Posts

Showing posts from February, 2020

Green India Challenge: ఖుష్బూతో మొక్కలు నాటించిన రోజా.. ఛాలెంజ్ ఎవరికి విసిరారంటే!

Image
‘మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని రక్షించుకుందాం’ అనే నినాదాన్ని జనంలోకి తీసుకువెళ్లడంలో సెలబ్రిటీలు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన కంటిన్యూ అవుతోంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు భాగస్వామ్యం అవుతూ తాము మొక్కలు నాటడంతో పాటు.. తమ సన్నిహితులు స్నేహితుల్ని ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగస్వామ్యం చేస్తున్నారు. ‘రోజా వనం’ పేరిట గత వారం సినీ నటుడు అర్జున్‌తో మొక్కలు నాటించిన సినీ నటి, నగరి ఎమ్మెల్యే శనివారం నాడు సీనియర్ నటి ఖుష్బూతో మొక్కలు నాటించారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్, రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుష్బూ మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తన తోటి యాక్టర్స్ మీనా, సుహాసిని, డాన్సర్ బింద్రాలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు .

Hit Movie: ‘హిట్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఈ లెక్కన నానికి లాభమా? నష్టమా?

Image
హీరోగానే కాదు.. నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు నేచురల్ స్టార్ నాని. వాల్ పోస్టర్ బ్యానర్‌తో నిర్మాతగా మారిన నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘హిట్’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రం శుక్రవారం నాడు విడుదలై పాజిటివ్ టాక్‌ను రాబట్టింది. శైలేష్ కొలను ఈ చిత్రంతో టాలీవుడ్ దర్శకుడిగా పరిచయం కాగా..‘చి.ల.సౌ ఫేమ్ రుహాని శర్మ హీరోయిన్‌గా నటించింది. మంచి బజ్‌తో థియేటర్స్‌కి వచ్చిన హిట్ మూవీ తొలిరోజు మంచి కలెక్షన్లే రాబట్టింది. ఈ నగరానికి ఏమైంది?, ఫలక్ నుమాదాస్ చిత్రాలతో నటుడిగా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కాకపోవడంతో ఈ చిత్రం తొలిరోజు ఓ మాదిరిగానే ఉన్నాయి. తొలిరోజు అన్ని ఏరియాలలోనూ కలిపి రూ. 1.29 కోట్లు రాబట్టింది. ఏరియాల వారిగా.. నైజాం- 0.66 కోట్లు సీడెడ్- 0.13 కోట్లు యూఏ- 0.12 కోట్లు గుంటూరు- 0.15 కోట్లు ఈస్ట్ గోదావరి- 0.06 కోట్లు వెస్ట్ గోదావారి- 0.05 కోట్లు క్రిష్ణా - 0.08 కోట్లు నెల్లూరు- 0.04 కోట్లు మొత్తం - 1.29 కోట్లు మొదటి 15 నిమిషాలు మీరు థియేటర్‌కి వచ్చికూర్చోండి.. ఆ తరువాత సీట్లలో మిమ్మల్ని నేను కూర్చోబెడతా.. వచ్చేటప్పుడు ఎక్కువ వాటర్

రాత్రి వేళల్లో హాట్ హీరోయిన్‌తో విజయ్ బైక్ రైడ్: ఫొటోలు వైరల్

Image
రౌడీ బాయ్ హాట్ హీరోయిన్‌ను బైక్ ముందు కూర్చోబెట్టుకుని రాత్రి వేళ్లలో తెగ చక్కర్లుకొట్టాడు. నమ్మడం లేదా.. కావాలంటే పైనున్న ఫొటో చూడండి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? బాలీవుడ్‌లో మొన్న మొన్ననే అడుగుపెట్టిన లేద అందం అనన్యా పాండే. ‘సాహో’ సినిమాలో విలన్‌గా నటించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు. ‘ఫైటర్’ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ సినిమాను సమర్పిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ లీకయ్యాయి. విజయ్ దేవరకొండ బైక్‌పై కూర్చుని ఉండగా, అనన్య ఆయన ముందు కూర్చుని ఉన్నారు. రాత్రివేళల్లో ఈ సీన్‌ను చిత్రీకరిస్తుండగా ఎవరో ఫొటోలు తీసారు. దాంతో ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో ఓ ఇంటర్‌ నేషనల్‌ స్టార్‌ను నటింపచేసేందుకు ప్రయత్నిస్తున్నాడట పూరి. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ

‘మైండ్ బ్లాక్’ ఫుల్ సాంగ్: బాబూ సూడు.. గంటలోనే రికార్డు!

Image
‘బాబూ నూ సెప్పు.. వాడ్ని కొట్టమని డప్పు’.. సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు థియేటర్లలో పూనకాలతో ఊగిపోయిన పాట ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈరోజుకి సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘మైండ్ బ్లాక్’ ఫుల్ సాంగ్‌ని రిలీజ్ చేసింది టీం. ఈ పాట రిలీజ్ అయిన గంటలోనే నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. పాటకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. మహేష్ ఇలాంటి ఒక ఊర మాస్ పాట చేస్తాడని ఫ్యాన్స్ ఎప్పుడూ ఊహించలేదు. లుంగీ కట్టుకుని మరీ మహేష్ మాస్ స్టెప్పులకు వేసాడంటే ఇక ఫ్యాన్స్ ఆగుతారా. అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఫ్యాన్స్‌ మరిచిపోలేని మాస్ పాట అందిస్తానని చెప్పాడు. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అసలు మహేష్‌కి డ్యా్న్స్ వచ్చా అని అడిగినవారంతా ఈ పాట చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. సినిమా 50 రోజులు సక్సెస్‌ఫుల్‌గా ఆడిన సందర్భంగా అనిల్ రావిపూడి ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టారు. READ ALSO: ‘మరో మర్చిపోలేని సంక్రాంతి. నేనెప్పటికీ మర్చిపోలేని ప్రయాణం. నేను

పవర్‌స్టార్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌కి రెడీగా ఉండిండి.. ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది

Image
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది. సోమవారం ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే టీం నుంచి అఫీషియన్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సినిమాకు లాయర్ సాబ్, లేదా వకీల్ సాబ్ అనే టైటిల్ అనుకుంటున్నారట. బాలీవుడ్‌లో మంచి విజయం అందుకున్న ‘పింక్’ సినిమాకు ఈ సినిమా రీమేక్‌గా రాబోతోంది. అందులో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో అదే పాత్రను పవన్ పోషిస్తున్నారు. ఈ సినిమాలో మరో ముగ్గురు అమ్మాయిల పాత్రలు చాలా కీలకం. హిందీలో తాప్సి, కీర్తి కుల్హరి నటించిన పాత్రల్లో నివేదా థామస్‌, అంజలి నటిస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరిగిపోతోంది. పవన్ షూటింగ్స్‌కు హైదరాబాద్ వచ్చేందుకు దిల్ రాజు ఆయన కోసం ప్రత్యేకమైన విమానం కూడా ఏర్పాటుచేసినట్లు సమాచారం. READ ALSO: త్వరోలో సినిమాలోని మొదటి పాటను రిలీజ్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు తమన్ సంగీతం అందించార

ఇక బెడ్రూం సీన్లలో నటించే ఓపిక నాకు లేదు: సిద్ధార్థ్ హీరోయిన్

Image
ఫలానా హీరోయిన్ సెక్స్ సీన్లలో, రొమాంటిక్ సీన్లలో నటిస్తే ఇక ఆమెను ఇలాంటి సన్నివేశాల్లో చూపించాలని అనుకుంటారు. కొందరేమో ఏ సన్నివేశం అయితే ఏంటి అవకాశం వచ్చిందా లేదా అని నటించేస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం ఎప్పుడూ ఇవే సీన్లా, నాలో నటిని గుర్తించలేరా అని బాధపడుతుంటారు. అలాంటివారిలో ఒకరు ప్రముఖ తమిళ నటి . ‘గృహం’, ‘విశ్వరూపం 2’ సినిమాల్లో రొమాంటిక్ డోస్ కాస్త ఎక్కువగా ఉన్న సన్నివేశాల్లో నటించారు ఆండ్రియా. ఇటీవల రిలీజ్ అయిన ‘వడా చెన్నై’ సినిమాలో కూడా ఆండ్రియా పాత్ర బెడ్‌రూం సీన్లకే పరిమితం అయిపోయింది. అయితే ఇక ఈ సీన్లతో విసిగిపోయానని అంటున్నారు ఆండ్రియా. తనకు చాలాకాలంగా ఇలాంటి సన్నివేశాలే వస్తున్నాయని, ఇక తన వల్ల కాదని అన్నారు. తన పాత్ర గొప్పగా ఉండి, బెడ్ రూం సీన్లలో నటించాల్సిన అవసరం ఉంటే తప్పకుండా చేస్తాను కానీ, ఊరికే బోల్డ్ సీన్లలో నటించమంటే మాత్రం ఇక నుంచి నో చెప్పాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మంచి పాత్రలతో తన వద్దకు వస్తే రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆండ్రియా ‘మాస్టర్’ సినిమాలో నటిస్తున్నారు. దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు

రాజకీయాల్లోకి రజినీకాంతా.. వచ్చేలోపే చచ్చిపోతాడు: దర్శకుడి షాకింగ్ వ్యాఖ్యలు

Image
సూపర్‌స్టార్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుంచో కలలు కన్నారు. ఇంకా పార్టీ పేరు ప్రకటించలేదు కానీ ఆయన పరోక్షంగా రాజకీయాల్లోకి వచ్చేసినట్లే. అయితే సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్తే.. ప్రత్యర్ధి పార్టీలు కుళ్లుకోవడం, కామెంట్స్ చేయడం చూసే ఉంటాం. కానీ ఓ సినీ దర్శకుడే రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై షాకింగ్ కామెంట్స్ చేసారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఆర్. సుందర రాజన్. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత 72వ జయంతి సందర్భంగా తమిళనాడులో ఓ కార్యక్రమం ఏర్పాటుచేసారు. ఈ ఈవెంట్‌కు సుందరరాజన్ అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్ ఎక్కి ఇష్టారాజ్యంగా మాట్లాడేసారు. "అన్నాదురై ముఖ్యమంత్రి అయినప్పుడు టీచర్లు చాలా సంతోషించారు. ఎందుకంటే సీఎం అవడానికి ముందు అన్నాదురై కూడా టీచర్ ప్రొఫెషన్‌లోనే ఉన్నారు. కానీ టీచర్లు ఎవ్వరూ ఆయన్ను ఫాలో అయ్యి సీఎం అవ్వాలని అనుకోలేదు. కానీ ఎప్పుడైతే మహానుభావుడు ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యారో, చాలా మంది తమకున్న అర్హతలు ఏంటో కూడా చూసుకోకుండా సినిమాల్లోకి వచ్చేయాలని నిర్ణయించేసుకున్నారు. రజినీకాంత్ పార్టీ పెట్టి, కోయింబత్తూరులో తొలి సమావేశం ఏర్పాటుచేసారనుకోండ

ఫొటోలు: రష్మిక చిట్టి చెల్లెలు.. ఎంత ముద్దుగుందో

భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో 2020లో రెండు హిట్లు అందుకుని టాలీవుడ్‌లో సత్తా చాటుతోంది రష్మిక. అర్థమౌతోందా అంటూ అందర్నీ అలరిస్తున్న ఈ భామకు ఓ చిట్టిచెల్లెలు ఉంది. వీరిద్దరికీ సంబంధించి వైరల్ అవుతున్న ఫొటోలు మీకోసం.

