Posts

Showing posts from September, 2019

షాకింగ్‌ : రానా ఇలా అయిపోయాడేంటి?

Image
స్టార్‌ వారసుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి తరువాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ యంగ్ హీరో రానా దగ్గుబాటి. మ్యాచో స్టార్ పేరు తెచ్చుకున్న ఈ యంగ్‌ హీరో తరువాత బాలీవుడ్‌, కోలీవుడ్‌లలోనూ సత్తా చాటాడు. అంతేకాదు హీరోగా క్యారెక్టర్సే చేస్తానంటూ మడి కట్టుకు కూర్చోకుండా పాత్ర బాగుంటే క్యారెక్టర్‌ రోల్స్‌తో పాటు విలన్‌ క్యారెక్టర్స్‌కు సై అంటున్నాడు. అయితే చివరగా ఎన్టీఆర్‌ మహానాయకుడు సినిమాలో కనిపించిన రానా తరువాత వెండితెర మీద కనిపించలేదు. అదే సమయంలో రానా ఆరోగ్యపరిస్థితిపై రకరకాల వార్తలు వినిపించాయి. రానా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిందని, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ కోసం విదేశాలకు వెళ్లాడన్న ప్రచారం జరిగింది. అయితే నిజంగానే విదేశాలకు వెళ్లిన రానా, తన ఆరోగ్య పరిస్థితి మాత్రం బాగానే ఉందంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ రానా లుక్‌ చూస్తే మాత్రం రానా ఆరోగ్యం విషయంలో అనుమానాలు రాక మానవు. బాహుబలిలో బల్లాలదేవుడిగా భారీ ఖాయంతో కనిపించిన రానా ప్రస్తుతం బక్కచిక్కిపోయి కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ సమయంలో చంద్రబాబు నాయుడు పాత్ర కోసం బరువు తగ్గానని చెప్పినా ఆ తరువాత కూడా మరింతగా బర

Chiranjeevi: ‘సైరా’ రూ. 500 కోట్లు ఆలిండియా షేర్ గ్యారంటీ.. రిలీజ్‌కి ముందే ‘కత్తి’ లాంటి కలెక్షన్స్

Image
పెద్ద పెద్ద స్టార్లు నటించారు.. దండిగా డబ్బులు కూడా పెట్టారు.. ప్రమోషన్స్‌ కూడా కనీవినీ ఎరుగని రేంజ్‌లో చేస్తున్నారు. ఇక టీజర్, ట్రైలర్‌లు చూస్తే బొమ్మ హిట్టు అనేవారే తప్ప రెండో మాటలేదు. మెగాస్టార్ నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ విడుదల కావడమే లేటు కాని.. బాక్సాఫీస్ వద్ద స్వైరవిహారం చేయడం ఖాయమే అంటూ లెక్కలు కట్టేస్తున్నారు మూవీ అనలిస్ట్‌లు. తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ ‘సైరా’ భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొణెదల ప్రొడక్షన్స్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఈ చిత్రాన్ని సుమారు రూ. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. చిరంజీవి సత్తాకి ఈ కోట్లు వెనక్కి తిరిగిరావడం పెద్ద కష్టం కాదంటున్నాడు మూవీ క్రిటిక్ మహేష్ కత్తి. పవన్ కళ్యాణ్ అంటే అంతెత్తున లేచిపడే మహేష్ కత్తి.. అన్న చిరు అంటే మాత్రం అభిమానమే. ఎంత అభిమానం అంటే.. సినిమా విడుదలకు ముందే ‘సైరా రూ. 500 కోట్ల ఆల్ ఇండియా షేర్ గ్యాంరంటీ’ అనేంత. మెగాస్టార్ చిరంజీవి సత్తా అంటే ఇదీ.. అంటూ రూ. 5

‘సైరా’లో చిరంజీవికి డబ్బింగ్ చెప్పింది ‘చాణక్య’ విలన్!

Image
మాచో హీరో గోపీచంద్ హీరోగా వస్తోన్న స్పై థ్రిల్లర్ ‘చాణక్య’. తమిళ దర్శకుడు తిరు తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, స్క్రీన్ రైటర్ రాజేష్ ఖట్టర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ‘చాణక్య’లో ఖురేషి పాత్రలో ఆయన నటించారు. ఇది విలన్ పాత్ర. ఇంత మంచి సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఖట్టర్ అంటున్నారు. అయితే, అంతకన్నా ఆయనకు ఆనందమైన విషయం ఇంకోటి ఉంది. అదే, మెగాస్టార్ చిరంజీవికి హిందీలో డబ్బింగ్ చెప్పడం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తెలుగు గడ్డపై ఆంగ్లేయులపై కత్తెత్తిన తొలి పోరాట యోధుడు, రేనాటి సూరీడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం సమకూర్చారు. నయనతార, తమన్నా ప్రధాన నటీమణులు. అలాగే అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవికిషన్ కీలక పాత్రల్లో నటించారు. Also Read: సుమారు రూ.270 కోట్ల

చిరంజీవి అబద్దం చెప్పారా?.. అందుకే కేసులు వెనక్కి తీసుకున్నారా?

Image
సైరా...దేశం మొత్తం ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకులముందుకు రాబోతుంది. అయితే నిన్నమొన్నటివరకు ఈ సినిమా కథకి డబ్బులు చెల్లించాలి అని డిమాండ్ చేసి, కోర్ట్‌కి కూడా వెళ్లారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు.ఆ రోజు కోర్ట్‌లో వాదనల అనంతరం తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాపై వాళ్ళు వేసిన కేసులు వెనక్కి తీసుకున్నారు. దాంతో ఎలాంటి వివాదాలు లేకుండా క్లీన్ ఇమేజ్‌తో రిలీజ్‌కి రెడీ అయ్యింది సైరా. Also Read: వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో ఉయ్యాలవాడ వంశస్థులు సైరా కోసం డబ్బులు డిమాండ్ చేశారు. అయితే అప్పుడు రామ్ చరణ్ ఆ వంశంలోని మొత్తం 23 కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 లక్షల చొప్పున సాయం చేస్తా అని మాట ఇచ్చారట. కానీ ఎక్కడ తేడా వచ్చిందో ఏమో కానీ ఉయ్యాలవాడ వారసులు కుటుంబానికి రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారు అంటూ ఒక వార్త బయలుదేరింది. చిరంజీవి కూడా ఆ మాట నిజం అని చెప్పుకొచ్చారు. Also Read: అయితే తమకు అన్యాయం జరుగుతుంది అంటూ వాళ్ళు ముందు పోలీస్ కేస్ పెట్టారు, ఆ తరువాత కోర్ట్ మెట్లు ఎక్కారు?. తమకి ముందు లీగల్

'సైరా'పై అల్లు అర్జున్ స్పందన.. బన్నీ మనసులో ఇంతుందా?

