Posts

Showing posts from January, 2021

65వ పడిలోకి తెలుగువారి ఆనందం బ్రహ్మానందం.. హాస్య బ్రహ్మ సినీ జర్నీలో మైలురాళ్లు ఎన్నో ఎన్నెన్నో..!

Image
బ్రహ్మానందం.. ఈ పేరు వినబడితే చాలు తెలుగు వారి మదిలో ఆనందం చిగురిస్తుంటుంది. తనదైన ఎక్స్‌ప్రెషన్స్, కడుపుబ్బా నవ్వించే డైలాగ్స్‌తో వెండితెరపై హాస్యం పండించడంలో తనకు సాటెవ్వరూ లేరని నిరూపించారు . కోట్లాదిమంది ప్రేక్షకులను ఇట్టే రిలాక్స్ చేసే ఓ కామెడీ టానిక్ ఆయన. మూడున్నర ద‌శాబ్ధాల కెరీర్‌లో దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించిన ఆయన.. స్టార్ హీరోలను మించిన పాపులారిటీ సంపాదించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి అలాంటి కామెడీ కింగ్ పుట్టినరోజు అంటే మామూలుగా ఉంటుందా!. సోషల్ మీడియా హోరెత్తిపోవాల్సిందే.. ఈ రోజు (ఫిబ్రవరి 1) ఆయన పుట్టినరోజు. నేటితో 64 సంవత్సరాలు పూర్తిచేసుకొని 65వ పడిలోకి అడుగుపెడుతున్నారు బ్రహ్మానందం. దీంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఆయన బర్త్ డే విషెస్ మాత్రమే దర్శనమిస్తున్నాయి, హాస్యానికి పెట్టింది పేరు మీరంటూ సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఆయనపై ప్రశంసల వర్షం గుప్పిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ 1956 సంవత్సరంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బ్రహ్మానందం జన్మించారు. ఆయన తండ్రి కన్నెగంటి నాగలింగాచారి, తల్లి పేరు కన్నెగ

స్టార్ డైరెక్టర్‌ శంకర్‌కు 'రోబో' తెచ్చిన కష్టాలు.. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

Image
భారీ సినిమాలు రూపొందిస్తూ తనదంటూ ప్రత్యేక శైలి అని నిరూపించుకున్న స్టార్ డైరెక్టర్ శంకర్ చిక్కుల్లో పడ్డారు. అది కూడా ఆయన రూపొందించిన సినిమా కారణంగా. అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచి రికార్డులు తిరగరాసిన 'రోబో' కథ తనదే అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో డైరెక్టర్‌ శంకర్‌కు చెన్నై ఎగ్మోర్‌ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 2010 సంవత్సరంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ హీరోగా రోబో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు శంకర్. సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో అన్ని సెంటర్లలో భారీ ఆదరణ చూరగొని సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఆ 'రోబో' కథపై అరుల్‌ తమిళ్‌ నందన్‌ అనే రైటర్‌, డైరెక్టర్ శంకర్‌పై పలు ఆరోపణలు చేస్తూ కోర్టుకెక్కాడు. తాను రాసిన 'జిగుబా' అనే కథను కాపీ కొట్టి శంకర్‌ రోబో చిత్రాన్ని తెరకెక్కించాడని కేసు వేశాడు. అయితే ఈ కేసు విషయమై విచారణకు హాజరు కావాలంటూ కోర్టు అనేక పర్యాయాలు ఆదేశించినప్పటికీ శంకర్‌ నుంచి ఎలాంటి స్సందన రాలేదు. దీంతో

మెగాస్టార్ అవతారమెత్తిన ఫేమస్ క్రికెటర్.. చిరంజీవిగా చించేశాడులే! వీడియో వైరల్

Image
కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ఇంట్లోనే ఉంటూ టిక్‌టాక్‌ వీడియోలతో అట్రాక్ట్ చేశాడు ఆస్ట్రేలియన్ క్రికెటర్ . తన భార్యతో కలిసి స్టెప్పులేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి చర్చల్లో నిలిచాడు. ఆ తర్వాత రూటు మార్చిన ఈ క్రికెటర్.. పేస్ ఆఫ్ యాప్‌ను ఉప‌యోగించి అమితాబ్, ప్ర‌భాస్‌, మహేష్ బాబు, ర‌జినీకాంత్ లాంటి స్టార్ హీరోల రీఫేస్ క్రియేట్ చేసి అభిమానుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవిపై దృష్టి పెట్టి ఓ వీడియోతో ఆసక్తి రేకెత్తించాడు డేవిడ్ వార్నర్. ప్రతిష్టాత్మక మూవీ ‘’ టీజర్‌ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌లోని సన్నివేశాన్ని రీఫేస్‌ యాప్‌తో ఛేంజ్‌ చేసి చిరంజీవి డైలాగ్స్‌ని తాను చెబుతున్నట్లు వీడియో తీశాడు డేవిడ్ వార్నర్. ఇక ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వెంటనే వైరల్ అయింది. ఈ మేరకు 'కమింగ్ సూన్' అంటూ ఆయన చేసిన కామెంట్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చిరంజీవి 152వ సినిమాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ 'ఆచార్య' మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరో

చావు కబురు చల్లగా: కార్తికేయ, లావణ్య త్రిపాఠి ప్రేమకు ముహూర్తం.. బ్యూటిఫుల్ రాక్షసి అంటూ హీరో ట్వీట్

Image
RX 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత గుణ 369, 90 ML, హిప్పీ లాంటి డిఫరెంట్ మూవీస్ చేసిన ఆయన ఇప్పుడు '' అంటూ మరో విలక్షణ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో జంటగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. మర్చి 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు హీరో కార్తికేయ. ''ఈ మార్చి 19కి చావు కబురు చల్లగా చెప్పడానికి బాలరాజు గాడు, మల్లిక థియేటర్లలోకి వస్తున్నారు. బిగ్ బ్యానర్ గీత ఆర్ట్స్‌లో ఈ సినిమా చేయడం, బ్యూటిఫుల్ రాక్షసి లావణ్య త్రిపాఠితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది'' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. మరోవైపు ఇదే విషయాన్ని తెలుపుతూ లావణ్య తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది. మీ అందరినీ మార్చి 19న మళ్ళీ థియేటర్స్‌లో కలవనుండటం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని ఆమె పేర్కొంది. డిఫరెంట్ టైటిల్‌లో వస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రి

చావు కబురు చల్లగా: కార్తికేయ, లావణ్య త్రిపాఠి ప్రేమకు ముహూర్తం.. బ్యూటిఫుల్ రాక్షసి అంటూ హీరో ట్వీట్

Image
RX 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత గుణ 369, 90 ML, హిప్పీ లాంటి డిఫరెంట్ మూవీస్ చేసిన ఆయన ఇప్పుడు '' అంటూ మరో విలక్షణ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో జంటగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. మర్చి 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు హీరో కార్తికేయ. ''ఈ మార్చి 19కి చావు కబురు చల్లగా చెప్పడానికి బాలరాజు గాడు, మల్లిక థియేటర్లలోకి వస్తున్నారు. బిగ్ బ్యానర్ గీత ఆర్ట్స్‌లో ఈ సినిమా చేయడం, బ్యూటిఫుల్ రాక్షసి లావణ్య త్రిపాఠితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది'' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. మరోవైపు ఇదే విషయాన్ని తెలుపుతూ లావణ్య తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది. మీ అందరినీ మార్చి 19న మళ్ళీ థియేటర్స్‌లో కలవనుండటం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని ఆమె పేర్కొంది. డిఫరెంట్ టైటిల్‌లో వస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రి

బాలయ్య స్టైలిష్ లుక్ అదుర్స్.. ఎన్టీఆర్ జయంతి నాడే BB3 రిలీజ్

Image
‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ BB3 (వర్కింగ్ టైటిల్). మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పుట్టిన‌రోజు కానుక‌గా విడుదల చేసిన ‘BB3 ఫస్ట్ రోర్’ టీజ‌ర్‌కి అద్భుతమైన స్పందన వ‌చ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఒక ఎగ్జయిటింగ్ అప్‌డేట్‌ను ఆదివారం మధ్యాహ్నం 3:36 గంటలకు అందిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ ఉదయం ప్రకటించింది. అన్నట్టుగానే విడుదల తేదీతో పాటు బాలకృష్ణ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని మే 28న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్నట్టు అధికారికంగా ప్రక‌టించారు. టీజ‌ర్‌లో మాస్‌ లుక్‌లో అద‌ర‌గొట్టిన బాలయ్య.. ఇప్పుడు ఈ కొత్త పోస్టర్‌లో స్టైలిష్‌ లుక్‌లో ఫ్యాన్స్‌ని అల‌రిస్తున్నారు. జేబులో చేయిపెట్టుకుని న‌డిచివ‌స్తున్న బాల‌య్య స్టైలిష్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మే 28 విశ్వవిఖ్యాత న‌ట‌సార్వభౌమ, న‌ట‌ర‌త్న నందమ

గ్రాండ్‌గా 'నరుడి బ్రతుకు నటన' చిత్ర ప్రారంభం.. ముఖ్య అతిథిగా ఎస్. రాధాకృష్ణ

Image
ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్‌మెంట్స్ యువ కథానాయకుడు హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం విదితమే. 'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని నేడు అధికారికంగా ప్రారంభించారు. ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో పూజాకార్యక్రమాలు జరిగాయి. చిత్ర నాయకా, నాయికలు సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టిలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత నిర్మాత ఎస్. రాధాకృష్ణ పెద్ద కుమార్తె హారిక క్లాప్ నివ్వగా, చిన్న కుమార్తె హాసిని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) చిత్ర దర్శక,నిర్మాతలకు చిత్రం స్క్రిప్ట్‌ను అందచేశారు. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలోనిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానుంది. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్

బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ: అల్లు అర్హ అల్లరి వీడియో.. బన్నీ ఎమోషనల్

Image
గారాలపట్టి అల్లు అర్హ తండ్రితో కలిసి ఎంత అల్లరి చేస్తుందో చెప్పాల్సిన అవసరంలేదు. అర్హతో తీసుకున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతూ ఉంటారు బన్నీ. అర్హ ముద్దు ముద్దు మాటలకు బన్నీ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతుంటారు. తాజాగా అర్హ వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు అల్లు అర్జున్. ఈ వీడియోలో అర్హ చిలిపిగా చెప్తున్న డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ’ అని తన తండ్రిని ఉద్దేశించి వీడియోలో అర్హ అంటోంది. ఆమె చిలిపిగా ఆ డైలాగ్ చెప్పగానే వీడియో తీస్తున్న బన్నీ నవ్వు ఆపుకోలేకపోయారు. వాస్తవానికి ఇది గతేడాది మార్చి 1న తీసిన వీడియో అట. కానీ, బన్నీ ఇప్పుడు పోస్ట్ చేశారు. దీనికి కారణం ఉంది. అల్లు అర్జున్ మళ్లీ ‘పుష్ప’ షూటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లారు. తన టీమ్‌తో కలిసి ఆయన కేరళ వెళ్లినట్టు సమాచారం. ఇది కాస్త పెద్ద షెడ్యూల్ అట. అందుకే, ఆ వీడియోను షేర్ చేసి దాని మీద ‘ఐ మిస్ యు అర్హ’ అని రాశారు బన్నీ. తన గారాలపట్టి అల్లరిని మిస్ అవుతున్నందుకు ఆయన కాస్త ఎమోషనల్ అయ్యారు. కానీ, అర్హ వీడియో చూసిన వాళ్లకు బన్నీ ఎమోషన్ కనబడదు.. ఆమె చిలిపి

Pushpa: అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారా..? కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సుకుమార్

Image
స్టైలిష్ స్టార్ హీరోగా రూపొందుతున్న '' మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఇటీవలే కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 13వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుందని ప్రకటించారు. అయితే ఇక్కడే వచ్చి పడింది అసలు కన్ఫ్యూజన్. తాజాగా విడుదల చేసిన ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో బన్నీ కాలుకు ఐదు వేళ్లే కనిపించడంతో జనాల్లో చర్చలు మొదలయ్యాయి. గతంలో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్‌లో కూర్చుని ఉన్నట్లు ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా.. అందులో అల్లు అర్జున్ ఎడమకాలికి ఆరు వేళ్లు కనిపించాయి. కానీ లేటెస్ట్ పోస్టర్‌ నిశితంగా గమనిస్తే ఆ కాలుకి ఐదు వేళ్లే కనిపిస్తున్నాయి. దీంతో ఈ పోస్ట‌ర్‌ చూసిన ఫ్యాన్స్ బ‌న్నీ ఇందులో డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడా? అని చర్చించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే దీనిపై పెద్ద డిస్కషన్ మొదలైంది. చూడాలి మరి.. ఈ విషయంలో అసలు సీక్రెట్ ఏంటనేది సుకుమార్ చెబుతారా? లేక సస్పెన్సు లోనే ఉంచుతారా? అనేది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జ‌రుగుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తుండగా.. ఆయన

‘ఆహా’లో రవితేజ ‘క్రాక్’.. వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌కు డేట్ ఫిక్స్

Image
మాస్ మహారాజా హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘క్రాక్’. బి.మధు నిర్మాత. భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. విడుదలైన తొలి వారంలోనే లాభాల బాట పట్టింది. తొలి రోజు ఆర్థిక సమస్యలతో రాత్రి వరకు షోలు పడకపోయినా ఆ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడలేదు. మొత్తానికి రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా ‘క్రాక్’ నిలిచింది. ఇంత సూపర్ హిట్ అయిన ‘క్రాక్’ సినిమాను ఇంకా థియేటర్లలో చూడని వారికి శుభవార్త. ప్రముఖ అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో ‘క్రాక్’ మూవీ అందుబాటులోకి వస్తోంది. ఫిబ్రవరి 5 నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ‘క్రాక్’ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌కు డేట్ ఫిక్స్ చేస్తూ ‘ఆహా’ ట్వీట్ చేసింది. అంతేకాదు, కొత్త ట్రైలర్‌ను రేపు 11 గంటలకు విడుదల చేస్తోంది ‘ఆహా’. ‘క్రాక్’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ‘ఆహా’ సొంతం చేసుకున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ రైట్స్‌ను ‘ఆహా’ రూ.6.5 కోట్లకు సొంతం చేసుకున్నట్టు మొదట ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం రాగా.. ఇప్పుడు, ర

Khiladi: క్రాకింగ్ హిట్ తర్వాత మరో మాస్ జాతరకు ముహూర్తం ఫిక్స్.. 'ఖిలాడీ'గా రవితేజ రెడీ

Image
ఈ మధ్య వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాస్ మహారాజ్ ఇటీవలే 'క్రాక్' సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కారు. కొత్త ఏడాది ఆరంభంలోనే సంక్రాంతి బరిలో దిగి క్రాకింగ్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం అదే జోష్‌లో తన లేటెస్ట్ మూవీ ''లో నటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాను మే 28వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేసి రవితేజ అభిమానుల్లో జోష్ నింపారు చిత్ర నిర్మాత సత్యనారాయణ కోనేరు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటిస్తుండటం విశ

నేను నిక్షేపంగా ఉన్నాను.. ఆ వార్తలు బాధించాయి: నటి ఆమని ఆవేదన

Image
రెండు రోజుల క్రితం తెలంగాణలోని మంచిర్యాలలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సీనియర్ నటి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లి వైద్యం తీసుకున్నారు. అక్కడి మెడికల్ స్టాఫ్ కోరిక మేరకు వాళ్లతో ఒక ఫొటో కూడా దిగారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమనికి అస్వస్థత అనే వార్త క్షణాల్లో వ్యాపించేసింది. డిజిటల్ మీడియాలో ఈ వార్త హైలైట్ అయ్యింది. కొంత మంది అత్యుత్సాహంతో ఆమని గుండె పోటు అని రాసేశారు. అయితే, ఈ వార్తలపై నటి ఆమని స్పందించారు. ఇలాంటి వదంతులు ఎందుకు పుడతాయో అర్థం కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను నిక్షేపంగా ఉన్నానని.. దయచేసి వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆమె మీడియాలో మాట్లాడారు. ‘‘నేను నిక్షేపంగా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. ఫుడ్ పాయిజన్ వల్ల కొంచెం అస్వస్థతగా అనిపించడంతో యూనిట్ బలవంతం మీద ఆసుపత్రికి వెళ్లాను. దీన్ని హార్ట్ ఎటాక్‌గా చిత్రీకరించడం చాలా బాధాకరం’’ అని ఆమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మంచిర్యాల జిల్లాకు చెందిన గేయ రచయిత తైదల బాపు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ చిత్రంలో ఆమని నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నిమ

నా కెరీర్‌లో పెద్ద అడుగు.. ఎన్నో రోజుల కల నెరవేరింది.. యాంకర్ ప్రదీప్ ఎమోషనల్ కామెంట్స్

Image
బుల్లితెరపై మాటల తూటాలతో అలరించి తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్న వెండితెరపై కూడా టాలెంటెడ్ యాక్టర్ అనిపించుకుంటున్నాడు. హీరోగా ఆరంగేట్రం చేసిన తొలి సినిమాతోనే పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. ఆయన హీరోగా శుక్రవారం విడుదలైన '?' మూవీ తొలిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా థియేటర్స్ మూతబడటంతో వాయిదాపడి చివరకు ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన ''నీలి నీలి ఆకాశం ఇద్దామ‌నుకున్నా..'' సాంగ్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకొని సినిమాపై హైప్ పెంచేసింది. దీంతో తొలిరోజే ఈ మూవీ రూ.4 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. చిత్రంలో హీరోగా ప్రదీప్ నటన చాలా బాగుందనే టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు ప్రదీప్. ''ఒక చిన్న సినిమాకు విశేష స్పందన రావడం ఆనందంగా ఉంది. ఎన్నోరోజుల కల ఇది. మీ అందరి సహకారంతోనే ఈ రోజు సాధ్యమైంది. నీ కెరీర్‌లో పడిన అతిపెద్ద అడుగుకు ఇంతటి సపోర్ట్ అందడం చాలా

