే అందచందాలను పెట్టుబడిగా పెట్టి.. ఎంత ఆరబోస్తే అన్ని ఆఫర్స్ అన్నట్టుగా రెచ్చిపోతుంటారు. ఇలాంటి వాళ్లకు ఒకటి రెండు సినిమాలతోనే ఇంటికి పంపేస్తుంటారు తెలుగు ప్రేక్షకులు. నటనలో ఉన్న అందాన్నే చూస్తారు తప్ప.. పైపై మెరుగుల్ని మన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. అయితే కొంతమందికి అందం, అభినయం రెండూ ఉన్నా లక్ కలిసిరాకపోవడంతో ఒకటి రెండు సినిమాలకే తెరమరుగుఅవుతున్నారు. హిప్పీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సూర్యవన్షీకి ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో ఎంట్రీలోనే నిరాశకు గురైంది. ఆ సినిమాలో మితిమీరి అందాలు ప్రదర్శించి.. లిప్ లాక్‌లతో రెచ్చిపోయిన దిగంగన ఇకపై అలాంటి సీన్లు చేయనంటోంది. హీరోయిన్ క్వాలిటీస్ ఆమెలో పుష్కలంగా ఉండటంతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటానంటోంది. ఆమె మాట్లాడుతూ.. ‘హిప్పీ’ సినిమా సక్సెస్ కాలేకపోయినప్పటికీ నా వరకూ నేను హ్యాపీగానే ఉన్నాను. ఆ చిత్రంలో నా పాత్రకు మంచి రివ్యూస్ వచ్చాయి. ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. అయితే దర్శకుడు తెరకెక్కించిన విధానం ఒక్కటైతే.. ప్రేక్షకుడు చూసే కోణం మరోలా ఉండటంతో సినిమా క్లిక్ కాలేదు. ఒక్కోసార

నందమూరి Vs మెగా ఫ్యామిలీ వార్ ముగిసినట్టే.. చరణ్ నన్ను అనుసరిస్తున్నాడన్న చిరు

Image
‘పెద్ద ఫ్యామిలీనా.. మాలాగా.. వాళ్లెంత బురద జాతి’ అంటూ సీన్ పండటం కోసం బాలయ్య బాబు డైలాగ్ చెప్పినా.. అది ఫ్యాన్స్ మధ్య వైరాన్ని పెంచింది. ఇప్పుడే కాదు సంక్రాంతి, దసరా, దీపావళి, క్రిస్మస్ లాంటి పెద్ద పండుగలకు ఈ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే ఫ్యాన్స్ మధ్య యుద్ధమే నడిచేది. అప్పట్లో అయితే సోషల్ మీడియా పెద్దగా అందుబాటులో లేకపోవడంతో ప్రత్యక్షంగానే ఫ్యాన్స్ వార్‌కి దిగేవారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చొక్కాలు చించుకునే పిచ్చి ఫ్యాన్స్‌కి టాలీవుడ్‌లో కరువు లేకపోవడంతో హీరోల మధ్య మంచి అనుబంధమే ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుచచ్చేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి.. యువ హీరోలు బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. ఏం చేస్తే ఈ ఫ్యాన్స్ గోల తగ్గుతుందో మార్గదర్శకాలు వెతుకుతున్నారు. ఒక హీరో సినిమా ఫంక్షన్ మరో హీరో వెళ్లడం.. మల్టీస్టారర్ సినిమాల్లో నటించడం.. ఒక హీరో సినిమాను మరో హీరో ప్రమోట్ చేయడం ద్వారా ఈ ఫ్యాన్స్ మధ్య రగడను దాదాపు నివారించడం శుభపరిణామం. ఇంకా కొంతమంది హీరోల ఫ్యాన్స్ తమ హీరోనే గొప్ప అంటూ డబ్బాలు కొట్టుకుంటూనే ఉన్నారు కాని.. వాళ్లని సెపరేట్ క్యాటగిరీ కింద వదిలేసి హీరోలు మాత్రం

‘మగధీర’ నా ఆల్‌టైమ్ ఫేవరేట్.. మహేష్‌కి పెద్ద ఫ్యాన్‌ని: విహారీతో తెలుగులో మాట్లాడిన అశ్విన్

Image
వాళ్లిద్దరూ భారత్ తరఫున ఆడుతోన్న అంతర్జాతీయ క్రికెటర్లు. ఒకరకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్టార్లు. అలాంటి క్రికెటర్లు తెలుగు సినిమాల గురించి చర్చించుకుంటే.. అందులోనూ తెలుగు భాషలోనే చర్చించుకుంటే విశేషమే కదా. తమిళనాడుకు చెందిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. హైదరాబాద్ క్రికెటర్ హనుమ విహారీతో తెలుగులో మాట్లాడారు. తెలుగు సినిమాల గురించి చర్చించారు. వీరిద్దరూ కలిసి ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో లైవ్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న వీరిద్దరూ లైవ్‌లో కాసేపు వ్యక్తిగత విషయాలపై ముచ్చట్లు పెట్టారు. దీనిలో భాగంగా తెలుగు సినిమాల గురించి వీరిద్దరి మధ్య చర్చ వచ్చింది. అశ్విన్ చాలా చక్కగా తెలుగులో మాట్లాడారు. ‘‘లెట్స్ స్టార్ట్‌ అని తెలుగులో ఎలా అంటారు’’ అని విహారీని అశ్విన్ అడిగారు. దీనికి ‘మొదలుపెడదాం’ అని రిప్లై ఇచ్చారు విహారి. మొదట తెలుగు సినిమాల గురించి మాట్లాడదాం అని అశ్విన్ అన్నారు. ఇక అక్కడి నుంచి ఒకరినొకరు సినిమాల గురించి ప్రశ్నలు వేసుకున్నారు. Also Read: అశ్విన్: తెలుగులో మీ ఫేవరేట్ మూవీ ఏంటి? విహారి: నా ఫేవరేట్ మూవీ అంటే.. ఇటీవల ఒక మంచి కామెడీ సినిమా చూశాను. సినిమా పేరు ‘భీ

Mahesh Babu: జక్కన్న వస్తే వంశీ పైడిపల్లి ఔటేనా?? అంతలేదంటూ దర్శకుడు క్లారిటీ!

