జగన్‌తో మంచు విష్ణు లంచ్.. సీఎంలో కొత్త కోణం గురించి చెప్పిన హీరో!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిలను హీరో దంపతులు శుక్రవారం కలిశారు. భార్య విరానికాతో కలిసి తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన విష్ణు.. సీఎం జగన్ దంపతులతో కాసేపు సరదాగా గడిపారు. వారితో మధ్యాహ్న భోజనం కూడా చేశారు. ఈ విషయాన్ని మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జగన్ దంపతులతో కలిసి తీసుకున్న సెల్ఫీని ఇన్‌గ్రామ్‌లో షేర్ చేసిన విష్ణు.. సీఎం జగన్‌ మోహన్ రెడ్డిలోని కొత్త కోణం గురించి చెప్పారు. ‘జగన్ అన్న, భారతి అక్కను కలిశాం. లంచ్ చేశాం. విద్య పట్ల ఆయనకున్న విజన్ మరోస్థాయి. ఇంకో విషయం ఏంటంటే, ఆయనలోని హాస్య కోణాన్ని ప్రజలు మరింత తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మరిన్ని విషయాలు తర్వాత చెబుతా!’ అని మంచు విష్ణు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతానికి లంచ్ కోసం మాత్రమే కలిశామని పేర్కొన్నా మంచు విష్ణు.. మరిన్ని విషయాలు తరవాత చెబుతా అని చిన్న మెలిక పెట్టారు. ఆ విషయాలేంటో త్వరలో తెలుస్తాయేమో చూడాలి. ఇదిలా ఉంటే, మంచు విష్ణు ప్రస్తుతం ‘మోసగాళ్ళు’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది హాలీవుడ్‌-ఇండియ‌న్ సినిమా. దీనికి మంచు విష్ణే నిర్మాత. ఈ సినిమా కోసం ఆయన భారీగానే ఖర్చు చేస్తున్నారు. కూక‌ట్‌ప‌ల్లిలో సుమారు రూ. 3.5 కోట్ల వ్యయంతో ఒక భారీ ఐటీ ఆఫీస్ సెట్‌ వేశారు. ప్రంపంచలోనే అతిపెద్ద ఐటీ స్కాం నేపథ్యంతో ఈ సినిమా కథ సాగనుంది. 2019లో మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మార్చి 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం. హాలీవుడ్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న ‘మోస‌గాళ్ళు’ సినిమాలో మంచు విష్ణుకు చెల్లెలిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ నటించారు. సునీల్ శెట్టి, న‌వ‌దీప్ ముఖ్య పాత్రలు పోషించారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