‘రెడ్’ టీజ‌ర్: రాపో మాస్ థ్రిల్లర్.. మణిశర్మ మార్క్ స్కోర్

Image
క్రైమ్ థ్రిల్లర్ జోన‌ర్‌కి స‌స్పెన్స్ ఎలిమెంట్ చాలా కీల‌కం. అస‌లేం జ‌రుగుతోంది? అన్నది ముందే రివీల్ కాకూడ‌దు. ప్రేక్షకుడి ఊహ‌కు దొరికిపోకూడదు. ఊపిరి బిగ‌బ‌ట్టి కుర్చీ అంచున కూర్చొని చూడ‌గ‌లిగేలా చేస్తేనే స‌క్సెస్ సాధ్యం. అలాంటి గ్రిప్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్లు ఇటీవ‌ల టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేశాయి. ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ కం ల‌వ్ స్టోరీల‌తో హిట్లు కొట్టే ట్రెండ్ న‌డుస్తోంది. ఆ కోవ‌లోనే మ‌రో ప్రయ‌త్నం ‘రెడ్’. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కిశోర్ తిరుమ‌ల ద‌ర్శక‌త్వం వ‌స్తోన్న చిత్రం ‘రెడ్’. శ్రీ‌ స్రవంతి మూవీస్ ప‌తాకంపై స్రవంతి ర‌వికిశోర్ నిర్మిస్తున్నారు. ఇదో స‌స్పెన్స్ థ్రిల్లర్ కం ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్. ఆద్యంతం ఎమోష‌న్స్ ర‌క్తి క‌ట్టిస్తాయి. నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ‌ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, చిత్ర ప్రచారంలో భాగంగా శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. Also Read: ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. టీజర్‌లో ఈ రెండు పాత్రలను పరిచయం చేశారు. ‘‘క్రైమ్ హిస్టరీలో ఇల

బాక్సాఫీస్ దుమ్ముదులిపిన భీష్మ.. ఫస్ట్ వీక్ రూ. 50 కోట్లు

Image
నితిన్, రష్మిక జంటగా నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద భీష్మ కలెక్షన్ల కుమ్ముడు కొనసాగిస్తోంది. గత శుక్రవారం (ఫిబ్రవరి 21) విడుదలైన ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో నితిన్ కెరియర్‌లోను అత్యధిక వసూళ్లను రాబడుతోంది. తొలిరోజు ఆరున్నర కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.10 కోట్లు.. నాలుగు రోజుల్లో రూ. 16.71 కోట్ల షేర్ రాబట్టింది. ఇక తొలివారం ముగిసేనాటికి ఆక్యుపెన్సీ పెంచుకుని వరల్డ్ వైడ్ రూ.50 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. కాగా భీష్మ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. ఈ సినిమా రూ. 23 కోట్లకు మార్కెట్ చేయగా.. తొలి ఐదురోజుల్లోనే ఖర్చుపెట్టిన మొత్తం వచ్చేసింది. దీంతో ఫుల్ ఖుషీలో ఉంది. ఇప్పటికే హైదరాబాద్ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగగా.. వైజాగ్‌లో 29న ‘భీష్మ’ విజయోత్సవ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు దక్కడంతో విజయోత్సవ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తారనే ప్రచారం నడుస్తోంది. అయితే నిర్మాణ సంస్థ నుండి పవన్ రాకపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

నిఖిల్ ‘కార్తికేయ 2’కి ముహూర్తం ఫిక్స్

Image
నిఖిల్ హీరోగా సుమారు ఆరేళ్ల క్రితం అంటే 2014 అక్టోబర్ 24న ‘కార్తికేయ’ అనే సినిమా విడుదలైంది. నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ ‘కార్తికేయ’ను మించిన సినిమాను నిఖిల్ చేయలేదు. ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు అని నిఖిల్‌ను అభిమానులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇటు నిఖిల్‌తో పాటు డైరెక్టర్ చందు మొండేటిని సీక్వెల్ గురించి పదేపదే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది. యానిమ‌ల్ హిప్నటిజం అనే కొత్త కాన్సెప్ట్‌ని ‘కార్తికేయ’ చిత్రం ద్వారా డైరెక్టర్ చందు మొండేటి తెలుగు ప్రేక్షకులకు ప‌రిచ‌యం చేశారు. మొత్తానికి మళ్లీ వీరిద్దరి కాంబినేష‌న్‌లో ‘కార్తికేయ 2’ వచ్చేస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 2న తిరుమ‌ల తిరుప‌తిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీవేంక‌టేశ్వరుని స‌న్నిధానంలో ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. Also Read: ‘‘అర్జున్ సుర‌వ‌రం’’ లాంటి బ్లాక్‌బ‌స్టర్ త‌రువాత ఏ చిత్రం చేయ‌కుండా కొంత గ్యాప్ తీసుకుని ప్రేక్షకుల‌కి, త‌న అభిమా

‘ఓ పిట్టకథ’ చెప్పడానికి వస్తోన్న మెగాస్టార్

Image
గతంలో మంచి కమర్షియల్ సినిమాలను నిర్మించిన భవ్య క్రియేషన్స్‌ సంస్థ తొలిసారి కొత్త తారలతో, కొత్త దర్శకుడితో నిర్మించిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా బ్రహ్మాజీ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 6న విడుదలకు సిద్ధమవుతోంది. చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత ఆనంద ప్రసాద్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ‘‘కథను నమ్మి తీసిన సినిమా ఇది. ఇప్పటికే మా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా చాలా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేయనున్నాం. చిరంజీవి గారి రాకతో మా సినిమాకి ఓ కొత్త ఊపు రాబోతుంది. ఆయన ఈ ఫంక్షన్‌కి రావడానికి అంగీకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్‌’’ అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య చిన్న సినిమాలను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇటీవల నిఖిల్ సినిమా ‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథ

నూనిగాడి సినిమా ఫట్ అంటగా... శ్రీరెడ్డి సెటైర్

Image
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్’ సినిమాపై వివాదాస్పద నటి కామెంట్స్ చేసిందా? ఆమె కామెంట్ చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. విశ్వక్ సేన్, రుహాని శర్మ జంటగా నటించిన ‘హిట్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో కామెంట్స్ చేసింది. ‘హిట్టా ఫట్టా.. నూనిగాడు ఓం బూమ్ ఫట్ అంటగా’ అని సెటైర్ పేల్చింది. అయితే నాని నిర్మించిన హిట్ సినిమాకు శ్రీరెడ్డి పెట్టిన కామెంట్ సింక్ అవుతోంది. అంటే ఆమె నానిపై కామెంట్స్ చేసినట్టేగా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. శ్రీరెడ్డి మీటూ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు నాని పేరును కూడా బయటపెట్టి షాకింగ్ విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. నాని కూడా తనను లైంగికంగా వేధించాడని పేర్కొంది. అందుకే ‘బిగ్ బాస్ 2’లో తనకు అవకాశం రానివ్వకుండా చేసాడని ఆరోపించింది. కానీ నాని మాత్రం ఈ వార్తలను ఖండించాడు. అనవసరంగా తనపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతేకాదు శ్రీరెడ్డిని లీగల్ నోటీసులు కూడా పంపించారు. దీనికి శ్రీరెడ్డి స్పందిస్తూ.. ‘కచ్చితంగా మనం న్యాయ పరంగానే పోరాడదాం’ అని సవాల్ చేసారు. ఇవ

కరోనా వైరస్‌పై హీరో నిఖిల్ సిల్లీ కామెంట్.. క్లాస్ పీకిన జర్నలిస్ట్

Image
చైనాతో పాటు ఇతర దేశాలను గజగజా వణికిస్తోంది మహమ్మారి కరోనా వైరస్. చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పటికి 50 దేశాలకు వ్యాపించింది. ఓ పక్క యావత్ ప్రపంచం ఎక్కడ ఈ వైరస్ బారిన పడతామోనని భయంతో వణికిపోతుంటే.. యువ నటుడు సిద్ధార్థ్ ఈ వైరస్‌పై సిల్లీ కామెంట్ చేసారు. కరోనా వైరస్ వల్ల స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోయిందని, 2008 ఆర్థిక మాంద్యం తర్వాత మళ్లీ ఇంతగా పడిపోయింది లేదు అని ఓ వ్యక్తి ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌కు నిఖిల్ స్పందిస్తూ.. ‘థ్యాంక్స్ టు కరోనా వైరస్. స్టాక్స్ కొనుక్కోవడానికి ఇదే సరైన సమయం’ అని కామెంట్ చేసాడు. దాంతో ప్రముఖ జర్నలిస్ట్ హేమంత్‌కి ఒళ్లుమండింది. ‘ఇలాంటి సమయంలో నీ కామెంట్ చాలా ఇన్‌సెన్సిటివ్‌గా ఉంది బ్రో. ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న దేశాలు, ప్రజలు వైరస్ వల్ల అల్లాడిపోతున్న సమయంలో ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా’ అని నిఖిల్‌కి క్లాస్ పీకాడు. దీనికి నిఖిల్.. ‘మనుషులు ఎంత మంది మనుషులను చంపగలరో, అంతమందిని ఈ వైరస్ కూడా చంపలేదు. ఇంతమందిని మద్యం, సిగరెట్లు కూడా చంపలేవు. ఇలాంటి ఫ్లూ వ్యాధిలు వచ్చిపోతుంటాయ్. మనం ద

భక్తవత్సలం నాయుడు లాండింగ్.. కలెక్షన్ కింగ్ కిర్రాక్ లుక్

Image
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ప్రముఖ తమిళ నటుడు సూర్య నటిస్తున్న చిత్రం ‘సూరారై పొట్రు’. తెలుగులో ఈ సినిమాను ‘ఆకాశం నీ హద్దురా’ టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో మోహన్ బాబు ఎయిర్ వింగ్ కమాండర్‌గా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఆయన పేరు భక్తవత్సలం నాయుడు. మోహన్ బాబు అసలు పేరు కూడా అదే కావడం విశేషం.ఈ సినిమాలోని మోహన్ బాబు లుక్స్ రిలీజ్ అయ్యాయి. ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో ఆయన లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. సినిమాకు మోహన్ బాబే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకురాలు సుధ కొంగర. ఆస్కార్ అవార్డు గ్రహీత గునీత్ మోంగాతో పాటు సూర్య ఈ సినిమాను నిర్మాతగా వ్యవహరించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ వినోద్ మాల్యా అనే పాత్రలో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఇటీవల ఈ సినిమాలోని తొలి పాటను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసారు. దాదాపు వంద మంది అనాథ పిల్లలను సూర్య విమానంలో ఎక్కించారు. ఈ సినిమాలో జేబులో ఆరు వేల రూపాయలు పెట్టుకుని పట్టణం

సునీల్ కొత్త సినిమా.. బాప్‌రే విలన్ గెటప్‌లో అదిరిపోయాడుగా!

