‘ఎనిమీ’గా వస్తోన్న విశాల్‌, ఆర్య.. టైటిల్‌కు భారీ స్పందన

తమిళ హీరోలు , ఆర్య.. ఇద్దరూ ఇద్దరే. వైవిధ్యమైన కమర్షియల్ సినిమాలు చేస్తూ తమకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరోలు వీరు. గతంలో బాలా రూపొందించిన ‘వాడు-వీడు’ సినిమాలో విశాల్, ఆర్య కలిసి నటించి బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. ఆ సినిమా అప్పట్లో హాట్ టాపిక్. వీరిద్దరూ పక్కా పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు మరోసారి విశాల్, ఆర్య కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రానికి ‘ఎనిమీ’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్. ఈ టైటిల్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఇది హీరో విశాల్‌కు 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ సినిమా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ ప‌తాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విల‌క్షణ న‌టుడు ప్రకాష్ రాజ్ ఒక కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు. ‘గ‌ద్దల‌కొండ గ‌ణేష్’ సినిమాలో న‌టించిన మృణాళిని ర‌వి ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. Also Read: ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ ఆర్.‌డి.రాజ‌శేఖ‌ర్ ఛాయాగ్రహ‌ణం అందిస్తుండ‌గా, ఎస్.త‌మ‌న్ స్వరాలు స‌మ‌కూరుస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు మరికొన్ని భాషలలో ఈ చిత్రం విడుద‌ల‌కానుంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ టి.రామలింగం, ఎడిటర్ రేమండ్ డెరిక్ క్రాస్టా, యాక్షన్ రవివర్మ.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