చిరంజీవి తండ్రి కూడా నటుడే... ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో

తెలుగు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఆ తర్వాత అగ్రహీరోగా ఇండస్ట్రీనే శాసించే స్థాయికి చేరారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన తండ్రి వెంకట్రావు ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారన్న విషయం మాత్రమే అందరికీ తెలుసు. ఆయన కూడా సినిమాల్లో నటించారన్న సంగతి చాలామందికి తెలియదు. సినిమాల్లోకి రాకముందే అంటే 1969లో విడుదలైన ‘జగత్ కిలాడీ’ సినిమాలో ఆయన చిన్న పాత్రలో మెరిశారు. ఆ తర్వాత ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కుటుంబ బాధ్యతల రీత్యా ఉద్యోగానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన పెద్ద కుమారుడైన శివశంకర వరప్రసాద్(చిరంజీవి)ని సినిమాల వైపు ప్రోత్సహించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి హీరోగా మారి రోజురోజుకీ ఎదుగుతుండటాన్ని చూసి ఆయన మురిసిపోయేవారట. Also Read: చిరంజీవి హీరోగా నటించిన ఓ సినిమాలో వెంకట్రావు కూడా నటించి కొడుకుతో కలిసి నటించాలన్న తన కోరిక తీర్చుకున్నారు. అయితే ఈ సినిమాలో ఇద్దరి మధ్య సన్నివేశాలేమీ ఉండదు. మినిస్టర్ పాత్రలో కాసేపు కనిపిస్తారాయన. ఆ సినిమానే ‘మంత్రిగారి వియ్యంకుడు’. బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంత్రి పాత్రకు సూటయ్యే నటుడి కోసం చాలామందిని స్క్రీన్ టెస్ట్ చేశారట. ఆ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అల్లు రామలింగయ్య వెంటనే బాపు దగ్గరికి వెళ్లి వెంకట్రావు పేరు సూచించారట. అందుకు బాపు ఓకే చెప్పేయడంతో ఆ సినిమాలో మంత్రి పాత్రలో వెంకట్రావు నటించారు. అంతేకాదు అల్లు రామలింగయ్య ఇంట్లోకి వెళ్లే సమయంలో ఇంటి బయట ఉన్న నేమ్ బోర్డులో కె.వెంకట్రావు, మినిస్టర్.. అని రాసి ఉన్నట్లు చూపించారు. అయితే తండ్రీకొడుకులు ఒకే స్క్రీన్పై కనిపించకపోయినా.. ఒకే సినిమాలో నటించామన్న తృప్తి మాత్రం వెంకట్రావుకు లభించిందట. ఈ సినిమా ఎప్పుడైనా చూస్తే అల్లు రామలింగయ్య.. మంత్రి ఇంటికి వెళ్లి మాట్లాడే సన్నివేశాన్ని మిస్ కాకుండా వీక్షించండి. Also Read:


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