‘జల జల జలపాతం’ సాంగ్: దేవిశ్రీ సంగీతం.. శ్రేయా ఘోషల్ గానం.. జస్ట్ వావ్

Image
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘ఉప్పెన‌’. కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించారు. సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సుకుమార్ రైటింగ్స్ సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఫిబ్రవ‌రి 12న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. వీటిలో ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్ సూపర్ డూపర్ హిట్టయ్యింది. అలాగే ‘ధక్ ధక్’, ‘రంగులద్దుకున్న’ పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో అందమైన పాట విడుదలైంది. ‘జల జల జలపాతం’ అంటూ సాగే ఈ మెలొడీ సంగీత ప్రియులను అలరిస్తోంది. ఈ పాటను సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేయడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ మరో అద్భుతమైన మెలొడీని స్వరపరిచారు. శ్రీమణి సాహిత్యం, జస్ప్రీత్ జాజ్ - శ్రేయా ఘోషల్ గానం, దేవిశ్రీ సంగీతం కలిపి మరో గుర్తుండిపోయే పాటను తెలుగు ప్రేక్షకులకు అందించాయి. మరోవైపు,

ఇకపై థియేటర్లలో 'ఫుల్' ఆక్యుపెన్సీ.. సినీ ప్రియులకు శుభవార్త చెప్పిన కేంద్రం

Image
కరోనా తెచ్చిన కష్టాల్లో థియేటర్ గేట్లు మూతపడటం ఒకటి. గతేడాది కోవిడ్ ప్రభావంతో సినిమా షూటింగ్స్, థియేటర్స్ అన్నీ క్లోజ్ కావడంతో సినీ పరిశ్రమ విలవిల్లాడింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని గతేడాది అక్టోబర్‌లో పర్మిషన్స్ ఇచ్చిన కేంద్రం.. తాజాగా మరో సడలింపు చేసింది. ఇకపై థియేటర్స్ 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకోవచ్చని అనుమతులిస్తూ ఇటు సినీ ప్రియులకు, అటు థియేటర్ యాజమాన్యాలకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. క్రమంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుండటంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులు కూడా ఇప్పుడిప్పుడే సినిమా హాళ్లలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఇకపై థియేటర్లు 'ఫుల్' ఆక్యుపెన్సీతో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. థియేటర్‌ యాజమాన్యాలు సంతోషించేలా 100 శాతం ఆక్యుపెన్సీకి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసింది. జనవరి 31 నుంచే నుంచి ఇది అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు థియేటర్ జయమాన్యాలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేస

అప్‌డేట్‌తో బాలకృష్ణ రెడీ.. ఫ్యాన్స్‌కు పూనకాలేనట!

Image
డైరెక్టర్ బి.గోపాల్ తరవాత నందమూరి బాలకృష్ణలోని ఫైర్‌ను ఆ స్థాయిలో చూపించిన దర్శకుడు బోయపాటి శ్రీను. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ అనగానే అది కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అనే అభిప్రాయానికి చాలా మంది వచ్చేస్తారు. దీనికి కారణం గతంలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు. ‘సింహా’ సినిమా ద్వారా కొత్త బాలకృష్ణను చూపించి తన ప్రత్యేకతను చాటుకున్నారు బోయపాటి శ్రీను. ఆ తరవాత ‘లెజెండ్’ సినిమాతో తమ కాంబో సూపర్ హిట్ అని నిరూపించారు. అందుకే, ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తోన్న మూడో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘‘రాజు గారు మీ నాన్నగారు బాగున్నారా అనడానికి.. రాజు గారు నీ అమ్మ మొగుడు బాగున్నాడా అనడానికి చాలా తేడా ఉందిరా లమ్మిడీ కొడకా’’ అంటూ వీడియోలో బాలయ్య చెప్పిన డైలాగ్ అభిమానులను ఊపేసింది. అంతేకాకుండా న్యూ లుక్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. ఈ సినిమా టైటిల్‌ను ఎప్పుడు ప్రకటిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ‘మోనార్క్’ అనే టైటిల్ చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. ప్రస్తుతానికి BB3 అని పిలుస్తున్నారు.

అది డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయం: RRR విడుదల తేదీ వివాదంపై నిర్మాత దానయ్య

Image
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ RRR. దసరా సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ డి.వి.వి. ఎంటర్‌టైన్మెంట్ ఇటీవల ప్రకటించింది. RRR టీమ్ కొత్త విడుదల తేదీని ప్రకటించడంతో ఇటు చరణ్, తారక్ ఫ్యాన్స్‌తో పాటు అటు రాజమౌళి అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆనందంగా వ్యక్తం చేశారు. అయితే, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ మాత్రం రాజమౌళిపై అసహనం వ్యక్తం చేశారు. బోనీ కపూర్ అసహనం వ్యక్తం చేయడానికి కారణం ‘మైదాన్’ సినిమా. ఫుట్ బాల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి బోనీ కపూర్ ఒక నిర్మాత. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. అందుకే, బాక్సాఫీసు వద్ద RRR-మైదాన్ క్లాష్‌పై బోనీ కపూర్ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇది అన్యాయమని అన్నారు. దీంతో, ఈ రెండు సినిమాల క్లాష్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. లాక్‌డౌన్ వల్ల ఇప్పటికే బాలీవుడ్ తీవ్రంగా నష్టపోయిందని.. ఈ క్లాష్ వల్ల ఏ సినిమాకు న్యాయం జరగదని కొంత మంది

Director Munna: ప్రదీప్ హీరో ఏంటి.. థియేటర్‌కి ఎవడొస్తాడు అన్నారు.. దానికి సమాధానమే ఈ 4.17 కోట్లు: డైరెక్టర్ మున్నా

Image
యాంకర్ ప్రదీప్‌కే కాదు.. దర్శకుడు మున్నా‌కి కూడా తొలి చిత్రం ఈ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’?. యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన ప్రదీప్ ఈ చిత్రంతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ 300 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టి సంచలనంగా మారడంతో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రానికి మంచి హైప్ వచ్చింది. మంచి అంచనాలతో జనవరి 29న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్‌ వచ్చినప్పటికీ తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించగా.. దర్శకుడు మున్నా ఎమోషనల్‌గా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాకి ప్రాణం.. ఇందులోని నీలి నీలి ఆకాశం పాట. 300 మిలియన్ వ్యూస్ దాటి వెళ్తూనే ఉంది. ఈ సాంగ్ చూడటం కోసం చాలా మంది థియేటర్స్‌కి వస్తున్నారు. ఇండస్ట్రీలో ఈ కథ అనుకున్నప్పుడు ఒకే ఒక క్వచ్ఛన్ ఉండేది.. కథ చాలా బాగుంది.. డైలాగ్స్ చాలా బాగున్నాయ్.. దీనికి ప్రదీప్ హీరో ఏంటి అని ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు చాలామంది నన్ను క్వచ్ఛన్ వేశారు. చేతిలో రిమోట్ మార్చితే ప్రదీప్ కనిపిస్తాడు.. అతన్ని చూడటం కోసం థియేటర్‌కి వస్తా

Chaavu Kaburu Challaga: వామ్మో అనసూయ!! మూడు నిమిషాల ఐటమ్ సాంగ్‌కి 20 లక్షలు.. ‘చావు కబురు చల్లగా’!

Image
‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా ప్రేక్షకుల్ని మైమరపించిన బజర్దస్త్ యాంకర్.. బుల్లితెరపైనే కాదు.. వెండితెరపై కూడా హవా కొనసాగిస్తుంది. చాలా సెలెక్టివ్‌గా కీలకపాత్రల్లో కనిపిస్తున్న అనసూయ.. అప్పుడప్పుడూ ఐటమ్ సాంగ్స్‌తో కూడా మెరుస్తోంది. ఆ మధ్య సాయి ధరమ్ తేజ్ ‘విన్నర్’ సినిమాలో సుయ సుయ అనసూయ సాంగ్‌లో ఐటమ్ భామగా మెరిసిన అనసూయ.. ఎఫ్ 2 చిత్రంలోని డింగు డాంగ్ సాంగ్‌లో మెరుపులు మెరిపించింది. అయితే తాజాగా కార్తీకేయ హీరోగా తెరకెక్కుతున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో మరోసారి ఐటమ్ సాంగ్ చేయబోతుందట అనసూయ. ఇందులో విశేషం ఏముందిలే.. అనసూయకి ఐటమ్ సాంగ్ ఏమీ కొత్త కాదుగా అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ పాట కోసం ఏకంగా రూ.20 లక్షలు రెమ్యునరేషన్ చెల్లిస్తున్నారట నిర్మాతలు. సినిమాలో ఈ పాట కీలకం కావడంతో మంచి క్రేజ్ ఉన్న జబర్దస్త్ భామ అయితేనే పర్ఫెక్ట్ అని భావించిన చిత్ర నిర్మాత బన్నీ వాసు అనసూయవైపే మొగ్గు చూపిస్తున్నారట. అందుకే రూ.20 లక్షలు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారట. భారీ హంగులతో చిత్రీకరిస్తున్న ఈ ఐటమ్ సాంగ్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం విశేషం. అయితే విచిత్రం ఏ