Image
సినిమాపై అందరికి భారీ అంచనాలున్నాయి. అంతేకాదు బాహుబలి తరువాత మళ్ళీ ఒక తెలుగు సినిమా ఆ రేంజ్‌లో సంచలనం సృష్టించబోతోంది అన్న ఆనందం ప్రతిఒక్కరిలో ఉంది. కానీ ఈ సినిమా ట్రైలర్ గుంరించి బన్నీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏదైనా చిన్న సినిమా విజయం సాధిస్తేనే బేషజానికి పోకుండా ఆ సినిమాని సోషల్ మీడియాలో పొగిడి దానికి మైలేజ్ తెచ్చే బన్నీ అంత పెద్ద సినిమా, అంతా అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్న సినిమా, స్వయానా సొంత మేనమామ అయిన సినిమా గురించి కనీసం కూడా స్పందించకపోవడంతో అంతా బన్నీని ఏకేస్తున్నారు. అలానే సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి రానందుకు కూడా బన్నీని ట్రోల్ చేస్తున్నారు. Also Read: అప్పుడు సైలెంట్‌గా ఉన్న బన్నీ ఇప్పుడు మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్‌లో సైరా గురించి ఒక సుదీర్ఘమయిన పోస్ట్ పెట్టాడు.' సైరా నరసింహారెడ్డి..మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఒక మాగ్నమ్ ఓపస్ ఇది. ఇది నిజంగా తెలుగు సినిమా గర్వించదగ్గ విషయం. చాలా సంవత్సరాల క్రితం నేను మగధీర సినిమా చూసినప్పుడు ఎప్పుడోఅప్పడు చిరంజీవిగారిని కూడా అలాంటి ఒక గ్రాండ్ ఎపిక్ సినిమాలో చూడాలి అనుకున్నాను. ఆ ఆశ ఇప్పుడు నెరవేరింది. చిరంజీవి గారితో

చరణ్ గురించి చిరు.. బెంగుళూరులో కూడా పవన్ క్రేజ్ పీక్స్

Image
రిలీజ్‌కి ఎంతో టైమ్ లేదు. చూస్తుండగానే రిలీజ్ డేట్ రోజుల్లో నుండి గంటల్లోకి వచ్చేసింది. దీంతో సైరా టీమ్ కూడా ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ముందు నుండి కాస్త డల్‌గా ఉన్న టీమ్ ఇప్పుడు మాత్రం సైరా ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. హిందీలో అమితాబ్, మలయాళంలో పృథ్విరాజ్, కన్నడలో శివరాజ్ కుమార్ ఈ సినిమా ప్రమోషన్స్‌కి అటెండ్ అయ్యారు. అయితే ఇప్పటివరకు చరణ్ గురించి పెద్దగా ఓపెన్ అవ్వని కన్నడ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మాత్రం తన ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. వెళ్లిన ప్రతి చోట ఇలాంటి సినిమా తీసినందుకు చరణ్‌ని అంతా పొగుడుతుంటే చూసి మురిసిపోయిన చిరంజీవి బెంగుళూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన మనసులోని మాటలను బయటపెట్టారు. Also Read: 'చిరంజీవి నువ్వు ఏం సాధించావు అంటే ముందు నా అభిమానులు అని చెబుతాను.కానీ నేను వేరు నా అభిమానులు వేరు కాదు కాబట్టి నువ్వు ఏం సాధించావు అంటే రామ్ చరణ్‌ని సాధించాను అని చెబుతాను'' అని అన్నారు. ఆ టైమ్‌లో ముందు చిరంజీవి ముఖంలో, ఆ‌మాట చెబుతున్నప్పుడు రామ్ చరణ్ ముఖంలో కూడా ఒక రకమయిన భావోద్వేగం కనిపించాయి. ఇద్దరూ కూడా పెల్లుబికి వస్తున్న ఆనందభాష్పాలను కంట్రోల్ చేసుకున్నారు.

‘ఓ.. సైరా’ వీడియో సాంగ్: విజువల్స్ అదిరిపోయాయి

Image
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఆ సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై కత్తి దూయనున్నారు. టాలీవుడ్ రికార్డుల దుమ్ము దులపనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘సైరా’ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. తాజాగా విడుదలైన ‘సైరా’ టైటిల్ సాంగ్ వీడియో ఆ అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఆ వీడియో సాంగ్‌లో విజువల్స్ అద్భుతం అనిపిస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ‘బాహుబలి’ తరవాత మరో ఆణిముత్యంగా ‘సైరా’ నిలిచిపోతుంది అనిపిస్తుంది. తెలుగు గడ్డపై మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు, రేనాటి సూరీడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథను ‘సైరా నరసింహారెడ్డి’గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించారు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవికిషన్ కీలకపాత్రల్లో నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం సమకూర్చారు. ఇటీవల ఈ సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడ

గోపీచంద్ ‘చాణక్య’: ఫస్టాఫ్ సరదాగా.. సెకండాఫ్ యాక్షన్

Image
గోపీచంద్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `చాణక్య`. బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ కీల‌క పాత్రలో న‌టించారు. తిరు ద‌ర్శక‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామబ్రహ్మం సుంక‌ర నిర్మాత‌గా ఈ సినిమా రూపొందుతోంది. అక్టోబ‌ర్ 5న విడుద‌లవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో ఆదివారం రాత్రి జ‌రిగింది. ఈ కార్యక్రమంలో హీరో , డైరెక్టర్ తిరు, అనిల్ సుంకర, రామజోగయ్య శాస్త్రి, రాజేష్ ఖట్టర్, ఎం.వి.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. ‘‘నా నుంచి ప్రేక్షకులు ఎలాంటి అంశాలను కోరుకుంటారో అవ‌న్నీ ఈ సినిమాలో ఉన్నాయి. మంచి ఫైట్స్‌, డైలాగ్స్ ఉన్నాయి. డైరెక్టర్ తిరు ఓ హీరోను ఎలా చూపించాలో అలా చూపించారు. అబ్బూరి ర‌వి చాలా మంచి డైలాగ్స్ రాశారు. పాట‌లకు కూడా మంచి స్పంద‌న వ‌స్తుంది. విశాల్ చంద్రశేఖ‌ర్‌, శ్రీచ‌ర‌ణ్ పాకాల అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. అనిల్ సుంక‌ర‌ గారికి సినిమాలంటే ఎంతో ఇష్టం. అలాంటి వ్యక్తితో క‌లిసి ప‌నిచేయ‌డాన్ని ఆశ్వాదించాను. మీ అందరి ప్రేమతో అక్టోబర్ 5న మళ్లీ నేనేంటో నిరూపించుకుంటాను’’ అని అన్నారు. డైరెక్టర్

రొమాంటిక్ ఫస్ట్ లుక్: హాట్ కాదు...అరాచకం అంతే

Image
ఒకప్పుడు బాలీవుడ్‌కి మాత్రమే పరిమితమయిన హాట్ సీన్స్, బోల్డ్ సీన్స్, లిప్ లాక్స్ ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా కామన్ అయిపోయాయి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే అవి లేకుండా సినిమా తియ్యడానికి కూడా ఎవరూ ఇష్టపడట్లేదు. పెద్ద హీరో అయినా, యంగ్ హీరో అయినా కూడా సినిమాకి మైలేజ్ పెంచే ఆ సీన్స్ మాత్రం కామన్ కంటెంట్. పెద్ద సినిమాలో అయినా కూడా లిప్ లాక్స్ లేకపోతే ట్రెండ్‌కి దూరంగా ఉన్నారు అనేస్తున్నారు అని ఆ తరహా సీన్ ఒకటయినా ఉండేలా చూసుకుంటున్నారు. Also Read: బోల్డ్ సీన్స్‌ని తెరకెక్కించడంలో పూరి మార్క్ వేరు. ఎలాంటి హీరోకి అయినా తన సినిమాలో మేకోవర్‌తో ఒక కొత్త లుక్‌తో పాటు కొత్త ఇమేజ్ కూడా ఇచ్చే పూరి హీరోయిన్స్‌కి అయితే తన సినిమాతో ఏకంగా లైఫ్ ఇచ్చేస్తాడు. ఇలియానా నుండి ఇప్పుడు నభా నటేష్ వరకు అనేకమంది హీరోయిన్స్ పూరి ప్రోడక్ట్స్. ఆయన కళ్ళలో పడి మెప్పించగలిగితే ఆమె హాట్ ఎస్సెట్స్ ఏంటి అనేది తన సినిమాల్లో వెండితెరపై ఆరబోసి మరీ ప్రూవ్ చేస్తాడు. ఇప్పుడు పూరి స్కూల్ నుండి వస్తున్న రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ దశ కూడా ఈ ఒక్క సినిమాతో మారిపోతుంది అనిపిస్తుంది రొమాంటిక్ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే. ఎక్స్పోజిం

మంచు విష్ణు హాలీవుడ్ మూవీలో బాలీవుడ్ హీరో

Image
మంచు విష్ణు హీరోగా ఓ హాలీవుడ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ డైరెక్టర్ జెఫెరీ చిన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని చిత్ర యూనిట్ సంప్రదించింది. కథ విన్న సునీల్ శెట్టి వెంటనే ఓకే చెప్పేశారు. కథ ఆయనకు బాగా నచ్చిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సునీల్ శెట్టి అతి త్వరలో షూటింగ్‌లో పాల్గొననున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. తెలుగు, ఇంగ్లీష్ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విష్ణు సరసన కాజల్ అగర్వాల్, రుహానీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, గత కొంతకాలంగా మంచు విష్ణు బాగా వెనకబడిపోయారు. గడిచిన ఐదేళ్లుగా విష్ణుకు వరుసగా ప్లాపులే వచ్చాయి. ఈ ఏడాది ‘ఓటర్’ సినిమాతో వచ్చినా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. తానే నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి, కచ్చితంగా ఈ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఈ సినిమా గురించి పెద్దగా ప్రచారం ఏమీ లేదు. చూద

పూరి హీరోయిన్ పిచ్చ హాట్.. కుర్రాళ్లకు పండగే!

