Posts

Showing posts from December, 2019

Vijay Devarakonda: రౌడీ న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. `వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌` అప్‌డేట్

Image
సెన్సేషనల్ స్టార్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం . విభిన్న చిత్రాల దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ నాలుగు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించనున్నాడు. విజయ్‌కి జోడిగా రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇసాబెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈసినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే సినిమాలోని నాలుగు ప్రేమ కథలకు సంబంధించిన నాలుగు పోస్టర్లను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. న్యూ ఇయర్‌ కానుకగా మరో అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్‌ రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్‌ చేశారు. Also Read: రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను జనవరి 3న రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు. న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు తెలుపుతూ టీజర్‌ రిలీజ్ డేట్‌తో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై సీనియర్‌ నిర్మాత కేయస్ రామారావు సమర్పణ ఏ వల్లభ ఈ సినిమాను ని

Nayanthara: `అదే నా జీవితంలో తీసుకున్న అతి చెత్త నిర్ణయం`

Image
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా మంచి ఫాంలో ఉన్న చాలామంది తారలు కెరీర్‌ స్టార్టింగ్‌లో చిన్న చిన్న పాత్రలు అంతగా ప్రాధాన్యం లేని హీరోయిన్‌ రోల్స్ చేసివారే. లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార కూడా కెరీర్‌ స్టార్టింగ్‌లో అలాంటి సినిమాల్లో చేసింది. గతంలో తను పాత్రల ఎంపికలో చేసిన పొరపాట్ల విషయంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది. ముఖ్యంగా స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌, టాప్‌ హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా గజినిలో నటించటం తన కెరీర్‌లో తీసుకున్న అతి చెత్త నిర్ణయం అంటూ కామెంట్‌ చేసింది నయనతార. అంతేకాదు ఈ సినిమాలో తన పాత్ర ముందుగా చెప్పినట్టుగా తెరకెక్కించలేదని, తన లుక్‌ కూడా అంత బాగోలేదని అభిప్రాయపడింది. అయితే ఈ విషయంలో తాను ఎవరినీ తప్పు పట్టడం లేదని, అలాంటి పాత్ర చేయటం వల్ల తనకు ఓ అనుభవం అయ్యిందటూ క్లారిటీ ఇచ్చింది. Also Read: అయితే తాజాగా ఈ విషయంపై డైరెక్టర్‌ మురుగదాస్ స్పందించాడు. తాను ఉద్దేశ పూర్వంగా ఓ ఆర్టిస్ట్‌ను తక్కువ చేయటం, మరో ఆర్టిస్ట్‌కు ఎక్కువ పాత్ర ఇవ్వటం లాంటివి చేయనన్నాడు మురుగదాస్‌. కథ డిమాండ్‌ మేరకు మాత్రమే మార్పులు ఉంటాయని గజిని విషయంలో కూడా అదే జరి

Sri Reddy: నా కాళ్లు పట్టుకుంటానని.. ఇప్పుడు ఆమె కాళ్లపై పడ్డావేం వర్మా.. నేను హర్టూ!

Image
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏంటి? ఆమె హీరోయిన్ కాళ్లపై పడటం ఏంటి? మరీ ఇంత దిగజారిపోయాడా? ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇదే చర్చ. వర్మ శిష్యుడు అగస్థ్య మంజు దర్శకత్వం వహించిన ‘బ్యూటిఫుల్’ మూవీ న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వర్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో సినిమాను ప్రమోట్ చేసుకునే వర్మ ఈసారి తన పంథా మార్చి వింత వ్యక్తిగా మారారు. ప్రమోషనల్ ప్రెస్ మీట్‌లలో హీరోయిన్స్‌ నైనా గంగూలీతో పబ్లిక్‌గా రొమాన్స్ చేస్తూ ఆమెతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ప్రీ న్యూ ఇయర్ పార్టీ పేరుతో సెలబ్రేషన్స్ నిర్వహించిన వర్మ.. అక్కడ తాగుతూ తూలుతూ ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిలతో డాన్స్ చేసి వింతగా ప్రవర్తించారు. ‘కసితీరా’ అంటూ బ్యూటిఫుల్ హీరోయిన్ నైనా గంగూలీతో డాన్స్ చేసి ఆమె కాళ్లపై పడ్డాడు. నైనా కాళ్లపై వర్మ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వర్మ మాదిరే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి వర్మ చేసిన పనికి ఫసక్ లాంటి పంచ్‌లేసింది. ‘వర్మ నన్ను చీట్ చేశారు.. నన్ను

ప్రతిరోజూ పండగే డిలీట్ సీన్ 2: పిసుకుడు డాక్టర్‌గా TNR , భద్రం మాత్రం అదే పనిలో..

Image
‘ప్రతిరోజూ పండగే’ చిత్రంతో హిట్ అందుకున్నారు సుప్రీమ్ హీరో సాయి తేజ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆదరించడంతో హిట్ లిస్ట్‌లో చేరి సాయి తేజ్‌ కెరియర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌ను విడుదల తరువాత కూడా వేగవంతం చేశారు చిత్ర యూనిట్.. ప్రతిరోజూ పండగే సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలోని డిలీట్ సీన్‌లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. మంగళవారం నాడు సింక్ బ్రదర్స్ కాంబినేషన్ సీన్‌ను విడుదల చేయగా.. దానికి ఓ మోస్తరు స్పందన వచ్చింది. అయితే కొద్దిసేపటి క్రితం మరో సీన్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో రావురమేష్, ఐ డ్రీమ్స్ టీఎన్ఆర్ కాంబినేషన్ సీన్ పొట్ట చెక్కలు చేస్తుంది. ఫస్ట్రేషన్‌తో బీపీ తెచ్చుకున్న రావురమేష్‌కి వైద్యం చేయడానికి వచ్చిన టీఎన్ఆర్‌కి హై ఫస్ట్రేషన్ అవ్వడం.. దాన్ని తగ్గించుకునేందుకు జేబులో స్మైలీ బాల్ పట్టుకుని పిసుక్కుంటూ ఉండటం.. ‘నాక్కూడా బీపీ ఉంది.. అందుకే జేబులో బాల్ పెట్టుకుని పిసుక్కుంటా’ అని చెప్పే సీన్ నవ్వులు పుట్టిస్తోంది. ఈ బీపీ డ

బిగ్ బాస్ బ్యూటీ బికినీ షో.. వామ్మో తేజస్వి!

Image
బిగ్ బాస్ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరంలేదు. యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి.. ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో పాల్గొనడం ద్వారా బాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 2లో ఆమె కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లి హాట్ బ్యూటీగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. అయితే, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరవాత ఆమెకు సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో టీవీ షోలలో ఎక్కువగా పాల్గొంది. మొత్తానికి ఇటీవల ‘మీటూ’ అనే సినిమాను అంగీకరించింది. క్యాస్టింగ్ కౌచ్ సారాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం తేజస్వి ఇండోనేసియాలోని గిలి దీవుల్లో హాలీడేను ఎంజాయ్ చేస్తోంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడికి వెళ్లిన తేజస్వి హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. అయితే, తాజాగా తేజస్వి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బికినీ ఫొటో చాలా హాట్‌గా ఉంది. స్విమ్మింగ్ పూల్ ఒడ్డున టూ పీస్ బికినీలో తలకు హ్యాట్ పెట్టుకుని స్టైలిష్ పోజ్ ఇచ్చింది. అంతేకాదు, స్విమ్మింగ్ పూల్‌లోని నీటిపై అల్పాహారం ఉంచిన పడవలాంటి బుట్ట కూడా చాలా అందంగా కని

‘బ్యూటిఫుల్’ హీరోయిన్‌కి ‘జార్జిరెడ్డి’ హీరో ఛాలెంజ్

Image
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పణలో వస్తోన్న ‘బ్యూటిఫుల్’ సినిమా హీరోయిన్ నయనా గంగూలీకి ‘జార్జిరెడ్డి’ హీరో సందీప్ మాధవ్ ఒక ఛాలెంజ్ విసిరారు. ఇంతకీ ఏంటా ఛాలెంజ్ అనుకుంటున్నారా..? ఈ మధ్య సెలబ్రిటీలు ఒకరిపై ఒకరు విసురుకుంటోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్. చెట్లను కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలనే కాన్సెప్ట్‌తో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందన వస్తోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ గాయని మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన సందీప్ మాధవ్.. బుధవారం మోతినగర్ పార్కులో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హీరో సందీప్ మాట్లాడుతూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని దానిలో తాను కూడా భాగస్వామి అయి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో సంతోష్ ఏ కార్యక్రమం చేపట్టినా తాను తోడుగా ఉంటానని సందీప్ మాధవ్ హామీ ఇచ్చారు. కాగా, ఈ గ్రీన్ ఇం

‘ప్రతిరోజూ పండగే’ డిలీటెడ్ సీన్: తీసేసి మంచిపని చేశారట!