Image
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తరువాత రిలాక్స్ మోడ్‌లో ఉన్నారు. ఈ చిత్రం తరువాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా ఉండబోతున్నట్టు అఫీషియల్‌గానే ప్రకటించారు. అయితే కారణాలు చెప్పకుండా అగ్రదర్శకుడితో సినిమా కట్ అంటూ క్లారిటీ ఇస్తూ.. సుక్కూ-బన్నీ కాంబో మూవీ ‘పుష్ప’ చిత్రానికి ఆల్ ది బెస్ట్ చెప్పేశారు. ఈ కథే మహేష్ బాబుతో చేయాల్సిఉండగా.. అనుకోని కారణాలతో చివరికి బన్నీతో ఫిక్స్ అయ్యారు సుక్కూ. ఇక సరిలేరు షూటింగ్ దశలో ఉండగానే తన నెక్స్ట్ మూవీ ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లితో ఉంటుందని ప్రకటించారు మహేష్ బాబు. ఇక ‘గీతగోవిందం’ దర్శకుడు పరుశురామ్ కథను కూడా క్యూలోనే పెట్టారు మహేష్. ఇక అదీ ఇదీ కాదు సేఫ్‌గా కొరటాల అయితేనే బెటర్ అనుకుని.. ఆయన మెగాస్టార్‌తో చేస్తున్న ‘ఆచార్య’ ఎలాగూ చివరి దశకు వచ్చేయడంతో కొరటాలతో కలసి హ్యాట్రిక్ హిట్ కొట్టే ప్లాన్‌లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఇంత మంది దర్శకుల్లో మహేష్ మూవీ ఎవరితో ఉండబోతుందనే సందిగ్థంలో దర్శకుడు రాజమౌళి.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో అంటూ బాంబు పేల్చారు. ప్రస్తుతం రాజమౌళి RRR సినిమా షూటింగ్ దశలోనే జక్కన్న మూవీ కాబట్టి ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరి

లైవ్‌లో శ్రియ యోగా సెగలు.. దారాళంగా ఆరబోస్తూ, భర్త ఎంట్రీతో మరింత చెమటలు

Image
టాలీవుడ్ సీనియర్ బ్యూటీ 37 ఏళ్ల వయసులోనూ వన్నెతరగని అందంతో కవ్విస్తోంది. తన భర్త ఆండ్రూతో కలిసి ఇన్ స్టాగ్రామ్‌లో రచ్చ రచ్చ చేస్తున్న శ్రియ తరచూ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. వాటిల్లో తన భర్తను సైతం ఇన్వాల్వ్ చేస్తూ హాట్ టచ్ ఇవ్వడం ఆమె స్పెషాలిటీ. రీసెంట్‌గా ఆమె తన భర్తతో కలిసి లైవ్ నిర్వహిస్తుండగా.. ఓ నెటిజన్ ఆమె ఎద సంపదపై చేసిన కామెంట్ పెద్ద వైరల్ అయ్యింది. దీనికి ఆమె భర్త ఆండ్రు సైతం తెగ సంబర పడుతూ తన భార్య అందాలను మరింత పొగడమని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. తన వన్నెతరగని అందానికి అసలు రహస్యం యోగానే అంటూ తన ఆసనాలను లైవ్‌లోనే చూపించేసింది శ్రియ. ఫిట్నెస్, ఆరోగ్యం, వ‌ర్కౌట్స్‌, యోగాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే శ్రియ.. తన బ్యూటీ సీక్రెట్ ఇదే అంటోంది. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తన యోగా ట్రైనర్‌తో ఆన్ లైన్ యోగా చేస్తుంది శ్రియ. ట్రైనర్ ఎలా ఆసనాలు వేయాలి అన్న దానికి క్లాస్ చెప్తుండగా.. శ్రద్ధగా యోగాసనాలు మొదలుపెట్టింది. ఇక ఆమె ఆసనాల సంగతి పక్కన పెట్టి ఎద భాగాన్ని మొత్తం కనిపించేట్టుగా ఆసనాలు వేస్తూ హీట్ పెంచేసింది శ్రియ. మధ్యలో అతని భర్త