Image
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోయిన్లు చాలా హాట్‌గా ఉంటారు. ఆయన గత చిత్రాలు చూస్తే ఈ విషయం ఎవ్వరికైనా అర్థమవుతుంది. తెలుగు కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టే అమ్మాయిల్ని వెతికిపట్టుకొని వాళ్లను హీరోయిన్లుగా పరిచయం చేయడంలో పూరి దిట్ట. రక్షిత, అయేషా టకియా, హన్సిక, నేహా శర్మ, దిశా పటాని ఇలా చాలా మంది హాట్ హీరోయిన్లను తెలుగు ప్రేక్షకులకు ఆయన పరిచయం చేశారు. ఇప్పుడు మరో హాట్ బ్యూటీని పరిచయం చేయబోతున్నారు. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కుతోన్న రెండో చిత్రం ‘రొమాంటిక్’. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలను పూరి జగన్నాథ్ అందిస్తున్నారు. అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఇదే తొలి చిత్రం. అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ‘రొమాంటిక్’ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రేపు ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా ద్వారా ఢిల్లీకి చెందిన మోడల్ కేతికా శర్మను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. కేతిక

పవన్ కళ్యాణ్‌కి అమితాబ్ ప్రశంసలు..ఒక సెటైర్ కూడా

Image
ప్రమోషన్స్ కోసం చాలా టైమ్ కేటాయించారు. అలాగే చరణ్ కూడా దగ్గరుండి మరీ ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే పాన్ ఇండియా సినిమాలకు హార్ట్ లాంటిది బాలీవుడ్ మార్కెట్. కనీసం అక్కడివాళ్లను మెప్పించగలిగినా కూడా సినిమా సేఫ్ అయిపోతుంది. అంత స్టామినా ఉన్న మార్కెట్ అది. అందుకే అక్కడ అమితాబ్‌తో కలిసి ఒక ఇంటర్వ్యూ‌లో పాల్గొన్నారు చిరు. అయితే ఆ ఇంటర్వ్యూ అంతా కూడా ఎదో రొటీన్‌గా కాకుండా చాలా సరదాగా సాగింది. చిరు చాలా ఫార్మల్‌గా మాట్లాడుతున్నా కూడా అమితాబ్ మాత్రం తన స్పాంటేనిటీతో, తన మార్క్ చమక్కులతో నవ్వించారు. Also Read: అయితే ఆ ఇంటర్వ్యూ‌లో సైరా అనేది చిరంజీవి సినిమా మాత్రమే కాదు ఆ సినిమాలో మొత్తం చిరంజీవి కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పుకొచ్చారు బిగ్ బి. 'చిరంజీవి తనయుడు చరణ్, అలాగే కూతురు సుస్మిత కూడా సినిమాకోసం పనిచేసారు. ఆమె టాలెంట్ చూసి ఆమెకి కాంప్లిమెంట్స్ ఇచ్చాను' అని చెప్పారు. ఆ సందర్భంలో చిరంజీవి సైరా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 'ఈ సినిమాకోసం నా తమ్ముడు పవన్ కళ్యాణ్ వాయిస్ ఇచ్చాడు... సినిమా స్టార్టింగ్‌లో ఎండింగ్‌లో కూడా వాయిస్ వస్తుంది,

పాలిటిక్స్ వద్దు అని చెప్పా, చిరంజీవి వినలేదు.. నవ్వుతూనే చురకలేసిన అమితాబ్

Image
అమితాబ్ బచ్చన్, చిరంజీవి.. వీరిద్దరూ మెగాస్టార్లే. హిందీలో దిగ్గజ నటుడు అమితాబ్ అయితే.. తెలుగులో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండ్ చిరంజీవి. అయితే, ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆత్మీయ అనుబంధం ఉంది. ఈ బంధంతోనే చిరంజీవికి అమితాబ్ బచ్చన్ ఎన్నో సలహాలు ఇచ్చారట. కానీ, వాటిలో చిరంజీవి ఒక్కటి కూడా పాటించలేదట. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా చెప్పారు. చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా అక్టోబర్ 2న విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. దీంతో అన్ని భాషల్లో భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా తాజాగా చిరంజీవి, అమితాబ్‌లను హిందీలో ఈ సినిమాను విడుదలచేస్తోన్న ఫర్హాన్ అక్తర్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఈ స్టార్లు ఇద్దరూ పలు విషయాలను పంచుకున్నారు. Also Read: ఈ సందర్భంగా చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘మేమిద్దరం ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం. నేను ఈయనికి సలహాలు ఇస్తూనే ఉంటాను.. కానీ, ఎప్పుడూ వాటిని పాటించలేదు. నేను పాలిటిక్స

‘రొమాంటిక్’ ప్రీ లుక్: పూరి భుజాలపై పోరి!

Image
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘మెహబూబా’ సినిమా ద్వారా తన కుమారుడు ఆకాశ్ పూరిని సోలో హీరోగా పరిచయం చేశారు. ఈ సినిమాకు పూరి జగన్నాథే దర్శకుడు, నిర్మాత. ఛార్మి సహనిర్మాతగా పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమాకు పూరి మంచి హైప్ క్రియేట్ చేసినా అంచనాలను అందుకోవడంతో ఘోరంగా విఫలమైంది. దీంతో, తన సినీ వారసుడిగా ఆకాశ్‌ను నిలబెట్టే సినిమా ఇవ్వాలని మరో చిత్రాన్ని పూరి నిర్మిస్తున్నారు. ఆకాశ్ పూరి హీరోగా నటిస్తోన్న రెండో చిత్రం ‘రొమాంటిక్’. కేతిక శర్మ హీరోయిన్. అనిల్ పాదురి దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ సోమవారం ఉదయం 11 గంటలకు విడుదలకానుంది. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా, ‘రొమాంటిక్’ ప్రీ లుక్‌ను విడుదల చేశారు. ఈ ప్రీ లుక్ పోస్టర్‌లో ఆకాశ్ పూరి భుజాలపై ఢిల్లీ పోరి కేతిక శర్మ దర్జాగా కూర్చుంది. ఆకాశ్ ఆమెను మోసుకుంటూ బీచ్‌లో హాయిగా నడుస్తున్నాడు. ‘‘లవ్ బర్డ్స్.. బీచ్‌లో వ

