Posts

Showing posts from November, 2020

‘నీపై పగ తీర్చుకుంటా’... నితిన్‌కి వార్నింగ్ ఇచ్చిన కీర్తిసురేష్

Image
‘మహానటి’ కీర్తి సురేష్‌ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా మారింది. లాక్‌డౌన్ సమయంలో ఆమె నటించిన రెండు సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజై తీవ్రంగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నితిన్‌తో ‘రంగ్‌దే’, మహేశ్‌బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ‘రంగ్‌దే’ షూటింగ్ ప్రస్తుతం దుబాయిలో జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమా సెట్లో కీర్తి నిద్రపోతుండగా ఫోటో తీసిన .. దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్‌తో తమకు చెమటలు పడుతుంటే కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్‌ అవుతోందంటూ కామెంట్ చేశాడు. Also Read: ఈ సరదా ఫోటో సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై స్పందించిన కీర్తి ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘షూటింగ్ సెట్లో ఎప్పుడూ నిద్రపోకూడదని గుణపాఠం నేర్చుకున్నా. పగ తీర్చుకుంటా’ అని కామెంట్ చేసింది. దీంతో పాటు దుబాయి‌లోని అద్భుతమైన లొకేషన్లో దిగిన ఫోటోలను కూడా తన ఇన్‌‌స్టాగ్రామ్‌ అకౌంట్లో పోస్ట్ చేసింది. Also Read:

ఓటేయకపోవడం నేరం.. ప్రశ్నించే హక్కు వదులుకోవద్దు: రాజేంద్రప్రసాద్

Image
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ నగర ప్రజలందరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు సినీనటుడు . కేపీహెచ్‌ ఏడో ఫేజ్‌లోని పోలింగ్ బూత్ నంబర్ 58లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ఉదయం ఆయన తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో ఓటు వేయకపోవడం పెద్ద నేరమని అన్నారు. Also Read: తమ భవిష్యత్తునే నిర్దేశించే ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యతని రాజేంద్రప్రసాద్ అన్నారు. ప్రజాప్రతినిధులను నిలదీయాలన్నా, మనకు కావాల్సింది అడిగి నెరవేర్చుకోవాలన్నా ప్రతి ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. తాను అరకులో షూటింగులో బిజీగా ఉన్నప్పటికీ ఓటు వేసేందుకే హైదరాబాద్‌కు వచ్చానన్నారు. పోలింగ్ కేంద్రం బోసిపోవడం చూసి తన మనసు చలించిపోయిందని, నగర ప్రజలు తప్పనిసరిగా తమ ఓటుహక్కు వినియోగించుకుని నగర అభివృద్ధితో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. Also Read:

నాది లవ్ ఫెయిల్యూర్.. కానీ డేటింగ్ చేయాలనుంది: రాశీ ఖన్నా

Image
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడినా.. వెంకీమామ, ప్రతిరోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవర్.. చిత్రాలతో తిరిగి పుంజుకుంది. సోమవారం తన 30వ పుట్టినరోజు జరుపుకున్న రాశీ.. ఓ ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. తన ప్రేమ వైఫల్యం గురించి చెబుతూనే.. ఎవరితోనైనా డేటింగ్ చేయాలని ఉందంటూ షాకిచ్చింది. Also Read: ‘ప్రేమ సక్సెస్‌ అవ్వడం అనేది అరుదుగా జరుగుతుందని, ప్రేమలో ఫెయిల్యూర్సే ఎక్కువని... అలాంట చేదు అనుభవం తనకూ ఉందని రాశీఖన్నా గతంలోనే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది. స్కూల్‌ డేస్‌లో తన సీనియర్‌‌తో ఆమె ప్రేమలో పడగా.. కొన్ని కారణాల వల్ల అది విఫలమైంది. పుట్టినరోజు నాడు ఆమెకు విషెస్ చెప్పిన నెటిజన్లు.. ఇప్పుడు ప్రేమలో ఉన్నారా? అంటూ కొంటెగా అడిగారు. Also Read: ‘ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. ఇప్పటికైనా నా జీవితంలో ఎవరూ లేరు. నిజం చెప్పాలంటే ఎవరితోనైనా డేటింగ్‌ చేయాలని ఉంది. ఆ అనుభవం ఎలా ఉంటుందో ఆస్వాదించాలని ఉంది. కానీ ఎందుకో ఆ వైపు వెళ్లలేకపోతున్నా’ అని చెప్పుకొచ్చింది రాశీఖన్నా. ఈ అమ్మడి

Prabhas: ప్రభాస్‌తో మళ్లీ సినిమానా.. జనాలు భరించలేరు: రాజమౌళి షాకింగ్ కామెంట్స్

Image
యంగ్ రెబల్‌స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ప్రభాస్‌ను ఆలిండియా స్టార్‌ని చేసింది కచ్చితంగా రాజమౌళి అనే చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి, ‘ఛత్రపతి’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి2’ చిత్రాలలో ప్రభాస్‌ని ఏ రేంజ్‌లో రాజమౌళి ఎలివేట్‌ చేశారో అందరికీ తెలిసిందే. బాహుబలి, బాహుబలి-2 తర్వాత రేంజ్ బాలీవుడ్ హీరోలను మించిపోయింది. అందుకే దర్శక నిర్మాతలు ఆయనతో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించేందుకు పోటీ పడుతున్నారు. Also Read: ఈ నేపథ్యంలో ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో మరో సినిమా వస్తే ఎలాగుంటుంది... ఇదే ప్రశ్న రాజమౌళికి ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలుసా. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళికి ఇదే ప్రశ్న ఎదురైంది. ప్రభాస్‌తో మళ్లీ సినిమా తీస్తారా? అని అడగ్గా.. వామ్మో మళ్లీ ప్రభాస్‌తోనా? అంటూ బెదిరిపోయారు. Also Read: ‘బాహుబలి కోసం ఇద్దరం సుమారు ఐదేళ్లు కలిసి చేశాం. మళ్లీ మా కాంబినేషన్‌లో సినిమా అంటే జనాలు తలలు పట్టుకుంటారేమో’ అని అని రాజమౌళి సరదాగా కామెంట్ చేశారు. ప్రభాస్‌తో మళ్లీ సినిమా చేయడం తనకూ ఇష్టమేనని, మంచి కథ కుదిరితే కచ్చితంగా చేస్తానని చెప్పారు జక్కన్న. Also Read:

BAFTA: అరుదైన గౌరవం దక్కించుకున్న ఏఆర్ రెహమాన్‌

Image
దేశం గర్వించదగ్గ ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్‌ రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ (బాఫ్టా) ఆయన్ని ‘బాఫ్టా బ్రేక్‌ త్రూ ఇనిషియేటివ్‌ అంబాసిడర్‌’గా నియమించినట్లు సోమవారం ప్రకటించింది. ఈ క్రమంలో జ్యూరీ సభ్యులు, నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఆయన దేశంలోని సినిమా, క్రీడలు, టెలివిజన్‌ రంగాల్లో ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించనున్నారు. జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన కళాకారులకు సంవత్సరం పాటు మార్గనిర్దేశనం చేయనుంది. Also Read: ఈ ఘనత సాధించడం పట్ల రెహమాన్ స్పందిస్తూ... ‘భారత్‌ నుంచి అద్భుతమైన టాలెంట్‌ను వెలికితీసి ప్రపంచ వేదికపై నిలిపే అవకాశం నాకు రావడం సువర్ణావకాశంగా భావిస్తున్నా. బాఫ్టాతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది’ అని తెలిపారు. ‘భారతీయ సినిమాతో రెహమాన్‌కు ఉన్న అనుభందం బాఫ్టాకు సేవలందించేందుకు ఉపయోగపడుతుంది. మా సంస్థకు ఆయన అంబాసిడర్‌‌గా నియమితులు కావడం చాలా సంతోషంగా ఉంది’ అని బాఫ్టా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమాండ బెర్రీ పేర్కొన్నారు. Also Read: ఆస

‘బజార్ రౌడీ’గా సంపూర్ణేష్ బాబు.. స్టెప్పులేయిస్తున్న ప్రేమ్ రక్షిత్

Image
బ‌ర్నింగ్ స్టార్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. సెటైరికల్ సినిమాలతో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన హీరో సంపూ. ఆయ‌న న‌టించిన‌ ‘హృద‌య‌కాలేయం’, ‘కొబ్బరిమ‌ట్ట’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద విజయవంతం అయ్యాయి. ‘కొబ్బరిమట్ట’ తరవాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు సంపూ. దీనికి ఒక కారణం లాక్‌డౌన్ కూడా. లాక్‌డౌన్ త‌రువాత సంపూర్ణేష్ బాబు న‌టించిన చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రానికి ‘బ‌జార్ రౌడీ’ అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి వసంత నాగేశ్వరావు దర్శకత్వం వహిస్తున్నారు. కె‌ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌‌పై నిర్మాత సందిరెడ్డి శ్రీనివాస‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుకి జోడీగా మ‌హి న‌టిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా రామోజీ ఫిలిం సిటీలో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ‘ఛ‌త్రప‌తి, విక్రమార్కుడు, య‌మ‌దొంగ, ప‌రుగు, మ‌గ‌ధీర‌, ఆర్య-2, డార్లింగ్‌, సింహ‌, మ‌ర్యాద‌ రామ‌న్న, 100% ల‌వ్‌, బృందావ‌నం, కందిరీగ‌, పూల‌రంగ‌డు,

YS Jagan: జగన్ పిల్లోడే కానీ దేశంలోనే నెం.1 సీఎం, కేసీఆర్ లాస్ట్: బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్