రానా చెప్పిన ‘వైజయంతి’ కథ: 21 ఏళ్ల కుర్రాడి కల.. ఎన్టీఆర్ హస్తవాసి

Image
తెలుగు సినిమా పరిశ్రమలోని భారీ నిర్మాణ సంస్థల్లో వైజయంతీ మూవీస్ ఒకటి. నటరత్న నందమూరి తారక రామారావు హీరోగా ‘ఎదురులేని మనిషి’ సినిమాతో మొదలైన ఈ సంస్థ ప్రయాణం 45 ఏళ్లకు పైగా సుధీర్ఘంగా సాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతోన్న సినీ వారసులను పరిచయం చేసిన ఘనత ఈ సంస్థ సొంతం. సినిమాలపై మక్కువతో 21 ఏళ్ల వయసులో అశ్వనీదత్ బెజవాడ నుంచి చెన్నపట్నం బయలుదేరారు. ఎన్టీఆర్‌తో ఎలాగైనా సినిమా చేయాలనే బలమైన కోరిక ఆయన్ని ఇండస్ట్రీ వైపు నడింపించింది. టాలీవుడ్‌ గర్వించదగిన నిర్మాతను చేసింది. Also Read: జేబులో కొంత డబ్బు, గుప్పిట్లో సినీ తెర కలలు, గుండెనిండా ధైర్యంతో బెజవాడలో 21 ఏళ్ల అశ్వనీదత్‌ రైలు ఎక్కుతుండగా ఆయనకు డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు కనిపించారట. మళ్లీ ఊరికి తిరిగివస్తే ఆయనలా ఒక గొప్ప నిర్మాతనై రావాలని అశ్వనీదత్ నిర్ణయించుకున్నారట. ఆ ప్రయాణానికి ఒక చారిత్రాత్మిక నాంది ఎలా పడిందో రామానాయుడు మనవడు అయిన రానా దగ్గుబాటితో చెప్పించారు అశ్వనీదత్. వైజయంతీ మూవీస్ వెనకున్న అసలు కథను తెలియజేస్తూ ఆ సంస్థ ఒక వీడియోను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ వీడియోలో రానా.. వైజయంతీ మూవీస్ ప్రయాణం గురించి చెప

‘పోకిరి’ 1000 డేస్.. సున్నాల్లో లెక్క తప్పులేదు.. చార్మి పోస్ట్‌కి మహేష్ ఫ్యాన్స్ విజిల్స్

Image
పండుగాడు టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల్ని పగలగొట్టి నేటికి సరిగ్గా 14 ఏళ్ల. ఎవ్వడు కొడ్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు అంటూ ‘’ సినిమాతో గేమ్ ఛేంజర్ అనిపించారు సూపర్ స్టార్ . మూసధోరణికి ముగింపు పలుకుతూ దర్శకుడు పూరీ జగన్నాథ్ కలం నుంచి జాలువారిన ఆ పండుగాడి పిచ్చకొట్టుడికి బాక్సాఫీస్ బెంబేలెత్తింది. ఇంటర్వెల్‌లో ఆ క్రిష్ణమనోహర్ ఐపీఎస్ ఎంట్రీకి రోమాలు నిక్కబొడుచుకోని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’, ‘ఎప్పుడు వచ్చాం అన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా??’, ‘షెడ్డు బాగుంది.. కొట్టుకోవడానికి ఈ మాత్రం ఉండాలి.. కొంచెం తెరిచిపెట్టుకోమ్మా.. పారిపోవడానికి ఉంటాది’, ‘అన్నయ్యా ఈ తొక్కలో మీటింగ్‌లు ఏంటో నాకు అర్థం కావడంలేదు’,‘అన్నయ్యా బ్లడ్ పోతిందిక్కడా’, ‘సినిమాలు చూడట్లేదేటి’, ‘ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా.. నాన్నా’.. ‘అర్థ రూపాయ్ శాంపూలు వాడితే ఇలాగే ఉంటుంది’.. ‘గిల్లితే గిల్లించుకోవాలి అరవ కూడదు’.. లాంటి పూరీ మార్క్ డైలాగ్‌లకు మహేష్ బాబు మేనరిజం పర్ఫెక్ట్‌గా సూట్ కావడంతో థియేటర్స్‌లో దుమ్ములేచిపోయింది. ‘ఇప్పటి

చిరంజీవి బయటపెట్టిన వీడియోపై నాని రియాక్షన్.. అయ్యో! ఇలా అనేశాడేంటి?

Image
ఇటీవలే సోషల్ మీడియాలో కాలుమోపిన కొద్దిరోజుల్లోనే తన స్టామినా ఏంటో నిరూపించారు. నేటితరం యువతను అట్రాక్ట్ చేసేలా పోస్టులు పెడుతూ అమాంతం ఫాలోయింగ్ పెంచేసుకుంటున్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు ప్రతీ విషయాన్నిషేర్ చేస్తూ సోషల్ మీడియా కింగ్ అనిపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న (ఏప్రిల్ 27) ఓ ట్వీట్ చేసి జనాల్లో క్యూరియాసిటీ పెంచేశారు చిరంజీవి. ఆ ట్వీట్‌లో పేర్కొన్నట్లు గానే ఈ రోజు (ఏప్రిల్ 28) ఉదయం 9 గంటలకు ఆ ట్వీట్ కొనసాగింపుగా తన సీక్రెట్ వీడియో బయటపెట్టారు చిరు. ఆ వీడియోలో తన మనవరాలు నవిష్క (కళ్యాణ్ దేవ్- శ్రీజ‌ల కూతురు)తో కలిసి చిన్న పిల్లాడిలా ఆడుకుంటూ కనిపించారు. ఖైదీ నెంబర్ 150 సినిమాలోని మిమ్మీ మిమ్మిమీ పాటకు స్టెప్పులేస్తూ మనవరాలిని ఆడించారు. సంవత్సరం వయసున్న చిన్నారిని కూడా సంగీతం ఎంతలా ఆకట్టుకుంటుందో చూడండి అని ఈ వీడియో ద్వారా చెప్పారు చిరంజీవి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియో చూసిన హీరో దాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్ జోడించారు. ''ఈ వీడియోలో నాకైతే ఇద్దరు చిన్న పిల్లలు కనిపిస్తున్నారు. మరి మీరు ఆ ఇద

