అట్రాక్ట్ చేసే కథతో 'పీనట్ డైమండ్'.. ఫస్ట్లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి

విభిన్న తరహా కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. అదే నమ్మకంతో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం ''. ఎఎస్పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై ప్రొడక్షన్ నెం.1గా ఈ మూవీ రూపొందుతోంది. అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్రాసన్, శాని సాల్మాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ తానై చూసుకుంటున్నారు వెంకటేష్ త్రిపర్ణ. `బెంగాల్ టైగర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసిన యూనిట్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కాగా తాజాగా ఈ మూవీకి డైరెక్టర్ సపోర్ట్ లభించింది. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీ ఫస్ట్లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మారుతి. రెండు కాలమాణాలకు సంబంధించిన ఓ విభిన్న కథాంశంతో అన్నివర్గాల ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఈ మూవీ రూపొందిస్తున్నామని, 1989లో ఒక కథ జరుగుతూ ఉంటే దానికి ప్యారలల్గా 2020లో మరోక కథ రన్ అవుతుండటం ఆసక్తి రేకెత్తిస్తుందని నిర్మాతలు అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ తెలిపారు. ఫస్ట్లుక్ రిలీజ్ అనంతరం మారుతి మాట్లాడుతూ.. 'డైరెక్టర్ వెంకటేష్ పదేళ్లుగా తెలుసు. వెరీ టాలెంటెడ్ పర్సన్. ఎప్పుడూ కొత్తగా చేయాలని ఆలోచించే ఆయన, నాతోపాటు మా బ్యానర్లో చాలా సినిమాలకు వర్క్ చేశాడు. అతని ఆలోచనా విధానానికి తగ్గట్లుగానే డిఫరెంట్ స్టోరీతో ఈ 'పీనట్ డైమండ్' సినిమా చేస్తున్నాడు. టైటిల్ చెప్పగానే చాలా కొత్తగా ఉందనిపించింది. పోస్టర్ చూడగానే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కథ లైన్ చెప్పారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా అంటే చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యాలి అప్పుడే మనం అనుకున్న ఔట్పుట్ వస్తుంది. తప్పకుండా ఈ చిత్రం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
Comments
Post a Comment