Image
సినిమాను తెరకెక్కించడం అనేది ఒక పెద్ద ప్రక్రియ. సినిమా మొత్తాన్ని చిత్రీకరించిన తరవాత ఎడిటింగ్ రూమ్‌లో దానికి చాలా కత్తెరలు వేస్తారు. నిడివి తగ్గించడానికో, ఈ సన్నివేశం అవసరంలేదనో కొన్ని సీన్లను తొలగిస్తారు. అలా తొలగించినవాటిలో మంచి సీన్స్ ఉంటే ఈ మధ్య చిత్ర నిర్మాణ సంస్థలు యూట్యూబ్‌లో పెట్టేస్తున్నాయి. వాటికి కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. తాజాగా ‘ప్రతిరోజూ పండగే’ సినిమా నుంచి డిలీట్ చేసిన సీన్‌ను గీతా ఆర్ట్స్ సంస్థ యూట్యూబ్‌లో పెట్టింది. సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. మారుతి దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం సమకూర్చారు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఔట్ అండ్ ఔంట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో తొలగించిన ఒక సన్నివేశాన్ని తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. హీరో తాతయ్య రఘురామయ్య తన వ్యవసాయ భూమిలో భార్య సమా

అలా చేయటం మాట తప్పటమేం కాదు: రామ్ గోపాల్ వర్మ

Image
సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. అంతేకాదు సమాజంలో అందరి దృష్టిని ఆకర్షించిన చాలా సంఘటనలపై వర్మ సినిమాలు చేస్తానంటూ ప్రకటించాడు. అలా చెప్పిన చాలా సినిమాలు రిలీజ్ చేశాడు కూడా. కమ్మరాజ్యంలో కడపరెడ్లు, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ లాంటి సినిమాలు అలా తెరకెక్కించినవే. అయితే వర్మ ఇలా పదుల సంఖ్యలో సినిమా టైటిల్స్‌ ఎనౌన్స్‌ చేశాడు. అమ్మ, కుర్చీ. రెడ్డిగారు పోయారు, నయీం, శశికల ఇలా రాష్ట్రాన్నీ కదిలించే స్థాయి సంఘటన ఏది జరిగినా ఏదో ఒక సినిమా టైటిల్‌ను ఎనౌన్స్‌ చేస్తూ వచ్చాడు వర్మ. Also Read: తాజాగా అలా తాను ఎనౌన్స్‌ చేసిన సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చాడు వర్మ. తాను ప్రకటించిన నయీం, శశికల సినిమాలు తానే మర్చిపోయానని చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చాడు. అంతేకాదు తాను అలా పక్కకు పడేసిన టైటిల్స్‌, సినిమాలు దాదాపు 10 వరకు ఉంటాయని చెప్పాడు. కొంత మంది వ్యక్తులతో మాట్లాడినప్పుడు కొన్ని లైన్స్‌, టైటిల్స్‌ ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తాయి. కానీ తరువాత సినిమాగా తెరకెక్కించే అంత కంటెంట్‌ రెడీ కాకపోవటంతో ఈ ప్రాజె

శ్రీరెడ్డికి చుక్కలు చూపిస్తున్న చెన్నై వాసులు.. నావల్ల కాదంటూ ఏడుపు

Image
హైదరాబాద్‌లో నానా హంగామా చేసి మొత్తానికి చెన్నై వెళ్లిపోయింది . అక్కడ గుళ్లకు వెళుతూ భక్తురాలిగా మారిపోయింది. తమిళనాడు ప్రజల కోసం సాయం చేయాలనుకుంటున్నాని ఇప్పటికే చాలా వీడియోలు పెట్టింది. నిర్మాణ సంస్థను ఏర్పాటుచేసి తమిళనాడుకు చెందిన యువ టాలెంట్‌ను ప్రోత్సహించాలని అనుకుంటున్నానని తెలిపింది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. గత కొన్ని రోజులుగా తమిళనాడు ప్రజలు శ్రీరెడ్డిని బాగా టార్చర్ పెడుతున్నారట. శ్రీరెడ్డి ఉంటున్న ప్రదేశంలోనే విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ నివాసం ఉంది. అక్కడ ఓ వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోందట. ఈ వెబ్ సిరీస్‌లో తమన్నా నటిస్తున్నారు. అయితే షూటింగ్‌కి వచ్చే వారంతా తమ వాహనాలను శ్రీరెడ్డి నివాసం ముందు పార్క్ చేస్తున్నారట. ఫ్యాన్స్ తన ఇంటి ముందు కూర్చుకుంటున్నారట. దాంతో విసిగిపోయిన శ్రీరెడ్డి ఎన్నో సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఫలితం లేకుండాపోయింది. ఇక ఏం చేయాలో తెలీక లైవ్ వీడియోను పోస్ట్ చేస్తూ తన బాధను చెప్పుకుంది. READ ALSO: ‘నా ఇంటి ముందు ఉన్నవారంతా నాపై కామెంట్స్ చేస్తుంటారు. తమన్నా సెక్యూరిటీ గార్డ్స్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ తమన్నా షూటింగ్ చేస్తోంద

బన్నీ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. సూపర్‌ హిట్‌ సాంగ్‌ వీడియో

Image
ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ సాధించిన పాటల్లో టాప్‌ లిస్ట్‌ లో ఉండే సాంగ్ `సామజవరగమన`. అల వైకుంఠపురములో సినిమాలోని ఈ పాట లిరికల్‌ వీడియో ఇప్పటికే 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించిన రికార్డ్ సృష్టించింది. తమన్‌ సంగీత సారధ్యంలో సిద్ధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రీ సాహిత్యమందించాడు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఈ పాట వీడియో ప్రోమోను న్యూ ఇయర్‌ కానుకగా విడుదల చేశారు. 59 సెకన్ల నిడివితో రిలీజ్‌ అయిన ఈ ప్రోమో వావ్‌ అనిపించేలా ఉంది. పారిస్‌లోని అందమైన లోకేషన్‌లో ఈ పాటను చిత్రీకరించారు. బన్నీ స్టైలింగ్‌తో పాటు స్టైలిష్ డాన్స్‌ మూవ్స్‌ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హీరోయిన్‌ పూజా హెగ్డే అందాలు మరింత గ్లామర్‌ను యాడ్‌ చేశాయి. Also Read: లాంగ్ గ్యాప్‌ తరువాత అల్లు అర్జున్‌ చేస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్‌, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కాన

Regina Cassandra: చిరుతో ఐటమ్‌ సాంగ్‌.. హాట్‌ బ్యూటీకి క్రేజీ ఆఫర్‌!

Image
హీరోయిన్‌ ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా.. స్టార్‌ ఇమేజ్‌ అందుకోలేకపోయిన బ్యూటీ కాసాండ్ర. పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌ రోల్స్‌లో పాటు గ్లామర్‌ క్యారెక్టర్స్‌కు కూడా సై అన్నా ఈ భామకు అవకాశలు మాత్రం రావటం లేదు. ఇటీవల ఎవరు సినిమాలో నెగెటివ్ రోల్‌లోనూ మెప్పించిన రెజీనాకు స్టార్‌ హీరోల సరసన ఛాన్స్‌ దక్కకపోయినా వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా ఈ భామకు ఓ క్రేజీ ఆఫర్‌ తలుపు తట్టినట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్‌ హీరోగా తెరకెక్కుతున్న 152వ సినిమాలో రెజీనా నటించనుంది. అయితే ఈ సినిమాలో రెజీనా నటించబోయేది ఓ ప్రత్యేక గీతంలో అన్న టాక్‌ వినిపిస్తోంది. సందేశాత్మక చిత్రాలను కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కించే స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. Also Read: ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా జనవరిలో రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో రెజీనా స్పెషల్‌ సాంగ్‌లో నటించనుందట. చిరుతో డ్యాన్స్‌ చేసే ఛాన్స్‌ రావటంతో రెజీనా కూడా స్పెషల్‌ సాంగ్‌కు వెంటనే ఒప్పేసుకుంది. గతంలో చిరు రీ ఎంట్రీ సినిమా

సమ్మర్‌లో రానున్న మరో మెగా హీరో.. మెప్పిస్తాడా?

Image
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వెండితెరను ఏలేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో యువ నటుడు చేరనున్నాడు. మెగాస్టార్‌ మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్ హీరోగా తెరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వైష్ణవ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమా షూటింగ్ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతో కలిసి క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కృతికా శెట్టి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో నెగెటివ్‌ రోల్‌లో నటిస్తుండటం విశేషం. Also Read: ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌. ఈ సినిమాలో వైష్ణవ్‌ చేపలు పట్టే కుర్రాడి పాత్రలో ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడు. సుకుమార్‌ ఆస్థాన సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నాడు. మెగా హీరో లాంచింగ్‌ మూవీ కావటంతో ప్రతీ ఒక్కరు ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. శ్

Rajinikanth: సూపర్‌ స్టార్ సినిమాకు చిక్కులు.. రిలీజ్‌ ఆపాలంటూ పిటీషన్‌!

Image
కోలీవుడ్‌లో భారీ చిత్రాలకు రిలీజ్‌ సమస్యలు తప్పటంలేదు. చివరి నిమిషంలో సినిమాపై కాపీ ఆరోపణలు రావటం, లేదా ఆర్థిక సమస్యలు రావటం అనేది సర్వ సాధారణమైపోయింది. తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న దర్బార్‌ సినిమాకు కూడా ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. నిర్మాణ సంస్థ గత చిత్రం కోసం చేసిన అప్పుల కారణంగా దర్బార్‌ ఇబ్బందుల్లో పడింది. సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన దర్బార్‌ సినిమాను పొంగల్‌ కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అయితే తాజాగా నిర్మాణ సంస్థ కారణంగానే ఈ సినిమా రిలీజ్‌పై అనుమానాలు కలుగుతున్నాయి. Also Read: దర్బార్‌ రిలీజ్‌ను ఆపాలంటూ దాఖలైన పిటీషన్‌పై స్పందించాలంటూ మద్రాసు హైకోర్టు లైకా ప్రొడక్షన్స్‌కు నోటీసులు పంపింది. గతంలో 2.ఓ సినిమా నిర్మాణంలో ఉండగా లైకా సంస్థ, మలేషియాకు చెందిన ఎంటర్‌టైన్మెంట్‌ కంపెనీ డీఎంవై క్రియేషన్స్‌ నుంచి 12 కోట్లు అప్పుగా తీసుకుంది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవటంతో ఇప్పుడు వడ్డీతో కల

టెన్త్ క్లాస్ హీరోయిన్‌కి పెళ్లి చేసేశారు.. ఆ ఫొటోనే కొంపముంచిందా?