43 ఏళ్ల క్రితం చరిత్ర సృష్టించిన రోజు ఇది.. ‘బాహుబలి’కి ముడిపెట్టిన దర్శకేంద్రుడు

Image
తన కెరీర్‌లో 100కు పైగా సినిమాలు చేసి దర్శకేంద్రుడిగా టాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని రాసుకున్న దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్రరావు. నటరత్న నందమూరి తారక రామారావుతో ఈయన 10కి పైగా సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘అడవి రాముడు’. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్. సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఇదే రోజున అంటే 1977 ఏప్రిల్ 28న ‘అడవి రాముడు’ విడుదలైంది. ఈ సందర్భాన్ని గుర్తిచేసుకుంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆసక్తికర ట్వీట్ చేశారు. అలాగే, తాను సమర్పించిన ‘బాహుబలి 2’ కూడా ఏప్రిల్ 28నే విడుదలకావడం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. Also Read: ‘‘ఏప్రిల్ 28 నా సినీ జీవితంలో ఓ మరుపురాని రోజు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారితో నా సినిమా ప్రస్థానం, మరో మెట్టు ఎక్కిన రోజు. సినీ ప్రపంచంలో ఉన్న రికార్డులను తిరగరాసి కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టిన రోజు. ఒక్క మాటలో చెప్పాలంటే అది చరిత్ర సృష్టించిన రోజు, 43 ఏళ్ల క్రితం అడవి రాముడు విడుదలైన రోజు. ఆ నందమూరి అడవి రాముడిని మరోసారి గుర్తు చేసుకుంటూ.. ఆ సినిమా నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, డిస్ట్రిబ

కరోనాపై రాహుల్ సిప్లిగంజ్ ఉర్రూతలూగించే పాట.. విడుదల చేసిన కేటీఆర్

Image
కరోనా వైరస్‌ వల్ల తలెత్తుతున్న పరిస్థితులపై రూపొందించిన ఓ ప్రత్యేక పాటను మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఆవిష్కరించారు. కరోనా కట్టడిలో ప్రధానంగా సేవలందిస్తున్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది సేవల్ని గుర్తు చేస్తూ బొంతు శ్రీదేవి ఈ పాటను రూపొందించారు. మంగళవారం ఈ పాటను ప్రగతిభవన్‌లో మంత్రి ఆవిష్కరించారు. ఈ గీతాన్ని కందికొండ రచించగా.. రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు. ఆవిష్కరణ సంందర్భంగా గీతాన్ని విన్న మంత్రి కేటీఆర్.. దీనివల్ల ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కలుగుతుందని అన్నారు. కరోనాపై చైతన్యం కలిగించేందుకు చొరవ చూపి పాటను నిర్మించిన హైదరాబాద్‌ మేయర్‌ సతీమణి బొంతు శ్రీదేవి శ్రీదేవికి మంత్రి అభినందనలు తెలిపారు. Also Read: మరోవైపు, గజ్వేల్‌లో పేద బ్రాహ్మణ కుటుంబాలకు మంత్రి హరీశ్‌రావు నిత్యావసరాలను పంపిణీ చేశారు. తెలంగాణలో సోమవారం కేవలం 2 కరోనా కేసులే నమోదయ్యాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వ్యాధిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. మరిన్ని రోజులు లాక్‌డౌన్‌కు సహకరించి కరోనాను తరిమికొట్టాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. Also Read:

Anchor Keerthi: రాహుల్‌తో ఆరోజు పబ్‌లో.. నేనే పార్టీ ఇవ్వమన్నా కానీ ఆ రాత్రి ఏమైందంటే.. అసలు నిజం చెప్పిన కీర్తి

Image
జర్నలిజం తన ప్రొఫెషన్ అని టిక్ టాక్ తన ఫ్యాషన్ అంటోంది టిక్ టాక్ సంచలనం, రెడ్డి. పొట్టి పొట్టి బట్టలతో టిక్ టాక్‌లో వీడియోలు చేస్తూ మిలియన్ల ఫాలోవర్స్‌ని రాబట్టిన ఈ యాంకర్ తన పర్శనల్ విషయాలను షేర్ చేసింది. దీనిలో భాగంగా ఇటీవల సింగర్, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి ఇష్యూలో తన పేరు బయటకు రావడంపై ఆమె స్పందించారు. ఈ ఇష్యూపై ఆమె మాట్లాడుతూ.. ‘నేను తాగుతా.. వోడ్కా అంటే నాకు ఇష్టం.. రెగ్యులర్‌గా నైట్ పార్టీలకు వెళ్తా.. ఎవడైనా తీస్కెల్తే పోతా.. లేదంటే ఇంట్లోనే మా అమ్మ, నేను, తమ్ముడు కలిసి తాగుతాం. మాది ఛిల్ ఫ్యామిలీ. నా కూతురిపై ఎప్పుడైనా అరుస్తుంటే అమ్మా పైకి పోయి సిగరెట్ తాగేసి రా.. కూల్ అవుతావ్ అంటుంది. ఇక రాహుల్ విషయానికి వస్తే.. తను నాకు మంచి ఫ్రెండ్. ఆరోజు రాహుల్ సిప్లిగంజ్‌ పై పబ్‌లో జరిగిన గొడవ నా గురించి కాదు.. నాది అంది పెద్ద ఫిగర్ కూడా కాదు. నా గురించి వాళ్లు కొట్టుకోవడానికి. ఆరోజు నేను.. రాహుల్.. ఇంకొక ఫ్రెండ్ కలిసి వెళ్లాలి. బిగ్ బాస్ తరువాత రాహుల్ ఒక ఇంటర్వ్యూలో కలిశాడు. ఆ తరువాత బాగా బిజీ అయ్యాడు. మాకు పార్టీ ఇవ్వడానికి వీలు కాలేదు. దీంతో అతనికి చాలాసార్లు ఫోన్ చే