Image
ఏపీ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రముఖ కమెడియన్, బీజేపీ నాయకుడు . దేశంలోనే నెంబర్ ముఖ్యమంత్రి సీఎం అని కొనియాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రిపై సంచలన కామెంట్స్ చేశారు. జగన్ నెంబర్ 1 అయితే కేసీఆర్ లాస్ట్ అంటూ ఆరోపణలు గుప్పించారు బాబు మోహన్. ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దేశంలోనే నెంబర్ 1 సీఎం. అద్భుతంగా పాలిస్తున్నాడు. పెన్షన్ల విధానంలో మార్పులు తీసుకువచ్చి వాలంటీర్స్‌ని పెట్టుకున్నాడు. గ్రామ సచివాలయాలు అంటూ సేవకుల్ని పెట్టుకున్నారు. వాలంటీర్లు ఇంటికి వెళ్లి మరీ పెన్షన్లు ఇస్తున్నారు. కరోనా టైంలో ఊరు ఊరికీ పోయి టెస్ట్‌లు చేయించాడు.. ప్రత్యేక వాహనాలు పెట్టాడు. జగన్ పిల్లాడు.. రాజకీయ అనుభవం లేదు.. తండ్రి చాటు బిడ్డ జగన్. అయినా అద్భుతంగా చేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి అడ్రసే లేదు. ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఫ్రెండ్సే కదా.. కరోనా టైంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టెస్ట్‌ల విషయంలో బ్రహ్మాండంగా చేశాడని ప్రధానమంత్రి మెచ్చుకున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకంటే కరోనా విషయంలో అద్భుతంగా చేశారని నెంబర్ వన్ సీఎం జగన్ అని ఆయనకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. తె

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Image
కన్నడ సినిమాలు ఒకప్పుడు సాదాసీదాగా ఉండేవి. కన్నడ సినిమాలకు అంత మార్కెట్ ఉండేది కాదు కాబట్టి భారీ బడ్జెట్ చిత్రాలు వచ్చేవి కాదు. కానీ, హోంబలే ఫిలింస్ అనే నిర్మాణ సంస్థ వచ్చిన తరవాత లెక్కలు మారాయి. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో క్వాలిటీ చిత్రాల‌ను నిర్మించి కన్నడ సినీ పరిశ్రమ‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు హోంబ‌లే ఫిలింస్ నిర్మాణ సంస్థ అధినేత విజ‌య్ కిర‌గందూర్‌. క‌న్నడ సూప‌ర్‌ స్టార్స్ పునీత్ రాజ్‌కుమార్‌తో ‘నినింద‌లే’, య‌ష్‌తో ‘మాస్టర్ పీస్‌’ వంటి సూప‌ర్‌ డూప‌ర్ హిట్ చిత్రాల‌ను రూపొందించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. త‌ర్వాత పునీత్ రాజ్‌కుమార్‌తో చేసిన ‘రాజ‌కుమార‌’ చిత్రం హ‌య్యస్ట్ గ్రాసర్‌గా నిలిచి శాండిల్‌వుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా హోంబ‌లే ఫిలింస్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. రాకింగ్‌ స్టార్ య‌ష్‌తో చేసిన భారీ బడ్జెట్‌ మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్టర్‌1’తో బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసి పాన్ ఇండియా నిర్మాణ సంస్థగా హోంబ‌లే ఫిలింస్ త‌న మార్క్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు హోంబ‌లే ఫిలింస్ నిర్మాణంలో రూపొందుతోన్న మ‌రో పాన్ ఇండియా భారీ బ‌డ్జెట్ మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్టర్ 2

RRR: 50 రాత్రుల కష్టం.. బైబై చెప్పేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్.. జక్కన్న నెక్స్ట్ ప్లాన్ ఇదే

Image
మెగా పవర్ స్టార్ , యంగ్ టైగర్ హీరోలుగా రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ RRR. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ నేటితో పూర్తయింది. ఈ షూటింగ్ విశేషాలు తెలుపుతూ ట్విట్టర్ ద్వారా సందేశం పోస్ట్ చేసింది టీమ్. గత కొన్ని రోజులుగా చిత్రంలోని కీలక ఘట్టాలను కెమెరాలో బంధించిన టీమ్.. నేటితో సెలవు తీసుకొని మరో షెడ్యూల్ ప్రారంభించడానికి రెడీ అవుతోంది. ''దాదాపు 50 రోజుల నైట్ షూట్ పూర్తి చేశాం. ఇక చలికాలపు రాత్రులకు గుడ్ బై.. ఇక తదుపరి షెడ్యూల్ కోసం వేరే దేశాల్లోని అందమైన ప్రదేశాలకు వెళ్లబోతున్నాం'' అని పేర్కొంటూ ట్వీట్ చేసింది RRR టీమ్. ఇటీవలే లొకేషన్స్‌ వద్ద ఉన్న పరిస్థితులను వీడియో రూపంలో ప్రేక్షకుల ముందుంచారు మేకర్స్. ఈ వీడియోలో యూనిట్ సభ్యులు మొత్తం చలిలో వణుకుతూ షూట్‌లో పాల్గొంటున్నట్లు కనిపించారు. రాజమౌళి, ఎన్టీఆర్, కెమెరామెన్ సెంథిల్ కుమార్.. ఇలా అందరూ సెట్‌లో ఏర్పాటు చేసిన హీటర్స్ దగ్గర చలి కాచుకుంటూ కనిపించారు. ఈ షెడ్యూల్‌లో చెర్రీ, ఎన్టీఆర్‌లపై భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశామని చెప్పింది చిత్రయూనిట్. Also Read: ఈ పోరాట సన్నివేశాలు చిత్రంలో దాదాపు 2

'కార్పొరేటర్'‌పై కన్నేసిన జబర్ధస్త్ కమెడియన్.. షకలక శంకర్ భలే ప్లాన్ చేశాడే!

Image
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల హవా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సిచ్యువేషన్ క్యాచ్ చేస్తూ కొత్త సినిమా ''ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. గత కొన్ని రోజులుగా డిఫరెంట్ సినిమాలతో హంగామా చేస్తున్న జబర్దస్త్ కమెడియన్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. కార్పొరేషన్ ఎలక్షన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాతో సంజయ్ పూనూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సమీప మూవీస్-ఎయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతగా, డాక్టర్ ఎస్.వి.మాధురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. కేవలం రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయింది. Also Read: మొత్తం 5 పాటలు, 4 ఫైట్స్‌తో రెగ్యులర్ ఫార్మట్ లోనే వినోదానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుందని అంటున్నారు మేకర్స్. షకలక శంకర్ పర్ఫార్మెన్స్ 'కార్పొరేటర్' చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు డాక్టర్ సంజయ్ చెబుతున్నారు. ఈ చిత్రంలో శంకర్ సరసన సునీత ప

వైరల్ అవుతున్న సింగర్ సునీత రెండో పెళ్లి వార్తలు.. ఇంతకీ ఇందులో నిజమెంత?

Image
ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు కొందరు గాసిప్ రాయుళ్లు. ఏ చిన్న హింట్ దొరికినా దానికో కథ అల్లేసి కన్ఫ్యూజన్‌లో పడేస్తుంటారు. ఈ క్రమంలోనే గత రెండు మూడు రోజులుగా సింగర్ పెళ్లి వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. సునీత రెండో పెళ్లికి సిద్ధమైందని కొందరంటే.. ఆమెకు కాబోయే భర్త ఈయనే అంటూ ఇంకొందరు మరో అడుగు ముందుకేసి మ్యాటర్ చెప్పేశారు. దీంతో టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. తెలుగు చిత్రసీమలో సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీత.. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడింది. యాంకర్‌గా, హోస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అంతేకాదు పేరుకే సింగర్ అయినా అందంతో కూడా తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది సునీత. కాకపోతే పెళ్లి విషయంలో మాత్రం ఫెయిల్ అయింది. పర్సనల్ లైఫ్‌లో చాలా కష్టాలు అనుభవించింది. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న ఆమె.. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని భర్తకు దూరంగా ఉంటోంది. Also Read: ఈ నేపథ్యంలో గురించి గత కొన్నిరోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా బయటకొచ్చిన న్యూస

18 ఏళ్ల వయసులో అలా చేశా.. ముప్పై మంది చూస్తుండగానే! యాంకర్ విష్ణుప్రియ బోల్డ్ కామెంట్స్

Image
సినిమా అన్నాక రొమాంటిక్ సీన్స్ కామన్. పైగా ఈ రోజుల్లో రొమాంటిక్ డోస్ దంచికొడితేనే ప్రేక్షకులు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో కథతో పాటు హీరోయిన్ అందాల ఆరబోతకు ప్రాముఖ్యత ఇస్తున్నారు దర్శకనిర్మాతలు. మరోవైపు హీరోయిన్లు కూడా కథ డిమాండ్ చేయాలే గానీ రొమాంటిక్ సీన్స్ చేసేందుకు సందేహించమంటూ ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ తన తాజా సినిమా '' గురించిన విషయాలు చెబుతూ బోల్డ్ కామెంట్స్ చేసింది. బులితెరపై హాట్ యాంకర్‌గా భారీ పాపులారిటీ కూడగట్టుకున్న విష్ణుప్రియ ప్రస్తుతం 'చెక్‌మేట్' సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వెలంపల్లి దర్శక నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. రాజేంద్రప్రసాద్, విష్ణుప్రియ సందీప్, దీక్షపంత్, బ్రహ్మనందం, రఘుబాబు షకలక శంకర్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌లో విష్ణుప్రియ హాట్‌నెస్, రొమాంటిక్ డోస్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. Also Read: కాగా తాజాగా 'చెక్‌మేట్' షూటింగ్ సంగతులపై రియాక్ట్ అయిన విష్ణుప్రియ.. ఈ సినిమాలో తాను చాలా హాట్ రోల్ చేశా

మూడో సారికీ రెడీ.. మళ్లీ గర్భం దాల్చాలని ఉంది.. అసలు విషయం చెబుతూ ఓపెన్‌ అయిన అనసూయ

Image
జబర్దస్త్ లేడీ భరద్వాజ్ తన మనసులోకి మాటలను బయటపెట్టి ఆశ్చర్యపరిచింది. ఏ పేరెంట్ అయినా సరే.. ఇద్దరు పిల్లలుంటే చాలని భావిస్తున్న ఈ రోజుల్లో తనకు మూడో సంతానం కనాలని ఉందని పేర్కొంటూ ఓపెన్ అయింది అనసూయ. మూడోసారి గర్భం దాల్చడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని, మళ్లీ తల్లి కావాలనుందని ఆమె చెప్పిన మాటలు జనాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. విషయం ఏదైనా కూడా మొహమాటం లేకుండా అసలు మ్యాటర్ చెప్పేయడం అనసూయకు అలవాటు. అదే ఆమెను చాలా సందర్భాల్లో ట్రోల్స్ బారిన పడేసింది. అయినా అనసూయతో ఆవగింజంత మార్పు కూడా కనిపించడం లేదు. తన మనసులోని మాటను నిర్మొహమాటంగా బయటపెట్టేస్తోంది. మరోవైపు విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ వెండితెరపై కూడా సత్తా చాటుతున్న ఈ జబర్దస్త్ భామ.. ప్రస్తుతం '' అనే మూవీ చేస్తోంది. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా అందులో గర్భవతిగా కనిపించి షాకిచ్చింది అనసూయ. Also Read: దీంతో అనసూయ మరోసారి గర్భవతి అయ్యిందంటూ సోషల్ మీడియా అంతా హోరెత్తిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఆమె.. మాతృత్వంలో ఉన్న ఆనందం గొప్పదని, మరోసారి గర్భవతి అయి ఆ మాతృత్వపు ఆనందం పొందాలని ఉందని తెలుపుతూ ఓ

OTT: సరికొత్త ATTలో ఫస్ట్ మూవీ ‘డర్టీ హరి’ .. ఫోన్ కొడితే ఫుల్ మసాలా మూవీ

Image
కరోనా కష్టకాలంలో మూవీ లవర్స్‌కి వినోదాన్ని పంచింది ఓటీటీ. ఆహా, అమేజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ద్వారా అనేక సినిమాలు విడుదలయ్యాయి. ఈ ఓటీటీకి మంచి ఆదరణ లభించడంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఏటీటీ. కొందరు సినీ ప్రముఖులు కలిసి ఏటీటీ () యాప్‌ని లాంఛ్ చేయబోతున్నారు. ఇందులో తొలి సినిమాగా డ‌ర్టీ హ‌రీని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిచిన రొమాంటిక్ మూవీ డ‌ర్టీ హ‌రి. రుహాని శ‌ర్మ‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, సిమ‌త్ర కౌర్ త‌దిత‌ర‌లు న‌టించిన ఈ సినిమా టీజ‌ర్ కి సోష‌ల్ మీడియాలో విశేష ఆద‌ర‌ణ ల‌భించిన విష‌యంలో తెలిసిందే, ఈ నేప‌థ్యంలో డ‌ర్టీ హ‌రి చిత్రాన్ని కొత్త ఓటిటి ప్లాట్ ఫామ్ ఏటీటీ ద్వారా డిసెంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌లైయ్యాయి. పే ఫర్ వ్యూ పద్దతిలో నడిచే ఈ కొత్త ఏటీటీ యాప్ కు తెలుగు ఆడియెన్స్ లో ప్రత్యేక స్థానం ఉంటుందని అంతా చాలా బలంగా నమ్ముతున్నారు. చిత్రంతో పాటు ఇంకా పలు సినిమాలు ఈ కొత్త ఏటీటీ స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. ఫోన్ కాల్ చేసి సినిమా చూసే నూత‌న‌ విధానంను ఈ కొత్త ఏటీటీ రెడీ అవుతుంది. ఈ ఏటిటి కి ఇద్ద‌రు పెద్ద ద‌

అర్ధరాత్రి వేళ సుమ కనకాల రచ్చ.. మన టైమ్ రావాల్సిందే అంటూ గుట్టు విప్పిన యాంకరమ్మ!!

Image
బుల్లితెర సెన్సేషన్, మాటల మహారాణి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది. లాక్‌డౌన్ వేళ ఖాళీ సమయం దొరకడంతో బుల్లితెర స్టార్ కాస్త సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఎప్పటికప్పుడు తన వీడియోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా.. తాను అర్దరాత్రి మేకప్ వేసుకుని రెడీగా ఉన్నానని పేర్కొంటూ ఓ వీడియో పోస్ట్ చేసి అసలు మ్యాటర్ చెప్పేసింది. తన పెంపుకు కుక్క జోరోతో కలిసి ఆడుతున్న ఆటలు, పని మనిషిని ఆట పట్టిస్తున్న వీడియోలతో హంగామా చేస్తున్న సుమ మరోసారి తనదైన మాటలతో అందరినీ ఆకట్టుకుంది. అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల కోసం '' అనే షోను హోస్ట్ చేస్తోంది యాంకర్ సుమ. ప్రతి ఏడాది ఈ షోను నిర్వహిస్తామని పేర్కొన్న ఆమె.. దీనికోసమే ఇలా ఈ అర్దరాత్రి సమయంలో మేకప్ వేసుకుని రెడీ అయ్యాయని చెబుతూ వీడియో వదిలింది. అయితే గతేడాది కంటే ఈ సారి ఓ గంట ఆలస్యంగా ప్రోగ్రాం మొదలుపెట్టామని చెప్పుకొచ్చింది. టైమ్ ముందుకు జరిగినా వెనక్కి జరిగినా మన టైమ్ రావాల్సిందే అంటూ ఫన్నీగా ముగించింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. Also Read: డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సరికొత్తగా అడుగు

Bandla Ganesh: జోకర్ కాదిక్కడ ఫైటర్.. ఎమ్మెల్సీ కవిత కామెంట్‌పై బండ్ల గణేష్ రియాక్షన్

Image
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పేరు మరోసారి సెన్సేషన్ అవుతోంది. ఏదో ఒకరకంగా ఆయన పేరు ప్రస్తావనలోకి వస్తుండటం గమనిస్తున్నాం. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ .. ఒకానొక సందర్భంలో బండ్ల గణేష్ పేరు తీయడంతో ఆ వీడియో వైరల్ అయింది. గత సంవత్సరం బండ్ల గణేష్ చేసిన కామెడీలా ఈ సంవత్సరం బండి సంజయ్ చేస్తున్నారంటూ ఆమె సందేశమివ్వడం జనాల్లో చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా కవిత కామెంట్‌పై రియాక్ట్ అయ్యారు బండ్ల గణేష్. ''నేను జోకర్‌ని కాదు.. ఫైటర్‌ని.. కానీ ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పార్టీలో ఉండదలచుకోలేదు. ఆల్ ది బెస్ట్'' అని పేర్కొంటూ కవితకు ట్యాగ్ చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్ చూసి.. బండ్లన్నకు మద్దతుగా భిన్న రకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. Also Read: తనకు రాజకీయాలతో సంబంధం లేదు మొర్రో అని మొత్తుకుంటున్నా కొందరు పనిగట్టుకుని మరీ ఆయన‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పదే పదే తాను ఏ రాజకీయ పార్టీలో లేనని చెప్పుకొస్తున్నారు బండ్ల గణేష్. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చ

Sri reddy: సెక్సీ ఫొటోలతో సమంత వ్యాపారం చేస్తోంది.. పెళ్లయ్యాక కూడా ఆమె.. బాబోయ్ ఎంత మాట..!!

Image
ఒకానొక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ సంచలనం సృష్టించిన .. ఆ తర్వాత చెన్నైలో మకాం వేసి అవకాశం చిక్కినప్పుడల్లా బడా దర్శక నిర్మాతలు, నటీనటుల వ్యవహారాలపై కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. బడా బాబుల చీకటి కోణాలపై రియాక్ట్ అవుతూ ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తూ వస్తోంది సంచలన తార శ్రీ రెడ్డి. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు బికినీ లుక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో బూతులతో వీరంగం సృష్టించడం శ్రీ రెడ్డికి కొత్తేమీ కాదు. సెక్సీ ఫోటోలు, హాట్ కామెంట్స్ చేస్తూ ప్రతి క్షణం తన సోషల్ మీడియా అకౌంట్స్‌ని ట్రెండింగ్‌లో ఉంచుకునే శ్రీ రెడ్డి.. తాజాగా సమంతను టార్గెట్ చేయడం సినీ వర్గాల్లో హాట్ ఇష్యూగా మారింది. ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సమంత, ఇటీవల బాత్‌టబ్ జలకాలాడుతూ హాట్ పోజిచ్చిన తన బికినీ లుక్ షేర్ చేసింది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇదే ఫోటోను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన శ్రీ రెడ్డి.. అర్థనగ్న ఫొటోలతో సమంత వ్యాపారం చేస్తోందంటూ ఆమెపై ఆటం బాంబ్ వేసింది. Also Read: ''గాయ్స్.. ఓ సారి ఈ ఫోటో

విశాఖ తీరాన 'హానీ ట్రాప్'.. అందమైన లొకేషన్స్‌లో అలా!!