Image
ఈరోజు ప్రముఖ కమెడియన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘కలర్ ఫొటో’ సినిమాలో ఆయన లుక్‌ను టీం రిలీజ్ చేసింది. లుక్‌లో సునీల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. జీపులో స్టైల్‌గా కూర్చుని సీరియస్‌గా కనిపిస్తున్న సునీల్ తన లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇందులో ఆయన పేరు ఎస్సై రామరాజు. ఈ సినిమాలో కమెడియన్ సుహాస్ కథానాయకుడిగా నటిస్తు్న్నారు. విజేత, పేపర్‌ బాయ్‌, మజిలీ, డియర్‌ కామ్రేడ్‌, ప్రతిరోజూ పండగే సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సుహాస్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. నటుడు సందీప్ రాజ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను హృదయ కాలేయం సినిమాకు దర్శకత్వం వహించిన స్టీవెన్‌ శంకర్‌ అలియాస్‌ సాయి రాజేష్, లౌక్యా ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. చాయ్‌ బిస్కెట్‌ యూట్యూబ్‌చానల్‌ కోసం కలిసి పనిచేసిన సుహాస్, సందీప్‌ల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. సుహాస్‌కు జోడిగా ఛాందిని చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. READ ALSO: ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత ‘అందాల రామ

టీఎస్‌ఆర్టీసీ బస్సులో ‘భీష్మ’ పైరసీ.. రియాక్ట్ అయిన కేటీఆర్

Image
వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భీష్మ’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. రష్మిక మందన కథనాయికగా నటించారు. వారం రోజుల్లోనే 50 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే పైరసీ కాపీలు వచ్చేసాయి. పైగా ఆ పైరసీ కాపీని టీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్లే చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని నిఖిల్ అనే నెటిజన్ దర్శకుడు వెంకీ కుడుములకు తెలియజేసాడు. ‘‘తెలంగాణ ఆర్టీసీ బస్సులో భీష్మ పైరసీని ప్లే చేసారు. వెంకీ కుడుముల, నితిన్ వెంటనే వీరిపై యాక్షన్ తీసుకోండి’ అంటూ ఆ బస్సు నెంబర్‌తో సహా ఫొటోలను షేర్ చేసాడు. దీనిపై వెంకీ కుడుముల స్పందిస్తూ.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసారు. ‘నా టీం పైరసీలు అవ్వకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బస్సుల్లో పైరసీ సినిమాలను ప్లే చేస్తే వెంటనే వారిని ప్రశ్నించండి. వినకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయండి. సినిమాలు తీయడానికి మేమెంతో డబ్బు పెట్టి కష్టపడుతుంటాం. మా సినిమా అనే కాదు ఏ సినిమాను కూడా పైరసీ చేయనివ్వకండి. గురించి నాకు తెలిసేలా చేసిన వ్యక్తికి ధన్యవాదాలు. టీఎస్‌ఆర్టీసీ బస్సులో పైరసీ మూవీని ప్లే చేయడం బాధాకరం. కే

Indian 2 Accident: శంకర్‌ను గంటల తరబడి విచారించిన సీబీఐ

Image
కొన్ని రోజుల క్రితం ‘భారతీయుడు 2’ షూటింగ్ సెట్‌లో జరిగిన ఘోర ప్రమాదం నుంచి సినిమా టీం ఇంకా కోలుకోలేకపోతోంది. రాత్రి షూటింగ్‌లో బిజీగా ఉండగా భారీ క్రేన్ మీద పడి ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్‌మెన్ అక్కడికక్కడే చనిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. దర్శకుడు శంకర్, కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ వెంట్రుకవాసిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఈ విషయం సీబీఐ దాకా వెళ్లింది. సీబీఐ అధికారులు శంకర్‌ను చెన్నైలోని వేపేరి ప్రాంతానికి తీసుకెళ్లి రెండు గంటలకు పైగా విచారణ జరిపారట. అయితే శంకర్‌ను ఎలాంటి ప్రశ్నలు సంధించారు అన్న వివరాలు మాత్రం బయటికి రాలేదు. అయితే ‘భారతీయుడు 2’ సెట్స్‌లో జరిగిన ప్రమాదం విషయంలో తప్పంతా లైకా ప్రొడక్షన్స్‌దే అన్నట్లుగా కమల్ మాట్లాడారు. అంతేకాదు సెట్స్‌లో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికి అన్ని విషయాల్లోనూ భద్రత కల్పిస్తేనే మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాం అని లైకా ప్రొడక్షన్స్‌కు లేఖ రాసారు. అప్పటివరకు ఎవ్వరూ షూటింగ్‌లో పాల్గొనరు అని చెప్పారు. దాంతో లైకా ప్రొడక్షన్స్ సీఈఓ నీలకాంత్ నారాయణ్‌పూర్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. దాంతో లైకా ప్రొడక్షన్స్ సీఈఓ నీలకాంత్ నారాయణ్ పూర్ కమల్ మాటలను ఖండ

మళ్లీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న శ్రుతి హాసన్.. షాక్‌కు గురిచేస్తున్న ఫొటోలు

Image
స్టార్ నటి ఒకప్పుడు ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె మళ్లీ సర్జరీ చేయించుకున్నారట. ఇదవరకు ఆమెకు ఉన్న ముక్కుతో పోలిస్తే ఇప్పుడు కాస్త సన్నబడినట్లుగా కనిపిస్తోంది. అన్నింటి కంటే షాకింగ్ విషయం ఏంటంటే.. శ్రుతి చాలా సన్నబడిపోయారు. దాంతో శ్రుతికి ఏమైంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దాంతో ఈ సారి ధైర్యంగా తాను ఎందుకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. "నేను ఇటీవల ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేసాను. కానీ చాలా సన్నగా ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ చేసారు. ఇకపై ఈ కామెంట్స్‌ సహించబోం. నేను ఇప్పుడు పోస్ట్ చేసిన ఫొటోలు మూడు రోజుల గ్యాప్ మధ్యలో తీసినవి. నేను చెప్పబోయే విషయం గురించి ఇతర ఆడవాళ్లు కూడా ఫీలవుతారని అనుకుంటున్నారు. నాకు మెంటల్‌గా ఫిజికల్‌గా హార్మోనల్ సమస్యలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పాటు నా హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అది అంత సులువు కాదు. బాధ భరించడం అంత సులువు కాదు, శారీరకంగా జరిగే మార్పులను తట్టుకోవడం అంత తేలిక కాదు" READ ALSO: "ఇతరులను వేలెత్తి చూపే హక్కు ఎవ్వరికీ

‘హిట్’ ట్విట్టర్ రివ్యూ: సస్పెన్స్‌తో చంపేశారు.. సూపర్‘హిట్’

Image
చాలా రోజుల తరవాత ఒక చిన్న సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి ప్రధాన కారణం నేచురల్ స్టార్ నాని. ఆయన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా నిర్మాణంలో వస్తోన్న చిత్రం కావడంతో ‘హిట్’ సినిమాకు మంచి పాపులారిటీ వచ్చింది. దీనికి తోడు ప్రచార కార్యక్రమాలను కూడా బాగా నిర్వహించడం ప్లస్ అయ్యింది. రాజమౌళి, అనుష్క, రానా వంటి వాళ్లతో ప్రమోట్ చేయించి సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చారు నాని. మరోవైపు, ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఈ చిత్రంలో హీరోగా నటించడం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్’ మూవీ భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభమైపోయాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ చాలా బాగుందని అంటున్నారు. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు కట్టిపడేశారట. చాలా బాగా ఎంగేజ్ చేశారని చెబుతున్నారు. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేశారట. విశ్వక్‌సేన్ చాలా బాగా నటిం

నా బ్యానర్‌లో స్టార్ డైరెక్టర్లు పని చేయరు.. నేనూ నటించను: నాని

Image
నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్పణ‌లో వాల్ పోస్టర్ సినిమా బ్యాన‌ర్‌పై ‘ఫ‌ల‌క్‌నుమాదాస్’ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన చిత్రం ‘హిట్‌’. ‘ది ఫ‌స్ట్ కేస్‌’ అనేది ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రశాంతి ఈ చిత్రాన్ని నిర్మాత. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించారు. విశ్వక్ సేన్ ఈ చిత్రంలో విక్రమ్ రుద్రరాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించనున్నారు. ఫిబ్రవ‌రి 28న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ నేపథ్యంలో గురువారం చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేసింది. నిర్మాత నాని మాట్లాడుతూ.. ‘‘రేపు సినిమా విడుదలవుతుంది. చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్నాం. అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది. గ‌త రెండు మూడేళ్లుగా తెలుగులో కొత్త కంటెంట్ సినిమాలు అన్నీ స‌క్సెస్ అవుతున్నాయి. స‌పోర్ట్ చేస్తున్న అంద‌రికీ థాంక్స్‌. అన్ని చోట్ల నుండి పాజిటివ్ బ‌జ్ వ‌స్తుంది. ప్రామిస్‌గా చెబుతున్నాను సినిమా న‌చ్చి.. మ‌ళ్లీ మీ స్నేహితుల‌తోనో, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తోనో వెళ‌తారనే న‌మ్మకం ఉంది. సినిమాను చూసిన వారు సినిమా గురించి ఎక్కువగా రివీల్ చేయకుండా చూడాలని

యాడ్స్‌లోకి వచ్చేసిన హీరో సుశాంత్: డౌట్స్ తుడిచెయ్.. అది తెరిచెయ్!