Image
హీరోయిన్ .. ఈ పేరుతో పాటు ఈమెను కూడా తెలుగు ఆడియన్స్ గుర్తుపట్టడం కష్టమే కాని.. అప్పట్లో కుమారి వర్సెస్ కుమారి, టెన్త్ క్లాస్ (సెకండ్ హీరోయిన్) సినిమాల్లో నటించిన సునైనాకి తమిళ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు తమిళ తంబీలు ఈమె రహస్య వివాహం గురించే చర్చించుకుంటున్నారు. సునైనా ఎవర్ని పెళ్లి చేసుకుంది? వరుడు ఎవరు? అంటూ చర్చోపచర్చలు మొదలుపెట్టారు. కొందరైతే ఆమెకు, ఆమె సన్నిహితులకు ఫోన్ చేసి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారట. హడావిడి ఏం లేకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్న ఈ నటికి పెళ్లి పెద్దలు ఎవరయ్యా అంటే.. సోషల్ మీడియా ప్రచారకర్తలే. అవును.. ఇటీవల ఒక యువకుడితో కలిసి ఉన్న ఫొటోను సునైనా తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో సునైనా ఆ అబ్బాయిని రహస్యంగా వివాహం చేసుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. ఈ పెళ్లి రూమర్ హీరోయిన్ చెవిన పడటంతో.. ఇదేం కర్మరా దేవుడా..? నాకు పెళ్లి కావడం ఏంటి.. పెళ్లి చేసుకునే దాన్నైతే అందరికీ చెప్పే చేసుకుంటా అంటూ క్లారిటీ ఇచ్చింది సునైనా. తనకు పెళ్లైపోయిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని.. అవన్నీ రూమర్స్ మాత్రమే అంటూ ఖండించింది సునైనా. అంతేకాదు.. అసలు తాను

Pawan Kalyan ఐ లవ్ యు.. మా అమ్మమీద ఒట్టు, నమ్మకపోతే మీ కర్మ: ఇట్లు మీ వర్మ

Image
సినిమా ప్రమోషన్స్‌ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు . ఎప్పుడూ వివాదాలు చేసి సినిమాలు ప్రమోట్ చేసుకోవడం బోర్ కొట్టిందో ఏమో కాని.. ఈసారి ఆయన పంథాను మార్చి.. డిఫరెంట్‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ప్రియ శిష్యుల్లో ఒకరైన అగస్త్య మంజు డైరెక్షన్‌లో వస్తున్న ‘బ్యూటిఫుల్’ మూవీని నూతన సంవత్సర కానుకగా జనవరి 1న విడుదల చేస్తున్నారు. టైగర్ కంపెనీ ప్రొడక్షన్‌లో వర్మ నిర్మించిన ఈ చిత్రానికి ట్రిబ్యూట్ టు రంగీలా అనేది ఉపశీర్షిక. ఈ బోల్డ్ అండ్ రొమాంటిక్ చిత్రంలో నైనా గంగూలీ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వర్మ హీరోయిన్స్‌తో డాన్స్ లాంటిది చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి వర్మ పిచ్చి పీక్స్ అన్నట్టుగా వ్యవహరిస్తూ హీరోయిన్ కాళ్లపై పడ్డాడు. ‘రా కసితీరా’ సాంగ్‌కి డాన్స్ చేస్తున్న నైనా కాళ్లపై పడ్డాడు వర్మ. న్యూ ఇయర్ కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రీ న్యూ ఇయర్ ప్రైవేటు పార్టీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.. ఈ పార్టీలో వర్మ తాగుతూ తూలుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడటమే కాకుండా హీరోయిన్స్‌తో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహర

సత్యదేవ్‌తో నిత్యా మీనన్.. 1979లో సాగే పీరియాడిక్ మూవీ!

Image
పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న నటుడు సత్యదేవ్ కంచరన. ఈయన సోలో హీరోగానూ సినిమాలు చేస్తున్నారు. ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాతో తన నటనలోని పవర్ ఏంటో చూపించారు సత్య. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా ఆయన ఇంకా సరైన బ్రేక్ అయితే రాలేదు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సత్యదేవ్ తాజాగా మరో సినిమాను అంగీకరించారు. సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో ఒక సినిమా తెరకెక్కనుంది. ‘అర్జున్ రెడ్డి’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి సూపర్ హిట్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన కె.ఎఫ్‌.సి. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఈ సినిమాను నిర్మిస్తోంది. 1979లో సాగే పీరియాడిక్ మూవీగా ఈ చిత్రం రూపొందుతుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డాక్టర్ కె.ర‌వికిర‌ణ్ స‌మ‌ర్పణ‌లో బైట్ ఫీచ‌ర్స్ బ్యాన‌ర్‌‌పై దర్శకుడు విశ్వక్ కందెరావ్ ఈ చిత్రాన్ని తెర‌కె

న్యూ ఇయర్ పార్టీకి మంచి కిక్కిచ్చే తెలుగు పాటలు.. వెయ్యిరా మావ!!

Image
తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరం అంటే ఉగాది పండుగే అయినా.. చాలా మందికి ఇంగ్లిష్ న్యూ ఇయర్ అంటేనే ఎక్కువ మక్కువ. దానికి కారణం హడావుడి, హంగామా, ఎంజాయ్‌మెంట్. డిసెంబర్ 31 వస్తుందంటే చాలు చాలా మందిలో ఏదో తెలియని హంగామా మొదలైపోతుంది. ఆ రోజు రాత్రి ఏం చేయాలి? పార్టీ ఎలా చేసుకోవాలి? ఎలాంటి డీజే పెట్టాలి? అనే కుర్రాళ్లంతా ఆలోచిస్తారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఏ వీధిలో చూసినా మ్యూజిక్ మోత మోగాల్సిందే. ఎక్కడ చూసినా పార్టీ వాతావరణమే కనిపిస్తుంది. మరి ఇలాంటి పార్టీల్లో మంచి కిక్కిచ్చే పాటలు ఉంటేనే కదా ఊపొస్తుంది. సౌండ్ సిస్టమ్‌లో పాట వస్తే డ్యాన్సంటే ఏంటో తెలియని వారు కూడా కాలు కదపాలి. దిస్ ఈజ్ ద న్యూ ఇయర్ పార్టీ అంటూ కుప్పి గంతులు వేయాలి. అలా మనతో గంతులు, స్టెప్పులు వేయించే సినిమా పాటలు ఈ ఏడాది చాలానే వచ్చాయి. దేవీశ్రీ ప్రసాద్, తమన్, మణిశర్మ, అనిరుధ్ వంటి సంగీత దర్శకులు అందించిన ఫాస్ట్ బీట్ సాంగ్స్‌తో పాటు మంచి పార్టీ సాంగ్స్ మీకోసం అందిస్తున్నాం. డాంగ్ డాంగ్ (సరిలేరు నీకెవ్వరు) దుమ్ము ధూళి (దర్బార్) దిమాక్ ఖరాబ్ (ఇస్మార్ట్ శంకర్) రాములో రాములా (అల వైకుంఠపురములో) కోకా కోలా పెప్సీ (వెంకీ మామ) ఏక్ బ

‘డాంగ్ డాంగ్’ సాంగ్: మహేష్ బాబు కొత్త స్టెప్పులు.. ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్

Image
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో చాలా వరకు మ్యూజికల్ హిట్లే. ఆయన సినిమా ఆల్బమ్స్ చాలా బాగుంటాయి. వాటిలో మంచి ఫాస్ట్ బీట్స్ కూడా ఉంటాయి. అయితే, మహేష్ బాబు డ్యాన్స్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుందనే విమర్శ ఉంది. అందుకే ఆయన స్టైల్ మార్చారు. సరికొత్త స్టెప్పులతో ఇరగదీశారు. ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ అందించారు. మహేష్ బాబు, రష్మి మందన హీరోహీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక దేవీశ్రీ అందించిన పాటలపై మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఫ్యాన్స్ సూపర్ హిట్ సాంగ్స్ అని చెబుతుంటే.. సగటు సంగీత ప్రేమికుడు మాత్రం దేవీ ట్యూన్స్‌పై పెదవి విరిచాడు. అయితే, ఇటీవల విడుదల చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ సాంగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్ అందించిన సాహిత్యం, శంకర్ మహదేవన్ గానం అద్భుతమనే చెప్పాలి. కానీ, తాజాగా విడుదలైన ‘డాంగ్ డాంగ్’ పాట

‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ ఎఫెక్ట్.. పేరు మార్చుకున్న నిర్మాత

Image
సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శక‌త్వంలో వచ్చిన సినిమా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’. శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శేఖర్‌ రాజు నిర్మించిన చిత్రం డిసెంబర్‌ 28న విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లను రాబడుతోంది. చిత్రం విజయం సాధించిన సందర్భంగా సోమవారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోస్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో హీరో సుడిగాలి సుధీర్‌, హీరోయిన్ ధన్య బాలకృష్ణ, నిర్మాత శేఖర్‌ రాజు, సంగీత దర్శకుడు భీమ్స్, గేయ రచయిత సురేష్ ఉపాధ్యాయ, డిస్ట్రిబ్యూటర్ పేపర్ సత్యనారాయణ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా హీరో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ‘‘వెండితెర మీద కంటిన్యూగా రెండు గంటలపాటు ఉండే క్యారెక్టర్ చేస్తానని నా లైఫ్‌లో ఊహించలేదు. అది ఈరోజు నిజమైంది. మాములుగా వారానికి మూడు రోజులు ఇంట్లో టీవీ ఆన్ చేస్తే కనిపిస్తాను. అలాంటిది నా కోసం టికెట్ కొనుక్కొని థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. సినిమా విడుదలైనప్పటి నుండి అంత‌టా పాజిటివ్ టాక్ వినిపి

Rana Daggubati: ‘మత్తు వదలరా’.. బాహుబలి, భళ్లాలదేవది ఒకే మాట!