Image
విశాఖలోని అందమైన లొకేషన్స్‌లో '' మూవీ తొలి షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భరద్వాజ్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వి.వి.వామన రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఋషి, శిల్ప, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వి.వి.వామన రావు మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాను. హీరో ఋషి, హీరోయిన్ శిల్పలపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలను చిత్రీకరికరించాం. శివ కార్తీక్ యువ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడు. ఆ సన్నివేశాల్ని చాలా చక్కగా చిత్రీకరించాం. ఈ నెలాఖరుకు విశాఖ షెడ్యూల్ పూర్తి చేస్తాం. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్లుగా కథని సమకూర్చాను. దానికి తగ్గట్లుగా సునీల్ కుమార్ రెడ్డి అద్భుతమైన లొకేషన్స్‌లో కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. మేము అనుకున్న దానికన్నా సినిమా బాగా వస్తోంది'' అన్నారు. Also Read: దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ''ఇది ఒక సోష

ఏది నిజం ఏది అబద్దం? మ‌న‌ల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు.. ఉదయభాను ఎమోషనల్ కామెంట్స్

Image
యాంకర్ .. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే అక్కర్లేని పేరిది. బుల్లితెర యాంకర్, హోస్ట్, సినీ నటిగా ఆమె ప్రతిఒక్కరికీ సుపరిచితం. యాంకర్‌గా మాటల తూటాలు పేల్చుతూ ఆకట్టుకునే ఉదయభాను.. ఎప్పటికప్పుడు సమాజ పరిస్థితులు, నిజ జీవిత అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. సోషల్‌ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను చెబుతూ ఉంటుంది. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఓటు యొక్క విలువను తెలుపుతూ జనాన్ని ఎడ్యుకేట్ చేసింది ఉదయభాను. ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియో, అందులో ఆమె మాట్లాడిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆలోచింపజేస్తున్నాయి. గ్రేటర్‌ పోరులో వినియోగంపై ఎంతో అద్భుతమైన సందేశమిచ్చింది ఉదయభాను. ప్రజాస్వామ్య దేశంలో ఓటును అమ్ముకుంటే జరిగే పరిణామాలపై తనదైన శైలిలో వివరించింది. జీవితం ఒక యుద్ధమైతే దాన్ని గెలవడానికి మనకున్న ఆయుధం ఓటు హక్కు అని, దాన్ని నిర్వీర్యం చేయొద్దని పేర్కొంటూ చక్కని తెలుగు భాషలో సూటిగా మాట్లాడింది. ప్రలోభాల కోసం కాదు.. ప్రగతి కోసం ఓటేద్దామని పిలుపునిచ్చింది. ''అభివృద్ధి జరిగిందా? అవినీతి పెరిగిందా..? కళ్లారా చూస్తున్నాం.. చెవులారా వింటున్నాం. సామాన్యుడి స్వప్నం సాకారమయ్యిందా అంటే

RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆన్ ఫైర్.. నడకలో నందమూరి రాజసం.. వీర లెవల్ అంతే!!

Image
దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ సినిమా . యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో విడుదలకు ముందే RRRపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన '' వీడియో నెట్టింట అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. మార్చి నెలలో విడుదలైన రామ్ చరణ్ 'భీమ్ ఫర్ రామరాజు' వీడియో యూట్యూబ్‌లో దుమ్ముదులపగా.. దసరా కానుకగా విడుదలైన ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీమ్' వీడియో ఆన్‌లైన్ సెన్సేషన్ అయింది. నిజానికి ఈ వీడియోపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చినా రికార్డుల వేటలో మాత్రం ముందంజలో ఉండటం విశేషం. అక్టోబర్ 22వ తేదీన విడుదలైన ఈ టీజర్ ఇప్పటివరకు 2 లక్షలకు పైగా కామెంట్లను దక్కించుకుంది. దీంతో టాలీవుడ్‌లో ఈ రేంజ్ కామెంట్లు దక్కించుకున్న మొదటి టీజర్‌గా 'రామరాజు ఫర్ భీమ్' వీడియో నిలిచింది. అలాగే యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ఈ

కత్తి మహేష్‌కు డబ్బు పంపుతున్న పవన్ ఫ్యాన్స్: పిచ్చ హ్యాపీ.. అసలేం జరుగుతోంది?

Image
జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై వీలు చిక్కినా, చిక్కకపోయినా విమర్శలు చేసే వ్యక్తి సినీ ఇండస్ట్రీలో ఒకే ఒక్కరు ఉన్నారు.. ఆయనే నటుడు, సినీ క్రిటిక్ ! అభిమానులు, కత్తి మహేష్‌కు మధ్య గతంలో పెద్ద యుద్ధమే నడిచింది. అప్పట్లో పవన్ గురించి తప్పుగా మాట్లాడొద్దంటూ ఆయన ఫ్యాన్స్ కత్తి మహేష్‌ను బెదిరించారు, రాజీకొచ్చారు, బతిమాలారు.. చివరికి విసుగొచ్చి అతడిని వదిలేశారు. కానీ, పవన్‌పై తన మాటల దాడిని మాత్రం కత్తి మహేష్ ఆపలేదు. రాజకీయంగా పవన్ నిర్ణయాలను చాలా తీవ్రంగా విమర్శించే కత్తి మహేష్.. ఒక్కోసారి కాస్త ఘాటుగా, కఠవుగా కూడా మాట్లాడుతుంటారు. ఇక కత్తి మహేష్‌ను తిట్టి, బెదిరించి లాభం లేదనుకున్నారో ఏమో గాని పవన్ కళ్యాణ్ అభిమానులు వినూత్నంగా నిరసనకు దిగారు. సాధారణంగా జనసైనికులు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసే వారిని డబ్బుకు అమ్ముడుపోయావని విమర్శిస్తుంటారు. కత్తి మహేష్‌ను కూడా వైసీపీకి అమ్ముడుపోయావని దుయ్యబడుతుంటారు. ఇందులో భాగంగా కత్తి మహేష్‌కు చిల్లర డబ్బు పంపించి నిరసన తెలపాలని భావించినట్లున్నారు. దీనిని కూడా కత్తి మహేష్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తనకు చిల్లర డబ్బులు కాదని, ఆ పంపేదేద

ముదిరిన వార్: నాగబాబుకు ప్రకాష్ రాజ్ అదిరిపోయే కౌంటర్.. గారు, అంటూనే!

Image
ప్రముఖ సినీ నటులు ప్రకాష్ రాజ్‌, మెగా బ్రదర్‌ మధ్య మాటల యుద్ధానికి తెరలేచినట్టే కనిపిస్తోంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మద్దతు ప్రకటించడం తనకు నచ్చలేదని ప్రకాశ్‌రాజ్‌ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్‌ను ఊసరవెల్లితో పోల్చారు. అయితే.. ప్రకాశ్‌ రాజ్‌ వ్యాఖ్యలపై పవన్‌ ‌సోదరుడు నాగబాబు ధీటుగా స్పందించారు. ‘‘మీకు భాజపా నచ్చకపోతే విమర్శించండి.. అంటూనే ఆ పార్టీ చేసే మంచిని కూడా హర్షించగలిగే మనసు మీకు లేదు’’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. మీడియా అడిగిందని ఒళ్లు పొంగి నీ పనికిమాలిన రాజకీయ డొల్లతనాన్ని బయటవేసుకోకు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు సత్తా చాటబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, నాగబాబు వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్‌ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ కౌంటర్ ఇచ్చారు. మాకు తెలుగు వచ్చు.. కానీ మీ భాష రాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘గౌరవనీయులైన నాగబాబు గారికి, మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చే

అమ్మ మాటలు కదిలించాయి.. అందుకే నటుడినయ్యా: రావు రమేష్

Image
తన విలనిజంతో ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు . తండ్రిని మించిన కొడుకుగా ఇప్పుడు అంతకంటే ఎక్కువగానే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. విలనిజంతో పాటు కామెడీ, సెంటిమెంట్‌ పాత్రలను అద్భుతంగా పండిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘సీమసింహం’తో టాలీవుడ్‌కి పరిచయమైన రమేష్‌కు... ‘కొత్త బంగారు లోకం’, ‘గమ్యం’ సినిమాలు బ్రేక్ ఇచ్చాయి. Also Read: అయితే రావు రమేష్‌కు అసలు నటన అంటే ఆసక్తి లేదంటే నమ్మగలమా. అవును ఇండస్ట్రీకి రాకముందు రమేష్‌ దర్శకుడు అవుదామనుకున్నారట. ఇదే విషయాన్ని తల్లికి చెప్పగా.. ‘డైరెక్టర్ కావాలంటే లెన్స్ తెలిస్తే సరిపోదు.. 24 విభాగాలపైనా పట్టు ఉండాలి, జీవితం తెలియాలి. ముళ్ల బాట దాటుకుని వెళ్లిన తర్వాతే వెలుగు కనిపిస్తుంది. ముందు నటుడిగా నిరూపించుకో’ అని చెప్పారంట. తల్లి చెప్పిన మాటలతో మనసు మర్చుకున్న రావు రమేష్‌ డైరెక్షన్ ఆలోచనను పక్కన పెట్టి నటుడయ్యారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. Also Read:

ప్రభాస్ ‘ఆదిపురుష్’.. సీతగా కృతి సనన్ ఖరారు!

Image
‘రాధే శ్యామ్’ తరవాత రెబల్ స్టార్ చేయబోతున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’. సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో బహుభాషా చిత్రంగా రూపొందుతోన్న ఈ ఎపిక్ డ్రామా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను టి-సిరీస్ అధినేత భూషన్ కుమార్ నిర్మిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో ప్రభాస్ సరసన సీతగా నటించడానికి బాలీవుడ్ నటి కృతి సనన్ ఖరారు చేశారని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతికథానాయకుడిగా లంకేశ్ పాత్ర పోషిస్తున్నారు. అయితే, సీత పాత్ర పోషించబోయే నటిని ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. సీత పాత్రను పోషించబోయే నటీమణుల జాబితాలో ఇప్పటి వరకు అనుష్క శెట్టి, అనుష్క శర్మ, కియారా అద్వానీ, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. అయితే, కృతి సనన్‌ను ఫైనలైజ్ చేసినట్టు ముంబై మిర్రర్ స్పష్టం చేసింది. Also Read: నిజానికి కృతి సనన్ టాలీవుడ్ ద్వారానే వెండితెరకు పరిచయమయ్యారు. మహేష్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ సినిమాలో నటించి తెరంగేట్రం చేశారు. ఆ తరవాత అక్కినేని నాగచైతన్యతో ‘దోచేయ్’ సినిమాలో నటించారు. అనంతరం బాలీవుడ్‌కు చెక్క

కీర్తి సురేష్ తల్లి కూడా స్టార్ హీరోయినే.. చిరంజీవితో బ్లాక్‌బస్టర్‌ మూవీ..