Image
అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో సుశాంత్ ఒకరు. ‘కాళిదాసు’ సినిమాతో హీరోగా పరిచయమైన సుశాంత్.. ‘కరెంట్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆ తరవాత వరుస డిజాస్టర్లతో డీలా పడ్డారు. 2018లో వచ్చిన ‘చి.ల.సౌ’ సినిమాతో మళ్లీ హిట్ అందుకున్నారు. ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ ఒక పాత్ర చేశారు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే, సుశాంత్ ఇప్పుడు వాణిజ్య ప్రకటనల్లోకి కూడా వచ్చేశారు. శీతల పానీయం ‘స్ర్పైట్’తో వాణిజ్య ప్రకటనల (కమర్షియల్ యాడ్స్) ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సుశాంత్ ఇప్పుడు ‘స్ర్పైట్’కు బ్రాండ్ అంబాసడర్. ఆ బ్రాండ్‌కు ఆయన చేసిన మొదటి కమర్షియ యాడ్ విడుదలైంది. ఇదివరకటి యాడ్స్ తరహాలోనే ఉత్తేజభరితంగా ఉన్న ఈ టీవీ కమర్షియల్‌లో సుశాంత్ ఉబర్ కూల్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. ‘స్ర్పైట్’కు తమిళంలో అనిరుధ్ రవిచందర్, హిందీలో ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ అంబాసడర్లుగా వ్యవహరిస్తున్నారు. Also Read: కాగా, ‘స్ర్పైట్’కు ఇప్పటి వరకు తెలుగులో నాని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అంతకు ముందు నవీన్ పొలిశెట్టి, ప్రియ

Bheeshma Thanks Meet: నితిన్ కోసం వస్తున్న మెగా వారసుడు

Image
యువ హీరో నితిన్‌కు దాదాపు నాలుగేళ్ల తర్వాత మంచి హిట్ వచ్చి పడింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ‘’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందన హీరోయిన్‌గా నటించారు. సినిమా రిలీజైన రోజే బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇటీవల సక్సెస్ మీట్‌ని ఏర్పాటుచేసారు. నాలుగేళ్ల తర్వాత హిట్ వచ్చిన సందర్భంలో తనకు సంతోషంతో ఏడుపు వచ్చేస్తోందని ఆ కన్నీళ్లు కనపడకూదనే కళ్లజోడు పెట్టుకున్నానంటూ నితిన్ ఎమోషనల్ అయ్యారు. శుక్రవారం సినిమా కోసం థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటుచేయనున్నారు. వైజాగ్‌లోని గురజాడ కళాక్ష్రేత్రంలో ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అతిథిగా రాబోతున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గెస్ట్‌గా వచ్చారు. కానీ సక్సెస్ మీట్‌కి మాత్రం ఏ గెస్ట్‌ని ఆహ్వానించలేదు. ఇక ‘భీష్మ’ సినిమా గురించి చెప్పాలంటే.. సినిమాలో నితిన్ మంచి ఈజ్‌తో నటించాడని ప్రేక్షకులు తెగ మెచ్చేసుకున్నారు. READ ALSO: ముఖ్యంగా కామెడీ చాలా బాగా చేసాడని అన్నారు. వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. మరోసారి తన మార్క్ కామె

Pawan Kalyan: పవన్-క్రిష్ సినిమాలో ఇతనే విలన్.. పవర్‌స్టార్‌కి సరైనోడే!

Image
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి తన సత్తా ఏంటో చాటుకోవాలని అనుకుంటున్నారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఇప్పటికే హైదరాబాద్‌లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించేసారు. సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ సినిమా అంటే విలన్ పాత్ర ఆయన రేంజ్‌కు సరిపోయేలా ఉండాలి. అందుకే ఈసారి విలన్‌ను బాలీవుడ్‌ నుంచి తెప్పించాలని అనుకుంటున్నారట క్రిష్. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ను ఎంపిక చేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాను క్రిష్ తెలుగులోనే కాకుండా హిందీలోనూ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అందుకే హిందీ నటులు కూడా ఉంటే బాలీవుడ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారనేది క్రిష్ ఆలోచన. అర్జున్ రాంపాల్‌కి హిందీలో మంచి గుర్తింపు ఉంది. విలన్ పాత్రల్లో బాగా ఒదిగిపోతారు. ఆయన చూపుల్లోనే విలనిజం ఉంటుందని అంటారు. కాస్త తెలుగు డైలాగులు బాగా బట్టీ పట్టి చెప్పగలిగితే.. పవన్‌కు సమానంగా పేరు తెచ్చుకోగలుగుతారని చెప్పొచ్చు. కానీ ఇంకా ఈ విషయంలో సినిమా టీం నుంచి క్లారిటీ రావాలి. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ దొంగ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తో

పవన్ కళ్యాణ్‌కు ఉన్న గట్స్ చిరంజీవికి లేవు అంటున్న రాకేష్ మాస్టర్

Image
చిత్ర పరిశ్రమలో అవకాశాలు లేక, ఇతరులు తనపై వేస్తున్న నిందలు భరించలేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. శ్రీరెడ్డి, చిరంజీవి, మంచు లక్ష్మిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన అసలు తనకు ఎందుకు చిరంజీవి నచ్చడో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘నేను ఏది మాట్లాడినా నిజాయతీగా మాట్లాడతాను. అందుకే నన్ను వివాదాస్పద మాస్టర్ అని అంటారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చిందే నందమూరి తారక రామారావుగారు, మెగాస్టార్ చిరంజీవిగారిని చూసి. నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఎందరికో లైఫ్ ఇచ్చాను. కానీ ఇప్పుడు నాకు లైఫ్ లేకుండాపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి నచ్చనివాడు ఎవ్వడూ ఉండడు. కానీ నాకు ఆయన వ్యక్తిత్వం నచ్చదు. చిరంజీవి ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్. నేను ఆయన్ని చూసే ఇండస్ట్రీలోకి వచ్చానన్న మాట నిజమే. కానీ నాకు ఆయన వ్యక్తిత్వం అస్సలు నచ్చదు. ఎందుకంటే నాలాంటి వాళ్లు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చిరంజీవిగారు పిలిచి అవకాశాలు ఇచ్చి సాయం చేయొచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. పైగా ఇప్పుడు అవకాశాలు ఇస్తానంటున్నారు" READ ALSO: "ఇప్పుడేం చేసుకోవాలి. వయసు

ఒకేరోజు పెళ్లికొడుకులు అవుతోన్న నితిన్, నిఖిల్!

Image
టాలీవుడ్‌కు పెళ్లి సీజన్ వచ్చింది. ఒకేసారి ఇద్దరు హీరోలు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఈ వేసవిలో తన బ్యాచ్‌లర్ లైఫ్‌కి టాటా చెప్పి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. యంగ్ హీరోలు నితిన్, నిఖిల్ సిద్ధార్థ ఒకే రోజు నుంచి తమ దాంపత్య జీవితాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఏప్రిల్ 16న వీరిద్దరూ పెళ్లికొడుకులుగా మారనున్నారు. తన పెళ్లి కోసం నితిన్ దుబాయ్ వెళ్తుండగా.. నిఖిల్ మాత్రం హైదరాబాద్‌లోనే పెళ్లి వేడుక చేసుకోనున్నారు. ఇదిలా ఉంటే, గత కొన్నాళ్లుగా భీమవరం అమ్మాయి డాక్టర్ పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న నిఖిల్ ఆమెతో ఫిబ్రవరి 1న నిశ్చితార్థం చేసుకున్నారు. గోవాలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. గోవాలోనే పల్లవి వర్మకు తన లవ్‌ను ప్రపోజ్‌ చేశారట. అందుకే, అక్కడే నిశ్చితార్థం వేడుకను జరుపుకున్నారు. వీరి వివాహం ఏప్రిల్ 16న హైదరాబాద్‌లో జరగనుంది. Also Read: మరోవైపు, నితిన్ పెళ్లి ప్రకటన అందరికీ ఒక సర్‌ప్రైజ్. ఎందుకంటే, నితిన్‌ది ప్రేమ వివాహం. కానీ, ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారాయన. కొన్నేళ్లుగా ప్రేమిస్తోన్న అమ్మాయినే ఆయన పెళ్లిచేసుకుంటున్నారు. నాగర్ కర్నూలుకు చెందిన షాలిని కం

తమన్ ప్రొఫైల్ పిక్‌లో పవన్... దూసుకెళ్లిపోతోందిగా!

Image
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ ప్రస్తుతం ‘పింక్’ రీమేక్‌ కోసం మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తమన్ పవన్‌ మిలిటరీ టోపీ పెట్టుకుని ఉన్న ఓ లోగో రిలీజ్ చేసారు. ఆ లోగోను తమన్ ట్విటర్ ప్రొఫైల్ పిక్చర్‌గా మార్చుకున్నారు. అంతేకాదు పింక్ రీమేక్‌లోని మొదటి పాటను ఎప్పుడు విడుదల చేస్తున్నారు అని ఫ్యాన్స్ ఒకటే గొడవ చేసేస్తున్నారు. దీనిపై తమన్ ట్వీట్ చేస్తూ.. ‘‘పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ‘పింక్’ రీమేక్‌లోని మొదటి పాటను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దామా అని ఆత్రుతగా ఫీల్ అవుతున్నాను. టీం మొత్తం చాలా కష్టపడుతోంది. మీ అందరూ ఈ సినిమా ఎంత ముఖ్యం అని ఫీలవుతున్నారో మేం కూడా అంతే. పవర్ స్టార్‌కు బెస్ట్ ఇవ్వడానికి మేం కూడా మా బెస్ట్ ప్రయత్నిస్తున్నాం. లవ్యూ గాయ్స్’ అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటి తర్వాత తమన్ తన ట్విటర్ ప్రొఫైల్ పిక్చర్ మార్చేసారు. ‘’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. READ ALSO: కాగా ఇటీవల తమన్ తాను సినిమా కోసం కంపోజ్ చేసిన మ్యూజిక్‌ను పవన్‌కు వినిపించేందుకు ఆయన ఇంటికి వెళ్

కమల్ కావాలని ముద్దు పెట్టారంటే నమ్మరు, వదిలేయండి: రేఖ

Image
పాతికేళ్ల క్రితం జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రముఖ తమిళ సీనియర్ నటి రేఖ.. 20 ఏళ్ల క్రితం నటించిన ‘పున్నగాయ్ మన్నన్’ సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటన గురించి ఇటీవల వెల్లడించారు. ఈ సినిమాలో హీరోగా, రేఖ హీరోయిన్‌గా నటించారు. లెజండరీ డైరెక్టర్ కే. బాలచందర్ దర్శకత్వం వహించారు. అందులో కమల్, రేఖ గాఢంగా ప్రేమించుకుంటారు. అయితే ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదని చనిపోవాలని నిర్ణయించుకుంటారు. అయితే ఆత్మహత్య చేసుకునే సన్నివేశం తెరకెక్కిస్తున్నప్పుడు కమల్ హాసన్ రేఖ‌కు ముద్దుపెట్టేసారట. ఈ విషయాన్ని రేఖ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన అనుమతి లేకుండానే బాలచందర్, కమల్ హాసన్ ముద్దు సీన్‌ను పెట్టారని, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు తనకు నిద్ర పట్టలేదని అన్నారు. అయితే ఆమె సరదాగా వెల్లడించిన ఈ విషయం కోలీవుడ్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా దీనిపై స్పందించి.. ఇలాంటి దర్శకులు ఇప్పటికీ ఉన్నారని కామెంట్స్ చేసారు. అయితే సోషల్ మీడియాలో రేఖ ఇచ్చిన ఇంటర్వ్యూ రచ్చ పుట్టిస్తోంది. కమల్ హాసన్ రేఖ‌కు క్షమాపణలు చెప్పాలని నెటిజన్స్ డిమాండ్ చేసారు. అయితే ఈ విషయం ఎక్కడ సీర

అయ్యో ‘అల..వైకుంఠపురములో’.. ఇలా ఎలా జరిగిందబ్బా.!