Image
‘మత్తు వదలరా’ సినిమా ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా, పెద్ద కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈయనే కాదు.. ఈ సినిమాకు పనిచేసిన వాళ్లంతా కొత్తవాళ్లే. సినిమాను కూడా అంతే కొత్తగా తీసి హిట్ అందుకున్నారు. ప్రేక్షకులు హిట్ చేసిన ఈ సినిమాను ఇప్పుడు సెలబ్రిటీలు కూడా చూస్తున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాతో నేషనల్ స్టార్స్‌గా పాపులారిటీ సంపాదించిన రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి తాజాగా ‘మత్తు వదలరా’ సినిమాను చూశారు. సినిమా అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రభాస్‌తో దిగిన ఫొటోను, రానా మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. ప్రభాస్ మాట్లాడే వీడియోను మంగళవారం విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా గురించి రానా మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఒక యూనిక్ కొత్త సినిమా తీసినందుకు చిత్ర దర్శకుడు రితేష్ రాణాకు అభినందనలు. నాకు ఇలాంటి కొత్త సినిమాలన్నా.. ఎడ్జీ సినిమాలన్నా చాలా ఇష్టం. ఇది చాలా మంచి ఎడ్జీ ఎడ్జీ ఫిల్మ్. సినిమా ప్రా

సరిలేరు నీకెవ్వరు.. అనిల్ రావిపూడి సెంటిమెంట్ కలిసొస్తుందా!

Image
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. 2019లో ‘ఎఫ్2’ సినిమాతో ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా విజయంతో స్టార్ నిర్మాతలు, హీరోల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబును తన కథతో మెప్పించగలిగారు. మళ్లీ సంక్రాంతి రేసులో నిలబడ్డారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఈ సంక్రాంతికి విడుదలవుతోంది. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు మంచి ప్రచారం కల్పిస్తున్నారు. సాగర నగరం విశాఖపట్నంలో ఈనెల 28న నిర్వహించిన విశాఖ ఉత్సవ్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సినిమాలోని ‘డాంగ్ డాంగ్’ సాంగ్ ప్రోమోను విశాఖ ఉత్సవ్‌లో విడుదల చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ ప్రోమోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ పాటకు వీరంతా స్టేజ్‌పై స్టెప్పులేశారు. అయితే, ఈ సాంగ్ ప్రోమో విడుదల కార్యక

దర్శకుడి చేతిలో 200 కోట్లు పెట్టిన ప్రభాస్?

Image
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తర్వాత అంతటి స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇందుకు ఆయన తెరకెక్కించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమానే కారణం. అయితే త్వరలో సురేందర్ రెడ్డి.. యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్‌తో కలిసి ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఈ మేరకు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ప్రభాస్‌కు చెందిన నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సురేందర్ రెడ్డి చేతిలో 200 కోట్ల రూపాయలను పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన తీసే సినిమా ‘సాహో’ మిగిల్చిన నిరాశ నుంచి బయటపడేలా ఉండాలని నిర్మాణ సంస్థ చెప్పిందట. రాధాకృష్ణతో కలిసి ప్రస్తుతం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్)తో బిజీగా ఉన్న ప్రభాస్‌తో సినిమా చేయాలని సందీప్ రెడ్డి వంగా, కొరటాల శివ లైన్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. READ ALSO: అయితే సందీప్ రెడ్డి వంగాతో సినిమాపై ఇటీవల ప్రభాస్ టీం క్లారిటీ ఇచ్చింది. అందులో ఎంత మాత్రం నిజం లేదని తెలిపింది. ఇక ప్రభాస్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్‌లో ఎంత నిజం ఉందో తెలియాంటే మరో క్లారిఫికేషన్ రావాలి. మరోపక్క కొద్ది రోజులుగా ఓ సినిమాలో నటించేందుకు ప్రభాస్‌కు భారీ రెమ్యూనరేషన్‌ అందుకోబోతున్నట

Rashmi Gautam ఎక్స్‌పోజింగ్‌కి మాత్రమే ఒప్పుకుంటోంది అందుకే సుధీర్‌ని..: దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

Image
‘జబర్దస్త్’ కామెడీ షోతో బాగా పాపులర్ అయిపోయారు రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్. వీరిద్దరి కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తే చూడాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఆ అవకాశం ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో రష్మీకి వచ్చింది. కానీ డేట్లు కుదరడంలేదు అన్న కారణంతో రష్మి సినిమాకు నో చెప్పిందట. ఈ విషయాన్ని సుధీర్ ఒకానొక సందర్భంలో తెలిపాడు. అయితే రష్మి ఈ సినిమాకు నో చెప్పడంపై ప్రముఖ దర్శకుడు ఇమంది రామారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఇక్కడ నేను నిజాలే మాట్లాడాలని అనుకుంటున్నాను. సినిమాకు రెమ్యునరేషన్‌గా రష్మి రూ.40 లక్షలు కావాలని అడిగింది. కానీ సినిమా యూనిట్ కేవలం 35 లక్షలు ఇస్తామని చెప్పింది. ఇందుకు రష్మి ఒప్పుకోలేదు. ఇది రష్మి జీవితంలో దురష్టకరమైన సంఘటన. దాదాపు ఏడెనిమిది ఏళ్లుగా రష్మి, సుధీర్ మధ్య మంచి ట్రాక్ నడుస్తోంది. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారో లేదో పక్కనబెడితే వీరిద్దరినీ అభిమానులు ఎంతో ప్రేమిస్తున్నారు. జబర్దస్త్‌లో రష్మి, సుధీర్ కలిసి ఎన్నో పాటలకు డ్యాన్స్‌లు చేశారు. ఒకవేళ రష్మి ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాకు ఒప

టాప్ 25 సూపర్ హిట్ తెలుగు సాంగ్స్ 2019

Image
టాలీవుడ్‌లో ప్రతి ఏటా కొన్ని వందల సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఒక్కో సినిమాలో మూడు నుంచి ఐదారు పాటలు ఉంటాయి. కానీ, ప్రతి సినిమాలోని పాటలు మనల్ని అలరించవు. కొన్ని సినిమాల్లో పాటలు మాత్రమే ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా పాట బాగుండే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. అలా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన 25 సూపర్ హిట్ సాంగ్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. సామజవరగమన (అల వైకుంఠపురములో) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: సిద్ శ్రీరామ్ సంగీతం: తమన్ ఎస్ సూర్యుడివో చంద్రుడివో (సరిలేరు నీకెవ్వరు) రచన: రామజోగయ్య శాస్త్రి గానం: బి. ప్రాక్ సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ బుట్టబొమ్మ (అల వైకుంఠపురములో) రచన: రామజోగయ్య శాస్త్రి గానం: అర్మాన్ మాలిక్ సంగీతం: తమన్ ఎస్ దుమ్ము ధూళి (దర్బార్) రచన: అనంత్ శ్రీరామ్ గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం: అనిరుధ్ రవిచందర్ సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ రచన: దేవీశ్రీ ప్రసాద్ గానం: శంకర్ మహదేవన్ సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ ఏమో ఏమో ఈ గుండెల్లో (ఎంత మంచివాడవురా) రచన: రామజోగయ్య శాస్త్రి గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం: గోప

కేసీఆర్ సాక్షిగా చిరంజీవి చెప్పిన చీరాల వీరయ్య కథ

Image
ప్రతి మనిషి జీవితంలోనూ తనలో స్ఫూర్తి నింపిన ఒక వ్యక్తి ఉంటాడని.. తన జీవితంలోనూ ఒక మనిషి ఉన్నాడని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. డిగ్రీ చదువుకున్న తరవాత ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తనలో ఎంతో స్ఫూర్తిని నింపి తాను గొప్ప నటుడిగా ఎదగడానికి ఒక వ్యక్తి కారణమయ్యాడని, ఆయన్ని ఎప్పటికీ మరిచిపోనని వెల్లడించారు. ఆ వ్యక్తి పేరు వీరయ్య అని, ఆయనది చీరాల అని, తన తండ్రి వద్ద కానిస్టేబుల్‌గా పనిచేసేవారని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ మేరకు ‘టీవీ9 నవ నక్షత్ర సన్మానం 2019’ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘జీవితంలో ఎలా ఎదగాలి అనడానికి నాకు నేనే ఉదాహరణగా చెప్పుకోగలను. వెనకా ముందు ఎవ్వరూ లేరు. నాన్న ఒక కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయ్యారు. ఆయన ఎస్ఐ అయిన సమయంలో మేం చీరాలలో ఉండేవాళ్లం. అప్పుడు నా డిగ్రీ అయిపోయింది. తరవాత ఏం చేయాలో అగమ్యగోచర పరిస్థితి. సినిమా పట్ల మక్కువ ఉండేది. కానీ, సినిమా పరిశ్రమలో నాకు తెలిసినవారు ఎవ్వరూ లేరు. అక్కడికి వెళ్తే నేను ఏకాకిని అయిపోతాను. దారీతెన్నూ లేని పరిస్థితి అయిపోతుంది. ఎలా.. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నా గురు