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ‘మహా సముద్రం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇద్దరు హీరోల మధ్య యుద్ధం ఎప్పుడంటే

Image
లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో షూటింగ్ దశలో ఉన్న సినిమాలన్నీ ఆగిపోయాయి. అయితే ఇటీవల షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో వరుస సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. పోటాపోటీగా విడుదల తేదీలను ప్రకటిస్తూ సినీ సందడిని తీసుకువస్తున్నారు మన హీరోలు. ‘సర్కారు వారి పాట’, ‘వకీల్ సాబ్’, ‘పుష్ప’, ‘ఎఫ్ 3’, ‘నారప్ప’, ‘వకీల్ సాబ్’, ‘కేజీఎఫ్’, ‘గని’ చిత్రాల విడుదల తేదీలను ఇప్పటికే ప్రకటించగా.. , సిద్దార్థ్ మల్టీస్టారర్ మూవీ ‘’ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్ర యూనిట్. ‘ఎగసిపడే సముద్రపు అలల్లో, మీరు కొలవలేనంత ప్రేమని పరిచయం చేయడానికి వస్తున్నాం.’ అంటూ ‘మహా సముద్రం’ టీమ్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. RX 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహా సముద్రం’ చిత్రం ఆగష్టు 19న గ్రాండ్‌గా విడుదల కానుంది. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు హీరో సిద్ధార్థ్. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత మళ్లీ ‘మహా సముద్రం’ అంటూ పలకరించబోతున్నాడు సిద్ధార్థ్. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని న

Pawan Kalyan: ‘వకీల్ సాబ్’ వచ్చేస్తున్నాడు.. అఫీషియల్ రిలీజ్ డేట్ ఇదిగో

Image
జనసేన అధినేతగా కంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌గా ఆయన్ని అభినించేవాళ్లు కోట్లాదిమంది ఉన్నారు. అప్పుడు ఇప్పుడు కాదు.. ఎప్పుడొచ్చినా బొమ్మ థియేటర్‌లో పడిందంటే రికార్డుల సునామీనే. అందరి లెక్కతేలుస్తూ.. బాక్సాఫీస్ వద్ద తిక్క చూపించే పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. లాంగ్ గ్యాప్ తరువాత ‘’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న పవన్ కళ్యాణ్.. రీ ఎంట్రీ మూవీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. ఏప్రియల్ 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ‘వకీల్ సాబ్’. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేసింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘పింక్’‌ను తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేశారు పవర్ స్టార్. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించగా.. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌ హీరోయిన్‌గా నటించగా.. నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల కీలక పాత్రల్లో

అట్రాక్ట్ చేసే కథతో 'పీన‌ట్ డైమండ్'.. ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి

Image
విభిన్న తరహా కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. అదే నమ్మకంతో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం ''. ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఈ మూవీ రూపొందుతోంది. అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అన్నీ తానై చూసుకుంటున్నారు వెంక‌టేష్ త్రిప‌ర్ణ. `బెంగాల్ టైగ‌ర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసిన యూనిట్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కాగా తాజాగా ఈ మూవీకి డైరెక్టర్ సపోర్ట్ లభించింది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మారుతి. రెండు కాల‌మాణాల‌కు సంబంధించిన ఓ విభిన్న క‌థాంశంతో అన్నివ‌ర్గాల ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఈ మూవీ రూపొందిస్తున్నామని, 1989లో ఒక క‌థ‌ జ‌రుగుతూ ఉంటే దానికి ప్యార‌ల‌ల్‌గా 2020లో మ‌రోక క‌థ ర‌న్ అవుతుండటం ఆసక్తి రేకెత్తిస్తుందని నిర్మాత‌లు

Actress Hema: నేను తోపు.. పులి.. నా తరువాత ఎవరూ లేరు రారు: స్టేజ్‌పై హేమ కన్నీళ్లు

Image
యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రం ఈ శుక్రవారం (జనవరి 29) విడుదలై మిక్స్డ్ టాక్ రాబట్టింది. ఈ చిత్రంలో హేమ యాంకర్ ప్రదీప్ తల్లి పాత్రలో అలరించింది. కొడుకుని విపరీతంగా ప్రేమించినా.. కొడుకు నుంచి తిరిగి ప్రేమను పొందుకోలేక కుమిలిపోయే అమ్మ పాత్రలో అద్భుతంగా నటించింది హేమ. ఆమె కెరియర్‌లోనే ఇది విభిన్న పాత్ర కాగా.. ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు చెప్తూ ఎమోషనల్ అయ్యింది హేమ. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సక్సెస్ మీట్‌‌లో పాల్గొన్న హేమ మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యింది. ఇలాంటి పాత్ర కోసం గత ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నా ఎవరూ ఇవ్వలేదని.. ఈ ఆనందం నాకు మూడు నందులకంటే ఎక్కువ అంటూ పొంగిపోయారు. హేమ మాట్లాడుతూ.. ‘నాకు రెండు మూడు నంది అవార్డులు వచ్చినా.. ఎప్పుడూ నా కళ్లవెంట నీళ్లు రాలేదు. నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా.. దాదాపు ఆరేడేళ్ల నుంచి ట్రై చేస్తున్నా.. ఇలాంటి పాత్ర కోసం. ఈ విషయం పూరీ జగన్నాథ్ అన్నయ్యకి బాగా తెలుసు. నేను మదర్ క్యారెక్టర్ కోసం వాడితో ఎంతో గొడవపడేదాన్ని. అలాగే సుకుమార్ గారితో కూడా గొడవ పడితే.. ఆయన కుమారి 21F సినిమాలో మదర్ క్య

అఫీషియల్: రవితేజ సినిమాలో అర్జున్.. ఖిలాడీ క్లబ్‌లో చేరిపోయిన యాక్షన్ కింగ్

Image
సౌత్ ఇండియన్ తెరపై అంటే ఓ స్పెషల్ ఇమేజ్ ఉంటుంది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోగల సత్తా ఉండటంతో యాక్షన్ కింగ్ అని పిలిపించుకుంటూ ప్రేక్షకలోకాన్ని అలరిస్తున్నారు అర్జున్. పాత్ర పరిధి ఎంతనేది పక్కనబెట్టి ఆ రోల్ నచ్చితే చాలు వెంటనే ఓకే చెప్పేస్తున్న ఆయన.. రీసెంట్‌గా హీరోగా తెరకెక్కుతున్న '' మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటిస్తూ ఆయనకు స్వాగతం పలికింది 'ఖిలాడీ' యూనిట్. ఖిలాడీ క్లబ్‌కి స్వాగతం అని పేర్కొంటూ అర్జున్‌, ఈ మూవీ టైటిల్‌తో కూడిన ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు డైరెక్టర్ రమేష్ వర్మ. దీంతో తమ అభిమాన హీరో మూవీలో అర్జున్ కూడా నటిస్తున్నారని తెలిసి మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ భాగం కావడం ఆనందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన `నా పేరు సూర్య` తర్వాత మరోసారి ఈ 'ఖిలాడీ'తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు అర్జున్. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ

'ఆచార్య' లొకేషన్స్‌లో చిరంజీవితో తెలంగాణ మంత్రి.. అందుకే అక్కడికెళ్లారట!

Image
మెగాస్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ''. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ హైదరాబాద్ శివారులోని కోకాపేటలో ఉన్నారు. అక్కడ సెలక్ట్ కొన్ని లొకేషన్స్‌లో చిరంజీవిపై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ షూటింగ్ లొకేషన్స్‌‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 'ఆచార్య' సెట్స్ పైకి వెళ్లి చిరంజీవితో సరదాగా ముచ్చటించిన విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ కొన్ని ఫొటోలు పంచుకున్నారు. షూటింగ్ లొకేష‌న్‌కి వెళ్లి చిరంజీవితో పాటు ఆచార్య సినిమా దర్శకుడు కొరటాల శివను కలిసి కాసేపు ఆయన మాట్లాడారు. ఈ మేరకు 'ఆచార్య' సక్సెస్ కావాలని కోరుకుంటూ చిత్రయూనిట్ మొత్తానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ''ఆచార్య చిత్ర యూనిట్‌తో చిరు హాసం.. మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రం ఆచార్య చిత్రం విజయవంతం కావాలని కోరుతూ..'' అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంట

Mr Miss Movie: సక్సెస్ సంబరాల్లో ‘పెళ్లి చూపులు’ జ్ఞానేశ్వరి.. ప్రదీప్‌ సినిమాతో పోటీగా దిగి

Image
జీ తెలుగులో ప్రసారమైన ‘పెళ్లి చూపులు’ షో యాంకర్ ప్రదీప్‌నే కాదు.. ఆ షోలో విజేతగా నిలిచిన జ్ఞానేశ్వరిని కూడా సెలబ్రిటీగా మార్చేసింది. పెళ్లి చూపులు షోలో విజేతగా నిలవడంతో.. ప్రదీప్‌కి నచ్చిన ఈ యువతిని పెళ్లాడబోతున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే అది పెళ్లి చూపులు దగ్గరే ఆగిపోవడంతో ఇప్పటికీ వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఆ విషయాన్ని పక్కనపెడితే.. వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా ఒకేసారి పరిచయం కావడమే కాదు.. వీళ్లి సినిమాలు కూడా ఒకే రోజు విడుదలయ్యాయి. యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా నిన్న (జనవరి 29) విడుదల కాగా.. ఇదే రోజు హీరోయిన్‌గా నటించిన ‘మిస్టర్ & మిస్’ చిత్రం థియేటర్స్‌లో విడుదలైంది. అయితే ప్రదీప్ సినిమా భారీగా ఎక్కువ థియేటర్స్‌లో విడుదల కాగా.. జ్ఞానేశ్వరి తొలి చిత్రం మాత్రం చాలా తక్కువ థియేటర్స్‌లో విడుదలైంది. డేటింగ్, వీడియో చాటింగ్‌లతో పక్కదారి పడుతున్న యువతను మేలుకొలిపే కథనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిస్టర్ అండ్ మిస్’ చిత్రాన్ని క్రౌడ్ ఫండెడ్ అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. జ్ఞానేశ్వరి కండ్రేగ

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? కలెక్షన్ రిపోర్ట్.. తొలిరోజు యాంకర్ ప్రదీప్ హవా ఎలా ఉందంటే!!