ఆ అమ్మాయిని చాలా ఇష్టపడ్డా.. కానీ చివరికి: కార్తికేయ రియల్ లవ్‌స్టోరీలు

Image
‘RX 100’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. చాలా మంది ఇదే ఆయన తొలి సినిమా అనుకుంటారు. కానీ, ‘ప్రేమతో మీ కార్తీక్’ ఆయన ఫస్ట్ సినిమా. అయితే, ఈ సినిమా ఎప్పుడొచ్చిందో కూడా ఎవ్వరికీ తెలీదు. ‘RX 100’ సినిమాతోనే ఆయన హీరోగా ఇమేజ్‌ను ఏర్పరుచుకున్నారు. తన సొంత బ్యానర్‌లోనే, తన తండ్రి నిర్మించిన సినిమాతోనే కార్తికేయ తానేంటో నిరూపించుకున్నారు. ప్రేమలో విఫలమైన యువకుడిగా మంచి నటనను కనబరిచారు. అయితే, రియల్ లైఫ్‌లో కూడా తనకు లవ్ ఫెయిల్యూర్ ఉందని చెప్పారు కార్తీక్. ఆ మధ్య కార్తికేయ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాలేజ్ లవ్‌స్టోరీ గురించి చెప్పారు. కార్తికేయ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. ఆయ స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్ ఇక్కడే పూర్తయింది. ఆ తరవాత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వరంగల్‌లో బీటెక్ చేశారు. అయితే, హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్న సమయంలో తన కాలేజీలో చదివే ఒక పంజాబీ అమ్మాయిని కార్తికేయ ఇష్టపడ్డారట. కాలేజీలో ఆ అమ్మాయిని బాగా ఫాలో అయ్యేవారట. ఆ అమ్మాయి బాగా చదివేదని.. తాను మాత్రం యావరేజ్ స్టూడెంట్‌నని చెప్పారు. అయితే, ఆ అమ్మాయికి తన ప్రేమ గురించి చెప్పలేదని, అప్పట్లో ప్రపోజ్ చేసేంత

చిరంజీవి అలా మోహన్ బాబు ఇలా.. తాతల సరదా భలే ఉందే! వీడియో వైరల్

Image
కరోనా వైరస్ నివారణలో భాగంగా షూటింగ్స్ అన్నీ నిలిపివేసి ఇంటికే పరిమితమైన సినీ తారలు సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. యంగ్ హీరోహీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ హోమ్ క్వారంటైన్ విశేషాలు చెబుతూ అందరినీ పలకరిస్తుంటే.. సీనియర్ హీరోలైన చిరంజీవి, తమ తమ మానవరాళ్లతో కలిసి వీడియోలు చేస్తూ లాక్‌డౌన్ స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియా ఛాలెంజ్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే 'బీ ది రియల్ మెన్' అంటూ స్టార్ హీరోలు, దర్శకులు తమ తమ వీడియోలతో హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన మనవారిని పక్కనే కుర్చోబెట్టుకొని వంట గదిలో రుచికరమైన వంటలు చేస్తూ మరో ఛాలెంజ్ పరిచయం చేశారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు. టి. సుబ్బిరామిరెడ్డి కూతురు పింకీ తనకు ‘వంట సవాల్’ విసిరిందని చెబుతూ తాను స్వయంగా శనిగపప్పు మసాలా వడలు చేస్తున్న తాలూకు వీడియో షేర్ చేశారు. తాను చేసిన ఆ వడలను మనవరాలు విద్య నిర్వాణకు చూపించి నేను టేస్ట్ చేయాలా? నువ్వు టేస్ట్ చేస్తావా? అని అడిగిన మోహన్ బాబు.. చివరకు ఆయనే నోట్లో వేసుకొని ఆహా ఏమి రుచి అన్నారు. దీంతో ఈ వీడియో సోషల్

అమెజాన్‌తో తేజ భారీ డీల్! సిచ్యుయేషన్ క్యాచ్ చేసుకుంటూ పక్కా ప్లాన్

Image
రోజురోజుకూ టెక్నాలజీ విస్తృతం అవుతుండటంతో క్రమంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌కి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ (OTT)‌ వృద్ధి చెందుతూ అందరికీ చేరువవుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా విధించిన ఈ లాక్‌డౌన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌కి మరింత బూస్టింగ్ ఇచ్చి అమెజాన్, ఆహా లాంటి ఓటీటీ వేదికలకు కస్టమర్లను పెంచేసింది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న జనం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో సినిమాలు చూడటం అలవాటుగా మార్చుకున్నారు. దీంతో ఫ్యూచర్‌లో కూడా వీటికే డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఓటీటీ వైపు అడుగులేస్తున్నారు. సరిగ్గా ఇదే అంశాన్ని గ్రహించిన డైరెక్టర్ తేజ.. ఇప్పటి సిచ్యుయేషన్ క్యాచ్ చేసుకునేలా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్‌తో భారీ డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో మూడు వెబ్ సిరీస్‌లు, రెండు సినిమాలు నిర్మించేలా డీల్ కుదుర్చుకున్నాడ‌ని ఇన్‌సైడ్ టాక్. నేటితరం ప్రేక్షకులకు మరింత చేరువవుతూ ఇకపై డిజిటల్ రంగంలో రాణించాలని ఆయన ఫిక్స్ అయ్యారని విశ్వసనీయ వర్గాల

Ram Charan: చెర్రీ, ఉపాసన పిల్లల ప్లానింగ్‌పై చిరు షాకింగ్ కామెంట్స్.. ఎంత చెప్పాలో అంతే చెప్తాం అంటూ..