కమెడియన్ నుంచి హీరో.. ఇప్పుడు విలన్.. సునీల్ కొత్త ప్రయత్నం

Image
హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు సునీల్. టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా ఎదిగిన సునీల్.. ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారారు. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాతో హీరోగానూ తన మార్క్‌ను చూపించారు సునీల్. అయితే, ‘మర్యాద రామన్న’ తరవాత సునీల్ హీరోగా చాలా సినిమాలే చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. దీంతో ఆయన బాగా వెనకబడిపోయారు. ఇటు హీరోగా రాణించలేక, అటు కమెడియన్‌గా అవకాశాలు లేక సునీల్ కెరీర్ పరంగా చాలా ఇబ్బందిపడ్డారు. మొత్తానికి తన మిత్రుడు, దర్శకుడు తివిక్రమ్ సాయంతో ‘అరవింద సమేత’ సినిమాతో మళ్లీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొత్త కెరీర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అయితే, ఇన్నిరోజులూ కమెడియన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన సునీల్ ఇప్పుడు విలన్‌గా ప్రేక్షకులను భయపెట్టబోతున్నారు. ఈమేరకు ఆయన విలన్‌గా ఒక కొత్త సినిమాను అంగీకరించారు. ఈ సినిమా ద్వారా యంగ్ కమెడియన్ సుహాస్ హీరోగా పరిచయం అవుతున్నారు. ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరి మట్ట’ చిత్రాలను నిర్మించిన అమృత ప్రొడక్షన్స్ తదుపరి చ

‘అల వైకుంఠపురములో’ మ్యూజికల్ నైట్.. ఫ్యాన్స్ కోసం వినూత్నంగా..!

Image
సంక్రాంతి బరిలో ఉన్న భారీ చిత్రాల్లో ‘అల వైకుంఠపురములో’ ఒకటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ హ్యాట్రిక్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఇప్పటికే మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు తమన్ అందించిన పాటలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా ‘సామజవరగమన’ సాంగ్ అయితే ఈ ఏడాదికే బెస్ట్ సాంగ్‌గా చెప్పుకోవచ్చు. ఇక ‘రాములో రాములా’, ‘బుట్టబొమ్మ’ సాంగ్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘అల వైకుంఠపురములో’ ఆల్బమ్‌ సూపర్ సక్సెస్ కావడంతో ఈ విజయోత్సవాన్ని అల్లు అర్జున్ అభిమానుల సమక్షంలో నిర్మాతలు నిర్ణయించారు. అందుకే, జనవరి 6న ‘అల వైకుంఠపురములో’ మ్యూజికల్ కాన్సెర్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అధికారికంగా ప్రకటించారు. Also Read: ‘‘అల వైకుంఠపురంలో సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన అన్ని సాంగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్ కెరీర్‌లో మరో బ్లాక్ బాస్టర్ ఆల్బమ్‌గా నిలిచింది ఈ చిత్రం. అందుకు ముఖ్యంగా తమన్‌కు కృతఙ్ఞతలు. పాటలు ఇంతటి ప్రాచుర్యం పొందిన సందర్భాన్ని పురస

నిర్మాతను బీరు బాటిల్‌తో కొట్టిన నటి సంజన?.. ఇదో చిల్లర ప్రచారం అంటోన్న హీరోయిన్!

Image
సంజన గల్రానీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. తరుణ్ ‘సోగ్గాడు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ‘బుజ్జిగాడు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో వరుసపెట్టి సినిమాలు చేస్తోన్న సంజన.. తెలుగులో మాత్రం కనిపించింది చాలా తక్కువే. కిందటేడాది ‘దండుపాళ్యం 3’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇదిలా ఉంటే, సంజన తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. కన్నడ మహిళా నిర్మాత వందన జైన్‌ను సంజన బీర్ బాటిల్‌తో కొట్టిందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 24న బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన పార్టీలో సంజన తనను బీర్ బాటిల్‌తో కొట్టి గాయపరిచిందని పోలీసులకు వందన ఫిర్యాదు చేసింది. పార్టీలో తనకు, సంజనకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని.. కోపంతో సంజన తనను బీర్ బాటిల్‌తో కొట్టిందని ఆ ఫిర్యాదులో వందన పేర్కొంది. దీంతో సంజనపై బోలెడన్ని వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలపై సంజన తాజాగా స్పందించింది. తనపై వందన చేస్తోన్న ఆరోపణలన్నీ తప్పని.. ఆమె చిల్లర ప్రచారం చేసుకుంటోందని మండిపడింది. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా మీడియాకు ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. ఈ ప్రెస్ నోట్‌లో ఆమ

హాఫ్ మిలియన్ కొట్టిన సాయి తేజ్.. యూఎస్‌లో తొలిసారి

Image
సరైన హిట్టు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న సుప్రీం హరో సాయిధరమ్ తేజ్ ఎట్టకేలకు తన విజయ దాహాన్ని తీర్చుకున్నారు. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మళ్లీ ఫాంలోకి వచ్చారు. ఈ సినిమా 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వేటను కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ బాక్సాఫీసు వద్ద కూడా సత్తా చాటుతున్నారు తేజూ. తన కెరీర్‌లో మొదటిసారి యూఎస్ బాక్సాఫీసు వద్ద హాఫ్ మిలియన్ డాలర్ మార్క్‌ను అందుకున్నారు. యూఎస్ బాక్సాఫీసు వద్ద ‘ప్రతిరోజూ పండగే’ సినిమా శనివారం నాటికి 529,600 డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. అంటే, ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 3.78 కోట్లు. యూఎస్ హాఫ్ మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసిన తొలి సాయిధరమ్ తేజ్ సినిమా ఇది. అక్కడ భారీ విజయం అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ బయ్యర్స్‌కు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో యూఎస్‌లోనూ సాయి తేజ్ మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకున్నారు. ఇకపై ఆయన సినిమాలకు అక్కడ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. కాగా, రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్

మహేష్ సినిమా అందుకే ఫ్లాపైంది.. ఎన్టీఆర్‌కు కథ చెప్పింది నిజమే!

Image
సౌత్‌ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్ తొలిసారిగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను డైరెక్ట్‌ చేసిన సినిమా దర్బార్‌. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు భారీగా జరుగుతున్నాయి. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌లతో పాటు లిరికల్‌ వీడియోలతో సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేరాయి. వరుస ప్రెస్‌మీట్‌లు ఇంటర్వ్యూలతో ఈ అంచనాలను మరింతగా పెంచేస్తున్నారు చిత్రయూనిట్‌. తాజాగా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు మురుగదాస్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తెలుగులో స్టాలిన్‌, స్పైడర్‌ రెండు సినిమాలు చేసిన మురుగదాస్‌ ఆ రెండు సినిమాల పరాజయానికి తానే కారణమన్నాడు. తెలుగు ప్రేక్షకుల పల్స్‌ తెలుసుకోలేకపోయానని తెలిపాడు. స్పైడర్‌ విషయంలో మహేష్‌ను తమిళ ఆడియన్స్‌కు పరిచయం చేయాలనుకున్నానే తప్ప తెలుగు ప్రేక్షకులు మహేష్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో పట్టించుకోలేదన్నాడు. Also Read: అంతేకాదు గతంలో ఎన్టీఆర్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా అంటూ వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్పందించిన మురుగదాస్‌.. చాలా రోజులుగా కిందట ఎన్టీఆర్‌కు కథ చెప్పిన మాట వాస్తవమే అన్నాడు. అయితే ఆ ప్రాజెక్

Bheeshma: నితిన్‌, రష్మికకు కృతజ్ఞతలు తెలిపిన హృతిక్‌ రోషన్‌

Image
వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో లాంగ్‌ గ్యాప్‌ తరువాత చేస్తున్న సినిమా భీష్మ. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. టీజర్‌తో పాటు వరుసగా లిరికల్‌ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల పోసిటానాలో షూటింగ్ జరుగుతుండగా నితిన్‌, రష్మికలు ఓ వీడియోను తమ సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేశారు. హృతిక్‌ నటించిన గుంగ్రూ పాటకు నితిన్‌, రష్మికలు కలిసి డ్యాన్స్‌ చేసి ఆ వీడియోను హృతిక్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. `భీష్మ టీం తరపున మీకు ప్రేమతో హృతిక్‌ సర్‌. ఆడియో సరిగ్గా సింక్‌ అవ్వలేదు క్షమించాలి` అంటూ ట్వీట్ చేశాడు. Also Read: అయితే ఈ వీడియోపై స్పందించాడు. తన ట్విటర్‌ వేదికగా నితిన్‌, రష్మిక మందన్నలకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతేకాదు నితిన్‌, రష్మికలతో పాటు భీష్మ టీ మొత్తానికి ఆల్‌ ద బెస్ట్‌ అంటూ ట్వీట్ చేశాడు నితిన్‌. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీష్మ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా 2020 ఫిబ్రవరిలో విడుదల కానుంది.