సాఫ్ట్‌వేర్ సుధీర్ : మొత్తం కామెడీనే

Image
ఢీ షో లో అస్తమాను హీరో అంటూ ఒక మేనరిజం పెట్టుకుని అందరిని అలరించిన, అలరిస్తున్న సుధీర్ ఇప్పుడు హీరోగా మారాడు. అక్కడ సుధీర్ హీరో అవుతా అనగానే సెటైర్స్ పడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం నిజంగానే హీరో అయిపోయాడు. అతను నటించిన సినిమా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. ఎక్స్ట్రా జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్‌గా నవ్విస్తున్న అతను ఇప్పుడు ''‌గా మారాడు. ఆ‌ టీజర్‌లో ముందు ఎదో యాక్షన్ హీరోలా రెండు మూడు బిల్డప్ షాట్స్ ఇచ్చిన సుధీర్ ఆ తరువాత మాత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ చెయ్యడానికి ప్రయత్నించాడు.అతని ఒరిజినల్ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో కూడా బాగా పండినట్టు అనిపిస్తుంది. అలాగే డైలాగ్స్ చెప్పటప్పుడు ఈజ్ కూడా బావుంది. Also Read: చాలామంది బుల్లితెర నటులు కూడా హీరోలుగా వచ్చినా కూడా క్లిక్ కాలేదు. కానీ సుధీర్ మాత్రం వాళ్ళకి భిన్నంగా వెళుతున్నట్టు కనిపిస్తున్నాడు. పేరుకి ఒక పేరడీ సినిమా టైటిల్‌లా ఉన్నా కూడా ఈ సినిమాలో ఎదో చెప్పుకోదగ్గ మ్యాటర్ కూడా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో షియాజీ షిండే, నాజర్, ఇంద్రజ, పోసాని కృష్ణమురళి లాంటి చాలామంది స్టార్ కాస్ట్ ఉన్నారు. అయితే మరొక విశేషం ఏంటంటే ప్రజాగాయకుడిగ

స్నేహారెడ్డి బర్త్‌డే.. భార్యకు బన్నీ స్వీట్ విషెస్

Image
టాలీవుడ్‌లోని క్యూటెస్ట్ కపుల్ జాబితాలో ముందు వరుసలో ఉన్న జంట , స్నేహారెడ్డి. ప్రేమించి.. పెద్దలను ఒప్పించి.. పెళ్లిచేసుకున్న వీరు అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. బన్నీ సినిమాలతో బిజీబిజీగా గడుపుతుంటే.. స్నేహ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. అయితే, ఆదివారం స్నేహారెడ్డి తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు బన్నీ స్వీటెస్ట్ విషెస్ చెప్పారు. చాలా సింపుల్‌గా.. ‘‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’’ అని ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తన భార్యను హత్తుకుని తీసుకున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. కాగా, అల్లు అర్జున్-స్నేహారెడ్డిల వివాహ బంధానికి ఎనిమిదేళ్లు. మార్చి 6న వీరిద్దరూ తమ ఎనిమిదో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. 2011 మార్చి 6న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో బన్నీ, స్నేహల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వారి ప్రేమకు ప్రతిరూపంగా 2014 ఏప్రిల్ 4న అయాన్ జన్మించాడు. 2016లో కూతురు అర్హ జన్మించింది. Also Read: ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ ప్రస్తుతం ‘అల... వైకుంఠపురములో...’ అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్

Ala..Vaikunthapurramloo :అల్లు అర్జున్ రేంజ్ ఇది.. దూసుకుపోతున్న రేస్ గుర్రం

Image
అల్లు అర్జున్ మెగా హీరో గా ఎంట్రీ ఇచ్చి తన స్కిల్‌తో టాప్ హీరోగా ఎదిగాడు. అయితే బన్నీకి గత కొంతకాలంగా అన్ని విషయాల్లో నెగెటివిటీ ఎదురవుతుంది. సరైనోడు సినిమా హిట్ అయినా కూడా పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. DJ టైమ్‌లో మీడియా మీద ఎదురుదాడి చేస్తే అప్పుడొక రభస జరిగింది. అన్నీ క్లియర్ అయిపోయాయి అనుకుని భారీ బడ్జెట్‌తో నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా సినిమా చేస్తే అది కెరీర్‌లోనే వరస్ట్ డిజాస్టర్ అయ్యింది. ఇక రీసెంట్‌గా సైరా ఫంక్షన్‌కి రాలేదు అని ఏకేస్తున్నారు. ఇన్ని చిరాకుల్లో కూడా బన్నీకి మంచి బూస్టింగ్ ఇచ్చింది సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్. Also Read: త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తన మూడో సినిమా 'అల...వైకుంఠపురములో'లో నటిస్తున్నాడు బన్నీ. ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అయితే ఏ సినిమాకి అయినా కూడా సినిమా రిలీజ్‌కి ముందు మంచి ఇంప్రెషన్ కలిగించేది ఆ సినిమా ఆడియో. పైగా అక్కడినుండే సినిమా పై ఎక్స్పెక్టేషన్స్ కూడా మొదలవుతాయి. స్టార్ హీరోల సినిమాల విషయంలో కీలకమయిన ఓపెనింగ్స్ తీసురావడంలో కూడా ఆడియో కీలకపాత్ర వహిస్తుంది. అలాంటి కీలకమయిన ఆడియో విషయంలో మాత్రం అల...వై

పవన్ కళ్యాణ్ 'సైరా' కథ ఇమ్మన్నాడు..రామ్ చరణ్‌కి కూడా నో చెప్పాం

Image
సైరా...ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో డిస్కషన్ పాయింట్‌గా మారిన సినిమా. ఆ సినిమా రూపుదిద్దుకోవడానికి రెండున్నరేళ్లు పట్టినా కూడా ఆ కథ పుట్టి మాత్రం పదేళ్లు దాటింది. ఇదే విషయాన్ని స్వయంగా తెలియజేసారు పరుచూరి గోపాలకృష్ణ. '2006లో చిరంజీవి గారికి ఈ సినిమా కథ చెప్పాం. ఆ కథ విని అదిరిపోయింది అని దాన్ని డెవలప్ చెయ్యడం కోసం మా అన్నయ్యని దుబాయ్ తీసుకెళ్లారు, బ్యాంకాక్ తీసుకెళ్లారు, ఈ కథ పై కూర్చుంటూనే ఉన్నారు. 2008 వరకు ఈ సినిమా కథపై ఉన్నారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అప్పుడు చాలా బాధవేసింది' అని సైరా కథ గురించి అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. Also Read: 'చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయాక చాలామంది సైరా కథ ఇవ్వమని అడిగారు కానీ మేము మాత్రం ఈ కథ చిరంజీవి గారికి మాట ఇచ్చాం, ఎప్పటికయినా ఆయనే చెయ్యాలి అని చెప్పాం. ఒక‌సారి కూడా సైరా కథ ఒక్కసారి చెప్పండి, అన్నయ్య ఆ కథని ఎందుకు అంత ప్రేమిస్తున్నాడు అని అడిగారు. మధ్యలో చిరంజీవి గారు కూడా ఒక వేళ ఈ కథ నేను చెయ్యలేకపోతే రామ్ చరణ్‌కి సూట్ అవుతుందా ఒక్కసారి ఆలోచించండి అన్నారు. కానీ మేము మాత్రం ఈ కథ చేస్తే మీరే చెయ్యాలి అని

Sye Raa Review: ‘సైరా’ ఫస్ట్ రివ్యూ: ఇతని రేటింగ్‌ని నమ్మలేం

Image
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే హైప్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందులోనూ ఆయన ఎన్నాళ్ల నుండో చేయాలనుకుంటున్న పాత్రను సొంత నిర్మాణంలో చేస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్రను చిరంజీవి పోషిస్తూ.. ‘సైరా’గా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బాహుబలి, సాహో చిత్రాల తరువాత టాలీవుడ్ నుండి రాబోతున్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్‌లతో ఈ అంచనాలు రెట్టింపుకావడంతో ఈ సినిమా రిజల్ట్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంలో సినిమాకి ఉన్న హైప్‌ని క్యాష్ చేసుకుంటూ విడుదలకు ముందే రివ్యూలు ఇచ్చే దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడుగా చెప్పుకునే మూవీ మార్కెట్ పీఆర్ ఎక్స్ పర్ట్ ఉమైర్ సంధు ‘సైరా’ చిత్రానికి ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. ‘సైరా చిత్రం ఎమోషనల్ రైడ్‌తో అద్భుతంగా ఉంది. రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలతో సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ పొందుతారు. బాహుబలి చిత్రం కల్పన కాని.. ఇది వాస్తవ కథ ఆధారంగా రూపొందించబడింది. ఏపీ అన్ని రికార్డ్‌లను సైరా స్మాష్ చేస్తుంది. మెగాస్టార్ అభిమానులకు ఈ చి

