పవన్ కళ్యాణ్ ఓ ఊసరవెల్లి: ఇక జనసేన ఎందుకు.. ప్రకాష్ రాజ్ సంచలనం
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై ప్రముఖ సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పూటకో మాట మార్చే ఊసరవెల్లి అని వ్యాఖ్యానించారు. అభిమానులు, కార్యకర్తలకు బీజేపీకి ఓటెయ్యాలని చెబితే ఇక జనసేన ఎందుకని ప్రశ్నించారు. శుక్రవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేనాని రాజకీయాలపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్రాజ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘‘పవన్ కళ్యాణ్కు ఏమైందో నిజంగా నాకు అర్థం కావట్లేదు. పవన్ రాజకీయ నిర్ణయాలపై చాలా నిరుత్సాహం చెందాను. నువ్వొక లీడర్.. మీకొక పార్టీ ఉంది.. మళ్లీ ఇంకో నాయకుడి వైపు వేలు చూపించడం ఏంటి? ఏపీలో గాని, ఇంకో చోట గాని.. జనసేన ఓట్ షేర్ ఎంత.. బీజేపీ ఓటు షేర్ ఏంటి? 2014లో మీరే బీజేపీ వాళ్లు అద్భుతం, ఇంద్రుడు, చంద్రుడు అన్నారు. మళ్లీ గత ఎన్నికల్లో లేదు, వాళ్లు ద్రోహులు అన్నారు! మళ్లీ ఇప్పుడు వీళ్లే నాయకులుగా కనిపిస్తున్నారు అంటున్నారు. అంటే, ఇలా మూడు, నాలుగు సార్లు మారుతున్నారంటే.. మీరు ఊసరవెల్లి అయి ఉండాలి కదా. జాతి హితం కోసమే బీజేపీకి మద్దతా.. వీళ్లు మాట్లాడుతోంది ఏంటసలు. ఈ బీజేపీ వాళ్లు వెయ్యి జన్మలు ఎత్తాలి ,కేసీఆర్ అవ్వాలంటే. అభిమానులకు బీజేపీకి సపోర్ట్ చేద్దాం అంటున్నారు.. అంటే లీడర్ నేను కాదు.. ఆయన అని పవన్ అంటున్నట్లు! మీరు బీజేపీకి మద్దతు ఇవ్వాలంటే.. ఇక, జనసేన ఎందుకు? ఇంకొకరి భుజాన ఎక్కి ఈ రాజకీయాలు ఎందుకు? బీజేపీ, కాంగ్రెస్ సహా జాతీయ పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయాయి. తెలంగాణ ప్రజలరా.. తస్మాత్ జాగ్రత్త! గతంలో ఇలా వచ్చిన వారికి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఈసారి ఆయన బిజీగా ఉన్నారు. కాబట్టి, ప్రజలారా.. ఈ ఎన్నికల్లో మీరే ఇలా వచ్చిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపాలి. వీళ్లకే కాక, వీళ్ల వెంట వెళ్లిన మన వారికి కూడా బుద్ధి చెప్పాలి.’’ అని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment