వీడియో దుమారం: ట్రోల్ చేస్తున్నారంటూ నటుడు పృథ్వీ ఫిర్యాదు
సినీనటుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. టిక్టాక్ తదితర సోషల్ మీడియా యాప్లతో తన వీడియోలను ఎడిట్ చేసి కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సోమవారం (ఏప్రిల్ 27) హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా తన వీడియోలు ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పృథ్వీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల టిక్టాక్లో పృథ్వీ పోస్టు చేసిన ఓ వీడియో వైరల్గా మారింది. ‘మన అని ఎవరినీ నమ్మొద్దు. ఎందుకంటే ఇది తాతల నాటి యుగం కాదు. కల్తీ నా కొడుకులు ఏలుతున్న కలియుగం. మన ముందు మన మాట మాట్లాడతారు. వాడి ముందు వాడి మాట మాట్లాడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి’ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. పృథ్వీ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది ఆసక్తికరమైన చర్చకు తావిచ్చింది. ఆయన నోటి వెంట యాదృశ్చికంగానే ఈ మాటలు వచ్చాయా.. లేక రాజకీయ ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి వీడియోల కోసం కాచుకొని చూసే ఓ వర్గానికి పృథ్వీ చేసిన ఓ అస్త్రంగా దొరికింది. ‘కల్తీ నా కొడుకులు అంటే తెలుసా..’ అంటూ ట్రోల్స్ మెదలుపెట్టారు. ఇంతకీ ఈయన పార్టీ నుంచి ఎప్పుడు బయటకొచ్చారో అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్గా మారింది. గతంలో ఓ ఆడియో టేపు వల్ల రేగిన దుమారం కారణంగా ఆయన ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. Also Read:
Comments
Post a Comment