శర్వానంద్, సిద్ధార్థ్ ‘మహా సముద్రం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇద్దరు హీరోల మధ్య యుద్ధం ఎప్పుడంటే
లాక్ డౌన్ ఎఫెక్ట్తో షూటింగ్ దశలో ఉన్న సినిమాలన్నీ ఆగిపోయాయి. అయితే ఇటీవల షూటింగ్లు తిరిగి ప్రారంభం కావడంతో వరుస సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి. పోటాపోటీగా విడుదల తేదీలను ప్రకటిస్తూ సినీ సందడిని తీసుకువస్తున్నారు మన హీరోలు. ‘సర్కారు వారి పాట’, ‘వకీల్ సాబ్’, ‘పుష్ప’, ‘ఎఫ్ 3’, ‘నారప్ప’, ‘వకీల్ సాబ్’, ‘కేజీఎఫ్’, ‘గని’ చిత్రాల విడుదల తేదీలను ఇప్పటికే ప్రకటించగా.. , సిద్దార్థ్ మల్టీస్టారర్ మూవీ ‘’ రిలీజ్ డేట్ను ప్రకటించింది చిత్ర యూనిట్. ‘ఎగసిపడే సముద్రపు అలల్లో, మీరు కొలవలేనంత ప్రేమని పరిచయం చేయడానికి వస్తున్నాం.’ అంటూ ‘మహా సముద్రం’ టీమ్ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించింది. RX 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహా సముద్రం’ చిత్రం ఆగష్టు 19న గ్రాండ్గా విడుదల కానుంది. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు హీరో సిద్ధార్థ్. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత మళ్లీ ‘మహా సముద్రం’ అంటూ పలకరించబోతున్నాడు సిద్ధార్థ్. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Post a Comment