Naina Ganguly: `ఈ `బ్యూటీఫుల్‌` అందాలని ఇలా ఎప్పుడు చూశావయ్యా`

Image
సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తన సినిమాలకు సోషల్ మీడియా ద్వారానే కావాల్సినంత ప్రచారం చేసుకుంటాడు. ఇటీవల ఎక్కువగా వివాదాస్పద చిత్రాలనే రూపొందిస్తున్న వర్మ తాజాగా ఓ సెన్సిబుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన బ్యూటీఫుల్ సినిమాకు తనదైన స్టైల్‌లో ప్రచారం చేస్తున్నాడు. ఇటీవల అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన వర్మ ఆశించిన విజయం మాత్రం సాధించలేకపోయాడు. ఈ సినిమా క్వాలిటీ, కంటెంట్‌ పరంగా నిరాశపరచటంతో వర్మ సృష్టించిన వివాదాలన్ని వృధా అయ్యాయి. తాజాగా బోల్డ్‌ కంటెంట్‌తో తెరకెక్కిన బ్యూటీఫుల్‌ను తలకెక్కుకున్నాడు వర్మ. Also Read: న్యూ ఇయర్‌ కానుకగా జనవరి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్మ ఆస్థాన నటి నైనా గంగూలి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర ట్వీట్‌లు చేస్తున్నాడు వర్మ. `మా `బ్యూటిఫుల్` టీం ప్రీ న్యూ ఇయర్ పార్టీ లో నాతో, నైనా గంగూలీ తో, పార్థ సూరి తో, అగస్త్య మంజు తో కలిసి వోడ్కా తాగండి.... ఎలాగంటే Facebook, instagram ద్వారా ఈరోజు 29 రాత్రి

`కలర్‌ ఫోటో`తో హీరోగా మారుతున్న మరో కమెడియన్‌

Image
ఇటీవల కమెడియన్లు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం తరుచూ కనిపిస్తోంది. గతంలో చాలా మంది కమెడియన్లు హీరోలుగా నటించినా తరువాత కామెడీ పాత్రల్లో కొనసాగారు. కానీ ఈ మధ్య కాలంలో హీరోలుగా మారుతున్న కామెడియన్లు హీరోలుగా కొనసాగలేక, తిరిగి కామెడీ పాత్రలు చేయలేక ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. అంతేకాదు ఒకసారి హీరోగా చేసిన వారికి తిరిగి కామెడీ పాత్రలో ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు కూడా పెద్దగా ఆసక్తి కనబరచటం లేదు. తాజాగా మరో కమెడియన్‌ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. విజేత, పేపర్‌ బాయ్‌, మజిలీ, డియర్‌ కామ్రేడ్‌, ప్రతిరోజూ పండగే సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న కమెడియన్‌ సుహాస్‌ హీరోగా సినిమా ప్రారంభమైంది. కలర్‌ ఫోటో పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నటుడు సందీప్‌ రాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. Also Read: ఈ సినిమాను హృదయ కాలేయం సినిమాకు దర్శకత్వం వహించిన స్టీవెన్‌ శంకర్‌ అలియాస్‌ సాయి రాజేష్, లౌక్యా ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. చాయ్‌ బిస్కెట్‌ యూట్యూబ్‌చానల్‌ కోసం కలిసి పనిచేసిన సుహాస్, సందీప్‌ల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై ఆసక్తి

Daang Daang పాటతో మహేష్, మిల్కీ బ్యూటీ ఇరగేశారు

Image
డేంగ్.. డేంగ్ అంటూ పార్టీ సాంగ్‌తో రచ్చ చేస్తున్నారు మహేష్ బాబు, తమన్నాలు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ‘సరిలేరు నీకెవవ్వరు’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఈ సాంగ్‌కి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది చిత్ర యూనిట్. డేంగ్.. డేంగ్ అంటూ సాగిన ఈ పాటలో తమన్నా ఎప్పటిలాగే స్టెప్పులతో పిచ్చెక్కిస్తుండగా.. మహేష్ బాబు సైతం స్టెప్పులేశాడు. దేవిశ్రీ ప్రసాద్ అదిరే బీట్ ఇవ్వగా.. రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. నకాష్ అజీజ్, లావిటొ లోబొ ఆలపించిన ఈ పాట కొద్దిసేపటి క్రితం విడుదలై యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. సాయంత్రం 7 గంటలనుండి ఈ పాట ప్రోమో కోసం నిరీక్షించి నీరసించిన ఫ్యాన్స్‌కి మంచి ఊపునిచ్చే పాటను ఇచ్చి జోష్ నింపాడు దేవి శ్రీ. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్‌లో స్వింగ్ జరా మిల్కీ బ్యూటీ తమన్నాతో పోటీ పడి స్టెప్పులు వేశారు మహేష్. మొత్తంగా మహేష్ బాబుపై డాన్స్‌ సరిగా వేయలేడనే కంప్లైంట్ ఉండనే ఉంది.. అయితే ఈ సాంగ్‌తో మహేష్ దాన్ని చెరిప

Allu Arjun: ‘అల.. వైకుంఠపురములో’.. కాస్త రిలాక్స్

Image
సంక్రాంతి పండుగ నాడు బాక్సాఫీస్ దుమ్ముదులిపేందుకు స్టైలిష్ స్టార్ ‘’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజు, టబు, సునీల్, నవదీప్, రాజేంద్రప్రసాద్, సత్యరాజ్, సముద్రఖని, సచిన్ ఖేడ్కర్, మురళీశర్మ, రావు రమేష్ ఇలా చెప్పుకుంటూ పోతే స్క్రీన్‌ సరిపడనంతమంది భారీ క్యాస్టింగ్‌తో ఈ ‘అల వైకుంఠపురాన్ని నింపేశాడు మాటల మాంత్రికుడు. అసలే సంక్రాంతి అందులోనే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీ రేస్‌లో ఉండటంతో పక్కా ప్లానింగ్‌తో ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి అన్ని కార్యక్రమాలను చక్కబెడుతున్నారు. కాగా శనివారం నాటితో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని గమ్మడికాయ కొట్టేసింది. ఈ సందర్భంగా షూటింగ్ కంప్లీట్ అంటూ .. పూజాతో కలిసి స్టెప్పులు వేస్తున్న ఫొటో పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. మొత్తానికి షూటింగ్ పూర్తి కావడంతో నటీనటులకు రిలీఫ్ దొరికింది. బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో ‘అల.. వైకుంఠపురములో’ చిత్

రామ్‌ చరణ్‌ భార్యకు అక్కినేని అమల ఛాలెంజ్‌

Image
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అన్ని వర్గాల వారు భాగస్వాములు అవుతున్నారు. ప్రభుత్వాధికారులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ముందుకు వస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు తమ సన్నిహితులను భాగస్వాములయ్యేందుకు ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా నటి అమల గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్ (IAS) ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన అమల శనివారం తన నివాసంలో 5 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థను ఆమె అభినందించారు. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నూతన సంవత్సరంలో అందరూ మొక్కలు నాటాలని అమల పిలుపునిచ్చారు. ఎప్పుడు సామాజిక కార్యక్రమాల్లో బిజీగా ఉండే అమల ఇటీవల నటన మీద దృష్టి పెట్టారు. వెబ్‌ సిరీస్‌లతో పాటు అడపాదడపా సినిమాల్లోనూ సటిస్తున్నారు.

Sri Reddy: పవన్ సీఎం కాదు కదా సర్పంచ్ కూడా అవ్వలేడు: భవానీ మాలలో విజృంభించిన శ్రీరెడ్డి

Image
సినీ నటుడు, జనసేన అధినేత ముఖ్యమంత్రి కాదు కదా సర్పంచ్ కూడా అవ్వలేడు అంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది శ్రీరెడ్డి. చెన్నైకి వెళ్లిపోయిన ఆమె మెగా ఫ్యామిలీని టచ్ చేయకుండా ఉండటం లేదు. ప్రస్తుతం భవానీ మాలలో ఉన్న శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌ని అతని ఫ్యా్న్స్‌ని ఓ రేంజ్‌లో ఏకిపారేసింది. ‘‘నేను చెప్తున్నా రాసిపెట్టుకో. నువ్వు జీవితంలో పైకి రాలేవు. అమ్మాయిలకు కడుపులు చేసే నువ్వు. అమ్మాయిని గౌరవించని నువ్వు.. వెయ్యి మందిని వెనకేసుకుని వారి చేత మొరిగించి, ఆ ప్రైమ్‌ నైన్ అనే న్యూస్ ఛానెల్‌ను వెనకేసుకుని నన్నేమీ పీకలేవు. హైదరాబాద్‌లో ఇప్పటికీ నా ఇల్లు అక్కడే ఉంది. నేను వస్తుంటా. ఏం పీకుతావురా నువ్వు. నా మెడలో ఉన్న శక్తి మాలను పట్టుకుని చెప్తున్నాను.. మీ అన్నయ్య చిరంజీవో, లేకపోతే పవన్ కళ్యాణో, లేకపోతే బొచ్చుగాడు నాగబాబో, నీ వెనకాల ఉన్న పావలా కుక్కలు నన్నేమీ చేయలేవు. ఆ దేవుడి పవర్ నాతో ఉన్నంత సేపు నీలాంటి వంద మంది పవన్ కళ్యాణ్‌లు వంద మంది చిరంజీవులు వచ్చినా కూడా వారందరినీ నా కాలి కిందేసి తొక్కుతా." READ ALSO: "రేయ్ పావలా కుక్క.. నీ ప్రైమ్ నైన్‌ని లేకపోతే నువ్వు విడిచిపెట్టిన కొన్ని కుక్కలు ఉన్న

అశ్వథ్థామకు సూపర్‌ రెస్పాన్స్‌.. టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న టీజర్‌

Image
యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ . ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 31న రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ శుక్రవారం టీజర్ను రిలీజ్‌ చేశారు. యాక్షన్‌ ప్రధానంగా కట్‌ చేసిన టీజర్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. సినిమా కంటెంట్‌ ఎలా ఉండబోతుందో చూపిస్తూ డిజైన్‌ చేసిన గ్రిప్పింగ్ టీజర్‌ రిలీజ్‌ అయిన 24 గంటల్లోనే 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది. ప్రస్తుతం టాప్‌ ట్రెండ్‌ అవుతున్న ఈ టీజర్ మరిన్ని రికార్డ్‌ల దిశగా దూసుకుపోతోంది. నాగశౌర్యకు జోడిగా మెహరీన్‌ నటిస్తున్న ఈ సినిమాకు రమణతేజ దర్శకుడు. శ్రీచరణ్ పాకల సంగీతమందిస్తున్నాడు. Also Read: థ్రిల్లర్‌గా కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు హీరో నాగశౌర్య కథ అందించటం విశేషం. గతంలో ఛలో సినిమాకు కూడా కథ అంధించిన నాగశౌర్య అప్పట్లో టైటిల్‌ క్రెడిట్స్‌ తీసుకోలేదు. అయితే ఈ సినిమా విషయంలో ఆ తప్పు చేయదలచుకోలేదని అందుకే టైటిల్‌లో కథ తనదే అని వేస్తున్నట్టుగా చెప్పాడు. Also Read:

