‘పింక్’ రీమేక్ ఫస్ట్ సాంగ్: పవన్ కోసం దిల్ రాజు సూపర్ ప్లాన్!
పవర్స్టార్ పింక్ తెలుగు రీమేక్తో టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చారు. వేణు శ్రీరామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను అనౌన్స్ చేసిన నాలుగు నెలల్లోనే రిలీజ్ చేసేయాలని నిర్ణయించేసుకున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. అయితే ఈ సినిమాలోని మొదటి పాటను త్వరలో రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల సంగీత దర్శకుడు తమన్ వెల్లడించారు. అంతేకాదు తాను సినిమా కోసం కంపోజ్ చేసిన రెండు మూడు పాటలను పవన్కు వినిపించేందుకు వెళ్లారు. ఆయనకు కూడా పాటలు నచ్చాయట. అయితే ఈ సినిమా విషయంలో దిల్ రాజు ‘అల వైకుంఠపురములో’ స్ట్రాటెజీని ఫాలో అవ్వాలని అనుకుంటున్నారట. అదేంటంటే.. ‘అల వైకుంఠపురములో’కి ముందు వరకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు సరైన హిట్స్ లేవు. దాంతో ముందు పాటలు వదిలారు. వాటికి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించింది. ఇప్పుడు దిల్రాజు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవ్వాలని అనుకుంటున్నారట. ముందు ‘పింక్’ తెలుగు రీమేక్లోని పాటను రిలీజ్ చేసేస్తే దానికి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆ తర్వాత సినిమా కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నారట. ఎందుకంటే పవన్ సినిమాలంటే ఏ స్థాయిలో రచ్చ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ పింక్ రీమేక్ సినిమా అంటే కమర్షియల్ సినిమా కాదు. READ ALSO: ఈ సినిమాలో పవన్ పాత్ర మొత్తం కోర్టులోనే నడుస్తుంది. రొమాంటిక్ పాటలు, మాస్ డైలాగులు ఉండే ఛాన్స్ చాలా తక్కువ. పవన్ లాంటి స్టార్ నుంచి ఇలాంటి సినిమా వస్తే ఫ్యాన్స్ ఒప్పుకోరు. పవన్ సినిమాలకు సాధారంగా ఉండే బజ్తో పోలిస్తే దానిలో 50 శాతం బజ్ కూడా ఈ సినిమాకు లేదు. అందుకే దిల్ రాజు ‘అల వైకుంఠపురములో’ ఫార్ములాను వాడేసి ఎలాగోలా పవన్ చేత హిట్ కొట్టించేయాలని అనుకుంటున్నారట. READ ALSO:
Comments
Post a Comment