400 టాయిలెట్లన్నారు ఏవి.. మాట నిలబెట్టుకోవాలి: సూర్యపై బిగ్ బాస్ బ్యూటీ ఫైర్

హిందూ ఆలయాలపై కామెంట్స్ చేయడం ఏమో కానీ.. దీని వల్ల ఆమె భర్త, హీరో సూర్యను టార్గెట్ చేస్తున్నారు కొంత మంది. ఆలయాలకు పెట్టే ఖర్చును హాస్పిటల్స్, స్కూల్స్‌లో పెట్టాలని.. ఇది చాలా ముఖ్యమని ఒక అవార్డుల ప్రధానోత్సవంలో జ్యోతిక అన్నారు. ఈ వ్యాఖ్యలను హిందూవాదులు తప్పుబడుతున్నారు. హిందూ ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని.. వాటిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సందర్భంగా 2018లో చేసిన ఒక వాగ్ధానాన్ని నటి, కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1 కంటెస్టెంట్ గాయత్రి రఘురాం గుర్తుచేశారు. ఇచ్చిన మాట సూర్య నిలబెట్టుకోలేదంటూ విమర్శించారు. ఒక వెబ్‌సైట్‌లో ప్రచురించిన వార్త స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ సూర్య ఇచ్చిన వాగ్ధానాన్ని ఆమె ప్రశ్నించారు. తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 400 టాయిలెట్లకు మరమ్మత్తులు చేసి, వాటిని నిర్వహించే బాధ్యతను తీసుకుంటానని సూర్య చెప్పినట్టు ఆ వార్త స్పష్టం చేస్తోంది. ఈ వాగ్ధానాన్ని ప్రశ్నిస్తూ.. ‘‘ఇది 2018లో ఇచ్చిన ఇంటర్వ్యూ. ఇప్పటి వరకు ఎంత పూర్తి చేశారు? ఇది ప్రభుత్వం చేయాల్సిన పనే, కానీ మీరు 2018లో మాటిచ్చారు. కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించే హక్కు మాకుంది’’ అని గాయత్రి ఘాటుగానే పేర్కొన్నారు. గాయత్రి అక్కడితో ఆగకుండా.. యాక్టర్స్ పబ్లిసిటీ కోసమే ఇలాంటివి చేస్తుంటారని జ్యోతికను ఉద్దేశించి అన్నారు. ‘‘యాక్టర్స్ ఇలాంటి పబ్లిసిటీ స్టంట్‌లు మానుకోండి. మీరు చేసే పనుల గురించి చెప్పండి. 400 టాయిలెట్లు నిర్మిస్తామని 2018లో సూర్య చెప్పారు. ఇప్పుడు హుండీలో డబ్బులు వేయకుండా వాటితో ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలు మెయింటైన్ చేయడానికి జ్యోతిక ముందుకొచ్చారు. ఇక మనకు ప్రభుత్వం అవసరం అస్సలు లేదు’’ అంటూ ఎగతాళి చేస్తూ ట్వీట్ చేశారు గాయత్రి. జ్యోతిక ఏమన్నారు.. ‘రాచ్చసి’ సినిమాలో నటనకు గాను ఓ అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ నటి పురస్కారం అందుకున్న జ్యోతిక మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా తంజావూర్ వెళ్లినప్పుడు అక్కడి బృహదీశ్వర ఆలయానికి వెళ్లాం. చాలా బాగుంది. ఉదయ్‌పూర్‌లో ప్యాలెస్ మాదిరిగా ఉంది. ఆలయాన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అయితే, ఆ మరుసటి రోజు హాస్పిటల్‌లో షూటింగ్ చేశాం. ఆ హాస్పిటల్‌ను చాలా దరిద్రంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి నాదొక రిక్వెస్ట్.. ఆలయాలను బాగా శుభ్రం చేస్తాం, పెయింట్ వేస్తాం, బాగా మెయింటైన్ చేస్తాం, ఆలయ హుండీలో డబ్బులు వేస్తాం. దయచేసి అవే డబ్బులు హాస్పిటల్స్‌కు పెట్టండి, పాఠశాలల అభివృద్ధికి వాడండి. ఇది చాలా ముఖ్యం. దయచేసి హాస్పిటల్స్, స్కూల్స్‌కు కూడా విరాళాలు ఇవ్వండి’’ అని అన్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