నయనతార, తాప్సీల బాటలో సమంత

Image
కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత. పెళ్లి తరువాత ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం 96 రీమేక్‌లో నటిస్తోంది. ఈ సినిమా తరువాత సమంత చేయబోయే సినిమా ఇంకా కన్‌ఫార్మ్‌ కాలేదు. అయితే సామ్‌ కొద్ది రోజులు బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. 96 రీమేక్‌ తరువాత మరోసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించేందుకు సమంత ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. థ్రిల్లర్‌ జానర్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కించే తమిళ దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ సమంత ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. Also Read: నయనతార ప్రధాన పాత్రలో మాయ, తాప్సీ లీడ్‌ రోల్‌లో గేమ్‌ ఓవర్ సినిమాలను తెరకెక్కించిన అశ్విన్‌.. సమంతతోనూ అదే జానర్‌లో ఓ సినిమాను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే సమంతకు కథకూడా వినిపించినట్టుగా తెలుస్తోంది. అశ్విన్ చెప్పిన కథ నచ్చటంతో ఈ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 96 రీమేక్‌ షూటింగ్ పూర్తయ్యి

Chiranjeevi: ట్వీట్లు పెట్టడం కాదు చిరంజీవి, మహేష్ ఇప్పుడు మాట్లాడరే: శ్వేతారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Image
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుపై అల్లర్లు జరుగుతున్నాయి. కొందరు సినీ ప్రముఖులు ఈ బిల్లుకు సపోర్ట్ చేస్తున్నారు మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై ఎందరో బాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందించారు కానీ టాలీవుడ్‌కి చెందిన ఏ ఒక్క సెలబ్రిటీ స్పందించలేదు. దాంతో టాలీవుడ్ అగ్ర హీరోలైన మహేష్ బాబు, చిరంజీవిలను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు వివాదాస్పద జర్నలిస్ట్ శ్వేతారెడ్డి. ‘‘2019లో మోదీ ప్రభుత్వం తీసుకున్న బెస్ట్ నిర్ణయం పౌరసత్వ సవరణ బిల్లు. దీనికి వ్యతిరేకంగా ఎంత మంది ఎన్ని రకాలుగా కామెంట్స్ చేసినా మోదీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు. ఈ బిల్లుకు మద్దతు తెలపని వారు ఉగ్రవాదులతో సమానం. వారంతా దేశద్రోహులు. ఈ మాట ఎవరో కాదు మన సూపర్‌స్టార్ అంటున్నారు. ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాలి. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని తప్పు పట్టే హక్కు ఎవ్వరికీ లేదు. ఇలాంటి సందర్భాల్లో తమిళనాడు సెలబ్రిటీల పవర్ కనిపిస్తుంది. సినిమాల విషయంలో కాదు.. ఇలాంటి సందర్భాల్లో స్పందిస్తూ నిజంగా సూపర్‌స్టార్స్ అని నిరూపించుకుంటున్నారు. ఇంత గొడవ జరుగుతున్న ఇప్పటివరకు ఏ ఒక్క

Rajasekhar: బికినీల్లో హాట్ హాట్‌గా రాజశేఖర్ కూతుళ్లు

Image
2019కి గుడ్‌బై 2020కి హార్టీ వెల్‌కం చెప్పే సమయం వచ్చేసింది. న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకోవాలో ఈపాటికి దేశమంతా ప్లానింగ్స్ వేసేసి ఉంటారు. సాధారణ ప్రజలైతే ఎక్కడైనా వేడుకలు జరుపుకుంటారు. కానీ సెలబ్రిటీలకు అది వీలుపడదు. అందుకే విదేశాల్లో సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు తమ పనులను కాస్త పక్కనబెట్టి ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడానికి విదేశాలకు పయనమయ్యారు. తాజాగా ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మికలు న్యూ ఇయర్ సందర్భంగా చిల్ అవుతున్న ఫొటోలు బయటికి వచ్చాయి. వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి సింగపూర్ వెళ్లారు. అక్కడి మరీనా బే సాండ్స్ రిసార్ట్స్‌లో బిల్డింగ్‌పై కట్టిన స్విమ్మింగ్ పూల్‌లో శివానీ, శివాత్మికలు బికినీలు వేసుకుని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ ఫొటోలను శివానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఈ ఫొటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి. ఇక ఇతర సెలబ్రిటీల విషయానికొస్తే శుక్రవారం సూపర్‌స్టా్ర్ మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు ఎంజాయ్ చేయడానికి న్యూయార్క్ వెళ్లారు. మరోపక్క సమంత గోవాకు వెళ్లిపోయారు. READ ALSO: ఇక శివానీ, శివాత్మికల

Megastar: చిరంజీవిని రాష్ట్రపతిగా చూడలట.. స్క్రీన్‌ మీద కాదు రియల్‌ లైఫ్‌లో!

Image
సామాన్యుడిగా వెండితెరకు పరిచయం అయి అసామాన్యుడిగా ఎదిగిన నటుడు మెగాస్టార్‌ . తన కృషి, పట్టుదలతో వెండితెర వేల్పుగా ఎదిగిన మెగాస్టార్‌ తరువాత రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తెర మీద చిరుకు నీరాజనాలు పట్టిన తెలుగు ప్రేక్షకులు, ఆయనకు రాజకీయ నాయకుడిగా మాత్రం ఆమోదం తెలపలేదు. దీంతో చిరు రాజకీయ ప్రయాణం అర్థాంతరంగా ఆగిపోయింది. ఎన్నో ఆశలు, ఆశయాలతో పెట్టిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, కొంత కాలం కేంద్రమంత్రిగా సేవలందించి తరువాత తిరిగి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. రీ ఎంట్రీలోనూ తనదైన స్టైల్‌, మేనరిజమ్స్‌తో ఆకట్టుకున్న మెగాస్టార్‌ తన ఇమేజ్‌, కలెక్షన్‌ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. Also Read: అయితే ఇటీవల చిరు, బావమరిది అల్లు అరవింద్‌.. మెగాస్టార్‌ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర కామెంట్‌ చేశాడు. ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ కథనం మేరకు అల్లు అరవింద్‌, చిరంజీవిని రాష్ట్రపతిగా చూడాలనుకుంటున్నాడు. అంటే ఏదో సినిమాలో పాత్రలో కాదు. నిజంగా భారత దేశ ప్రథమ పౌరుడిగా చిరంజీవిని చూడాలన్నది కోరిక. `చిరంజీవి ఇంకా ఏ స్థాయికి ఎదగాలనుకుంటున్నారు ?` అనే ప్రశ్న అల్లు అరవింద్

Mahesh Babu: బ్రేక్‌ తీసుకున్న మహేష్‌.. న్యూ ఇయర్‌ వేడుకలకు పయనం!

Image
సూపర్‌ స్టార్‌ షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలికి ఎంతో ఇంపార్టెన్స్‌ ఇస్తాడు. అందుకే ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఏ చిన్న అకేషన్‌ వచ్చినా ఫ్యామిలితో కలిసి ఫారిన్‌ టూర్‌లు వెలుతుంటాడు. ఏడాదిలో కనీసం మూడు నాలుగు సార్లు ఇలాంటి హాలీడే ట్రిప్స్‌కు వెళ్లటం మహేష్ ఫ్యామిలీకి అలవాటు. అందుకే మహేష్ సినిమాలు కూడా కాస్త నెమ్మదిగానే చిత్రీకరణ జరుగుతుంటాయి. తాజాగా సినిమా పనులకు బ్రేక్‌ ఇచ్చి వెకేషన్‌కు చెక్కేస్తున్నాడు సూపర్‌ స్టార్‌. ఈ సారి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఫ్యామిలీతో కలిసి యూరప్‌ వెళుతున్నాడు మహేష్. ఇప్పటికే సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేసిన మహేష్ బాబు హాలీడేస్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. Also Read: వారం రోజుల పాటు యూరప్‌లో గడిపేలా ప్లాన్ చేసుకున్నాడు సూపర్‌ స్టార్‌. జనవరి 3న మహేష్ తిరిగి ఇండియాకు వస్తాడని తెలుస్తోంది. తరువాత సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొననున్నాడు. ఎల్బీ స్టేడియంలో భారీగా నిర్వహించనున్న ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. మెగాస్టార్‌, సూపర్‌ స్టార్‌ ఒకే వేదిక మీదకు వస్తుం

Ram Gopal Varma: రాజధానికి మీనింగే లేదు.. చెన్నైలో ఉంటే ఏంటి?: వర్మ

Image
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని సెగలు రేగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయంపై అమరావతి ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ అధికార పార్టీ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఉద్యమ బాట పట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌‌గా ఉన్న ఏపీ రాజధాని ఇష్యూపై వివాదాస్పద దర్శకుడు తనదైన శైలిలో స్పందిస్తూ కొత్త చర్చనే లేవనెత్తారు. ఆయనేదో బ్యూటిఫుల్ అనే హాట్ పుల్లు చిత్రాన్ని చాలా హార్ట్‌ఫుల్‌గా తీసి నీట్‌గా క్యాష్ చేసుకునే పనిలో ఉంటే.. పోయి పోయి ఆయన్ని రాజధాని గురించి అడిగారు జర్నలిస్ట్ సోదరుడు. అసలే వివాదాల పురుగు అతను ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలపై అతని ఆన్సర్ వివాదంగా కాక చక్కగా ఉంటుందనుకోవడం పొరపాటు కాక మరేమౌతుంది. బ్యూటిఫుల్ అనే కళాఖండాన్ని వర్మ శిష్యుడు అగస్థ్య మంజు రూపొందించారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం వైజాగ్ వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించారు వర్మ. దీనిలో భాగంగా ‘ఏమయ్యా వర్మా.. రాజధానిపై నీ అభిప్రాయం ఏంటి అని ఓ జర్నలిస్ట్ సోదరుడు అడిగిన ప్రశ్నకు వర్మ మార్క్ ఆన్సర్ వచ్చింది. ‘రాజధాని లేదు ఏం లేదు.. అసలు రాజధాని అవసరం అంటారా?