Image
బుల్లితెరపై తనదైన శైలి యాంకరింగ్ చేస్తూ సొంత అభిమానులను కూడగట్టుకున్న .. ? అంటూ వెండితెరపై హీరోగా ఆరంగేట్రం చేశాడు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. నిన్న (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమాకు ఆశించిన మేర స్పందన వచ్చిందని తాజాగా వచ్చిన కలెక్షన్ రిపోర్ట్ చూస్తుంటే అర్థమవుతోంది. మరోవైపు ప్రదీప్ నటనపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుండటం ఈ మూవీకి ప్లస్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కలెక్షన్ రిపోర్ట్ చూస్తే.. నైజాం- 64 లక్షలు సీడెడ్- 24 లక్షలు ఉత్తరాంధ్ర- 17 లక్షలు ఈస్ట్ గోదావరి- 14 లక్షలు వెస్ట్ గోదావరి- 12.5 లక్షలు కృష్ణా- 10 లక్షలు గుంటూరు- 19 లక్షలు నెల్లూరు- 8 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి టోటల్ కలెక్షన్స్ చూస్తే 2.73 కోట్ల గ్రాస్ వసూలు కాగా 1.69 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఇక కేరళ, ఇతర రాష్ట్రాలు కలిపి మరో 8 లక్షలు, ఓవర్‌సీస్‌లో 6 లక్షలు వసూలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా టోటల్‌గా చెప్పాలంటే 1.83 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదయ్యాయి. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.97 కోట్లు. ఏరియా వైజ్ బ్రేక్ ఈవెన్

ఆ గిఫ్ట్ చూడగానే గంగవ్వ రియాక్షన్.. మై విలేజ్ షో టీమ్‌పై యాంకర్ ప్రదీప్ కామెంట్స్

Image
మై విలేజ్ షో టీమ్.. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇది. మారుమూల గ్రామంలోని గల్లీలో ప్రారంభమైన వీరి ప్రయాణం సెలబ్రిటీల వరకూ వెళ్లింది. ఈ టీమ్ సభ్యుల్లో ముఖ్యంగా మాటతీరు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తెలంగాణ యాస, భాషకు ఉండే ఆదరణే వేరని తనదైన మాటలతో నిరూపించింది గంగవ్వ. కూలీ పనులు చేసుకుంటూ, కనీసం ఊరు దాటి బయటికి వెళ్లడం తెలియని ఆమె యూట్యూబ్‌తో ఓ స్టార్ అయిపోయింది. దీంతో బిగ్ బాస్ ఛాన్స్ రావడం, సినిమా ప్రమోషన్స్ కోసం గంగవ్వను ఎంటర్ చేయడం.. అబ్బో ఒక్కటేమిటి ఇలా ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తాను హీరోగా చేసిన '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమా ప్రమోషన్స్ కోసం 'మై విలేజ్ షో' టీమ్‌తో ఓ వీడియో చేశారు. ఇందులో గంగవ్వతో ప్రదీప్ ముచ్చట్లు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటూ '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమాకు బెస్ట్ ప్రమోషన్ ఇస్తున్నాయి. అంతేకాదండోయ్.. ఈ వీడియో యూట్యూబ్‌ ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్‌లో ఉంది. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ తర్వాత తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో , గంగవ్వపై యాంకర్ ప్రదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''మై విలేజ్ ష

సమ్మర్ త్వరగా వస్తే ఎంత బాగుంటుందో..! ఆతృతగా ఉందంటున్న నిహారిక.. అసలు కారణమిదే

Image
మెగా డాటర్ సమ్మర్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇది మేం చెప్పడం కాదండోయ్.. స్వయంగా ఆమెనే ట్వీట్ చేసింది. మరి సమ్మర్‌లో ఏంటి ప్రత్యేకం..? నిహారిక ఆతృత దేనికి? ఇదేగా మీ సందేహం. ఇక అక్కడికే వచ్చేద్దాం.. నిహారిక పెదనాన్న (డాడీ) హీరోగా రాబోతున్న ప్రతిష్టాత్మక సినిమా 'ఆచార్య' మే నెల 13వ తేదీన విడుదల కానున్నట్లు అఫీషియల్ ప్రకటన రావడంతో నిహారిక చూపు వేసవిపై పడింది. ఇటీవలే జొన్నలగడ్డ వెంకట చైతన్యను పెళ్లాడి ఓ ఇంటిదైన నిహారిక.. పెళ్లికి ముందు లాగే తన సోషల్ మీడియా హంగామాను కంటిన్యూ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫొటోస్, వెకేషన్ ట్రిప్స్ డీటెయిల్స్ లాంటి వివరాలు షేర్ చేస్తూనే రెగ్యులర్ అప్‌డేట్స్ కూడా మన ముందుకు తెస్తోంది. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' టీజర్ చూసి ''అద్భుతం'' అని కామెంట్ చేసిన ఆమె.. సినిమా కోసం సమ్మర్ వరకూ ఆగాలా? ఈ సమ్మర్ త్వరగా వస్తే ఎంత బాగుంటుందో.. అని పేర్కొంది. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. మెగాస్టార్ 152వ సినిమాగా 'ఆచార్య' మన ముందుకు రాబోతోంది. సందేశాత్మక చిత్రాలను రూపొందించడంలో దిట్ట అని నిరూపించుకు

Live Telecast: లైవ్‌లో దెయ్యాన్ని చూపించాలనే వెరైటీ ఆలోచన.. పెళ్లయ్యాక కాజల్ డేరింగ్ స్టెప్

Image
స్టార్ హీరోయిన్ ఇటీవలే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చిన ఈ అమ్మడు.. ప్రస్తుతం తాను కమిటైన సినిమాల షూటింగ్స్ పూర్తిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తొలి వెబ్ సిరీస్ '' విడుదలకు సిద్ధమైంది. హారర్ నేపథ్యంలో ఓ డిఫరెంట్ కథతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కేవలం ఒక నిమిషం 19 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిపోయింది. హారర్ సన్నివేశాలను చాలా డిఫరెంట్ వే లో షూట్ చేశారని తెలుస్తోంది. లైవ్‌లో దెయ్యాన్ని చూపించాలనే వెరైటీ ఆలోచన చేసి ఓ ఇంటికి వెళ్లిన కాజల్ బృందం ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంది? నిజంగా వాళ్లకు దెయ్యం కనపడిందా? ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? అనే విషయాలను తెలియపర్చుతూ ట్రైలర్ విడుదల చేశారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సీరీస్ థ్రిల్లింగ్ కథగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు క్లియర్‌గా అర్థమవుతోంది. ఈ మూవీలో టీవీ రిపోర్టర్‌గా కాజల్ కనిపించనుంది. టీఆర్పీ, సెన్సేషనలిజం కోసం దెయ్యాలను లైవ్‌లో కవర్ చేసి చూపిస్తామని కాజల్

Ram Charan: నిజంగా అది నా అదృష్టం.. 'ఆచార్య'పై ఫీలింగ్స్ బయటపెట్టిన రామ్ చరణ్

Image
మెగాస్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో '' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సిద్ధ అనే ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నిన్న (శుక్రవారం) సాయంత్రం ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేయగా.. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేసిన రామ్ చరణ్.. ఆచార్యలో సిద్ధ పాత్రలో నటించడం, తండ్రి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై రియాక్ట్ అయ్యారు. ఈ సినిమాలో తనది అతిథి పాత్ర కాదని చెప్పిన చెర్రీ తన తండ్రి, మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి ఒకే తెరపై కనిపించనుండటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నాన్న సినిమాలో, నాన్నతో కలిసి నటించే అవకాశం కల్పించిన దర్శకుడు కొరటాల శివకు ప్రత్యేక ధన్యవాదాలు అని రామ్ చరణ్ తెలిపారు. గత కొన్నిరోజులుగా జరుగుతున్న 'ఆచార్య' రెగ్యులర్‌ షూట్‌లో రామ్ చరణ్ కూడా‌ పాల్గొంటున్నారు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చెర్రీ సరసన పూజా హెగ్డే కనిపించనుందట. వీళ్ళిద్దరితో ఓ డ్యూయట్ కూడా ప్లాన్ చ

28 ఏళ్ల తర్వాత మళ్లీ మే నెలలో చిరంజీవి సినిమా.. నక్షత్రం కూడా బాగా కలిసొస్తుందట!

