రజినీకాంత్‌ను చూస్తూ పెరిగాను.. ఇప్పటికీ కలలానే ఉంది: లిరిసిస్ట్ కేకే

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, స్టార్‌ డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘దర్బార్‌’. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఎ.సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో రజినీ ఇంట్రడక్షన్ సాంగ్ ‘దుమ్ము ధూళి’ విడుదలైంది. యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌తో దూసుకువెళుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఆ పాటను అనంత శ్రీరామ్ రాయగా... ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. సినిమాలో మరో పాట, పెళ్లి నేపథ్యంలో వచ్చే ఎనర్జిటిక్ సాంగ్ ‘డుమ్ డుమ్’ను కృష్ణకాంత్ రాశారు. గురువారం ఆ పాటను విడుదల చేశారు. నకాష్ అజీజ్ ఈ పాటను ఆలపించారు. ‘డుమ్ డుమ్’ పాట విడుదల సందర్భంగా గేయ రచయిత కృష్ణకాంత్ (కేకే) మాట్లాడుతూ.. ‘‘రజినీకాంత్ సినిమాలో పాట రాసే అవకాశం నాకు ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు. నాకు ఇంకా ఇది ఒక కలలా ఉంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన సూర్య ‘గ్యాంగ్’, నాని ‘జెర్సీ’ సినిమాలలో అన్ని పాటలు రాశాను. అనిరుధ్ నన్ను గుర్తుపెట్టుకుని.. ఈ సినిమాలో ఒక పాట రాయమని ఇచ్చారు. చిన్నప్పటి నుండి రజినీకాంత్‌ని చూస్తూ పెరిగిన నాకు.. ఆయన సినిమాలో పాట రాసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలో ఒక యువ జంటకు పెళ్ళయ్యే సందర్భంలో ఈ ‘డుమ్ డుమ్’ పాట వస్తుంది. పెళ్లికి ముందు, తర్వాత భార్యభర్తలు ఎలా ఉంటారు? అని చిన్న ఫిలాసఫీతో సాగే గీతం ఇది. రజినీకాంత్ పాటల్లో ఎక్కువ ఫిలాసఫీ ఉంటుంది. తమిళంలో ఈ పాటను వివేక్ రాశారు. ఆ పాటను నాకు పంపించారు. తెలుగులో ఈ పాటను మీరు రాయాలని చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. దర్శకుడు మురుగదాస్ తీసిన ‘గజినీ’, ‘కత్తి’, ‘తుపాకీ’ సినిమాలు నాకు చాలా ఇష్టం. నా అభిమాన దర్శకుల్లో ఆయన ఒకరు. Also Read: రజనీకాంత్, మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో నాకు ఒక పాట రాసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎనర్జిటిక్ మ్యారేజ్ సాంగ్‌ను నకాష్ అజీజ్ పాడారు. రజనీ ఎనర్జీకి ఆ వాయిస్ బాగా సూట్ అయింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అనిరుధ్ రవిచంద్రన్, రజనీకాంత్, మురుగదాస్, చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కి థాంక్స్. జనవరి 9న విడుదల అవుతున్న సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. రజనీకాంత్ సరసన కథానాయికగా నయనతార, రజనీకాంత్ కుమార్తెగా నివేదా థామస్, ఇతర కీలక పాత్రల్లో సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా నటిస్తున్నారు. ఈ సినిమాకు పీటర్ హెయిన్, రామ్-లక్ష్మణ్ స్టంట్ కొరియోగ్రఫీ చేశారు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