‘వైల్డ్ డాగ్’ ఫస్ట్ లుక్: నాగార్జున సర్‌ప్రైజ్.. డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్

Image
కింగ్ నాగార్జున తన అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘మన్మథుడు 2’ తరవాత నాగార్జున సోలో హీరోగా సినిమాను ఎనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ఆయన ‘బ్రహ్మాస్త్ర’ అనే బాలీవుడ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే, నాగార్జున హీరోగా నెక్ట్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు కింగ్. తన తరవాత సినిమాను ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. టాలీవుడ్‌లో ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోల్లో నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కమర్షియల్, ఆధ్యాత్మిక సినిమాలతో పాటు ‘గగనం’, ‘ఊపిరి’ వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేశారాయన. ఇప్పుడు అలాంటి మరో సినిమాతో వస్తున్నారు కింగ్. Also Read: నాగార్జున టైటిల్ రోల్‌లో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శుక్రవారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ అంద‌రిలో ఆస‌క్తిని రే

‘భీష్మ’ సింగిల్స్ యాంథమ్: ఒంటిలో మంటల్ని చల్లార్చే పాప అంటోన్న నితిన్

Image
యంగ్ హీరో నితిన్ నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు. కిందటేడాది ఆయన హీరోగా వచ్చిన ‘ఛల్ మోహన్‌రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’ బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయాయి. అంతకు ముందు సంవత్సరం వచ్చిన ‘లై’ కూడా ఆకట్టుకోలేకపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’నే నితిన్‌ను చివరి హిట్టు. దీంతో ఈసారి ఎలాగైనా మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు కొట్టాలని నితిన్ చూస్తున్నారు. అందుకే ‘ఛలో’ వంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ కుడుములతో జతకట్టారు. నితిన్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తిచేసి ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే సినిమాపై అంచనాలను పెంచేందుకు ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగా ‘భీష్మ’ నుంచి తొలిపాటను విడుదల చే

శ్రీరెడ్డి ఓ ల** నేనే చంపేస్తా దాన్ని: రెచ్చిపోయిన పవన్ ఫ్యాన్

Image
ఇటీవల పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ని నోటికొచ్చినట్లు తిడుతూ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఓ బూతులతో నిండిన వీడియోను వదిలిన సంగతి తెలిసిందే. పవన్ ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలీదని, అనవసరంగా కుల, మత విషయాల గురించి మాట్లాడితే ఒంగోబెట్టి*** అంటూ పచ్చి బూతులు మాట్లాడేసింది. దాంతో జనసైనికులకు ఒళ్లు మండింది. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానిని అంటూ ఓ యువకుడు శ్రీరెడ్డికి బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నాడు. ‘‘శ్రీరెడ్డి మనిషి జాతికి పుట్టలేదు. అసలు అది భారతదేశంలో పుట్టిన మహిళేనా? చెత్త ల**. ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌పై పడి ఏడుస్తావ్? నీకేం వేరే పని లేదా? నువ్వు తల్లిదండ్రులకే పుట్టావా? నువ్వెంత ఫ్రాడ్ అంటే.. నీ గురించి మాట్లాడటానికి మాటలు కూడా రావడంలేదు. నిన్ను చూస్తే ప్రతీ ఒక్కరికీ చెప్పుతో కొట్టాలని ఉంది. చంపేయాలని ఉంది. కానీ అలా చేయడం కరెక్ట్ కాదు. భారతదేశంలో స్త్రీలను గౌరవించడం మన బాధ్యత. కానీ నువ్వు మొత్తం స్త్రీ జాతికే మచ్చ తెస్తున్నావ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తలుచుకుంటే నువ్వు ఎక్కడ దాక్కున్నా బయటికి లాక్కొచ్చి నీకు ఎక్కడా చోటు లేకుండా చేస్తారు. ఇంకో పేజ్‌ని క్రియేట్ చేస్తా అంటున్నావ్. నువ్వు క్రియేట్ చేయ

కింగ్ కొత్త ప్లాన్‌.. సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్న నాగార్జున

Image
సీనియర్ హీరోల్లో ఇప్పటికీ మన్మథుడు లుక్‌ మెయిన్‌టైన్‌ చేస్తున్న ఏకైక హీరో నాగార్జున. 60 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటి ఇచ్చే గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న నాగ్‌ ఇటీవల సక్సెస్‌ల విషయంలో మాత్రం వెనకపడ్డాడు. ఇటీవల హీరోగా తెరకెక్కిన దారుణంగా ఫెయిల్ అయ్యింది. ఈ సినిమాతో నాగ్‌ ఇమేజ్‌, మార్కెట్‌ కూడా దెబ్బతింది. మన్మథుడు 2 రిజల్ట్‌తో షాక్‌ అయిన నాగ్‌ తదుపరి చిత్రం విషయంలో ఆలోచనలో పడ్డాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కించాలని భావించిన బంగార్రాజు సినిమాను పక్కన పెట్టేశాడు. అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు నాగార్జున ఓకె చెప్పినట్టుగా వార్తలు వినిపించాయి. అంతేకాదు ఈ సినిమాలో నాగ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. Also Read: తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ వినిపిస్తోంది. నాగ్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడట. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయిందన్న టాక్‌ వినిపిస్తోంది. ఓల్డ్‌ సిటిలో ఐదు రోజుల పాటు కీకల సన్నివేశాలు చిత్రీకరించారు. మన్మథుడు 2 నిరాశపరచటంతో నెక్ట్స్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు కింగ్‌. ఈ స

మనవరాలితో మెగాస్టార్.. శాంతా లిటిల్ గిఫ్ట్ ఎంత ముద్దుగుందో!

Image
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన కుటుంబంలో మూడో తరాన్ని చూస్తున్నారు. ఒకప్పుడు సినిమాలతో బిజీగా ఉంటూనే తన పిల్లలతో ఆడుకున్న చిరంజీవి.. ఇప్పుడు తన పిల్లల పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. మనవరాళ్లతో ఆడుకుంటున్నారు. తన చిన్న మనవరాలు, శ్రీజ-కళ్యాణ్ దేవ్ దంపతుల గారాలపట్టి నవిష్కను చిరంజీవి ఎత్తుకున్న ఫొటో ఒకటి తాజాగా బయటికి వచ్చింది. తాతయ్య ఒళ్లో కూర్చొని ఆ చిన్నారి పాప ఎంతో ఆనందపడిపోతోంది. నవిష్క గతేడాది సరిగ్గా క్రిస్మస్ రోజున (డిసెంబర్ 25న) జన్మించింది. అంటే, బుధవారం ఆమె తొలి పుట్టినరోజు. కొణిదెల వారింట పండగరోజు. ఈ వేడుకను కుటుంబ సభ్యులు ఎంతో వేడుకగా జరుపుకున్నారు. నవిష్క పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న చిరంజీవి మనవరాలిని ఎత్తుకుని మురిసిపోయారు. ఈ ఫొటోను చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘నా చిన్నారి పాపాయికి తొలి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా అందరికీ శాంతా ఇచ్చిన బహుమతి ఈమె’’ అని పోస్ట్‌లో సుష్మిత పేర్కొన్నారు. మరోవైపు, నవిష్క తండ్రి కళ్యాణ్ దేవ్ కూడా తన కుమార్తె బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో నవిష్క చాలా ము

రజినీకాంత్‌ను చూస్తూ పెరిగాను.. ఇప్పటికీ కలలానే ఉంది: లిరిసిస్ట్ కేకే

Image
సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, స్టార్‌ డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘దర్బార్‌’. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఎ.సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో రజినీ ఇంట్రడక్షన్ సాంగ్ ‘దుమ్ము ధూళి’ విడుదలైంది. యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌తో దూసుకువెళుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఆ పాటను అనంత శ్రీరామ్ రాయగా... ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. సినిమాలో మరో పాట, పెళ్లి నేపథ్యంలో వచ్చే ఎనర్జిటిక్ సాంగ్ ‘డుమ్ డుమ్’ను కృష్ణకాంత్ రాశారు. గురువారం ఆ పాటను విడుదల చేశారు. నకాష్ అజీజ్ ఈ పాటను ఆలపించారు. ‘డుమ్ డుమ్’ పాట విడుదల సందర్భంగా గేయ రచయిత కృష్ణకాంత్ (కేకే) మాట్లాడుతూ.. ‘‘రజినీకాంత్ సినిమాలో పాట రాసే అవకాశం నాకు ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు. నాకు ఇంకా ఇది ఒక కలలా ఉంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన సూర్య ‘గ్య