Image
మెగాస్టార్ , డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న భారీ చిత్రం ‘ఆచార్య’ను వేసవి కానుకగా మే 13న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం ‘ఆచార్య’ టీజర్‌ను విడుదల చేసిన గంటన్నర వ్యవధిలోనే చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు మెగాస్టార్. అయితే, ఈ విడుదల తేదీపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. మే నెల గతంలో చిరంజీవికి బాగా అచ్చొచ్చిందట. చిరంజీవి కెరీర్‌లో ఎవర్‌గ్రీన్ హిట్స్‌గా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలు మే నెలలోనే విడుదలయ్యాయి. అలా అని అన్నీ సూపర్ హిట్లే కాదు.. మే నెలలో విడుదలైన చిరంజీవి సినిమాల్లో ఫ్లాపులు ఉన్నాయి. ‘ఖైదీ’ సినిమాతో స్టార్ హీరో హోదాను సంపాదించిన చిరంజీవి.. ఆ తరవాత చాలా తక్కువ సినిమాలను మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. చిరంజీవి 86వ చిత్రం ‘వేట’ 1986 మే 28న విడుదలైంది. కానీ, ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తరవాత మళ్లీ 1990 మే 9న ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ విడుదలైంది. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ‘వేట’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’కి మధ్య 22

అన్ని ఏరియాల్లోనూ మా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి: ప్రదీప్ మాచిరాజు

Image
స్టార్ యాంకర్ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా రూపొందిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఫణి ప్రదీప్ (మున్నా)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ యస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత యస్వీ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. యూవీ క్రియేషన్స్, జీఏ2 సంస్థల ద్వారా ఈ చిత్రం నేడు (జనవరి 29న) ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. కాగా, శుక్రవారం హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్స్‌లో ఉన్న సుదర్శన్ 35ఎంఎం థియేటర్‌లో ఆడియెన్స్ మధ్య చిత్ర యూనిట్ సినిమాని వీక్షించింది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ.. ‘ఈరోజు కోసమే ఇంతకాలం వెయిట్ చేశాం. ఫైనల్‌గా మా సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఎన్నో సంవత్సరాల నుండి ఇదే థియేటర్‌లో సినిమాలు చూశాను. ఇప్పుడు నా సినిమా కూడా చూసుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. సినిమాలో ప్రతీ సీన్, ప్రతీ పాటకు ఆడియెన్స్ నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. విజిల్స్, క్లాప్స్‌తో ప్రతీ ఒక్కరూ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు మున్నా అనుకున్న కథకి, సన్నివేశాలకు తగ్గట్లుగా అనూప్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. తన మ్యూజిక్‌తో సినిమాకి ప్రాణం పోసారు.

‘కె.జి.యఫ్ 2’ రిలీజ్ డేట్: జులైలో వస్తోన్న రాకీ భాయ్

Image
‘తొంద‌ర‌ప‌డితే చ‌రిత్రను తిర‌గ రాయ‌లేం.. ఊరికే చ‌రిత్రను సృష్టించ‌లేం’. ఇది నిజ‌మ‌ని న‌మ్మించ‌డానికి సిద్ధమ‌వుతున్నాడు రాకీ భాయ్‌. ‘కె.జి.యఫ్: ఛాప్టర్ 1’తో న‌‌రాచీలో మొద‌లైన రాకీ భాయ్ దండ‌యాత్ర పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద ఈ దండ‌యాత్రను కొనసాగించడానికి రాకీ భాయ్ మ‌రోసారి సిద్ధమ‌వుతున్నాడు. మరింతగా థ్రిల్‌కు గురిచేసే అంశాలతో జులైలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాకింగ్ స్టార్ య‌శ్ క‌థానాయ‌కుడిగా ప్రశాంత్ నీల్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కె.జి.యఫ్: ఛాప్టర్ ‌2’. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ సహా ప్రకాశ్‌ రాజ్, రావు రమేష్ వంటి ప్రతిభావంతులైన నటులు నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ 150 మిలియన్ వ్యూస్‌తో 7.5 మిలియన్ లైక్స్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కనీవినీ ఎరుగని రీతిలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రికార్డే చెబుతోంది సినిమా కోసం ప్రేక్షకులు ఎంత క్రేజీగా ఎదురుచూస్తున్నారో. ఆ అంచనాలకు ధీటుగా ‘కె.జి.యఫ్: ఛాప్టర్ ‌2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై నిర్మాత విజయ

జగన్‌తో మంచు విష్ణు లంచ్.. సీఎంలో కొత్త కోణం గురించి చెప్పిన హీరో!

Image
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిలను హీరో దంపతులు శుక్రవారం కలిశారు. భార్య విరానికాతో కలిసి తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన విష్ణు.. సీఎం జగన్ దంపతులతో కాసేపు సరదాగా గడిపారు. వారితో మధ్యాహ్న భోజనం కూడా చేశారు. ఈ విషయాన్ని మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జగన్ దంపతులతో కలిసి తీసుకున్న సెల్ఫీని ఇన్‌గ్రామ్‌లో షేర్ చేసిన విష్ణు.. సీఎం జగన్‌ మోహన్ రెడ్డిలోని కొత్త కోణం గురించి చెప్పారు. ‘జగన్ అన్న, భారతి అక్కను కలిశాం. లంచ్ చేశాం. విద్య పట్ల ఆయనకున్న విజన్ మరోస్థాయి. ఇంకో విషయం ఏంటంటే, ఆయనలోని హాస్య కోణాన్ని ప్రజలు మరింత తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మరిన్ని విషయాలు తర్వాత చెబుతా!’ అని మంచు విష్ణు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతానికి లంచ్ కోసం మాత్రమే కలిశామని పేర్కొన్నా మంచు విష్ణు.. మరిన్ని విషయాలు తరవాత చెబుతా అని చిన్న మెలిక పెట్టారు. ఆ విషయాలేంటో త్వరలో తెలుస్తాయేమో చూడాలి. ఇదిలా ఉంటే, మంచు విష్ణు ప్రస్తుతం ‘మోసగాళ్ళు’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది హాలీవుడ్‌-ఇండియ‌న్ సినిమా. దీనికి మంచు విష్ణే నిర్మాత. ఈ సినిమా కోసం ఆయన భారీగా

‘నారప్ప’కు ఒక్కరోజు ముందొస్తున్న ‘ఆచార్య’

Image
‘ఆచార్య దేవో భవ’ అని మన అందరికీ తెలిసిందే.. కానీ ‘ఆచార్య రక్షోభవ’ అని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. అసలు ‘ఆచార్య’ గురించి అంత బలంగా ఎందుకు చెబుతున్నారు అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని అంటోంది చిత్ర యూనిట్‌. మెగాస్టార్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. ‘ఆచార్య’ టీజర్‌ను కొణిదెల అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. టీజర్‌కు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించారు. ఈ సినిమాలో సిద్ధ అనే మరో పవర్‌ఫుల్‌ పాత్రలో రామ్‌ చరణ్‌ నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతో సినిమా ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తి పెరిగింది. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు ఎప్పుడొస్తుందో తెలిసిపోయింది. టీజర్‌ను విడుదల చేసిన గంటన్నర సమయంలోనే ‘ఆచార్య’ విడుదల తేదీని ప్రకటించారు. మే 13న ‘ఆచార్య’ సినిమాను విడదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

అమ్మ పుట్టినరోజు.. నాగబాబు భావోద్వేగ సందేశం

Image
మెగా బ్రదర్ తన మాతృమూర్తి కొణిదెల అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా తల్లికి శుభాకాంక్షలు తెలిపారు. భావోద్వేగభరిత సందేశంతో తల్లిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు, సముద్రం లాంటి జీవితంలో తాను స్థిరంగా నిలబడానికి ఒక యాంకర్‌లా ఉన్నందుకు తల్లికి నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు. నా ప్రియాతి ప్రియమైన అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ భావోద్వేగ సందేశంతో ట్వీట్ చేశారు. ‘నా ప్రియాతి ప్రియమైన అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రతి ప్రయత్నం వెనుక బలం అమ్మే. పాతాళానికి పడిపోయిన సమయాల్లో నా మార్గంలో వెలుగులు నింపిన కాంతి అమ్మ. నా బాధలన్నింటిని మటుమాయం చేసేలా నువ్వు వాత్సల్యంతో హత్తుకున్నందుకు కృతజ్ఞతలు చెబితే సరిపోదమ్మా! నీ ఓదార్పు మాటలు చిన్నవే కావొచ్చు కానీ, జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొనేంత శక్తినిస్తాయి. నేనివాళ ఎంతో దృఢమైన వ్యక్తిలా నిలబడ్డానంటే అందుకు కారణం నీలాంటి శక్తిమంతమైన తల్లి పెంపకం వల్లే. ఈ జీవితాన్నిచ్చినందుకు కృతజ్ఞతలు అమ్మా. సముద్రం లాంటి ఈ జీవితంలో నేను నిలబడటానికి యాంకర్‌లా ఉన్నందుకు కృతజ్ఞతలు’ అని నాగబాబు తన సందేశంలో పేర్

టీజర్: గుణపాఠాలు చెప్పే ‘ఆచార్య’ ఏం స్టైలిష్‌గా ఉన్నాడబ్బా!