Image
ప్రేమ, పెళ్లి, పిల్లలు, మనవల్లు-మనవరాలు అనేవి మనిషి జీవితంలో కొత్త కొత్త బంధాలు పెనవేసుకునే మధుర స్మృతులు. వీటిల్లో ఉండే మాధుర్యం సరైన రీతిలో పొందాలే కాని.. ఇంతకంటే ఏం కావాలి ఈ జీవితాలకు అనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా పెళ్లై కొడుకు-కూతరు పెళ్లిళ్లు చేసిన తరువాత మనవల్లు-మనవరాల్లతో ఆడుకోవాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. ప్రస్తుతం మెగాస్టార్ తన కూతుళ్ల బిడ్డలతో తాత అని అనిపించుకున్నప్పటికీ నిజమైన వారసుడు కోసం ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్-ఉపాసనలు పెళ్లి చేసుకుని జూన్ 14 వస్తే ఎనిమిదేళ్లు అవుతుంది. 2012లో వీరి వివాహం జరగ్గా ఇంత వరకూ పిల్లలు లేరు. అయితే రామ్ చరణ్-ఉపాసనల పెళ్లి, పిల్లలు అనేది వారి పర్శనల్ విషయాలు కాబట్టి.. వారిదే తుది నిర్ణయం. అయితే తనకూ నిజమైన వారసుడు-వారసురాలు ఉండాలని.. తాత కావాలని ఉంటుందిగా అంటూ మనసులో కోరికను బయటపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఈ ఇష్యూపై మాట్లాడుతూ.. ‘నిజమైన వారసుడ్ని ఎత్తుకోవాలని నాకూ ఉంది. నా భార్య సురేఖ.. చరణ్-ఉపాసనలను అడుగుతూనే ఉంది. కాని వాళ్ల పిల్లల ప్లానింగ్ ఏంటో మాకూ అర్థం కావడం లేదు. అది వాళ్ల పర్శనల్ విషయం.. అందులో మ

నందమూరి బాలకృష్ణతో రాజమౌళి మూవీ.. జక్కన్న రియాక్షన్ చూస్తే!!

Image
నందమూరి నటసింహం బాలకృష్ణతో దర్శక ధీరుడు సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఇంకేముంది బాక్సాఫీస్ దడదడలాడాల్సిందే!. అయితే అలాంటి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందనే దానిపై దృష్టి పెట్టారు తెలుగు ప్రేక్షకులు. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ కావాలంటే బాలకృష్ణ- రాజమౌళి కాంబోలో సినిమా రావాల్సిందే అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయమై స్పందించిన రాజమౌళి.. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న రాజమౌళి.. పలు మీడియా సంస్థలకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులకు ఆసక్తి రేపే, ఆత్రుత కలిగించే ఎన్నో విషయాలను బయటపెడుతున్నారు. RRR తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించిన ఆయన, గతంలోనే బాలయ్యతో సినిమా చేయాలనుకున్నానని చెప్పారు. 17 ఏళ్ల కిందే ఆయనతో సినిమా చేయాలనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదని చెప్పారు. స్టార్ హీరోలతో సినిమాలు చూసి తమ స్థాయిని పెంచుకోవాలనే కోరిక ప్రతి దర్శకుడికి ఉంటుందని, ఏదైనా కథ అనుకున్నప్పుడు ఫలానా హీరో అయితే సరిపోతాడని దర్శకులకు ముందే అనిపిస్తుందని జక్కన్న అన్న

హ్యాపీ బర్త్ డే సమంత: అలాంటి అపోహలకు ఫుల్‌స్టాప్.. భార్య కోసం చైతూ!!

Image
టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా సత్తా చాటుతోంది . పెళ్ళికి ముందే హీరోయిన్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. అక్కినేని వారింట అడుగుపెట్టాక మరింత హవా కొనసాగిస్తోంది. హీరోయిన్ల పెళ్ళికి, కెరీర్‌కి ఎలాంటి సంబంధం లేదని నిరూపిస్తూ ప్రేక్షాధారణ పొందుతోంది. ఒకరకంగా చెప్పాలంటే పెళ్లి చేసుకున్నాకే ఆమె వరుస హిట్స్ అందుకుంది. పెళ్లయింది కదా అని గ్లామర్ ఒలకబోయడంలోనూ ఏ మాత్రం షరతులు పెట్టకపోవడం సమంతలో దాగిఉన్న వృత్తి ధర్మానికి నిదర్శనం. సరిగ్గా ఈ రోజే అనగా ఏప్రిల్ 28వ తేదీ 1987 సంవత్సరం జన్మించిన సమంత.. అశేష తెలుగు అభిమానుల గుండెల్లో స్థిరపడిపోయింది. 'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై క్రమంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. మొదటి సినిమా హీరో నాగచైతన్యతోనే ప్రేమలో పడ్డ ఆమె చాలాఏళ్లు ఆయనతో ప్రేమాయణం కొనసాగించి చివరకు అక్కినేని వారింట అడుగుపెట్టింది. దీంతో ఇక సమంత సినిమాలు చేయదని అనుకుంటున్న తరుణంలో అందరికీ షాకిస్తూ 'రంగస్థలం'లో రామ్ చరణ్‌తో రొమాన్స్ చేసి భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత అన్నట్లుగా ఆమె కెరీర్ సాగిపోతోంది.