Image
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘’ సినిమాను 26న జెమిని టీవీ సంస్థకు చెందిన సన్ నెక్ట్స్ యాప్‌లో స్ట్రీమ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి భారీ సినిమాలన్నీ అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ యాప్స్‌లో రిలీజ్ చేస్తుంటారు. కానీ ఈ రెండు ఓటీటీలలో సినిమాను రిలీజ్ చేయమని అమెరికాకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు ముందునేగా అనౌన్స్ చేసారు. అందుకే ఓవర్ సీస్‌లో ఈ సినిమా మిలియన్ల డాలర్ల కాసుల వర్షం కురిపించింది. కానీ ఇప్పుడు ఓ షాక్ న్యూస్ బయటికి వచ్చింది. సన్ నెక్ట్స్ యాప్‌లో రిలీజ్ అవ్వాల్సిన ‘అల వైకుంఠపురములో’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఒక్క ప్రకటన కూడా లేకుండా ఇది ఎలా జరిగిందో తెలీదు కానీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే డిస్ట్రిబ్యూటర్లే కావాలని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని ముందుగానే చెప్పకుండా ఇలా చేసారా అన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. అయితే ఇప్పుడు నెట్‌ఫ్లి్క్స్‌లో ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ అవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు వచ్చిన నష్టం ఏమీ లేదు. READ ALSO: ఎందుకంటే.... తెలుగు రాష్ట్రాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లతో పాటు అమెరికాలో సినిమా కొనుక్కున్నవాళ్లు కూడా తొలి 50 రోజు

Mahesh Babu:‘సరిలేరు’ చూడలేదు.. మహేష్‌తో విభేదాలపై ప్రకాష్ రాజ్

Image
మహేష్ బాబుతో ప్రకాష్ రాజ్‌కి విభేదాలు ఉన్నాయా? ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందా? మహేష్ ఫ్యాన్స్‌ అంటే నచ్చడం లేదా? అసలేమైంది? వివాద రహితుడిగా టాలీవుడ్ మిస్టర్ కూల్‌గా పేరొందిన మహేష్ బాబుతో ప్రకాష్ రాజ్‌కి వివాదం ఏంటి అన్న విషయం చానాళ్లుగా టాలీవుడ్‌లో నలుగుతూనే ఉంది. ఈ ఇష్యూపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ అసలు విషయం చెప్పుకొచ్చారు. ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. మహేష్ బాబుతో నాకు గ్యాప్ రావడంతో ఏంటి? అదే నిజమైతే ఇద్దరం కలిసి సరిలేరు నీకెవ్వరు చిత్రం ఎలా చేస్తాం.. ఈ సినిమా షూటింగ్‌లో మా ఇద్దరి మధ్య మాటా మాటా వచ్చిందని.. అందుకే నేను ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్‌కి హాజరుకాలేదని ప్రచారంలో నిజం లేదు. నిజానికి నేను సినిమా ఫంక్షన్లకు దూరంగా ఉంటాను. నేను సినిమా చేశానా? అయిపోయిందా? అంతవరకే. నా సినిమాలు నేను చూడను. అంతెందుకు సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా నేను చూడలేదు. అలాంటప్పుడు నేను ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లకు ఎందుకు వెళ్తా. ఆ టైంలో ఫ్యామిలీతోనే.. మిగతా సినిమా షూటింగ్‌లకో వెళ్తుంటా. మహేష్ బాబుతో నాకు విభేదాలు ఏంటి ఆయన బంగారం. నేను చాలా రేర్‌గా సినిమా ఫంక్షన్లకు వెళ్తా. నా

ఫేస్ బుక్‌లో ఫోన్ నెంబర్.. నటి నందినిపై పోలీసు కేసు!

Image
సోషల్ మీడియా యాక్టివ్ అయిన తరువాత సెలబ్రిటీలు ఫ్యాన్స్‌కి అందుబాటులో ఉంటున్నారు. తమ పర్శనల్ విషయాలతో పాటు సినిమాలు, సీరియల్స్, ప్రోగ్రామ్స్ ఇలా రెగ్యులర్ అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచడానికి ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సమాచార మాధ్యమాలను ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని సక్రమమైన పద్దతిలో ఉపయోగించుకోకపోతే పరిస్థితి పోలీసు కేసుల వరకూ వెళ్తుంది అనడానికి ఈ ఘటనను ఉదాహరణగా చెప్పొచ్చు. సరవనన్ మీనాక్షి, కలక్క పోవత్తు యారు, కళ్యాణం ముదాల్ కాదల్ వారై వంటి తమిళ సీరియల్స్‌తో పాపులర్ టీవీ నటిగా పేరు సంపాదించిన మైనా నందినిపై తమిళనాడు కేసు నమోదైంది. ఆమె వ్యక్తిగత ఫేస్ బుక్ అకౌంట్‌లో చేసిన తప్పుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల నందిని తన పేరుతో ఓ నకిలీ ఫేస్ బుక్ ఖాతా ఓపెన్ చేశారు. అయితే ఆమె నంబర్‌కి బదులుగా ఈరోడ్ జిల్లా, అందియూర్‌ సమీపంలోని అన్నామడులై గ్రామానికి చెందిన గురునాథన్‌ అనే వ్యక్తి ఫోన్ నెంబర్‌ను ఆ ఫ్రేస్ బుక్ ప్రొఫైల్‌లో ఇచ్చారు నందిని. సమత్తువ మక్కళ్‌ కట్టి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గురునాథన్‌‌కు పగలు రాత్రి కాకుండా వరుసగా ఫోన్లు వస్తుండటంతో ఫే

‘బంజార’ టీజ‌ర్: పెళ్లయిన తరవాత అలా ఎంజాయ్ చేయడం తప్పేకాదట!!

Image
హారర్ మూవీ ‘క్షుద్ర’ దర్శకుడు నాగుల్ ఇప్పుడు మరో భయపెట్టే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే, ఈ సినిమా కేవలం భయపెట్టడమే కాదు కుర్రాళ్లకు కావాల్సినంత రొమాంటిక్ టచ్‌ను కూడా ఇస్తుంది. వర్కింగ్ యాంట్స్ ప్రొడక్షన్స్ ప‌తాకంపై కోయా రమేష్ బాబు, దేవభక్తుని నవీన నిర్మించిన ఈ రొమాంటిక్‌ హారర్ ‘బంజార’. అమృత, ట్వింకిల్ కపూర్, తేజేష్ వీర, హరీష్ గౌలి, జీవా, జీవీ ప్రధాన పాత్రల‌లో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుపుకుంటోంది. తెలుగు, తమిళ భాష‌ల్లో మార్చిలో విడుదలకు సిద్ధమ‌వుతోన్న ఈ చిత్రం టీజ‌ర్‌ను తాజాగా విడుదల చేశారు. టీజర్‌లో అడల్ట్ కంటెంట్‌ను బాగానే చొప్పించారు. ‘‘పెళ్లయిన తరవాత అలా ఎంజాయ్ చేస్తే తప్పేముంది’’ అంటూ డైలాగ్ కూడా చెప్పించారు. అయితే, లంబాడ మహిళ వేషధారణలో ఉన్న అమ్మాయి క్యారెక్టర్ ఆసక్తి రేపుతోంది. అసలు ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారనే క్యూరియాసిటీ టీజర్‌ చూస్తుంటే కలుగుతోంది. Also Read: సినిమా గురించి నిర్మాత కోయా ర‌మేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘మా ‘బంజార‌’ చిత్రం టీజ‌ర్ విడుద‌ల‌చేయ‌డం సంతోషంగా ఉంది. ఇది నిజంగా రొటీనుకు భిన్నమైన హారర్ చిత్రం. త‌ప్పకు

ఆ క్రేన్ నా మీద పడుంటే బాగుండేది: డైరెక్టర్ శంకర్ భావోద్వేగం

Image
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. చెన్నైలో షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో దురదృష్టవశాత్తు భారీ క్రేన్ కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణన్ (35), ఆర్ట్ అసిస్టెంట్ చంద్రు (58), ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు (27) ఉన్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కమల్ హాసన్ మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ప్రకటించారు. అయితే, ఈ విషాద ఘటనపై తాజాగా డైరెక్టర్ శంకర్ స్పందించారు. ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘తీవ్ర దు:ఖంతో ఈ ట్వీట్ చేస్తున్నాను. ఆ విషాదకర ఘటన జరిగినప్పటి నుంచి నేను షాక్‌లో ఉన్నాను. ఆ ప్రమాదంలో నా అసిస్టెంట్ డైరెక్టర్‌ను, ఇతర సిబ్బందిని కోల్పోవడంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. రెప్పపాటులో ఆ క్రేన్ నుంచి నేను తప్పించుకున్నాను. అలాకాకుండా అది నామీ పడుంటే బాగుండేది అని నేను ఫీలవుతున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. వారి కోసం దేవుణ్ని ప్రార్థిస్తున్నాను’’ అని శంకర్ పేర్కొన్నారు