Image
సినీ ఇండస్ట్రీలో వారసత్వం అన్నది సాధారణమే. హీరోలుగా, విలన్లుగా రాణించిన చాలామంది తమ వారసులను కూడా సినీ పరిశ్రమలో తీసుకొస్తూనే ఉన్నారు. తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే హీరోలే కాదు అలనాటి హీరోయిన్లలో కొందరు తమ కూతుళ్లను హీరోయిన్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన కీర్తి సురేష్ తల్లి ఒకప్పుడు అగ్ర హీరోయిన్‌గా కొనసాగారు. తెలుగు సినిమాల్లో కూడా నటించిన విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. Also Read: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌లో 1963లో పుట్టిన మేనక అసలు పేరు పద్మావతి. 1980లో విడుదలైన ‘రమాయి వయసుకు వంతుట్ట’ అనే సినిమా ద్వారా వెండితెరకి ఎంట్రీ ఇచ్చారు. ఆరేళ్లలోనే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి ఏకంగా 116 సినిమాల్లో నటించారు. అతి తక్కువ సమయంలోనే వంద సినిమాల్లో నటించిన రికార్డు ఆమె సొంతం. చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన ‘పున్నమినాగు’ సినిమాలో మేనక హీరోయిన్‌గా నటించారు. Also Read: కెరీర్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రముఖ నిర్మ

ప్రముఖ దర్శకుడు శివ తండ్రి కన్నుమూత

Image
ప్రముఖ తెలుగు, తమిళ దర్శకుడు శివ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి జయకుమార్ కన్నుమూశారు. జయకుమార్ షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీలకు ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. 400కు పైగా షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీలు జయకుమార్ ఖాతాలో ఉన్నాయి. జయకుమార్‌కు శివ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు బాల నటుడిగా, దర్శకుడిగా మలయాళ సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. కుమార్తె విదేశాల్లో శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. జయకుమార్ చాలా ఏళ్లుగా చెన్నైలోని విరుగంబాక్కంలో ఉంటున్నారు. చుట్టుపక్కల వారి బాగోగులు చూసుకోవడం, సామాజిక సేవలో జయకుమార్గా యాక్టివ్‌గా ఉండేవారు. జయకుమార్ తండ్రి వేలన్ కూడా సినీ పరిశ్రమకు చెందినవారే. ఆయన నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్‌గా సినీ పరిశ్రమకు సేవలందించారు. ఇక జయకుమార్ పెద్ద కుమారుడు శివ మొదట సినిమాటోగ్రాఫర్‌గా ప్రయాణం మొదలుపెట్టారు. తెలుగులో ‘శ్రీరామ్’, ‘నేనున్నాను’, ‘గౌతమ్ ఎస్ఎస్‌సీ’, ‘బాస్’ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అయితే, 2008లో గోపీచంద్ హీరోగా వచ్చిన ‘శౌర్యం’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తరవాత వరసగా ‘శంఖం’, ‘దరువు’ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో శివకు పెద్దగా గుర్తింపు రాలేదు.

హీరో రాజశేఖర్ తన రెండిళ్లను అమ్ముకున్నారట.. ఇందులో నిజమెంత?

Image
చాలా మంది నటులు తాము డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. కానీ మాత్రం డాక్టర్ అయ్యాకే యాక్టర్‌గా మారారు. తమిళ కుటుంబానికి చెందిన రాజశేఖర్ 1962, ఫిబ్రవరి 4న తమిళనాడులోని తానే జిల్లాలోని లక్ష్మీపురంలో జన్మించారు. ఆయన తండ్రి ఓ పోలీసు. దీంతో తాను కూడా పోలీస్ కావాలని రాజశేఖర్ అనుకునేవారట. అయితే తండ్రి ప్రోత్సాహంతో డాక్టర్ కోర్సు చదివారు. అయితే కాలేజీలో చదువుతున్న సమయంలో.. నువ్వు చాలా బాగుంటావు.. హీరోగా ప్రయత్నించొచ్చు కదా అని స్నేహితులు ప్రోత్సహించేవారట. దీంతో సినిమాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన హీరో కావాలనుకున్నారు. దీంతో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ కోసం దరఖాస్తు చేశారు. అదే సమయంలో ఎమ్మెస్ సీటు రావడంతో దాన్ని వదులుకుని మరీ సినిమాల్లోకి వచ్చారు. Also Read: ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న సమయంలోనే ప్రసిద్ధ దర్శకుడు భారతీరాజా తాను తీయబోయే సినిమాలో కొత్త హీరో కోసం వెతుకుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజశేఖర్ ఆయన్ని కలుసుకుని తన టాలెంట్ చూపించి ఛాన్స్ కొట్టేశారు. అయితే ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు చాలా సమయం పట్టింది. ఈలోగా ఓ కొత్త దర్శకుడు రాజశేఖర్‌ని కలిసి కథ

RGV: పవన్ కళ్యాణ్‌పై వర్మ సెటైర్స్.. చిర్రెత్తిపోయిన మెగా ఫ్యాన్స్! స్వీట్ వార్నింగ్

Image
వివాదాస్పద దర్శకుడు ఏ చిన్న సందర్భం దొరికినా దానిపై తనదైన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాను దున్నేస్తుంటారని మనందరికీ తెలుసు. సినీ, రాజకీయాలపైనే గాక ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులపై ఫోకస్ పెడుతూ ఓపెన్ అవుతుంటారు వర్మ. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ ఎన్నికలపై కామెంట్స్ చేస్తూ పవన్ కళ్యాణ్‌పై పంజా విసురుతున్న ఆయన తీరుపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌పై నెగెటివ్ కామెంట్స్ చేయడం ఆపాలంటూ వార్నింగులు ఇస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించడం, ఆ తర్వాత పోటీ లేదని చెప్పడాన్ని తన ఆయుధంగా మలచుకొని పవన్‌పై సెటైర్స్ వేయడం ప్రారంభించారు వర్మ. పవన్ కళ్యాణ్ మంచి ఎంటర్టైనర్ అని, అందుకే రాజకీయాల్లో తాను అతన్నే అనుసరిస్తానని అంటూ తనదైన కోణంలో లాజిక్ అప్లై చేస్తూ కామెంట్ చేశారు ఆర్జీవీ. ఇలాగే గతంలో కూడా ఆయన పవన్ కళ్యాణ్‌పై వర్మ ఓ రేంజ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిర్రెత్రిపోయిన మెగా ఫ్యాన్స్ వర్మపై ఫైర్ అవుతున్నారు. Also Read: లాజికల్‌గా మాట్లాడినంత మాత్రాన తామేమీ పిచ్చోళ్ళం కాదని, పవన్ కళ్యాణ్‌ని పొ

‘సోలో’గా వస్తోన్న సాయి తేజ్.. క్రిస్మస్‌కి థియేటర్లలో సందడే సందడి

Image
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు ద‌ర్శక‌త్వం వహించారు. నభా నటేష్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ విడుదల చేస్తోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ విడుదల తేదీని అధికారికంగా శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ.. ‘‘ఇన్ని రోజులు మ‌నం ఎలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొన్నామో మ‌న‌కు తెలుసు. ఈ నేప‌థ్యంలో ప్రేక్షకుల‌ను మ‌ళ్లీ ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి మేం సిద్ధమ‌వుతున్నాం. అందులో భాగంగా క్రిస్మస్‌కు మిమ్మల్ని న‌వ్వించ‌డానికి వస్తున్నాం. అన్ని ఎమోష‌న్స్ ఉన్న ఈ సినిమా ఫుల్ ప్యాక్‌డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా డిసెంబ‌ర్ 25న మీ ముందుకు వ‌స్తోంది’’ అని అన్నారు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘సోలో బ్రతుకే సో బెట‌ర్ సినిమాను క్రిస్మస్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేస్తుండ‌టం చాలా ఆనందంగా ఉంది. మా సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాం’’ అని చెప్పారు. అయితే, తెలంగాణలో థ

శ్వేత దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్..

Image
‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది . అనంతరం నాగార్జున సరసన ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రంలో మెరిసింది. తన అందాలు ఎంతగా ఆరబోసినా ఆమె నటించిన సినిమాలన్నీ ప్లాఫ్ కావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో ప్రగ్యా ఛాన్స్ దక్కించుకుంది. Also Read: ఈ సినిమాలో ముందుగా సాయేషా సైగల్‌ని అనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో ఈ అవకాశం ప్రగ్యాకు దక్కింది. బోయపాటి డైరెక్షన్లో వచ్చిన ‘జయ జానకీ నాయక’ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో ప్రగ్యా నటించింది. ఆ పరిచయంతోనే బోయపాటి తన నెక్ట్స్ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చాడట. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా జైస్వాల్ తన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. తాజాగా తెల్లటి దుస్తుల్లో మెరిసిపోతూ ఆమె దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు నిజంగానే దేవకన్యలా ఉన్నావంటూ తెగ పొగిడేస్తున్నారు. Also Read:

చిరంజీవి కూతుళ్లతో నిహారిక నైట్ పార్టీ.. మెగా డాటర్స్ బాగానే చిల్ అయినట్లున్నారే!