సినీ రచయిత కోన వెంకట్‌పై చీటింగ్ కేసు

Image
సి నీ రచయిత, నిర్మాత, దర్శకుడు కోన వెంకట్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. ఆయనపై జెమినీ ఎఫ్‌ఎక్స్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌.. జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కథ ఇస్తానని చెప్పి 2017లో రూ.18.50 లక్షలు తీసుకున్నారని.. కథ ఇవ్వకపోగా, డబ్బులు అడిగితే బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రసాద్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కోన వెంకట్‌పై 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పీవీ ఎక్స్‌ప్రెస్ వేకు సంబంధించిన ఓ ట్వీట్‌తో కోన వెంకట్ ఇటీవల వార్తల్లో ప్రముఖంగా నిలిచిన సంగతి తెలిసిందే. మెహిదీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌కు వెళ్లేందుకు, సిటీ నుంచి ఇన్నర్ రింగ్‌ రోడ్డు, ఔటర్ రింగ్‌ రోడ్డు వైపు వెళ్లేందుకు ప్రయాణికులు ఉపయోగించే పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే డ్యామేజ్ అయ్యింది. పిల్లర్ నంబర్ 20 వద్ద పీవీ పెచ్చులూడి, పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. కోన వెంకట్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా.. జీహెచ్ఎంసీ, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. Must Read: అమీర్‌పేట్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర పెచ్చులూడిపడి మహిళ మృతి చెందిన భాగ్యనగరంలో కలకలం రేపిన సంగతి తెలిసింద

పూరీ బర్త్ డే వేడుకలో చార్మి భావోద్వేగం.. ఇస్మార్ట్‌కి ముందు రూ. 50 వేలు కూడా లేవు

Image
నేడు (సెప్టెంబర్ 28) డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ బర్త్ డే సందర్భంగా ఆయన పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు హీరోయిన్ . ఈ సందర్భంగా.. ఇండస్ట్రీలో సినిమాలు లేక ఖాళీగా ఉన్న 20 మంది డైరెక్టర్లు, కో డైరెక్టర్లు ఒక్కొక్కరికి 50 వేల చొప్పున ఆర్ధికసాయం అందించారు చార్మి. ఈ పుట్టిన రోజు వేడుకలో ఎమోషనల్ స్పీచ్‌తో ఆకట్టుకున్నారు చార్మి. ఆమె మాట్లాడుతూ.. ‘నేను కెమెరా ముందు నటించడానికి, స్టేజ్‌ మీద మాట్లాడటానికి పెద్దగా భయపడను. కాని ఈరోజు ఎందుకో ఏం మాట్లాడాలి? దేనిపై మాట్లాడాలని టెన్షన్‌గా ఉంది. అప్పట్లో దాసరి గారు చెప్పారు.. పూరీ జగన్నాథ్ నా వారసుడు అని. ఆ మాట విన్న పూరీ గారు నా దగ్గర చాలా ఎమోషన్ అయ్యారు. ఆరోజు నా మనసులో అనిపించింది.. దాసరిగారు అంత పెద్ద మాట పూరీ గురించి అన్నప్పుడు దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ముందుకు వెళ్లాలని. Read Also: పూరీ ప్రొడక్షన్‌లో పనిచేస్తున్న నేను.. ఆయనకు ఏం కావాలో అది ఇవ్వడమేనా? సినిమాలు తీయడమేనా? హిట్లు కొట్టడమేనా? అనే ఆలోచన వచ్చినప్పుడు అయితే మా దగ్గర డబ్బులు లేవు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి పూరీ నేను ఫైనాన్సియల్‌గా ఇబ్బ

Puri Birthday: నచ్చిన పనికోసం చచ్చిపోండి: పూరీ బర్త్ డే మెసేజ్

Image
ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు.. పోతుంటారు.. కాని పూరీ లాంటి దర్శకులు అప్పుడప్పుడూ మాత్రమే పుడుతుంటారు. గొప్ప సినిమాలు తీశారని కాదు.. గొప్ప మనసు ఉంది కాబట్టే ఆయన గ్రేట్ డైరెక్టర్ అయ్యారు. స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్‌ హిట్లు ఇచ్చిన ఆయన ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకున్న డైరెక్టర్. అయితే కాలం కలిసి రాకపోవడంతో స్టార్ హీరోలు మెల్లగా సైడ్ అయ్యారు. చేతిలో కనీసం రూ. 50 వేలు లేని స్థితికి వచ్చేసినా.. పూరీ.. ఎవరి ముందూ చేయి చాచలేదు. తాను నమ్ముకున్న మెగా ఫోన్‌కి పదును పెట్టారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తిరిగి హిట్ కొట్టి తానేంటో నిరూపించుకున్నారు. నేడు బర్త్ డే సందర్భంగా.. అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు హీరోయిన్ చార్మి. ఈ సందర్భంగా సినిమాలు లేక ఖాళీగా ఉన్న ఓ 20 మంది డైరెక్టర్లు, కో డైరెక్టర్లు ఒక్కొక్కరికి 50 వేల చొప్పున సాయం చేయచేశారు. కష్టం విలువ తెలిసిన పూరీ మరోసారి ది గ్రేట్ డైరెక్టర్ అనిపించుకుని ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. గోవాలో విజయ్ దేవకొండ సినిమా స్క్రిప్ట్ పనిలో ఉండగా.. తన బర్త్ డే మెసేజ్‌ను చార్మి ద్వారా షేర్ చేశారు. ఇందులో

Venu Madhav: ఆ రాత్రి.. వేణు మాధవ్ నేను ఒకే బెడ్‌పై పడుకున్నాం.. అతను ఇలా చేశాడు: షకీలా

Image
‘రాత్రి పూట, లైట్స్ అన్నీ బంద్‌లో ఉన్నాయి. వేణు నా బెడ్‌పై పడుకుని నిన్ను ఒకటి అడుగుతూ కాదనకూడదు.. అని హస్కీ వాయిస్‌తో అడుగుతుంటుంటే.. ఏంట్రా నీ ప్రాబ్లమ్ అని గట్టిగా అడిగా. ఆ టైంలో వేణు ఏం చేస్తున్నాడంటే’.. అంటూ చిలిపి చేష్టలను తలుచుకుంటూ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు శృంగార తార . వేణు మాధవ్ అకాల మరణంతో ఇండస్ట్రీ మొత్తం ఆయనతో ఉన్న తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఇటీవల ‘కొబ్బరి మట్ట’ చిత్రంలో నటించిన షకీలా.. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. వేణు మాధవ్ స్నేహానికి ఎంత విలువనిస్తాడో ఒక సంఘటన ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ‘వేణు నేను ఓ సినిమా షూటింగ్‌కి వెళ్లాం.. అక్కడ బ్రహ్మానందం, రఘుబాబు ఇలా చాలామంది ఉన్నారు. బయట నుండి చాలా మంది ఆడియన్స్ మమ్మల్ని చూడటానికి హోటల్‌కి వచ్చేవారు. ఆ టైంలో వేణు నా గదిలోనే ఉన్నాడు. అప్పుడు ఒకడొచ్చి బెడ్ మీద పడి వేణుతో మాట్లాడుతున్నాడు. వాళ్లు రూంలు వాళ్లు క్లీన్‌గా ఉంచుకునేవాళ్లు. నా రూమ్‌‌ మాత్రం దరిద్ర్యం చేసేవాళ్లు. అందుకే నా రూమ్ నీట్‌గా లేకపోవడంతో వేణు.. నీ రూంకి వస్తా పడుకుంటా అని అడిగా. సరే రా అన్నాడు. ఇద్దరం

‘Ram Charan.. లవ్యూ రా లవ్యూ రా..’