చిరంజీవి ఫోన్ చేసి ‘వస్తావా’ అన్నాడు: పాపులారిటీ కోసం ఆంటీ వాగుడు

Image
సొంత టాలెంట్‌తో కాకుండా ఎలాగోలా పాపులర్ అవ్వాలని చూస్తున్నవారే ఇప్పుడు ఎక్కువ అవుతున్నారు. పెద్ద సెలబ్రిటీల గురించి ఇంటర్వ్యూలు ఇచ్చేసి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటారు. వారు పట్టించుకోనంత వరకు ఏదైనా సరదాగానే ఉంటుంది. కానీ వాళ్లు సీరియస్ అయ్యారంటే అడ్రెస్ లేకుండాపోతారు. ఇప్పుడు లోకులు కాకులు ఆంటీ ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ పిచ్చి వాగుడు వాగేసింది. ఏకంగా మెగాస్టార్ , దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ‘‘నాకు చాలా పాపులారిటీ ఉంది. హీరో రవితేజ నాకు తమ్ముడులాంటివాడు. ఓసారి మా ఇంటికి వస్తే చాయ్ ఇచ్చినా. తాగను అన్నాడు. తాగుబే అన్నాను. తమ్ముడు కాబట్టి అలా అనేసాను. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ కూడా ఫోన్లు చేస్తుంటారు. మొన్న మహేష్, విజయ్ ఫోన్లు చేసి నేను వారి సినిమాలకు పబ్లిసిటీ ఇవ్వడంలేదని ఫీలయ్యారు. నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం. వాళ్ల కొడుకు రామ్ చరణ్ నన్ను అత్త అని పిలుస్తాడు. అంటే నాకు చిరంజీవి అన్నయ్యే కదా. ఓసారి నేను బస్సులో వెళ్తుంటే నాకు ఓ ఫోన్ వచ్చింది. ‘నేను చిరంజీవిని వస్తావా’ అన్నాడు. నువ్వు ఫోన్ పెట్రా అన్నాను" READ ALSO: " చిరంజీవి నన్ను అలా అనడం ఎంత

‘పింక్’ రీమేక్ ఫస్ట్ సాంగ్: పవన్ కోసం దిల్ రాజు సూపర్ ప్లాన్!

Image
పవర్‌స్టార్ పింక్ తెలుగు రీమేక్‌తో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చారు. వేణు శ్రీరామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను అనౌన్స్ చేసిన నాలుగు నెలల్లోనే రిలీజ్ చేసేయాలని నిర్ణయించేసుకున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. అయితే ఈ సినిమాలోని మొదటి పాటను త్వరలో రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల సంగీత దర్శకుడు తమన్ వెల్లడించారు. అంతేకాదు తాను సినిమా కోసం కంపోజ్ చేసిన రెండు మూడు పాటలను పవన్‌కు వినిపించేందుకు వెళ్లారు. ఆయనకు కూడా పాటలు నచ్చాయట. అయితే ఈ సినిమా విషయంలో దిల్ రాజు ‘అల వైకుంఠపురములో’ స్ట్రాటెజీని ఫాలో అవ్వాలని అనుకుంటున్నారట. అదేంటంటే.. ‘అల వైకుంఠపురములో’కి ముందు వరకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు సరైన హిట్స్ లేవు. దాంతో ముందు పాటలు వదిలారు. వాటికి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించింది. ఇప్పుడు దిల్‌రాజు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవ్వాలని అనుకుంటున్నారట. ముందు ‘పింక్’ తెలుగు రీమేక్‌లోని పాటను రిలీజ్ చేసేస్తే దానికి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆ తర్వాత సినిమా కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నారట. ఎందుకంటే పవన్ సినిమాలంటే ఏ స్థాయిలో రచ్చ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వీసా కోసం వేచిచూస్తోన్న నాగశౌర్య

Image
యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల ‘అశ్వథ్థామ’తో ప్లాప్ అందుకున్నారు. వరుస డిజాస్టర్లతో డీలా పడిన ఈ హీరో ఒక మంచి విజయంతో కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ఇటీవలే ఒక సినిమాను ప్రారంభించారు. అయితే, నాగశౌర్య తన ఆశలను మాత్రం అవసరాల శ్రీనివాస్ సినిమాపై పెట్టుకున్నారు. ఈ సినిమాకు ‘పలానా అబ్బాయి పలానా అమ్మాయి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌గా పేరు సంపాదించిన నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాతో మరోసారి జతకట్టారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ‘పలానా అబ్బాయి పలానా అమ్మాయి’ సినిమా ఆగిపోయిందని ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. కానీ, ఈ రూమర్లపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఆగిపోలేదని, ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తయిందని స్పష్టం చేశారు. Also Read: ‘‘నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ ప్రాజెక్ట్ 50 శాతం పూర్తయింది. మిగిలిన భాగాన్ని యూఎస్ఏ‌లో షూట్ చేస్తాం. మేం వీసాల కోసం వేచి చూస్తున్నాం. సినిమా చాలా బాగా వస్తోంది. ఈ ప్రాజెక

Vijayashanthi: ‘రాహు’ సినిమాపై రాములమ్మ కామెంట్

Image
కృతి గార్గ్, అభిరామ్ వర్మ కాంబినేషన్ లో సుబ్బు వేదుల అందిస్తున్న సినిమా రాహు. ఓ డిఫరెంట్ పాయింట్‌తో తెరకెక్కించిన థ్రిల్లర్ ఇది. ఈ నెల 28న విడుదల కాబోతోంది. ఈ సినిమాపై లేడీ అమితాబ్ స్పందించారు. సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘‘హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యతను ఇస్తూ, కొత్త తరహా కథతో చేసిన ‘రాహు’ సినిమా విజయవంతం కావాలని, మరిన్ని వైవిధ్యభరితమైన చిత్రాల రూపకల్పనకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను. మీ విజయశాంతి’ అని ట్వీట్ చేస్తూ ‘రాహు’ సినిమా ట్రైలర్‌ లింక్‌ను షేర్ చేసారు. ఇప్పటివరకు విడుదలైన అన్ని సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో థ్రిల్లర్ కథలు బాగా ఆడుతున్నాయి. ఇలాంటి టైంలోనే ‘రాహు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దర్శకుడు సుబ్బు. ఈ సినిమాలో నటించినవారంతా కొత్తవారే. జీ తెలుగు ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ‘‘రాహు’ సినిమాలో ఒక అమ్మాయికి రక్తం చూసినప్పుడు బ్లైండ్ అవుతుంది, స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అలాంటి అమ్మాయి జీవితంలో రాహు ఎంటర్ అయితే ఏమవుతుంది అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. సినిమా కంప్లీట్‌గా ఫ్రెష్ ఫ

నిర్మాత భార్యకు ఫోన్ చేసిన నటుడు.. ఆడియో లీక్

Image
తమిళ నటుడు ఓ వివాదంలో ఇరుక్కు్న్నారు. ఆయన ఓ నిర్మాత భార్యకు ఫోన్ చేసి తన విడాకుల గురించి చర్చించాడట. కానీ ఎవరో ఆ కాల్ రికార్డ్‌ను లీక్ చేయడంతో కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై బాలా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘‘నిన్నటి నుంచి నా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు బయటికి వస్తున్నాయి. నాకు చాలా మంది ఫోన్లు చేస్తు్న్నారు. నేను నాలుగు నెలల క్రితమే విడాకులు తీసుకున్నానన్న సంగతి అందరికీ తెలుసు. నా సెక్యూరిటీ కోసం కొన్ని ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ప్రస్తుతం నేను నిర్మాత భార్యకు ఫోన్ చేసి మాట్లాడానంటూ ఎవరో ఆడియో లీక్ చేసారు. అది ఇప్పటిది కాదు. ఏడాది క్రితంది. కానీ ఇప్పుడు తప్పుడు కారణాలతో దానిని వైరల్ చేస్తున్నారు. ఆ ఫోన్ కాల్ బయటికి ఎలా వచ్చిందో తెలీదు. ఎవరో కావాలనే నన్ను నవ్వులపాలు చేయాలని చూస్తున్నారు. నేను తలుచుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు" READ ALSO: "కానీ నేను అలా చేయను. నేను అలాంటి వ్యక్తిని కాను. నా ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. ఇతరుల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టాలని అనుకోవడంలేదు. ప్రస్తుతం నేను ‘బిలాల్’ అనే సినిమాలో మమ్ముట్టి సర

‘దోచుకున్నవాళ్ళకి దోచుకున్నంత’ ట్రైలర్: పెద్దలకు మాత్రమే!

Image
ఒకప్పుడు సినీ పరిశ్రమలో అడల్ట్ కంటెంట్‌తో కూడిన సినిమాలు వచ్చేవి. ముఖ్యంగా మలయాళంలో ఇలాంటి సినిమాలు ఎక్కువగా విడుదలయ్యేవి. షకీలా ఈ సినిమాలతోనే బాగా పాపులర్ అయ్యారు. ఇలాంటి సినిమాలు ప్రదర్శించడానికి థియేటర్లు కూడా ప్రత్యేకంగా, వేరే చోట ఉండేవి. అయితే, ఇలాంటి సినిమాల వల్ల యువత చెడిపోతోందని.. సెన్సార్ బోర్డు వీటికి అడ్డుకట్ట వేసింది. అయినప్పటికీ, పేరుమోసిన శృంగార తారల సినిమాలు ఇప్పుడు రాకపోయినా ఇలాంటి సినిమాలు అయితే ఆగడంలేదు. నిజానికి ప్రస్తుతం అడల్ట్ కంటెంట్‌తో వస్తోన్న సినిమాల్లో హీరోహీరోయిన్లు ఎవరో మనకు తెలీదు. సినిమా తీసిన దర్శకుడు, నిర్మించిన నిర్మాత గురించి కూడా చెప్పలేం. అంతా కొత్తవాళ్లే ఉంటారు. కానీ, వాళ్లు తీసే సినిమా మాత్రం బాగా పాపులర్ అయిపోతుంది. దీనికి కారణం అడల్ట్ కంటెంట్. ‘ఏడు చేపల కథ’, ‘వైఫ్ ఐ’ సినిమాల్లో ఇదే చూశాం. అయితే, సినిమా విడుదలకు ముందు ఒక సెక్స్ సినిమా మాదిరిగా టీజర్, ట్రైలర్లను వదులుతారు. ఇవి బాగా పాపులర్ అయిపోతాయి. కానీ, ఈ సినిమాలకు సెన్సార్ రాదు. సెన్సార్ రావాలంటే కచ్చితంగా అలాంటి సీన్లన్నీ తీసేయాలి. ఈ సంగతి ప్రేక్షకులకు ఎలాగూ తెలీదు. ఇక ట్రైలర్‌లో అలాంటి కంటె

ప్రభాస్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. మంచి డైరెక్టర్ చేతిలో పడ్డాడు!