Image
మెగా ఇంట పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. నాగబాబు కూతురు, మెగా డాటర్ వేడుకల కోసం మెగా ఫ్యామిలీ లేడీస్ అంతా ఒక్కచోట చేరి తెగ సందడి చేస్తున్నారు. చిరంజీవి ఇద్దరు కూతుళ్లు, అక్కలైన సుస్మిత, శ్రీజలకు స్పెషల్ పార్టీ ఇచ్చింది నిహారిక. కొద్దిరోజుల క్రితమే గోవాలో స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకున్న నిహారిక.. ఇప్పుడు తన సిస్టర్స్ అందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడు నెలల క్రిందట మెగా అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ తాను 'మిస్' నుంచి 'మిసెస్ నిహా'గా ప్రమోట్ అవుతున్నానని, తనకు కాబోయే భర్త ఇతనే అంటూ చైతన్య ఫోటోను స్వయంగా షేర్ చేసిన నిహారిక.. ఆ తర్వాత వెంటనే నిశ్చితార్ధ కార్యక్రమాన్ని ఫినిష్ చేసేసింది. ఇక డిసెంబర్ 9వ తేదీన డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని ఇటీవలే నాగబాబు ప్రకటించడంతో మెగా ఇంట సందడి మొదలైంది. నెల రోజుల ముందునుంచే ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి మెగా సిస్టర్స్ అంతా కలిసి చిల్ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read: ఈ ఫోటోలను నిహారిక తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. మెగా డాటర్స్ అందరూ కల

కమెడియన్ శంకర్ మేల్కొటే.. ఓ కంపెనీకి సీఈఓ... సినిమాల్లోనూ అవే పాత్రలు

Image
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హాస్యనటులున్నా కొందరు మాత్రం కలకాలం గుర్తుండిపోతారు. అలాంటి వారిలో ఒకరు. ప్రతి సినిమాలోనూ పిల్లి గడ్డంతో బ్లాక్‌ సూట్‌లోనే దర్శనమివ్వడం ఆయన ప్రత్యేకత. మేల్కొటే సినీ రంగ ప్రవేశం చాలా విచిత్రంగా జరిగిందట. ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థలో మేల్కొటే పనిచేసేవారు. ఆ సంస్థ కోసం తీసిన ప్రకటనలో ఆయన తొలిసారి నటించారు. కొద్దిరోజుల తర్వాత ఉషాకిరన్ మూవీస్ నిర్మించిన ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాలో హీరో బాస్ పాత్ర కోసం నటుడిని అన్వేషిస్తుండగా మేల్కొటేని పిలిచారట రామోజీరావు. Also Read: అక్కడే ఉన్న గేయ రచయిన వేటూరి సుందర రామ్మూర్తి మేల్కొటేని చూసి ఈయనకు స్క్రీన్ టెస్ట్ అవసరం లేదని రామోజీరావుకు చెప్పారట. ఆ సినిమాలో తెలుగు రాని బాస్‌ పాత్రలో మేల్కొటే ప్రేక్షకులను అలరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 180 చిత్రాల్లో ఆయన నటించారు. ఒకట్రెండు సినిమాల్లో తప్ప అన్ని సినిమాల్లోనూ బాస్‌గానే కనిపించినా ప్రేక్షకుల ఎప్పుడూ బోర్ కొట్టలేదు. సినిమాల్లో ఏదైనా కామెడీ బాస్ పాత్ర ఉందంటే ఇప్పటికీ దర్శక నిర్మాత ఫస్ట్ ఛాయిస్ ఆయనే. Also Read: అయిత

'మిథునం' బాలీవుడ్ రీమేక్.. బాలసుబ్రహ్మణ్యం పాత్రలో అమితాబ్ బచ్చన్!

Image
లెజెండరీ సింగర్ ఈ లోకాన్ని విడిచి రెండు నెలలు గడిచిపోయినా ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ నెమరు వేసుకుంటున్నారు జనం. గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకుల మదిలో ముద్ర వేసిన ఆయన `మిథునం` సినిమాలో విలక్షణ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. రెండే రెండు పాత్రలతో నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఈ సినిమాను రూపొందించారు. 2012లో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారట. Also Read: బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా రీమేక్ హక్కులను దక్కించుకుందట. ఈ హిందీ రీమేక్‌లో బాలీవుడ్ మెగాస్టార్ .. ఎస్పీ బాలు పోషించిన పాత్రలో నటించబోతున్నట్టు టాక్. అమితాబ్‌కు జంటగా ఒకనాటి అందాల తార రేఖ నటించనున్నారని తెలుస్తోంది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ మూవీ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరు? ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది అధికారిక వస్తేనే క్లారిటీ వస్తుంది.

వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరో తెలిస్తే షాకవుతారు...

Image
‘కోరుకున్న ప్రియుడు’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు వడ్డే నవీన్. నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా తెరంగ్రేటం చేసిన ఆయన హీరోగా అనేక సినిమాల్లో నటించారు. అయితే ఆయనకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం ‘పెళ్లి’. ఆ తర్వాత మనసిచ్చి చూడు, మా బాలాజీ, ప్రేమించే మనసు, చాలా బాగుంది లాంటి సినిమాలతో విజయాలు అందుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే కెరీర్లో ఎంత వేగంగా ఎదిగాడో అంతకంటే వేగంగా డౌన్ అయిపోయాడు నవీన్. Also Read: సుమారు 28 సినిమాల్లో హీరోగా నటించిన ఆయన అవకాశాలు తగ్గిపోవడంతో రెండు మూడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. అవికూడా పరాజయం పాలుకావడంతో ఆయన్ని పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఆయన నందమూరి కుటుంబానికి అల్లుడని చాలామందికి తెలియదు. వడ్డే రమేష్, నందమూరి కుటుంబాల మధ్య ఎప్పటినుంచో సాన్నిహిత్యం ఉండేది. దీంతో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కూతురైన చాముండేశ్వరిని నవీన్ పెళ్లాడాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా కొన్నాళ్లకే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ ప్రభావం కెరీర్‌పై పడటంతోనే నవీన్ సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఓ ఇంటర్వ్య

మీరు సూపర్... ప్రభాస్‌‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన మలయాళ స్టార్

Image
‘బాహుబలి’తో ఆలిండియా స్టార్‌గా ఎదిగారు రెబల్ స్టార్ . దక్షిణాదికి ధీటుగా ఉత్తరాదిలోనూ ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని ఆయన తూ.చా.తప్పకుండా పాటిస్తారు. తన సహనటులతో పాటు సీనియర్లకు ఎంతో మర్యాద ఇస్తుంటారాయన. అందుకే ప్రభాస్‌ని కలిసిన ఎవరైనా ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయిపోతారు. Also Read: ఈ కోవలోనే మలయాళం స్టార్‌ జయరాజ్‌ కూడా ప్రభాస్‌ని ఆకాశానికెత్తేశారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్‌’‌లో జయరామ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్‌తో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో పోస్ట్ చేసిన జయరామ్.. ప్రభాస్‌లో నిజాయతీలోనూ సూపర్ అంటూ పొగిడేశారు. రాధేశ్యామ్ గొప్ప ప్రేమకథా చిత్రమని, అందరి హృదయాలను తాకతుందని జయరామ్ అన్నారు. Also Read:

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కొత్త ప్రయాణం మొదలైంది.. నా బేబీతో కలిసి అడుగు పెట్టా: మంచు లక్ష్మి

Image
మంచు ఫ్యామిలీ నటీనటుల్లో ప్రయాణం ఎంతో ప్రత్యేకమైందని చెపుకోవచ్చు. అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై సందడి చేస్తూ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది మంచు లక్ష్మి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఫ్యామిలీ విశేషాలతో పాటు సమాజంలోని పరిస్థితులపై స్పందిస్తూ తన అభిప్రాయలు చెప్పే ఆమె.. తాజాగా కొత్త ప్రయాణం స్టార్ట్ చేసింది. ఈ మేరకు ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ పోస్ట్ పెట్టింది. ట్విట్టర్ వేదికగా తన ముద్దుల కూతురు విద్యా నిర్వాణతో కలిసి కొత్త ఆఫీస్‌లో అడుగుపెట్టిన ఫోటోలను షేర్ చేస్తూ తన ఫీలింగ్స్ అభిమానులతో పంచుకుంది. కొత్త ఆఫీస్‌ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఈ క్షణాలు ఎంతో మధురమైనవని అని పేర్కొంటూ మీ ప్రేమ ఆశీర్వాదం కావాలని కోరింది. ఇందుకోసం కొన్నాళ్ళుగా ఎంతో ఎగ్జైటింగా ఎదురు చేశానంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read: ఈ మధ్యకాలంలో తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్న మంచు లక్ష్మి.. ఇటీవలే బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అదే జోష్‌లో టెక్నాలజ

అనిల్ రావిపూడి మార్క్‌తో 'గాలి సంపత్'.. అరకులో శ్రీ విష్ణుతో కలిసి రాజేంద్ర ‌ప్ర‌సాద్ సందడి

Image
బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్న కొత్త సినిమా 'గాలి సంప‌త్'. అనిల్ కో డైరెక్ట‌ర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్ బ్యానర్ సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ హీరో , ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో న‌ట‌కిరీటి డా. గాలి సంప‌త్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనీష్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అరకులో జరుగుతోంది. రాజేంద్ర ప్రసాద్, హీరో శ్రీ విష్ణుతో పాటు సినిమాలో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ 5 వరకు జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుంది. ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఓ డిఫరెంట్ ఎమోషన్‌తో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్‌మెంట్ జోడించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. Also Read: ఈ చిత్రంలో రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్‌,

Prakash Raj పనికిమాలిన కుసంస్కారి.. ఒళ్లుపొంగి వాగితే.!: నాగబాబు సంచలన కామెంట్స్

Image
పవన్ కళ్యాణ్ పూటకో పార్టీ మార్చే ఊసరవెల్లి.. బీజేపీకి మద్దతు ఇవ్వాలంటే.. ఇక, జనసేన ఎందుకు? ఇంకొకరి భుజాన ఎక్కి ఈ రాజకీయాలు ఎందుకు? ప్రజలారా.. ఈసారి మీరే ఇలా వచ్చిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపాలి. వీళ్లకే కాక, వీళ్ల వెంట వెళ్లిన మన వారికి కూడా బుద్ధి చెప్పాలి అంటూ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. GHMC ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు తెలిపిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ విధానాలను తప్పుపట్టారు ప్రకాష్ రాజ్. అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలతో జనసైనికులు ఆగ్రహిస్తున్నారు. ప్రకాష్ రాజ్‌‌ని ఏకిపారేస్తుండగా.. ఈ విలక్షణ నటుడికి మద్దతు తెలిపేవారు చాలా మందే ఉన్నారు. ఈ తరుణంలో మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు.. ప్రకాష్ రాజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు కోసమే.. ప్రకాష్ పనికిమాలిన కుసంస్కారి అని.. డబ్బుకోసం నిర్మాతల్ని హింసకు గురిచేస్తాడంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. నాగబాబు ఏమన్నారంటే.. ‘రాజకీయాల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతూ ఉంటాయి.. బట్ ఆ నిర్ణయాల వెన