కాజల్ పాట అడుగుతున్న చిరు మనవరాలు.. ఉబ్బితబ్బిబ్బవుతున్న మెగాస్టార్

Image
సోమవారం క్రియేట్ చేసిన సస్పెన్స్‌కు చెక్ పెట్టేశారు . నిన్న చిరు ట్విట్టర్ వేదికగా నిన్న ఆసక్తికర ట్వీట్ చేశారు. సాధారణంగా, నేను పాటలు షూటింగ్ చేసే సమయంలో వాటిని వింటూ పూర్తిగా ఆనందిస్తాను. కానీ ఇటీవల, ఓ పాటను మాత్రం తరచూ పాజ్‌ చేస్తూ.. మళ్లీ మొదటి నుంచి వింటూ ఎంజాయ్‌ చేస్తున్నాను. దానికి గల కారణం ఏమిటన్నది రేపు ఉదయం 9 గంటలకు చెబుతాను అని చిరంజీవి ట్వీట్ చేశారు. సరిగ్గా మంగళవారం తొమ్మిది గంటలకు ఆయన చెప్పిన విధంగా ఆ సస్పెన్స్‌కు తెర దించారు మెగాస్టార్. చిరు తరచూ వింటున్న పాట ఖైదీ నెంబర్ 150లోని మీమీ పాట. అయితే ఆయన ఎందుకు ఇదే పాటను పాజ్ చేస్తూ వింటున్నారో వీడియోతో సహా చూపించారు. తన మనవరాలిని ఒళ్లో కూర్చోపెట్టుకున్న చిరు, తనకు ఏ పాట కావాలని అడిగారు. దానికి ఆ చిన్నారి మీమీ అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో చిరు ఎప్పుడూ అదే పాటేనా మరో పాట విందాం అన్నారు. దానికి బుంగమూతి పెట్టుకొని ఏడుపు ప్రారంభించేసింది. దీంతో వెంటనే ఆ చిట్టితల్లిని సముదాయించిన చిరంజీవి... టీవీలో మీమీ పాటను ఆన్ చేశారు. అంతే చిరు మనవారలు ఆనందంతో గంతులు వేయడం ప్రారంభించింది. చిన్నారి స్టెప్పులు చూసిన చిరు కూడా మనవరాలిని ఒళ్లో కూ

మల్లెపూలు పెట్టుకున్న మంచు లక్ష్మీ.. సోషల్ మీడియలో ఫోటో

Image
లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక సినీ సెలబ్రిటీల కూడా షూటింగులు బంద్ కావడంతో ఇంటి పట్టునే ఉంటున్నారు. టైమ్ దొరకడంతో కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతున్నారుజ. కరోనా లాక్‌డౌన్ సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. రెండు జడలు వేసుకొని మల్లెపూలు పెట్టుకున్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో ఆమె తల్లి ఆమెను అప్యాయంగా ముద్దు కూడా పెడుతున్నారు. ఈ ఫోటోను మంచు లక్ష్మీ స్వయంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ అమ్మ మల్లె పూలు పెడుతోంది. మా తోటలో పూసిన పూలు ఇవి’ అని కామెంట్ కూడా దానికి యాడ్ చేశారు. తాజాగా మంచు లక్ష్మీ తన గార్డెన్‌లో మామిడి చెట్టు ఎక్కిన వీడియో కూడా షేర్ చేశారు. ఇన్నాళ్లు బిజీగా ఉన్న తాను... ఇప్పుడు మొక్కలతో మాట్లాడడం స్టార్ట్ చేశానన్నాడరుజ తన ఇంటి పెరటిలో ఉన్న మామిడి చెట్టును ఆమె ఇప్పటి వరకు పట్టించుకోలేదని తెలిపారు.ఇప్పుడు ఆ మామిడి చెట్టునే కాకుండా తన పెరటిలో ఉన్న మొక్కలన్నిటినీ ఫ్యామిలీ మెంబర్స్‌గా భావిస్తూ.. రోజూ వాటితో మాట్లాడుతూ.. వాటికోసం కాసేపు సమయం కేటాయిస్తున్నాని తెలిపారు ఈ విషయాలన్నీ తెలుపుతూ

వీడియో దుమారం: ట్రోల్‌ చేస్తున్నారంటూ నటుడు పృథ్వీ ఫిర్యాదు

Image
సి నీనటుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. టిక్‌టాక్‌ తదితర సోషల్ మీడియా యాప్‌లతో తన వీడియోలను ఎడిట్ చేసి కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సోమవారం (ఏప్రిల్ 27) హైదరాబాద్‌ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా తన వీడియోలు ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పృథ్వీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల టిక్‌టాక్‌లో పృథ్వీ పోస్టు చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ‘మన అని ఎవరినీ నమ్మొద్దు. ఎందుకంటే ఇది తాతల నాటి యుగం కాదు. కల్తీ నా కొడుకులు ఏలుతున్న కలియుగం. మన ముందు మన మాట మాట్లాడతారు. వాడి ముందు వాడి మాట మాట్లాడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి’ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. పృథ్వీ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది ఆసక్తికరమైన చర్చకు తావిచ్చింది. ఆయన నోటి వెంట యాదృశ్చికంగానే ఈ మాటలు వచ్చాయా.. లేక రాజకీయ ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి వీడియోల కోసం కాచుకొని చూసే ఓ వర్గానికి పృథ్వీ చేసిన ఓ అస్త్రంగా దొరికింది. ‘కల్తీ నా కొడుకు

400 టాయిలెట్లన్నారు ఏవి.. మాట నిలబెట్టుకోవాలి: సూర్యపై బిగ్ బాస్ బ్యూటీ ఫైర్

Image
హిందూ ఆలయాలపై కామెంట్స్ చేయడం ఏమో కానీ.. దీని వల్ల ఆమె భర్త, హీరో సూర్యను టార్గెట్ చేస్తున్నారు కొంత మంది. ఆలయాలకు పెట్టే ఖర్చును హాస్పిటల్స్, స్కూల్స్‌లో పెట్టాలని.. ఇది చాలా ముఖ్యమని ఒక అవార్డుల ప్రధానోత్సవంలో జ్యోతిక అన్నారు. ఈ వ్యాఖ్యలను హిందూవాదులు తప్పుబడుతున్నారు. హిందూ ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని.. వాటిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సందర్భంగా 2018లో చేసిన ఒక వాగ్ధానాన్ని నటి, కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1 కంటెస్టెంట్ గాయత్రి రఘురాం గుర్తుచేశారు. ఇచ్చిన మాట సూర్య నిలబెట్టుకోలేదంటూ విమర్శించారు. ఒక వెబ్‌సైట్‌లో ప్రచురించిన వార్త స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ సూర్య ఇచ్చిన వాగ్ధానాన్ని ఆమె ప్రశ్నించారు. తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 400 టాయిలెట్లకు మరమ్మత్తులు చేసి, వాటిని నిర్వహించే బాధ్యతను తీసుకుంటానని సూర్య చెప్పినట్టు ఆ వార్త స్పష్టం చేస్తోంది. ఈ వాగ్ధానాన్ని ప్రశ్నిస్తూ.. ‘‘ఇది 2018లో ఇచ్చిన ఇంటర్వ్యూ. ఇప్పటి వరకు ఎంత పూర్తి చేశారు? ఇది ప్రభుత్వం చేయాల్సిన పనే, కానీ మీరు 2018లో మాటిచ్చారు.

భారతదేశం నివ్వెరబోయేలా సీఎం కేసీఆర్.. ముఖ్యమంత్రిపై బండ్ల గణేష్ కామెంట్స్

Image
గత ఎన్నికల్లో 7'O క్లాక్ బ్లేడు టాపిక్‌తో ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసిన .. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కామెంట్స్ చేస్తున్నారు. కరోనా నివారణలో భాగంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ఇటీవల పాజిటివ్‌గా స్పందించిన ఆయన, తాజాగా మరోసారి ముఖ్యమంత్రిపై ప్రశంసలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. ఆయనను జన్మసార్థకం చేసుకున్న నేత అంటూ పొగిడారు బండ్ల గణేష్. నేడు (ఏప్రిల్ 27) టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. 2001 సంవత్సరం సరిగ్గా ఇదే రోజు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ స్థాపించిన కేసీఆర్.. ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం పట్ల అవగాహన పెంపొందిస్తూ క్రమంగా తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతం చేశారు. చివరకు అనుకున్న టార్గెట్ ఛేదించి స్వరాష్ట్రం సాధించారు. దీంతో తెలంగాణలోని 4 కోట్ల కల సాకారమైంది. అయితే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కేసీఆర్ పోరాటాన్ని గుర్తు చేస్తూ ఆయన గొప్పతనాన్ని తెలియజేసే విధంగా బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. 809 ''అనుకున్న లక్ష్యం కోసం పుష్కరకాలం పోరాడి భారతదేశం నివ్వెరబోయే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఆరు సంవత్సరాలుగా అద్భుతం చ

థాంక్యూ చిరంజీవి గారు.. అంతా బాగున్నారని ఆశిస్తున్నా: సచిన్

Image
మెగాస్టార్ సోషల్ మీడియాలో ఆలస్యంగా జాయిన్ అయినా ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు కావాల్సినంత వినోదాన్ని, అలాగే సోషల్ మెసేజ్‌ను అందిస్తున్నారు. చిరంజీవి ట్విట్టర్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఆయన ప్రతి ట్వీట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఇతరులకు తనకు తేడా చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఏప్రిల్ 24న భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ 48వ ఏట అడుగుపెట్టారు. సచిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి ఒక ట్వీట్ చేశారు. సచిన్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. ‘‘క్రికెట్ దేవుడు, భారత గౌరవం, వన్ అండ్ ఓన్లీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. భారత తరాలకు మీరు ఇలానే స్ఫూర్తిని ఇస్తూ ఉండాలి. ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలి’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, చిరంజీవి ట్వీట్‌కు సోమవారం (ఏప్రిల్ 27న) రిప్లై ఇచ్చారు. ‘‘ఇంత గొప్పగా చెప్పినందుకు కృతఙ్ఞలు చిరంజీవి గారు. మీ వాళ్లంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను’’ అని సచిన్ తన ట్విట్టర్ రిప్లైలో పేర్కొన్నారు. చిరంజీవి ట్వీట్‌కు సచిన్ రిప్లై ఇవ్వడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నార