‘సాఫ్ట్వేర్ సుధీర్’ ఎఫెక్ట్.. పేరు మార్చుకున్న నిర్మాత
సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సాఫ్ట్వేర్ సుధీర్’. శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్పై శేఖర్ రాజు నిర్మించిన చిత్రం డిసెంబర్ 28న విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లను రాబడుతోంది. చిత్రం విజయం సాధించిన సందర్భంగా సోమవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్లో సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో హీరో సుడిగాలి సుధీర్, హీరోయిన్ ధన్య బాలకృష్ణ, నిర్మాత శేఖర్ రాజు, సంగీత దర్శకుడు భీమ్స్, గేయ రచయిత సురేష్ ఉపాధ్యాయ, డిస్ట్రిబ్యూటర్ పేపర్ సత్యనారాయణ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా హీరో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ‘‘వెండితెర మీద కంటిన్యూగా రెండు గంటలపాటు ఉండే క్యారెక్టర్ చేస్తానని నా లైఫ్లో ఊహించలేదు. అది ఈరోజు నిజమైంది. మాములుగా వారానికి మూడు రోజులు ఇంట్లో టీవీ ఆన్ చేస్తే కనిపిస్తాను. అలాంటిది నా కోసం టికెట్ కొనుక్కొని థియేటర్స్కి వెళ్లి సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. సినిమా విడుదలైనప్పటి నుండి అంతటా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. పెద్ద పెద్ద టెక్నిషియన్స్ వర్క్ చేయడం వల్లే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మొదటి రోజు నుంచి సినిమా బాగుందని పాజిటివ్ టాక్ రావడంతో మా డైరెక్టర్ గారు మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వెళ్లారు. ఆయన తరపున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని అన్నారు. చిత్ర నిర్మాత శేఖర్ రాజు మాట్లాడుతూ.. ‘‘నా మొదటి సినిమాను హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. కథ నచ్చి డబ్బుతీసుకోకుండా నటించిన డా. శివ ప్రసాద్ గారికి ఈ సినిమా అంకితమిస్తున్నాను. మా సినిమా మొదటి రోజు 190 థియేటర్స్లో విడుదలైంది. ఇప్పుడు 300 థియేటర్స్లో రన్ అవుతోంది. మా ‘సాఫ్ట్వేర్ సుధీర్’ విడుదలైన రెండు రోజుల్లోనే 4 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇంకా థియేటర్స్ పెంచుతున్నాం అని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు. ఈ విజయానికి గుర్తుగా నా పేరుని సాఫ్ట్వేర్ శేఖర్ రాజుగా మార్చుకున్నాను’’ అని అన్నారు. హీరోయిన్ ధన్యబాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకు నార్మల్ ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నాం. కానీ, సుధీర్ ఫ్యాన్స్ దీనిని ఆడియన్స్లోకి తీసుకెళ్లి ఒక పండుగలా ఇంత పెద్ద ఓపెనింగ్స్ ఇచ్చారు. మౌత్ పబ్లిసిటీతో సినిమా బాగా ఆడుతుంది. తెలుగు రాష్టాల్లోనే కాదు కర్ణాటకలో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఒక మంచి హిట్ కొట్టామని సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని సక్సెస్ చేసిన ఆడియన్స్కి, సుధీర్ ఫ్యాన్స్కి, నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు’’ అని అన్నారు.
Comments
Post a Comment