ఎస్పీ బాలసుబ్రమణ్యంకు ఏపీ ప్రభుత్వ ఘన నివాళి.. సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన చరణ్

Image
గాన గంధర్వురు ప్రస్తుతం మన మధ్యలో లేకపోయినా.. ఎన్నటికీ మాసిపోని ఆయన స్వరం సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది. ఆయన పాడిన పాటలు వింటూ బాలసుబ్రమణ్యంను నిత్యం తలచుకుంటోంది సినీ లోకం. అయితే తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. నెల్లూరు జిల్లా ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలకు ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరు పెట్టి ఆయన కీర్తిని చాటిచెప్పే ప్రయత్నం చేశారు సీఎం జగన్. ఈ మేరకు గురువారం రోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ పెట్టారు. దీనిపై రియాక్ట్ అయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్.. తన తండ్రి పేరును నెల్లూరు ప్రభుత్వ నృత్య పాఠశాలకు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మరణం తర్వాత తన తండ్రికి ఇచ్చిన గౌరవం పట్ల సీఎం జగన్‌కి, ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. బాలసుబ్రమణ్యం అభిమానులు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరస్మరణీయుడైన ఎస్పీ బాలసుబ్రమణ్యంకు నెల్లూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. నెల్లూరు లోనే పుట్ట

బాగా ఎంజాయ్ చేశా.. విజయ్ దేవరకొండతో ప్రయాణం ఓ విభిన్నమైన ప్రపంచం! అనన్య పాండే క్రేజీ ఫీలింగ్స్

Image
ఒకప్పుడు టాలీవుడ్ టు బాలీవుడ్ అన్నట్లుగా సాగిన హీరోయిన్స్ ప్రయాణం.. ఇప్పుడు బాలీవుడ్ టు టాలీవుడ్ అన్నట్లుగా మారడం చూస్తుంటే తెలుగు సినిమాల క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది తారలు బీ టౌన్ నుంచి వచ్చి తెలుగు తెరపై సందడి చేయగా.. హీరోగా రానున్న 'ఫైటర్' మూవీతో మరో బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాలో సమావేశంలో పాల్గొన్న అనన్య.. 'ఫైటర్' మూవీలో భాగం కావడం పట్ల ఆసక్తికరంగా రియాక్ట్ అయింది. స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌-2 సినిమాతో కెమెరా ముందుకొచ్చిన అనన్య పాండే తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మెల్లగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకుంటూ వరుస అవకాశాలు పట్టేస్తుంది. ఈ క్రమంలో కెరీర్ ఆరంభంలోనే టాలీవుడ్ నుంచి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫైటర్' (వర్కింగ్ టైటిల్) మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రొమాన్స్ చేస్తోంది. Also Read: అయితే తాజా ఇంటర్వ్యూలో తన అప్‌కమింగ్ సినిమాలపై స్పందించిన అనన్య పాండే.. తదు

‘మేజర్’ వెనుక పదేళ్ల కష్టం.. సందీప్ ఉన్నికృష్ణన్‌లా అడివి శేష్ ఎలా మారారంటే!

Image
‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవ‌రు’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు అడివి శేష్. ఆయన హీరోగా రాబోతున్న సినిమా ‘మేజర్’. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్‌లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ‘గూఢ‌చారి’ ఫేం శ‌శి కిర‌ణ్‌ తిక్కా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అడవి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా.. తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఎ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని రేపాయి. కాగా, శుక్రవారం ‘మేజ‌ర్‌’ లుక్ టెస్ట్ వీడియోను సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ బాబు విడుద‌ల‌ చేశారు. ఈ వీడియోలో ‘మేజర్’ ప్రయాణం ఎలా మొదలైంది.. లుక్ టెస్ట్ ఎలా జరిగింది అనే విషయాల‌ను అడివి శేష్ వెల్లడించారు. Also Read: ‘‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ 2008 నుంచి నా మైండ్‌లో ఉన్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు నేను యూఎస్

అనుపమా పరమేశ్వరన్ బాయ్‌ఫ్రెండ్‌తో రష్మిక డేటింగ్!

Image
కన్నడ బ్యూటీ రష్మిక మందనకు ప్రస్తుతం సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోయిన్ హోదాను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా నిలిచి మరింత పాపులారిటీని సంపాదించింది. అయితే, రష్మిక గురించి ప్రస్తుతం ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. అది ఆమె రిలేషన్‌షిప్ గురించి. మలయాళ దర్శకుడు, నిర్మాత చిరంజీవ్ మక్వానాతో రష్మిక రిలేషన్‌షిప్‌లో ఉన్నారట. ఈ విషయాన్ని ప్రముఖ ఫిలింస్ డాటాబేస్ సంస్థ ఐఎండీబీ స్పష్టం చేస్తోంది. ఐఎండీబీలో బయోగ్రఫీలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నిజానికి అనుమపమా పరమేశ్వరన్ ప్రియుడు చిరంజీవ్ మక్వానా అని ప్రచారంలో ఉంది. అందుకనే, బాయ్‌ఫ్రెండ్‌తో రష్మిక మందన రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ఐఎండీబీలో అప్‌డేట్ చేశారు. మరి దీనిలో నిజమెంతో తెలియాలంటే రష్మికనో లేదంటే చిరంజీవ్ మక్వానానో స్పందించే వరకు ఆగాల్సిందే. నిజానికి కన్నడ ఇండస్ట్రీ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన రష్మిక మందన.. ‘‘కిర్క్ పార్టీ’’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ చిత్ర హీరో, దర్శకుడు రక్షిత్ శెట్టితో రష్మిక ప్రేమలో పడ్డారు. ఆయనతో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, ఆ తరవాత వ్యక్తిగత కారణాలతో రక్షిత్ శెట్ట

ఆయనంటే చాలా ఇష్టం.. ఆ స్టార్ హీరో పెళ్లయిందని తెలిసి ఏడ్చేశా.. ఓపెన్ అయిన మంచు లక్ష్మి

Image
మంచు మోహన్ బాబు డాటర్, సినీ నటి ఇంటర్వ్యూ ఇచ్చిందంటే అందులో ఉండే కిక్కే వేరు. ఇంగ్లీష్, తెలుగు పదాలను కలిపి వాడుతూ తనదైన స్టైల్ మాటలతో అట్రాక్ట్ చేస్తుంటారామె. అందుకే ఈ మంచువారమ్మాయి మాటలను చాలా శ్రద్దగా వింటుంటారు ప్రేక్షకులు. పైగా సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే విషయాలపై రియాక్ట్ అయ్యే ఆమె.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను బయటపెడుతూ ఆసక్తికర సంగతులు చెప్పారు. రీసెంట్‌గా మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ ఓ హీరోకు పెళ్లి అయిందని తెలియడంతో ఏడ్చానని చెప్పి ఆశ్చర్యపర్చారు. ఆ హీరో మరెవరో కాదు అని, ఆయనకు తాను పెద్ద ఫ్యాన్ అని తెలిపారు. అయితే ఆయన పెళ్లి చేసుకున్నాడని తెలిశాక చాలా బాధ అనిపించిందని చెప్పిన ఈ మంచువారమ్మాయి.. ఆమిర్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్న సమయంలోనూ ఏడ్చేశానని చెప్పడం విశేషం. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ సినిమాలను ఎంచుకునే విధానం తనకు బాగా నచ్చుతుందని ఆమె పేర్కొన్నారు. ఇక తెలుగు హీరోల విషయానికొస్తే తాను నాగార్జునకు వీరాభిమానిని అని మంచు లక్ష్మి అన్నారు. అందుకే ఎప్పుడైనా ఆమిర్ ఖాన్, పేర్లు వింటే ఏదో అయిపోతుందని ఆమె చె

‘ఎనిమీ’గా వస్తోన్న విశాల్‌, ఆర్య.. టైటిల్‌కు భారీ స్పందన

Image
తమిళ హీరోలు , ఆర్య.. ఇద్దరూ ఇద్దరే. వైవిధ్యమైన కమర్షియల్ సినిమాలు చేస్తూ తమకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరోలు వీరు. గతంలో బాలా రూపొందించిన ‘వాడు-వీడు’ సినిమాలో విశాల్, ఆర్య కలిసి నటించి బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. ఆ సినిమా అప్పట్లో హాట్ టాపిక్. వీరిద్దరూ పక్కా పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు మరోసారి విశాల్, ఆర్య కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రానికి ‘ఎనిమీ’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్. ఈ టైటిల్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఇది హీరో విశాల్‌కు 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ సినిమా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ ప‌తాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విల‌క్షణ న‌టుడు ప్రకాష్ రాజ్ ఒక కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు. ‘గ‌ద్దల‌కొండ గ‌ణేష్’ సినిమాలో న‌టించిన మృణాళిని ర‌వి ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. Also Read: ఈ చిత్రాని

గర్భం దాల్చిన అనసూయ.. బయటపెట్టిన సాయి ధరమ్ తేజ్!

Image
యాంకర్, నటి భరద్వాజ్ గర్భం దాల్చారు. ఈ విషయాన్ని సుప్రీమ్ హీరో బయటపెట్టారు. అనసూయ గర్భం దాల్చారు అంటే నిజ జీవితంలో కాదండోయ్.. సినిమాలో! అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రానా ద‌గ్గుబాటి ఆవిష్కరించారు. దీనికి మంచి స్పంద‌న వచ్చింది. ఇప్పుడు నటీనటులను పరిచయం చేసే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆవిష్కరించారు. ప్రియ, అభిలను పరిచయం చేశారు. Also Read: ఈ పోస్టర్‌లో ఒక లిఫ్ట్‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ప్రెగ్నెంట్ లుక్‌లో, చేతిలో ఫేస్ మాస్క్ ప‌ట్టుకొని కోపంగా చూస్తున్నట్లు క‌నిపిస్తుంటే.. ఆమె వెన‌కే మ‌రో ప్రధాన పాత్రధారి అశ్విన్ విరాజ్ సీరియ‌స్ లుక్‌లో నిల‌బ‌డి క‌నిపిస్తున్నారు. ఒక‌రి వెనుక ఒక‌రు నిల్చొని, ప‌ర‌స్పరం చూసుకుంటున్న తీరు చూస్తుంటే ఆ ఇద్దరి మ‌ధ్య ఏదో గొడ‌వ ఉన్నట్లు అనిపిస్తోంది. టైటిల్ పోస్టర్ రివీల్ అయిన‌ప్పుడు సినిమా క‌థ‌కు, లిఫ్ట్‌కు ఏదో సంబంధం ఉంద‌నే విష‌యం అర్థమైంది. ఇప్పుడు ఆ లిఫ్ట్‌లో అన‌సూయ‌, విరాజ్ ఎడ‌ముఖం పెడ‌ముఖం పెట్టుకొని నిల్చొని క‌నిపించ‌డంతో సినిమా కంటెంట్‌పై మ‌రింత ఆస‌క్తి పెరిగింది.

చిరంజీవి తండ్రి కూడా నటుడే... ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో

Image
తెలుగు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఆ తర్వాత అగ్రహీరోగా ఇండస్ట్రీనే శాసించే స్థాయికి చేరారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన తండ్రి వెంకట్రావు ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారన్న విషయం మాత్రమే అందరికీ తెలుసు. ఆయన కూడా సినిమాల్లో నటించారన్న సంగతి చాలామందికి తెలియదు. సినిమాల్లోకి రాకముందే అంటే 1969లో విడుదలైన ‘జగత్ కిలాడీ’ సినిమాలో ఆయన చిన్న పాత్రలో మెరిశారు. ఆ తర్వాత ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కుటుంబ బాధ్యతల రీత్యా ఉద్యోగానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన పెద్ద కుమారుడైన శివశంకర వరప్రసాద్(చిరంజీవి)ని సినిమాల వైపు ప్రోత్సహించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి హీరోగా మారి రోజురోజుకీ ఎదుగుతుండటాన్ని చూసి ఆయన మురిసిపోయేవారట. Also Read: చిరంజీవి హీరోగా నటించిన ఓ సినిమాలో వెంకట్రావు కూడా నటించి కొడుకుతో కలిసి నటించాలన్న తన కోరిక తీర్చుకున్నారు. అయితే ఈ సినిమాలో ఇద్దరి మధ్య సన్నివేశాలేమీ ఉండదు. మినిస్టర్ పాత్రలో కాసేపు కనిపిస్తారాయన. ఆ సినిమానే ‘మంత్రిగారి వియ్యంకుడు’. బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంత్రి పాత్రకు సూటయ్య

‘అరణ్య’ సినిమా కోసం కంటి సర్జరీ.. నా డిసీజ్ అలా బయటపడింది: రానా

Image
తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన క్షణాల గురించి తొలిసారి స్పందించిన విషయం తెలిసిందే. సమంత హోస్ట్ చేస్తోన్న ‘సామ్ జామ్’ టాక్ షోలో పాల్గొన్న రానా.. తన అనారోగ్యంపై స్పందించారు. ‘సామ్ జామ్’ ఎపిసోడ్ 2 ప్రోమోలో ఈ విజువల్స్‌ను ప్రేక్షకులకు చూపించారు. అయితే, శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ‘సామ్ జామ్’ ఎపిసోడ్ 2లో రానా తన అనారోగ్యం గురించి, ఆ సమయంలో తాను ఎదుర్కొన్న కఠిన పరిస్థితుల గురించి క్షుణ్ణంగా వివరించారు. థాయిలాండ్‌లో ‘అరణ్య’ షూటింగ్ కోసం సన్నద్ధమవుతోన్న సమయమది. రానా సహా యూనిట్ మొత్తం థాయిలాండ్‌లోనే ఉంది. అయితే, ఈ సినిమాలో రానా కళ్లకు డిఫరెంట్ లెన్స్ వాడాలని దర్శకుడు ప్రభు సూచించారట. కానీ, ఆ లెన్స్ రానా కళ్లకు పెట్టడానికి కుదరదు. అందుకుని కళ్లకు ఒక చిన్న సర్జరీ చేసిన తరవాత లెన్స్ ఫిట్ చేయాలి. ఈ సర్జరీ చేయించుకుని ఒక 10 రోజులు విరామం తరవాత రానా షూటింగ్‌కు వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు ముందుగా బీపీ చూశారట. Also Read: డాక్టర్ వెంటనే.. మీకు ఎలా ఉంది, బాగానే ఉందా? అని అడిగారట. బాగానే ఉందని రానా సమాధానం చెప్పారట. నడిచేటప్పుడు బాగానే ఉందా? అని డాక్టర్ అడిగారట. నేను థ

పవన్ కళ్యాణ్ ఓ ఊసరవెల్లి: ఇక జనసేన ఎందుకు.. ప్రకాష్ రాజ్ సంచలనం

Image
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రముఖ సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పూటకో మాట మార్చే ఊసరవెల్లి అని వ్యాఖ్యానించారు. అభిమానులు, కార్యకర్తలకు బీజేపీకి ఓటెయ్యాలని చెబితే ఇక జనసేన ఎందుకని ప్రశ్నించారు. శుక్రవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేనాని రాజకీయాలపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్‌రాజ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘‘పవన్ కళ్యాణ్‌కు ఏమైందో నిజంగా నాకు అర్థం కావట్లేదు. పవన్ రాజకీయ నిర్ణయాలపై చాలా నిరుత్సాహం చెందాను. నువ్వొక లీడర్.. మీకొక పార్టీ ఉంది.. మళ్లీ ఇంకో నాయకుడి వైపు వేలు చూపించడం ఏంటి? ఏపీలో గాని, ఇంకో చోట గాని.. జనసేన ఓట్ షేర్ ఎంత.. బీజేపీ ఓటు షేర్ ఏంటి? 2014లో మీరే బీజేపీ వాళ్లు అద్భుతం, ఇంద్రుడు, చంద్రుడు అన్నారు. మళ్లీ గత ఎన్నికల్లో లేదు, వాళ్లు ద్రోహులు అన్నారు! మళ్లీ ఇప్పుడు వీళ్లే నాయకులుగా కనిపిస్తున్నారు అంటున్నారు. అంటే, ఇలా మూడు, నాలుగు సార్లు మారుతున్నారంటే.. మీరు ఊసరవెల్లి అయి ఉండాలి కదా. జాతి హితం కోసమే బీజేపీకి మద్దతా.. వీళ్లు మాట్లాడుతోంది ఏంటసలు. ఈ బీజేపీ వాళ్లు వెయ్యి జన్మలు ఎత్తాలి ,కేసీఆర్ అవ్వాలంటే. అభిమానులకు బీజేపీకి సపోర్

చిరంజీవి, నాగార్జున లాబీయింగ్ చేసుకున్నారు.. మాకు అన్యాయం చేశారు: నిర్మాత సంచలన వ్యాఖ్యలు

Image
కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన తెలుగు సినీ పరిశ్రమను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ కార్మికులను ఆదుకోవడంతో పాటు పరిశ్రమపై వరాల జల్లు కురిపించారు సీఎం కేసీఆర్. దీనికి కారణం మెగాస్టార్ , అక్కినేని సారథ్యంలో సినీ పెద్దలు కేసీఆర్‌తో చర్చలు జరపడమే. రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మితమయ్యే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్ చేస్తామని కేసీఆర్ ప్రకటించడంతో నిర్మాతలు, నిర్మాణ సంస్థలు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అయితే, కేసీఆర్ వరాల జల్లుపై తెలుగు ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్, నిర్మాత యేలూరు సురేంద్ర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, నాగార్జున తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. Also Read: ‘‘తెలంగాణ గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీకి వరాల జల్లు కురిపించిందని మా సినిమా పెద్దలు చంకలు కొట్టుకుంటున్నారు. చూస్తుంటే పెద్ద లాబీయింగ్ జరిగినట్లు ఉంది. పెద్ద హీరోలు, లీజు థియేటర్స్ వాళ్లు వారికి కావాల్సింది వాళ్ళు చేసుకున్నారు. 10 కోట్ల లోపు సినిమాకి జీఎస్టీ వాపస్ అన్నారు. పది కోట్ల రూపాయల సినిమాని చిన్న స

లవ్ ఫెయిల్యూర్ అయితే ఆ బాధేంటో నాకు తెలుసు: రేణూ దేశాయ్

Image
ప్రేమలో విఫలమైతే తట్టుకోవడం కష్టమని, ఆ బాధేంటో తనకు తెలుసని అన్నారు సినీనటి . అయితే ప్రేమలో విఫలమైనంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. చాలా రోజుల తర్వాత ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన రేణు.. అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్లు, అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చారు. Also Read: జీవితం, ప్రాణం కంటే ఎవరూ ఎక్కువ కాదని, ప్రేమలో ఫెయిల్ అయితే కలిగే బాధ తట్టుకోవడం కష్టమని రేణూ దేశాయ్ అన్నారు. ప్రేమించే మనిషి పక్కన లేదని, మనల్ని మోసం చేశాడన్న ఆలోచనలే చాలా కష్టంగా ఉంటాయని, కానీ ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం మాత్రం సరైన నిర్ణయం కాదన్నారు. కౌన్సిలింగ్ తీసుకుంటూనే కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌తో ఎక్కువ సమయం గడిపి మళ్లీ సాధారణ జీవితంలోకి అడుగుపెట్టొచ్చని చెప్పారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనకు ఒకేలా స్పందించాలని, బాధ కలిగితే ఏడవకూడదని, అలాగే సంతోషం కలిగినప్పుడు పొంగిపోకూడదని రేణు చెప్పారు Also Read: ప్రస్తుతం తాను ‘ఆద్య’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నానని రేణు దేశాయ్ తెలిపారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ వెబ్ సిరీస్‌లో తాను సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా కనిపించనున్నట్లు వె