Image
యంగ్ రెబెల్ స్టార్ ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటున్నారు. ఇందుకు కారణం ‘సాహో’ ఇచ్చిన షాకే. ప్రస్తుతం ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న ప్రభాస్ తన తర్వాతి సినిమాను కన్‌ఫర్మ్ చేసేసారు. ‘మహానటి’తో జాతీయ అవార్డును దక్కించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి పనిచేయబోతున్నారు ప్రభాస్. వైజయంతి మూవీస్ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ గుడ్ న్యూస్‌ను ప్రకటించింది. వైజయంతి మూవీ అధినేత అశ్విని దత్ సినిమాను నిర్మించనున్నారు. అయితే సినిమా టైటిల్ ఏంటి? హీరోయిన్ ఎవరు, సహాయ పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు? వంటి వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. చూడబోతే నాగ్ అశ్విన్.. ప్రభాస్ ఇమేజ్ మైండ్‌లో పెట్టుకుని చక్కటి కథనే తయారుచేసుకున్నట్లున్నారు. అందుకే ప్రభాస్‌ కూడా వెంటనే ఓకే చేసేసారు. నాాగ్ అశ్విన్ ఎవరో కాదు. అశ్విని దత్ అల్లుడు. అశ్వినీ దత్ సినిమాలంటేనే భారీ సెట్టింగ్స్‌తో గ్రాండ్‌గా ఉంటాయి. మరి ప్రభాస్‌తో కలిసి నాగ్ అశ్విన్, అశ్విని దత్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో వేచి చూడాలి. READ ALSO: ప్రస్తుతం రాధాకృష్ణ సినిమాతో ప్రభాస్ బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సినిమా పూర్తైన వెంటనే

రామ్ గోపాల్ వర్మను పెళ్లి చేసుకోవాలనుంది కానీ... షాకిచ్చిన గాయత్రి గుప్తా

Image
వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిలో నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఒకరు. ఒకప్పుడు మీటూ పేరుతో తనకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పి అందరినీ షాక్‌కు గురిచేసారు. దాని ఫలితంగా గాయత్రికి అవకాశాలు లేకుండాపోయాయి. దాంతో పీఆర్ కోసం ఇటీవల ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు షాక్‌కు గురిచేస్తున్నాయి. ముందుగా ఆమె వివాదాస్పద నటి శ్రీరెడ్డి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు చేసిన రచ్చ గురించి మాట్లాడారు. ‘‘శ్రీరెడ్డి చేసిన రచ్చేంటో నాకు తెలుసు. ఆమె చెప్పనవన్నీ నిజమే. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. కానీ శ్రీరెడ్డి అంత హంగామా చేసినప్పుడు నేను ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాను. ఆమె ఇచ్చిన సమాధానాలు విని ఈ రచ్చతో కలిగే ప్రయోజనాలు ఏమీ లేవు, ఎంతో కాలం నిలవదు అనిపించింది. దాంతో నేను మౌనంగా ఉండిపోయాను. క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రతీ చోటా ఉంటుంది. కానీ అది ఇద్దరి ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది. ఓ నిర్మాతో, దర్శకుడో నా కోరిక తీరిస్తే సినిమాలో అవకాశం ఇస్తా అని అన్నప్పుడు ఫలానా హీరోయిన్‌కి ఇష్టం లేకపోతే నో అని చెప్పచ్చు. దాని వల్ల అవకాశం పోతుంది. దాని వల్ల వచ్చే నష్టం లేదు. ఎక్కడ అ

‘‘ఆ దర్శకుడు వెన్నుపోటు పొడిచాడు.. స్నేహం కోసం అన్నీ భరించా’’

Image
ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ ప్రస్తుతం ‘’ సినిమాతో బిజీగా ఉన్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ తమిళ సినీ రచయిత అజయన్ బాలా రాసిన పుస్తకం ఆధారంగా సినిమాను తీస్తున్నారు విజయ్. అయితే ఈ సినిమాలో తనకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వలేందంటూ సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసారు అజయన్. ‘‘చిత్ర పరిశ్రమలో నాకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కానీ ‘తలైవి’ సినిమా విషయంలో నాకు ఎదురైన అవమానాన్ని మాత్రం భరించలేకపోతున్నా. ఆరు నెలల పాటు ఎంతో శ్రమించి రాసిన నవల ఆధారంగా విజయ్ ఈ సినిమా తీస్తున్నారు. కోర్టులో ఎవరో కేసు వేస్తే నా నవలను అడ్డుపెట్టుకుని కేసు నుంచి బయటపడ్డారు. అలాంటిది నాకు క్రెడిట్ ఇవ్వకుండా నా పేరు తీసేసారు. ఎందుకంటే సినిమాలో కొన్ని అసత్యాలు చూపించారని, పలువురు రాజకీయ నేతలను అవమానించారని కొన్ని సన్నివేశాలను తొలగించమని చెప్పాను. దాంతో నా పేరు తీసేసారు. నాది, విజయ్‌ది పదేళ్ల స్నేహం. ఆ స్నేహం కోసం ఎన్నో అవమానాలు భరించాను. కానీ ఈసారి మాత్రం చూస్తూ ఊరుకోలేకపోతున్నాను" " ఈ సినిమా కోసం ఏడాదిన్నర కూర్చుని స్క్రిప్ట్ రాస్తే నాకు వెన్

Mahesh Babu: మహేష్, చిరంజీవిల టచ్‌లోకి శ్రీనువైట్ల.. ‘దూకుడు 2’?

Image
తూగో జిల్లా.. కందులపాలెం దర్శకుడు శ్రీను వైట్లకు టాలీవుడ్‌లో బ్యాడ్ టైం నడుస్తోంది. , వెంకటేష్, నాగార్జున, ఎన్టీఆర్, , రామ్ చరణ్ తేజ్, రవితేజ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఈ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి వస్తుందని బహుషా ఆయనే ఊహించి ఉండరు. అయితే ఊహించుకున్నదే జరిగితే అని లైఫ్ ఎందుకు అవుతుంది. అందులోనూ రంగుల ప్రపంచంలో అది చచ్చినా కుదరదు. హిట్ కొట్టినోడే హీరో.. ఫ్లాప్ పడిందంటే ఎంత పెద్ద దర్శకుడికైనా డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్టే. ఇలా గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్‌లతో పాపం దెబ్బ మీద దెబ్బ తింటూనే ఉన్నారు. బాద్ షా‌తో హిట్లు ఆపేసిన ఈయన.. ఆడడు చిత్రంతో ఫ్లాప్ జర్నీ మొదలుపెట్టారు. బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ వంటి చిత్రాలతో పరాజయాలను చవిచూస్తూనే ఉన్నారు. దీంతో కుర్ర హీరోలే కాకుండా సీనియర్ హీరోలు సైతం ఈయనతో సినిమా చేయడానికి వెనుకంజ వేస్తున్న తరుణంలో ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ వర్గాల్లో హల్ చల్ చేస్తుంది. రీసెంట్‌గా శ్రీనువైట్ల మెగాస్టార్ చిరంజీవితో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబులను కలిశారని.. ఇద్దరికీ తన వద్ద ఉన్న కథలను వినిపించినట్టు తెలుస్తోంది. గతంలో మహేష్ బాబుకి దూకు

‘బుట్ట బొమ్మ’ ఫుల్ సాంగ్.. గంటలోనే దుమ్ములేపిన వ్యూస్

Image
స్టైలిష్ స్టా్ర్ అల్లు అర్జు్న్ కథానాయకుడిగా నటించిన ‘అల వైకుంఠపురములో’ మంచి విజయాన్నిచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. గురూజీ టైమింగ్, బన్నీ స్టైల్, పూజా గ్లామర్‌కు తమన్ అందించిన మ్యూజిక్ తోడవడంతో థియేటర్లలో బొమ్మ దద్దరిల్లింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించింది. కాగా.. ఇటీవల ఈ సినిమాలోని చార్ట్ బస్టర్ సాంగ్ అయిన ‘సామజవరగమన’ ఫుల్ పాటను రిలీజ్ చేసిన సినిమా టీం ఇప్పుడు ‘బుట్ట బొమ్మ’ పాటను రిలీజ్ చేసింది. ఈ పాటను రిలీజ్ చేసిన గంటలోనే నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 80 వేలకు మంది పైగా లైక్ చేసారు. అయితే ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలకు వచ్చినన్ని వ్యూస్ ‘బుట్ట బొమ్మ’కు పాట రాలేదు. కానీ పాటకు మాత్రం బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తన సోదరి షమితాతో కలిసి ఈ పాటకు టిక్ టాక్‌లో డ్యాన్స్ చేసిందంటేనే ఏ రేంజ్‌లో ఈ పాట దూసుకెళ్తోందో చెప్పొచ్చు. బన్నీ కెరీర్‌లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్, కలెక్షన్స్ సాధించిన సినిమా ఇది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్స్ ‘బాహుబల

Karate Kalyani: కరాటే కళ్యాణి, రాకేష్ మాస్టర్‌పై శ్రీరెడ్డి దారుణమైన పోస్ట్‌లు.. ఛీ.. బాబోయ్!

Image
వర్సెస్ కరాటే కళ్యాణిల మధ్య వార్ కొనసాగుతోంది. మధ్యలో వివాదాస్పద కొరియోగ్రాఫర్ సైతం చేరి శ్రీరెడ్డిని టార్గెట్ చేయడంతో వీరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బూతుల వర్షం కురిస్తోంది. ఎవరికి వారే బూతుల్లో పీహెడీ చేసినట్టుగా బూతు పంచాంగాలను విప్పుతున్నారు. శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ద్వారా , రాకేష్ మాస్టర్‌లపై బూతులు ఇలా కూడా తొట్టొచ్చా అన్నంతగా ఓ రేంజ్‌లో ఏకిపారేసింది. ఇక కళ్యాణి, రాకేష్ మాస్టర్‌లు సైతం బూతుల్లో ఏం తక్కువ కాదన్నట్టుగా మీడియాకి ఎక్కి మరీ బూతులు మొదలెట్టారు. అయితే వీరి మధ్య దూషణల పర్వం పెరిగి పెద్దది కావడంతో శ్రీరెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టింది నటి కరాటే కళ్యాణి. ఈ ఇష్యూపై వివాదం నడుస్తున్న సందర్భంలో మరో మారు కరాటే కళ్యాణి, రాకేష్ మాస్టర్‌లను టార్గెట్ చేస్తూ ఆదివారం నాడు ఓ వీడియో వదలింది శ్రీరెడ్డి. ‘కరాటే కళ్యాణి గారూ బాగున్నారండీ.. రాకేష్ బాబాయ్ బాగున్నారా? ఏంటి.. నా మీద కేసు పెట్టారంట కదా.. భలే పాపులర్ చేస్తున్నారుగా.. నన్ను పాపులర్ చేయడం అంటే రాకేష్‌కి, కళ్యాణికి బాగా ఇష్టం కదా థాంక్యూ.. ఇప్పుడు విషయం ఏంటంటే.. కేసును మర్యాదగా వెనక్కి తీసుకోకపోతే రివర్స్‌లో పరువు నష్టం దా