Image
‘ఈ అడవి నాదే వేటా నాదే’ అంటూ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు మెగాస్టార్ చిరంజవి తనయుడు రామ్ చరణ్. ఆయన నటించిన తొలి చిత్రం ‘చిరుత’. తొలి సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో చేశారు. సినిమా వంద రోజుల పాటు ఆడి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో నేహా శర్మ కథానాయికగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. సినిమా విడుదలైన నేటికి 12 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సినిమాలోని ‘లవ్యూ రా లవ్యూ రా నా మనసంతా నువ్వేరా’ అనే పాట గుర్తుందా. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. చరణ్ కోసం ఆయన రాసిన మొదటి పాట ఇదేనని ట్విటర్ వేదికగా వెల్లడించారు. అంతేకాదు సినిమా షూటింగ్‌ను కూడా పాటతోనే మొదలుపెట్టినట్లు తెలిపారు. చిరంజీవి కొడుకు కావడంతో సినిమా ఓ రేంజ్‌లో దూసుకెళ్లింది. రామ్ చరణ్ కెరీర్‌ విజయవంతంగా సాగేలా చేసింది. చిరు ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఇండస్ట్రీలోకి వచ్చారంటే వారిపై ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చిరు కుమారుడే ఎంట్రీ ఇస్తున్నాడంటే హైప్ ఎంతుంటుందో ఆలోచించండి. అం

‘అల.. వైకుంఠపురములో..’ తొలి మెలొడీ వచ్చేసింది సిద్ శ్రీరామ్ మళ్లీ చించేశాడు

Image
స్టైలిష్ స్టార్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మరో చిత్రం ‘అల..వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని తొలి మెలొడీ పాట అయిన ‘సామజవరగమన’ వీడియో సాంగ్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఎస్.ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ‘ఉండిపోరాదే’ పాటతో ఫేమస్ అయిపోయిన సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. వీడియోలో తమన్ పియానో వాయిస్తుండగా శ్రీరామ్ పాట ఆలపిస్తూ కనిపించారు. ‘నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.. నీ కళ్లకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు..నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు’ అంటూ సాగుతున్న ఈ పాట వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది. తమన్ ఎప్పుడూ తన మ్యూజిక్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తారు. ఇక సిద్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పాట కాబట్టి మంచి క్రేజ్ ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఇక అల్లు అర్జున్, పూజా హెగ్డే కెమిస్ట్రీ ఈ పాటకు కలిస్తే ఆ కిక్కే వేరు. వీడియో మధ్యలో సినిమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే, రాహుల్ రామకృష్

సూర్య ‘బంగారు’ మనసు.. చిత్రబృందానికి అదిరిపోయే సర్‌ప్రైజ్

Image
ప్రముఖ తమిళ నటుడు సూర్యది నిజంగానే బంగారంలాంటి మనసు. సినిమాలకు సంతకం చేశామా వచ్చామా షూటింగ్‌లో పాల్గొని వెళ్లిపోయామా అన్నట్లు కాకుండా సెట్స్‌లోని అందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. వారి కష్టసుఖాలను పంచుకుంటారు. అంతేకాదు తాను చేసే సినిమా తన మనసుకు దగ్గరైందనిపిస్తే చిత్రబృందానికి కానుకలు ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తుంటారు. ప్రస్తుతం ‘సూరారి పొట్రు’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా.. ఈ సినిమా చిత్రబృందానికి సూర్య అదిరిపోయే కానుక ఇచ్చారు. దాదాపు 150 మందికి 8 గ్రాములు ఉన్న బంగారు కాయిన్స్ ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నారు. తాను నిర్మిస్తున్న సినిమా కావడంతో యూనిట్ సభ్యులు మరింత ఆసక్తిగా సినిమా కోసం పనిచేయాలని ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారన్నమాట. అంతేకాదు అభిమానులకు ఏదన్నా ఆపద వస్తే వెంటనే సాయం చేయడానికి ముందుకొస్తారు సూర్య. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పా

ఆవిరి టీజర్: ఈ ఇంట్లో ఆత్మ ఉందట.. మీకు కనిపించిందా?

Image
వెన్నులో వణుకు పుట్టించే దెయ్యం సినిమాలను తీయడంలో దర్శకుడు రవిబాబుది అందెవేసిన చెయ్యి. దెయ్యం సినిమాలనే కాదు క్రైమ్ థ్రిల్లర్‌లకు కూడా చాలా రసవత్తరంగా తెరకెక్కించే సామర్థ్యం ఉన్న దర్శకుడు. తాజాగా ఆయన తెరకెక్కించిన మరో ఆసక్తికరమైన చిత్రం ‘ఆవిరి’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. ‘ఈ ఇంట్లో రాజ్‌కుమార్ రావు, అతని కుటుంబం నివసిస్తోంది. వారితో పాటు ఓ ఆత్మ కూడా ఉంది. దానిని మీరు కనిపెట్టగలరా?’ అన్న సబ్‌ టైటిల్స్‌తో టీజర్ మొదలైంది. ఓ డైనింగ్ టేబుల్‌ను తదేకంగా చూపిస్తూ ఒక్కసారిగా ఆ ఆత్మ కుర్చీ పక్కకు లాక్కుని జ్యూస్ గ్లాస్‌లో పోసుకుంటున్న సన్నివేశం దడ పుట్టించేలా ఉంది. మనిషి కనిపించకుండా అతని బూట్లు మాత్రమే నడుస్తుండడం, ఓ బాత్‌టబ్‌ నుంచి పొగలు వస్తుండడం, అందులోని ఓ చెయ్యి బయటికి రావడం చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, రవిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కుక్కర్‌లో ఉడుకుతున్న మనిషి తలను ఫస్ట్‌లుక్‌లో చూపించినప్పుడే సినిమాలో ఏదో భయపెట్టే కంటెంట్ ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు రవి బాబు. ఇప్పుడు టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఈ సినిమ

ఒకే ఫ్రేమ్‌లో చిరు, అమితాబ్.. బాలీవుడ్ సైతం ఫిదా

Image
ఈ ఏడాది టాలీవుడ్ నుండి రాబోతున్న మరొక భారీ బడ్జెట్ మూవీ సైరాకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. 270 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. అయితే ఆ సినిమా స్పాన్‌కి తగ్గ ప్రచారం ఇంతవరకు జరగలేదు. అయితే ఇన్ని రోజులు చేసిన ప్రచారం వేరు. ఇప్పుడు సినిమా రిలీజ్‌కి ముందు చేసే ప్రచారం వేరు. అందుకే 64 సంవత్సరాల వయసులోనూ అలుపెరగకుండా, వెనకడుగు వెయ్యకుండా ఈ సినిమా కోసం కష్టపడిన ఇప్పుడు ప్రమోషన్స్‌లో కూడా అంతే ఉత్సాహంగా పాల్గొంటున్నారు. Also Read: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాని హిందీలో ఫరాన్ అఖ్తర్ రిలీజ్ చేస్తున్నాడు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అయితే భారీ ఓపెనింగ్స్ రావాలంటే ఈ హైప్ సరిపోదు. అందుకే ఇప్పుడు ఆ సినిమాలో చిరంజీవి గురువు గోసాయి వెంకన్న పాత్రలో నటించిన అమితాబ్ కూడా రంగంలోకి దిగారు. అమితాబ్ వల్లే ఈ సినిమాకి అక్కడ అంత భారీ రిలీజ్ ప్లాన్ చేసారు. కానీ ఇప్పటివరకు బిగ్ బి ఈ సినిమాకి సంబంధించి ఏ ఈవెంట్‌లో కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం సైరా కోసం రంగంలో

‘గద్దలకొండ గణేష్’ ఫస్ట్ వీక్ కలెక్షన్.. డిస్ట్రిబ్యూటర్లు సేఫ్

Image
మెగా ప్రిన్స్ , డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ ‘గద్దలకొండ గణేష్’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజే ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. కొంత మంది సినిమా సూపరంటే.. మరికొందరు పెద్దగా ఏమీలేదు అని పెదవి విరిచారు. మొత్తం మీద మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో ‘గద్దలకొండ గణేష్’ బాక్సాఫీసు వద్ద బాగానే వసూళ్లు రాబడుతున్నాడు. గురువారం ముగిసేసరికి అంటే తొలి వారం ముగిసేనాటికి ‘గద్దలకొండ గణేష్’ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.19.70 కోట్ల షేర్‌ను రాబట్టింది. కొన్ని ఏరియాల్లో ఇప్పటికే అసలు మొత్తాన్ని ఈ సినిమా వసూలు చేసింది. కొన్ని ప్రాంతాల్లో దగ్గరలో ఉంది. మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లను సేఫ్ జోన్‌లో వేసింది. మరి ఏ మేరకు లాభాలు రాబడుతుందో చూడాలి. వాస్తవానికి గడిచిన శని, ఆదివారాల్లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. కానీ, సోమవారం నుంచి వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం 35 శాతం వసూళ్లు పడిపోయాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం మరో 30 శాతం కలెక్షన్ డ్రాప్ అయ్యింది. గురువారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. కాబట్టి, సినిమా లాభాల బాట పట్టాలంటే రెం

ఎన్టీఆర్ 18 ఏళ్ల జ్ఞాపకం.. అన్నీ మారాయి, ఆ ఒక్కటి తప్ప!

Image
దేశం గర్వించదగిన దర్శకుడిగా ఎదిగిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన ప్రయాణాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మొదలుపెట్టారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఎస్.ఎస్.రాజమౌళిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ‘స్టూడెంట్ నెం.1’. ఎన్టీఆర్‌కు నటుడిగా గుర్తింపు తెచ్చింది కూడా ఈ సినిమానే. ఆ తరవాత రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ‘సింహాద్రి’, ‘యమదొంగ’ వచ్చాయి. ఈ సినిమాలు ఎలాంటి విజయాలను అందుకున్నాయో తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘RRR’ చిత్రంలో ఎన్టీఆర్ ఒక హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ మరో హీరో. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు ఆర్ఎఫ్‌సీలో ఒక ప్రాంతం తన ‘స్టూడెంట్ నెం.1’ జ్ఞాపకాన్ని గుర్తుకు తెచ్చింది. వెంటనే ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. Also Read: ‘‘స్టూడెంట్ నెం.1 సినిమాకు 18 ఏళ్లు. అనుకోకుండా ఆర్ఎఫ్‌సీలో 18 ఏళ్ల కిత్రం ఎక్కడైతే షూట్ చేశామో అక్కడే ఈరోజు మేం షూటింగ్ చేస్తున్నాం. చాలా మారిప

'సైరా' రిలీజ్‌కి లైన్ క్లియర్.. వాళ్ళకు సినిమా చూపించక్కర్లేదు

Image
సినిమా అఫీషియల్‌గా సెన్సార్ కార్యక్రమాలు కూడా జరుపుకుని రిలీజ్‌కి రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా కథపై ఉయ్యాలవాడ వంశస్థులు కేస్ వెయ్యడంతో ఏం జరుగుతుందో అన్న సందిగ్దత కొనసాగింది.కానీ ఫైనల్‌గా సైరా సినిమా రిలీజ్‌పై స్టే ఇవ్వడం కుదరదు అని తేల్చిచెప్పేసింది హై కోర్ట్. ఆ సినిమా కథకి ఉపయోగపడే విషయాలు చెప్పినందుకు వాళ్లకు డబ్బులు ఇస్తాం అని లీగల్‌గా అగ్రిమెంట్ కూడా చేసి ఇప్పడు మాట మారుస్తున్నారు అని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసుల తరపున దొరవారి దస్తగిరి రెడ్డి హై కోర్ట్‌లో పిటిషన్ వేసాడు. అయితే ఆ కేస్‌పై వాదనలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అయితే సైరా సినిమా రిలీజ్ ఆపాలని వేసిన పిటిషన్‌కి మాత్రం వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. Also Read: డబ్బులు ఇస్తాం అని చేసుకున్న అగ్రిమెంట్ సివిల్ కోర్ట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడ తేల్చుకోవాలని, దానివల్ల సినిమా ఆపడం కుదరదు అని తేల్చి చెప్పడంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులకు షాక్ తగిలినట్టయింది. అలాగే అది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయో పిక్ కాబట్టి అది ముందు వాళ్లకు చూపించాలి అని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ ఆ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాత్రం అ

చిరు ప్రమోషన్స్ షురూ.. అమితాబ్‌తో ఛాయ్, చిట్ చాట్

Image
‘సైరా’ సినిమా ప్రమోషన్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారన్నది వాస్తవం. సినిమా విడుదలకు ఐదు రోజుల మాత్రమే ఉండగా ఇప్పటికీ ఇంకా సరైన ప్రచార కార్యక్రమాలను చేపట్టడంలేదని కొంత మంది మెగా అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అందుకేనేమో, తన అభిమానులను నిరాశపరచకుండా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. ‘సైరా’ ప్రమోషన్స్‌ను షురూ చేసేందుకు టైమ్ సెట్ చేశారు. ‘సైరా’ హిందీ ప్రమోషన్స్ కోసం చిరంజీవి, రామ్ చరణ్ శుక్రవారం ముంబై బయలుదేరి వెళ్లారు. ఇండస్ట్రీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అమితాబ్ బచ్చన్‌తో చిరంజీవి చిట్ చాట్‌లో పాల్గొంటారట. ‘ఛాయ్ సెషన్ విత్ అమితాబ్’ పేరుతో ఈ ముఖాముఖి రేపు అన్ని హిందీ ఎంటర్‌టైన్మెంట్ ఛానెళ్లలో ప్రసారం అవుతుందని అంటున్నారు. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్ర పోషించిన విషయం తెలిసిందే. హిందీ ట్రైలర్‌లో అమితాబ్ వాయిస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందుకే ప్రమోషన్స్ కూడా ఆయనతో మొదలుపెడుతున్నారు. Also Read: ఇక, తెలుగులుతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ‘సైరా’ ప్రమోషన్స్‌కు నిర్మాత రామ్ చరణ్ గట్టి ప్రణాళికే రచించారని అంటున్నారు

ఇటలీని హీట్ ఎక్కిస్తున్న' కియరా'.. పీక్స్ అనిపిస్తున్న పిక్స్

Image
కియరా అద్వాని...భరత్ అనే నేను సినిమాలో పద్ధతిగా వసుమతిగా కనిపిస్తేనే కుర్రాళ్లు అంతా ఆమెని ఇష్టపడ్డారు. అలాంటిది వినయ విధేయ రామ సినిమాలో మాత్రం ఒక రేంజ్‌లో రెచ్చిపోయి తన అందాల ప్రదర్శనతో హీట్ ఎక్కించింది. దాంతో ఆమెకి ఇక్కడ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. కానీ వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్ అవ్వడం వల్ల ఇక్కడ ఛాన్సులు రాలేదు. అయితే అదే టైమ్ లో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌లో సూపర్ ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమాలో అస్సలు మొహమాటపడకుండా ముద్దులు పెడుతూ, బోల్డ్ సీన్స్‌తో మత్తెక్కించింది. ఆ సినిమాని చాలా మంది తెలుగు ప్రేక్షకులు కేవలం కియరా కోసమే చూసారు అంటే అతిశయోక్తి కాదు. Also Read : ప్రస్తుతం ఆమె తన హాలిడేని ఎంజాయ్ చేస్తుంది. హాలిడే అంటే సింపుల్‌గా ఇండియాలో కాదు. ఇటలీలో అన్నమాట. అక్కడ బీచ్ పక్కన ఉన్న ఒక లక్సరియస్ రిసార్ట్‌లో దిగిన కియరా అక్కడినుండి తన ఫోటోలను అప్ లోడ్ చేస్తుంది. టు పీస్ బికిని వేసుకుని సన్‌కిస్ అంటూ ఆమె ఇన్స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోకి 1 మిలియన్‌కి పైగా లైక్స్ వచ్చాయి. ఆమె ఫోటో పోస్ట్ చెయ్యడమే లేట్ అన్నట్టు లైక్స్ వర్షం కురిపిస్తున్నారు ఆమె ఫాలోవర్స్. ఆమె కూడా

‘సైరా’లో పరుష పదాలు.. మ్యూట్‌తో మెగా అభిమానులకు నిరాశే!

