YS Jagan: జగన్ పిల్లోడే కానీ దేశంలోనే నెం.1 సీఎం, కేసీఆర్ లాస్ట్: బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్

ఏపీ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రముఖ కమెడియన్, బీజేపీ నాయకుడు . దేశంలోనే నెంబర్ ముఖ్యమంత్రి సీఎం అని కొనియాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రిపై సంచలన కామెంట్స్ చేశారు. జగన్ నెంబర్ 1 అయితే కేసీఆర్ లాస్ట్ అంటూ ఆరోపణలు గుప్పించారు బాబు మోహన్. ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దేశంలోనే నెంబర్ 1 సీఎం. అద్భుతంగా పాలిస్తున్నాడు. పెన్షన్ల విధానంలో మార్పులు తీసుకువచ్చి వాలంటీర్స్‌ని పెట్టుకున్నాడు. గ్రామ సచివాలయాలు అంటూ సేవకుల్ని పెట్టుకున్నారు. వాలంటీర్లు ఇంటికి వెళ్లి మరీ పెన్షన్లు ఇస్తున్నారు. కరోనా టైంలో ఊరు ఊరికీ పోయి టెస్ట్‌లు చేయించాడు.. ప్రత్యేక వాహనాలు పెట్టాడు. జగన్ పిల్లాడు.. రాజకీయ అనుభవం లేదు.. తండ్రి చాటు బిడ్డ జగన్. అయినా అద్భుతంగా చేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి అడ్రసే లేదు. ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఫ్రెండ్సే కదా.. కరోనా టైంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టెస్ట్‌ల విషయంలో బ్రహ్మాండంగా చేశాడని ప్రధానమంత్రి మెచ్చుకున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకంటే కరోనా విషయంలో అద్భుతంగా చేశారని నెంబర్ వన్ సీఎం జగన్ అని ఆయనకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రికి లాస్ట్ ర్యాంక్ ఇచ్చారు. ఈయన ఊ అంటే ప్రధానిని మారుస్తా అంటాడు.. ఏం మారుస్తాడే ఏమో ఈయన చేతుల్లో ఏముందో.. మొన్న జనం మార్చేవారే కానీ కొద్దిలో పోయింది. రేపటి ఎన్నికల్లో తెలుస్తోంది.. ఈయన్ని మారుస్తాడా.. జనమే మారుస్తాడా అన్నది. మహానుభావుడు ఎన్టీఆర్ ఏమన్నాడు.. ప్రజలే దేవుడు అన్నారు.. కేసీఆర్‌కి మాత్రం డబ్బున్నోడే దేవుడు. పేదోడంటే అడ్రస్ ఉండదు. దళితులు అంటే లెక్కే ఉండదు. చిన్నవాళ్లు అంటే అసలు ప్రజలే కానట్టుగా ఉంటారు. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు ప్రజలేదు దేవుళ్లు.. సమాజమే దేవాలయం అన్నాడు. కానీ కేసీఆర్‌కి జనం కాదు డబ్బున్నోడే దేవుడు’ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు బాబు మోహన్.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