Image
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సమయం వచ్చేసింది. ‘ఆచార్య’ టీజర్‌తో మెగా అభిమానులకు కనువిందు తీసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మెసేజ్‌తో కూడిన కమర్షియల్ సినిమాలు తీయడంతో సిద్ధహస్తుడిగా మారిన కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా రూపొందుతోన్న ఈ ‘ఆచార్య’ టీజర్‌ను శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ ట్రెండింగ్‌లో ఉంది. ‘ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు’ అనే రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ మొదలైంది. అదే వాయిస్ ఓవర్‌తో ‘ఆచార్య’గా చిరంజీవి వైలెంట్ ఇంట్రడక్షన్ కూడా జరిగింది. టీజర్ చూస్తుంటే చిరంజీవి హీరోయిజాన్ని కొరటాల శివ ఏ రేంజ్‌లో ఎలివేట్ చేశారో అర్థమవుతోంది. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తరవాత ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా’ సినిమాలు వచ్చినా.. ఎందుకో ఈ ‘ఆచార్య’ ఆయనకు కరెక్ట్ ఫిలిం అని టీజర్ చూస్తుంటే అనిపిస్తోంది. టీజర్‌లో చిరంజీవి స్టైల్, హీరోయిజం చూసి మెగా అభిమానులకు సంబరాలు చేసుకోవడం ఖాయం. అంత అందంగా, స్టైలిష్‌గా ఉన్నారు మెగాస్టార్. ఫైట్స్ కూడా వేరే

వేసవిలో వస్తోన్న ‘నారప్ప’.. విడుదల తేదీ ఖరారు

Image
విక్టరీ చాలా కాలం తరవాత చేస్తున్న పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘నారప్ప’. గతంలో వెంకటేష్‌తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి పనిచేసిన శ్రీకాంత్ అడ్డాల ‘నారప్ప’కు దర్శకత్వం వహిస్తున్నారు. సురుష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వి క్రియేషన్స్ బ్యానర్లపై డి.సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటి నుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థలు ఖరారు చేశాయి. మే 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్లను విడుదల చేశాయి. గతంలో విడుదల చేసిన వెంకటేష్ నారప్ప లుక్‌నే ఈ పోస్టర్లలో వాడారు. మొత్తానికి ఈ వేసవిలో ‘నారప్ప’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’కు ‘నారప్ప’ రీమేక్ అన్న విషయం తెలిసిందే. తమిళంలో ధనుష్ పోషించిన పాత్రను వెంకటేష్ చేస్తుండగా.. మంజు వారియర్ చేసిన పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. వెంకటేష్ పెద్ద కుమారుడి పాత్రను ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రత్నం పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమా నుంచి ఇప్ప

మహేష్ చేతిలో తాళాల గుత్తి.. 'సర్కారు వారి పాట' విడుదలపై సర్‌ప్రైజింగ్ అప్‌డేట్

Image
గతేడాది 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకుంటూ సంక్రాంతి సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ .. వచ్చే ఏడాది అదే సంక్రాంతిని టార్గెట్ చేశారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ '' రిలీజ్ కోసం సంక్రాంతి సీజన్‌ను ఎంచుకున్నారు. నిజానికి ఈ సినిమా ప్రకటన వచ్చి నెలలు గడిచిపోతున్నా చివరకు ఇటీవలే షూటింగ్ ప్రారంభించారు మేకర్స్. ఈ క్రమంలోనే రిలీజ్‌పై ఓ అంచనాకు వచ్చి 2022 సంక్రాంతి రేస్‌లో నిలవబోతున్నట్లు తెలిపారు. ఇటీవలే షూటింగ్స్ రీ- ఓపెన్ కావడం, ఆపై సినిమా థియేటర్ల గేట్లు తెరుచుకోవడంతో స్టార్ హీరోలంతా ఒక్కొక్కరుగా తమ తమ సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ అభిమానులకు కూడా సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చారు 'సర్కారు వారి పాట' దర్శకనిర్మాతలు. సినిమా విడుదల తేదీ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ద్వారా ఇచ్చిన ఈ అప్‌డేట్‌ను మహేష్ బాబు తన అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు షేర్ చేసిన కొత్త పోస్టర్‌లో మహేష్ తాళాల గుత్తి చేతిలో పట్టుకొని కనిపిస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్స్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ

పవన్‌ కళ్యాణ్‌తో రానా ఢీ.. రంగంలోకి దగ్గుబాటి వారసుడు

Image
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సమరానికి దిగాడు దగ్గుబాటి వారసుడు రానా. ఈ ఇద్దరి మధ్య నిన్న (జనవరి 28) నుంచి పోరాటం ప్రారంభమైంది. అర్థం కాలేదా..? అదేనండీ.. పవన్ కళ్యాణ్- కాంబోలో రాబోతున్న మలయాళీ మూవీ '' తెలుగు రీమేక్ సెట్స్ పైకి రానా కూడా వచ్చేశారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 12గా రూపొందుతున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు పవన్ ఎంటర్ కాగా, నిన్న రానా కూడా సెట్స్ మీదకొచ్చేశారు. ఫైట్ మాస్టర్ దిలీప్ సబ్బరాయన్ నేతృత్వంలో ప్రస్తుతం పవన్- రానా మధ్య పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. హైదరాబాద్ లోని లింగంపల్లి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ షూటింగ్ జరుగుతోంది. మరో పది రోజుల పాటు ఈ ఫైట్ సన్నివేశాల చిత్రీకరణ ఇక్కడే జరగనుందట. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, ఆయనను ఢీకొట్టే బలమైన పాత్రలో రానా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తుండగా.. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి యువ నిర్మాత సూర్యద

గోదావరి ఖనిలో హీరో ప్రభాస్ సందడి.. 10 రోజులు అక్కడే షూటింగ్

Image
యంగ్ రెబల్ స్టార్ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతంలో సందడి చేశారు. ప్రస్తుతం ఆయన కన్నడ దర్శకుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఫస్ట్‌లుక్ కూడా సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు తాజాగా యూనిట్ ప్రకటించింది. అభిమానులు ఆ సందడిలో ఉండగానే శుక్రవారం ప్రభాస్ గోదావరి ఖనిలో వాలిపోయాడు. గోదావరి ఖని పరిధి రామగిరి మండలంలోని సింగరేణి ఓపెన్‌ కాస్ట్ ప్రాంతంలో ‘సలార్’ మొదటి షెడ్యూల్ షూటింగ్‌ జరుపుకుంటోంది. ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు దగ్గర వేసిన భారీ సెట్‌లో యాక్షన్ సీక్వెన్స్‌ చిత్రీకరించనున్నారు. సుమారు 10 రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం .ఈ క్రమంలోనే శుక్రవారం రామగుండం కమిషనరేట్‌కు వచ్చిన ప్రభాస్ రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా సీపీ సత్యనారాయణ ప్రభాస్‌కు తన సిబ్బందిని పరిచయం చేశారు. పలువురు పోలీసు సిబ్బంది ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఈ ఫోటోలు ప

గోదావరి ఖనిలో హీరో ప్రభాస్ సందడి.. 10 రోజులు అక్కడే షూటింగ్

Image
యంగ్ రెబల్ స్టార్ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతంలో సందడి చేశారు. ప్రస్తుతం ఆయన కన్నడ దర్శకుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఫస్ట్‌లుక్ కూడా సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు తాజాగా యూనిట్ ప్రకటించింది. అభిమానులు ఆ సందడిలో ఉండగానే శుక్రవారం ప్రభాస్ గోదావరి ఖనిలో వాలిపోయాడు. గోదావరి ఖని పరిధి రామగిరి మండలంలోని సింగరేణి ఓపెన్‌ కాస్ట్ ప్రాంతంలో ‘సలార్’ మొదటి షెడ్యూల్ షూటింగ్‌ జరుపుకుంటోంది. ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు దగ్గర వేసిన భారీ సెట్‌లో యాక్షన్ సీక్వెన్స్‌ చిత్రీకరించనున్నారు. సుమారు 10 రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం .ఈ క్రమంలోనే శుక్రవారం రామగుండం కమిషనరేట్‌కు వచ్చిన ప్రభాస్ రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా సీపీ సత్యనారాయణ ప్రభాస్‌కు తన సిబ్బందిని పరిచయం చేశారు. పలువురు పోలీసు సిబ్బంది ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఈ ఫోటోలు ప

RRR: డియర్ జెన్నిఫర్ అంటూ హాలీవుడ్ బ్యూటీపై ఎన్టీఆర్ స్వీట్ కామెంట్.. అమ్మడి క్యూట్ లుక్ అదుర్స్

Image
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా . బడా నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు (జనవరి 29) ఒలీవియా పుట్టినరోజు సందర్భంగా ఆమె క్యూట్ లుక్ షేర్ చేస్తూ స్వీట్ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్. హ్యాపీ బర్త్ డే డియర్ 'జెన్నిఫర్' అంటూ RRR మూవీలో ఒలీవియా మోరిస్ పాత్ర పేరును పరిచయం చేశారు ఎన్టీఆర్. ఈ మేరకు ఆయన షేర్ చేసిన ఒలీవియా క్యూట్ లుక్ నెటిజన్లను ఫిదా చేసింది. ఈ లుక్ చూసిన వెంటనే సూపర్ అని పేర్కొంటూ వెండితెరపై ఒలీవియా- ఎన్టీఆర్ జోడీని చూడాలని కుతూహలంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. RRR మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ సరిసమానమైన ప్రియార్టీ ఇస్తూ పాత్రలను రూపొందించారు జక్కన్న. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం పైగా చిత్రీకరణ పూర్తయింది. కాగా తాజాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ ప్రేయసి (ఒలీవియా) పేరు

'మేజర్' డే అంటూ క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇదీ మ్యాటర్!!

Image
'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ''. సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో హీరోగా నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్ర నిర్మాణంలో సూపర్ స్టార్ భాగం కావడం సినిమాపై ఆతృతను పెంచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో అడవి శేష్ సరసన శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో శోభితా ధూళిపాళ్ల రోల్ ప‌వ‌ర్‌‌ఫుల్‌‌గా, ఎమోష‌న‌ల్‌‌గా ప్రేక్షకులకు కనెక్ట్ కానుందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా జులై 2వ తేదీన విడుదల కానుందని ప్రకటించిన మహేష్ బాబు.. ఆ రోజును 'మేజర్' డే అని తెలపడం గమనార్హం. ఓ వైపు 'మేజర్' సినిమా షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టిన చిత్రయూనిట్.. ఇప్పటికే చిత్ర ఫస్ట్‌లుక్, పలు అప్‌డేట్స్ రిలీజ్ చేసి

Sri Reddy: రేయ్ కలలు కనండి కానీ.. మరీ ఇలానా!! పవన్ కళ్యాణ్‌తో డ్యూయెట్.. బాల్స్ షేక్ అంటూ రచ్చ

Image
శ్రీ రెడ్డి.. ఈ పేరు వింటేనే చాలు బోల్డ్ మాటలతో పాటు సంచలనాలు అలా మనసులో మెదులుతుంటాయి. తన సోషల్ మీడియా ఖాతాల్లో అందాల ఆరబోత చేస్తూనే బోల్డ్ కామెంట్స్‌తో పిచ్చెక్కించే ఈ బ్యూటీ.. ఎప్పుడు ఎలాంటి ఆటం బాంబ్ ఎవరిపై విసురుతుందో కూడా అర్థంకాకుండా అటాక్ చేస్తుంటుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తనదైన స్టైల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా నెటిజన్లతో కాసేపు ముచ్చటించిన .. పవన్‌తో డ్యూయెట్ అంటూ బోల్డ్ మాటలతో రచ్చ చేసింది. సినిమాలతో దక్కని గుర్తింపు తరచూ వివాదాల్లో నిలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం మూలంగా శ్రీ రెడ్డి దక్కించుకుంది. సినీ పెద్దలపై లైంగిక ఆరోపణలు చేస్తూ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసి అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచింది శ్రీ రెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో ఆమె చేసిన రచ్చ అంతాఇంతా అని చెప్పలేం. ఇక ఆ తర్వాత చెన్నైలో మకాం వేసి సోషల్ మీడియా వేదికగా తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయటపెడుతూ బూతు పురాణాలు వినిపిస్తోంది ఈ సంచలన తార. ఏ చిన్న సందర్భం దొరికినా బోల్డ్ ముచ్చట్లతో ప్రతి ఒక్కరి చూపు తనపై పడేలా చేసుకుంటోంది. ఈ మధ్యకాలంల

దేశభక్తి ప్రధానాంశంగా 'సన్ ఆఫ్ ఇండియా'.. మోహన్ బాబు ఫస్ట్‌లుక్‌ రిలీజ్

Image
దాదాపు నలభై ఏళ్లుగా నటుడిగా, నిర్మాతగా, సమర్పకుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న మంచు ఈ మధ్యకాలంలో కాస్త సినిమాల జోరు తగ్గించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలపాటు విరామం తీసుకున్న ఆయన తిరిగి ఓ స్ట్రాంగ్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దేశభక్తి ప్రధానాంశంగా రూపొందుతున్న '' మూవీ చేస్తున్నారు మోహన్ బాబు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్ రిలీజ్ చేశారు. శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మోహన్‌బాబుకు స్టైలిస్ట్‌గా ఆయన కోడలు మంచు విరానికా వ్యవహరిస్తుండగా.. మంచు విష్ణు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో ఆకట్టుకుంది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన మువ్వన్నెల జెండాపై ఉన్న సినిమా టైటిల్ దేశ ప్రజల ఆదరణ చూరగొంటోంది. ఇక మోహన్ బాబు సీరియస్ లుక్‌లో కనిపిస్తుండటం ఈ సినిమాలో దేశభక్తికి సంబంధించి ఏదో కీలక పాయింట్ చూపించబోతున్నారనే ఫీలింగ్స్ తెప్పిస్తోంది. నిజానికి 'సన్ ఆఫ్

పుష్ప షూటింగ్‌లో విషాద ఘటన.. గుండెపోటుతో స్టిల్‌ ఫొటోగ్రాఫర్ కన్నుమూత

Image
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ టీం ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో ఉన్నారు. కాగా ఈ సినిమాకు స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ‌(54) సెట్స్ పైనే గుండెపోటుకు గురై కన్నుమూయడం తీవ్ర విషాదం నింపింది. ‘పుష్ప’ షూటింగ్‌ నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి వెళ్లిన జి. శ్రీనివాస్ శుక్రవారం ఉదయం షూటింగ్‌ లొకేషన్‌లో అస్వస్థతకు లోనయ్యారు. గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో వెంటనే అప్రమత్తమైన చితయూనిట్.. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన కన్నుమూశారు. దాదాపు 200లకు పైగా చిత్రాలకు శ్రీనివాస్‌ స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయనకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శ్రీనివాస్‌ మృతి పట్ల ‘పుష్ప’ టీమ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ పుష్ప మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన

ప్రభాస్ అభిమానులను ఖుషీ చేసే అప్‌డేట్.. 'సలార్'లో హీరోయిన్‌గా శృతి హాసన్ ఫిక్స్

Image
యంగ్ రెబల్ స్టార్ వరుసపెట్టి భారీ సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘రాధే శ్యామ్’ షూటింగ్ మరికొద్ది రోజుల్లోనే పూర్తికానున్న నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాల దర్శకనిర్మాతలు వేగం పెంచారు. ఇందులో భాగంగా ప్రభాస్- ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో రాబోతున్న '' మూవీ నుంచి ప్రభాస్ అభిమానులను ఖుషీ చేసేలా ఓ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటించనుందని అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. 'సలార్'లో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ భామను తీసుకోవాలని అనుకున్న ప్రశాంత్ నీల్.. పలువురు బాలీవుడ్ బ్యూటీలను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరకు అందరినీ ఆశ్చర్యపరుస్తూ శృతి హాసన్‌ని ఫిక్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ మేరకు శృతి హాసన్ పుట్టినరోజున (జనవరి 28) ఈ విషయం అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఆమెకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పారు. 'సలార్‌లోకి స్వాగతం. మిమ్మల్ని తెరపై చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం' అని పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ ఈ 'సలార్' సిన

‘ఖిలాడి’ అప్‌డేట్: రవితేజకు విలన్‌గా అర్జున్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన యాక్షన్ కింగ్!

Image
మాస్ మహారాజా హీరోగా రూపొందుతోన్న ‘ఖిలాడి’ సినిమా నుంచి కొత్త అప్‌డేట్ వచ్చింది. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో మరో సీనియర్ నటుడు భాగం అయ్యారు. ఆయన ఎవరో కాదు యాక్షన్ కింగ్ అర్జున్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘2021లో కొత్త సినిమా.. ‘ఖిలాడి’ సెట్స్‌లో నేను’ అని క్యాప్షన్ పెట్టి ఒక స్టైలిష్ లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు అర్జున్. ఇప్పటి వరకు ‘ఖిలాడి’లో అర్జున్ ఉన్నట్టు తెలీదు.. ఇప్పుడు సడెన్‌గా రివీల్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు యాక్షన్ కింగ్. ఇదిలా ఉంటే, అర్జున్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నట్టు సమాచారం. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తరవాత అర్జున్ నటిస్తోన్న మరో తెలుగు సినిమా ఇది. అందులో అల్లు అర్జున్‌కు తండ్రిగా నటించారు అర్జున్. అంతకు ముందు నితిన్ ‘లై’ సినిమాలో విలన్‌గా మెప్పించారు. కానీ, రవితేజ లాంటి మాస్ హీరోకు అర్జున్ విలన్ అంటే ఆ కిక్కే వేరు. మరి దీనిలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా, ‘ఖిలాడి’ సినిమాకు ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రాని