కరోనా వైరస్‌పై హీరో నిఖిల్ సిల్లీ కామెంట్.. క్లాస్ పీకిన జర్నలిస్ట్

చైనాతో పాటు ఇతర దేశాలను గజగజా వణికిస్తోంది మహమ్మారి కరోనా వైరస్. చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పటికి 50 దేశాలకు వ్యాపించింది. ఓ పక్క యావత్ ప్రపంచం ఎక్కడ ఈ వైరస్ బారిన పడతామోనని భయంతో వణికిపోతుంటే.. యువ నటుడు సిద్ధార్థ్ ఈ వైరస్‌పై సిల్లీ కామెంట్ చేసారు. కరోనా వైరస్ వల్ల స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోయిందని, 2008 ఆర్థిక మాంద్యం తర్వాత మళ్లీ ఇంతగా పడిపోయింది లేదు అని ఓ వ్యక్తి ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌కు నిఖిల్ స్పందిస్తూ.. ‘థ్యాంక్స్ టు కరోనా వైరస్. స్టాక్స్ కొనుక్కోవడానికి ఇదే సరైన సమయం’ అని కామెంట్ చేసాడు. దాంతో ప్రముఖ జర్నలిస్ట్ హేమంత్‌కి ఒళ్లుమండింది. ‘ఇలాంటి సమయంలో నీ కామెంట్ చాలా ఇన్‌సెన్సిటివ్‌గా ఉంది బ్రో. ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న దేశాలు, ప్రజలు వైరస్ వల్ల అల్లాడిపోతున్న సమయంలో ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా’ అని నిఖిల్‌కి క్లాస్ పీకాడు. దీనికి నిఖిల్.. ‘మనుషులు ఎంత మంది మనుషులను చంపగలరో, అంతమందిని ఈ వైరస్ కూడా చంపలేదు. ఇంతమందిని మద్యం, సిగరెట్లు కూడా చంపలేవు. ఇలాంటి ఫ్లూ వ్యాధిలు వచ్చిపోతుంటాయ్. మనం దీని నుంచి మనల్ని కాపాడుకోగలుగుతాం. మన వ్యాధి నిరోధక శక్తి ఈ వైరస్‌ను తట్టుకోగలదు’ అంటూ తనని తాను సమర్ధించుకున్నాడు నిఖిల్. READ ALSO: ఈ కరోనా వైరస్ క్రమంగా అన్ని ఖండాలకు వైరస్ విస్తరించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన చెందుతోంది. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొడానికి చర్యలు చేపట్టాలని పదే పదే డబ్ల్యూహెచ్‌ఓ అన్ని దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది. READ ALSO:


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