కన్నీళ్లు కనపడకూడదనే అద్దాలు పెట్టుకున్నా: నితిన్

Image
మొత్తానికి నాలుగేళ్ల తర్వాత ‘భీష్మ’ సినిమాతో హిట్ అందుకున్నారు యంగ్ హీరో నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. రష్మిక మందనకు వరసగా నాలుగో హిట్ ఇది. ఈ సందర్భంగా ‘భీష్మ’ సక్సెస్ మీట్ ఏర్పాటుచేసారు. ఈవెంట్‌లో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. రష్మికపై రెండు పంచ్‌‌లు కూడా వేసాడు. ‘ఈ సినిమాను ఇంత విజయవంతం చేసిందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాలుగేళ్ల తర్వాత హిట్ కొట్టాను. ఈ హిట్ నాకే కాదు వెంకీకి కూడా చాలా అవసరం. ఈ సినిమాతో తానేంటో నిరూపించుకుని చాలా మందికి సమాధానం చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత కొట్టిన హిట్ కావడంతో నాకు ఆనందంలో ఏడుపొస్తోంది. అందుకే ఆ కన్నీళ్లు కనపడకుండా కళ్లజోడు పెట్టుకున్నాను. ఈ క్రెడిట్ అంతా వెంకీకే దక్కాలి. అతను సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో చూసాను" READ ALSO: " తన సంగీతంలో సినిమాను మరో స్థాయి పైకి తీసుకెళ్లాడు మహతి స్వర సాగర్. ఆయన మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. ఇక మా రష్మిక మేడమ్ గురించి మాట్లాడాలంటే.. సినిమాలో మా ఇద్దరి రొమాన్స్ కంటే సంపత్ నందితో కలిసి నటించిన సీన్లనే ఎక్కువ ఎంజాయ్ చేసారు. రష్మిక మేడమ్ వెంకీకి తొలి

‘మృగం’ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది.. స్టార్ హీరోతో చేస్తా: ‘రాహు’ దర్శకుడు

Image
అభిరామ్ వర్మ, కృతి గార్గ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాహు’. సుబ్బు వేదుల దర్శకత్వం వహించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చారు. కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషించారు. ఎ.వి.ఆర్.స్వామి, శ్రీశక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మాతలు. ఈ నెల 28న ‘రాహు’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుబ్బు వేదుల మీడియాతో ముచ్చటించారు. ✦ నాది వైజాగ్, న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకున్నాను. ఆ సమయంలో కోన వెంకట్ నాకు పరిచయం. మేమిద్దరం కలిసి కొన్ని స్టోరీస్‌కు వర్క్ చేశాం. కొన్ని అనుకోని కారణాల వల్ల కోన వెంకట్‌తో ‘గీతాంజలి 2’ సినిమా స్టార్ట్ కాలేదు. కానీ నా ప్రయత్నాలు ఆపలేదు. ✦ ‘రాహు’ సినిమాలో ఒక అమ్మాయికి రక్తం చూసినప్పుడు బ్లైండ్ అవుతుంది, స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అలాంటి అమ్మాయి జీవితంలో రాహు ఎంటర్ అయితే ఏమవుతుంది అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. సినిమా కంప్లీట్‌గా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. మేకింగ్ స్టయిల్ ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌గా ఉండబోతుంది. ✦ కొత్త దర్శకుడిగా నేను పెద్ద స్టార్స్‌తో చెయ్యాలంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి.

హీరోయిన్ల బుగ్గలు వాచిపోయేలా కొట్టే దర్శకులున్నారు: ఈసారి పెద్దోళ్లను టార్గెట్ చేసింది

Image
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తన మధురమైన స్వరంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు ప్రముఖ సింగర్ . రెండేళ్ల కిందటి వరకు ఆమె మంచి సింగర్‌ అని నటి సమంతకు డబ్బింగ్ చెప్తారనే తెలుసు. కానీ ఎప్పుడైతే ప్రముఖ లిరిసిస్ట్ వైరాముత్తు తనను లైంగికంగా వేధించారని చెప్పి వివాదంలో ఇరుక్కున్నారు. అప్పటినుంచి ఆమెను సింగర్‌గా కంటే ‘మీటూ’ బాధితురాలిగానే చూస్తు్న్నారు. చాలా మంది ఆమె చెప్పినదాన్ని నమ్మలేదు. పైగా యాంటీ తమిళ్ అని హేళన చేసేవారు. అయినా కూడా చిన్మయి వెనక్కి తగ్గలేదు. ఇండస్ట్రీలో ఎంత పేరు మోసిన వ్యక్తి అయినా వారు తప్పు చేస్తే సోషల్ మీడియా ద్వారా బయటపెడుతున్నారు. తాజాగా లెజండరీ దర్శకుడు కే. బాలచందర్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేసారు చిన్మయి. ప్రముఖ తమిళ నటి రేఖ ఇటీవల తనకు కమల్ హాసన్, బాలచందర్ వల్ల ఎదురైన షాకింగ్ అనుభవాన్ని బయటపెట్టారు. రేఖ, కమల్ హాసన్ జంటగా 1986లో ‘పున్నగాయ్ మన్నన్’ అనే సినిమా ఒకటి వచ్చింది. అందులో కమల్, రేఖ గాఢంగా ప్రేమించుకుంటారు. అయితే ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదని చనిపోవాలని నిర్ణయించుకుంటారు. అయితే ఆత్మహత్య చేసుకునే సన్నివేశం తెరకెక్కిస్తున్నప్పుడు కమల్ హాసన్ రేఖ‌కు ముద్

వ్యూస్ కోసం దుస్తులు విప్పేస్తున్నారు: యాంకర్ వ్యాఖ్యలు

Image
డిఫరెంట్ లుక్, స్టైల్‌తో తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు లోబో. ఒకప్పుడు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో అలరించిన లోబోకు ఇప్పుడు అవకాశాలు లేక సతమతమవుతున్నాడు. అయితే ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన లైఫ్ గురించి సినిమా ఇండస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘నాకు నటి కాజోల్ అంటే చాలా ఇష్టం. ఆమె కోసం నేను ముంబై వెళ్లాను. ఆమెను ఒక్కసారైనా కలవకపోనా అని రోడ్లపై నిద్రిస్తూ ఎన్నో కష్టాలు పడ్డాను. కానీ కాజోల్‌ను కలవలేకపోయాను. ఆ తర్వాత మా ఛానెల్‌లో ఆరేళ్ల పాటు యాంకర్‌గా పనిచేసాను. చిన్న చిన్న సినిమాల్లో నటించాను. అయితే ఇప్పుడు బుల్లితెరను కాస్త దూరం పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నాకు మంచి ఫ్యా్న్ ఫాలోయింగ్ ఉంది. నా పేరుని పచ్చ బొట్టుగా వేయించుకున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్ల కోసమైనా నేను సినిమాలు చేయాలి. అయితే నేను హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ లాంటివి చేయాలని అనుకుంటున్నాను. అందుకే బుల్లితెరకు దూరంగా ఉంటున్నాను. కాకపోతే ప్రస్తుతం టైం కలిసి రావడంలేదు. నేను నా కష్టాన్ని, దేవుడిని నమ్ముకున్నాను. మనకు ఎవ్వరూ సాయం

‘అరణ్య’ కోసం తీవ్రంగా శ్రమించా.. 30 కిలోల బరువు తగ్గా: రానా

Image
రానా దగ్గుబాటి హీరోగా నటించిన అడ్వెంచర్ డ్రామా ‘అరణ్య’. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మూడు భాషల్లో విడుదలవుతోంది. తెలుగు వెర్షన్‌ ‘అరణ్య’, తమిళ వెర్షన్ ‘కాడన్’లో రానాతో పాటు తమిళ నటుడు విష్ణు విశాల్ నటించారు. ఇక హిందీ వెర్షన్ ‘హాథీ మేరీ సాథీ’లో పుల్కిత్ సామ్రాట్ నటించారు. మరో రెండు కీలక పాత్రలను శ్రియా పిల్గావోంకర్, జోయా హుస్సేన్ పోషించారు. ఈ యాక్షన్ మూవీలో ఇదివరకెన్నడూ కనిపించని కొత్త అవతారంలో రానా దగ్గుబాటి కనిపించనున్నరు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌లో రానా లుక్‌ను చూసి అంతా ఆశ్చర్యపోయారు. 35 ఏళ్ల రానా ఈ సినిమాలో బాణదేవ్ అనే అడవి మనిషి పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన చాలా కఠినమైన ఆహార నియమాల్ని పాటించడమే కాకుండా, కఠిన శిక్షణతో 30 కిలోల బరువు తగ్గారు. సినిమా అంతా ఆయన బాగా పెరిగిన గడ్డం, గ్రే హెయిర్, పైకి వంచిన భుజంతో కనిపిస్తారు. Also Read: ఆసక్తికరమైన విషయం ఏమంటే, బాణదేవ్ పాత్ర కోసం రానాతో పలు రకాల లుక్స్ ప్రయత్నించారు దర్శకనిర్మాతలు. వాటిలో దేన్ని ఫైనల్ చేశారో మొదటిరోజు షూటింగ్‌లో పాల్గొనే దాకా ఆయనకు కూడా వారు చెప్పలేదు. ఆ పాత్ర కోసం తన రూపాన్ని

‘హిట్’ స్నీక్ పీక్: ఉత్కంఠ రేపుతోన్న మర్డర్ మిస్టరీ

Image
విశ్వక్ సేన్ హీరోగా నేచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనేది ఉప శీర్షిక. రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించారు. డాక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాని స్థాపించిన వాల్ పోస్టర్ సినిమా నుంచి వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘హిట్’పై ఇప్పటికే అంచనాలున్నాయి. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎస్.ఎస్.రాజమౌళి చెప్పిన మాటలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఒక సినిమాలోని కీలక ఘట్టాన్ని ముందుగానే చెప్పేసి ఆ తరవాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను క్రియేట్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం హాలీవుడ్ సినిమా ‘2012’లో చూశానని.. మళ్లీ ఇప్పుడు ‘హిట్’ విషయంలో చూస్తున్నానని రాజమౌళి అన్నారు. నిజంగానే ‘హిట్’ టీమ్ ఆ ఉత్కంఠను ప్రేక్షకులకు కలుగజేస్తున్నారు. ‘హిట్’ సినిమా ఈనెల 28న విడుదలవుతోన్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికి ‘స్నీక్ పీక్’ పేరిట ఒక వీడియోను మంగళవారం విడుదల చేశారు. Also Read: 4 నిమిషాల 39 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. నిజంగానే సినిమాలో ఏం చూపించబోతున్నారనే ఉత్కంఠను