వీసా కోసం వేచిచూస్తోన్న నాగశౌర్య

యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల ‘అశ్వథ్థామ’తో ప్లాప్ అందుకున్నారు. వరుస డిజాస్టర్లతో డీలా పడిన ఈ హీరో ఒక మంచి విజయంతో కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ఇటీవలే ఒక సినిమాను ప్రారంభించారు. అయితే, నాగశౌర్య తన ఆశలను మాత్రం అవసరాల శ్రీనివాస్ సినిమాపై పెట్టుకున్నారు. ఈ సినిమాకు ‘పలానా అబ్బాయి పలానా అమ్మాయి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌గా పేరు సంపాదించిన నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాతో మరోసారి జతకట్టారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ‘పలానా అబ్బాయి పలానా అమ్మాయి’ సినిమా ఆగిపోయిందని ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. కానీ, ఈ రూమర్లపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఆగిపోలేదని, ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తయిందని స్పష్టం చేశారు. Also Read: ‘‘నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ ప్రాజెక్ట్ 50 శాతం పూర్తయింది. మిగిలిన భాగాన్ని యూఎస్ఏ‌లో షూట్ చేస్తాం. మేం వీసాల కోసం వేచి చూస్తున్నాం. సినిమా చాలా బాగా వస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వస్తోన్న రూమర్లు తప్పు. అవి నిరాధారమైన వార్తలు’’ అని చిత్ర నిర్మాతల్లో ఒకరైన వివేక్ కూచిభొట్ల ట్వీట్ చేశారు. కాగా, ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