Image
మెగాస్టార్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ సెన్సార్ పూర్తయ్యింది. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. వాస్తవానికి ఈ విషయాన్ని మూడు రోజుల క్రితమే చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ప్రకటించింది. కానీ, సెన్సార్ సర్టిఫికెట్ మాత్రం గురువారం వరకు నిర్మాత రామ్ చరణ్‌కు అందలేదు. దీనికి కారణం, సెన్సార్ సభ్యులు కొన్ని కరెక్షన్స్ చెప్పడమే. ప్రస్తుతం సినీ వర్గాల ద్వారా తెలుస్తోన్న సమాచారం ప్రకారం.. ‘సైరా’ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు మొత్తం ఏడు మార్పులు చేయాలని సూచించారు. ఈ ఏడు మార్పుల్లో ‘తొలి యుద్ధం’ అనే పదం కూడా ఉందట. అలాగే, కొన్ని బూతు పదాలను వినిపించకుండా (మ్యూట్) చేయాలని సూచించినట్లు తెలిసింది. ‘ల*జల’, ‘ఫ* ఆఫ్’, ‘ఫ*’, ‘బా*ర్డ్’ వంటి పరుష పదాలను మ్యూట్ చేశారని విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ‘సైరా’లో ఇలాంటి పరుషమైన పదాలు చాలానే ఉన్నాయట. అయినప్పటికీ సెన్సార్ బోర్డు వాటిని తొలగించాలని సూచించలేదు కానీ కొన్నిటిని మ్యూట్ చేయాలని చెప్పిందని తెలిసింది. హీరో మంచి ఎమోషన్‌తో డైలాగ్ చెప్పేటప్పుడు అందులో కొన్ని పదాలు మ్యూట్ అయితే చాలా చికాకుగా అనిపిస్

Pawan Kalyan: ఆ..అ..ఆరేళ్ళక్రితం అత్తారింటికి దారేది ?

Image
పవన్ కళ్యాణ్ అనే పదానికి తెలుగులో మామూలు క్రేజ్ లేదు. అందుకే కనీసం కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉన్నా కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అనేస్తారు. అయితే ఖుషి తరువాత మళ్ళీ హిట్ కొట్టడానికి పదేళ్లకు పైగానే టైమ్ పట్టింది పవన్ కళ్యాణ్‌కి. కానీ గబ్బర్ సింగ్‌తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పవన్ మళ్ళీ మరుసటి సంవత్సరంలోనే దాన్ని మరొక సినిమాతో బ్రేక్ చేసాడు. గబ్బర్ సింగ్ రికార్డ్స్‌ని తిరరాసిన ఆ సినిమానే అత్తారింటికి దారేది. మాటలమాంత్రికుడు ఒక పక్క పవన్ ఇమేజ్‌ని పడిపోకుండా మైంటైన్ చేస్తూనే మరోపక్క అదిరిపోయే ఎమోషన్స్‌ని మిక్స్ చేసి అత్తారింటికి దారేది అనే సినిమాని తీర్చిదిద్దాడు. Also Read: అయితే ఆ సినిమా నిర్మాణం పూర్తయింది. కానీ అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న కొన్ని వివాదాల కారణంగా ఆ సినిమా విడుదల కూడా నిరవధికంగా వాయిదా పడింది. ఒక పక్క ఆ సినిమాకి మంచి బజ్ ఉంది. సరిగ్గా అలాంటి టైమ్ ఆ సినిమా పైరసీ బైటకి వచ్చింది. 55 కోట్ల ఖర్చుతో నిర్మించిన భారీ సినిమా థియేటర్‌లో ఒక్క షో కూడా పడకుండా ముందే సి.డి ల్లో బయటకి వస్తే ఆ సినిమాని తీసిన నిర్మాత పరిస్థితి ఏంటి?. అందుకే ఏదైతే అది అయ్యింది అని ధైర్యంగా సినిమాని రిలీజ

పూరి పెద్ద మనసు.. ఖాళీగా ఉన్న డైరెక్టర్లు, కో-డైరెక్టర్లకు సాయం

Image
సినిమాలపై మక్కువ, సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలనే పిచ్చితో చాలా మంది హైదరాబాద్‌కు వస్తుంటారు. కృష్ణానగర్‌లో ఉంటూ అవకాశాల కోసం తిరుగుతుంటూరు. కానీ, సినిమా ఇండస్ట్రీలో పని దొరకాలంటే టాలెంట్‌తో పాటు లక్ కూడా కలిసిరావాలి. అదృష్టవశాత్తు అవకాశం వచ్చినా దాన్ని నిలబెట్టుకునే శక్తి ఉండాలి. అవకాశం వచ్చినా అందరూ సక్సెస్ కాలేరు. ఒకటి రెండు సినిమాల్లో చేసిన తరవాత అవకాశాల్లేక రోడ్లెక్కిన వాళ్లు ఎంతో మంది మన ఇండస్ట్రీలో ఉన్నారు. ఇలాంటి వాళ్లలో నటీనటులు, దర్శకులు, కథకులు అందరూ ఉంటారు. అయితే, ప్రస్తుతం అవకాశాలు లేక, ఇబ్బందుల్లో ఉన్న ఓ 20 మంది డైరెక్టర్లు, కో-డైరెక్టర్లకు ఆర్థిక సాయం అందించేందకు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, ఒకప్పటి నటి, ప్రస్తుతం నిర్మాత అయిన ఛార్మి ముందుకొచ్చారు. ఈ మేరకు తమ నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ ఎల్ఎల్‌పి పేరిట మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. రేపు (సెప్టెంబర్ 28న) పుట్టినరోజును పురష్కరించుకుని వారందరికీ సాయం అందించనున్నట్టు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. Also Read: ‘‘సినిమాతో మమేకమైవుండే ప్రతి ఒక్కరిపైన మాకు అపారమైన గౌరవం వుంది. సినిమా అన్నది వ్యాపారమే అయినా, డబ్బులు పెట్టే నిర

కిర్రాక్ లుక్‌లో విజయ్ దేవరకొండ.. వైరల్

Image
సెన్సేషన్ స్టార్ పేరు చెప్పగానే మనకు ముందుగా ‘అర్జున్ రెడ్డి’లోని గుబురు గెడ్డం లుక్ గుర్తుకు వస్తుంది. నిజానికి ఆ లుక్ విజయ్‌కి ట్రేడ్ మార్క్ అయిపోయింది. ఆ తరవాత ‘గీతగోవిందం’లో విజయ్ క్లీన్ షేవ్ లుక్‌లో కనిపించారు. కానీ, ఈ మధ్య వచ్చిన ‘డియర్ కామ్రేడ్’లో మరోసారి గుబురు గెడ్డంలో దర్శనమిచ్చారు. ఈ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనూ విజయ్ గెడ్డంతోనే కనిపించారు. దీంతో ప్రేక్షకులు కాస్త బోర్ ఫీలయ్యారు. ఎప్పుడూ ఇదే లుక్కా అని పెదవి విరిచారు. అయితే, తన అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ అదిరిపోయే క్లీన్ షేవ్ లుక్‌లో తాజాగా విజయ్ కనిపించారు. గతంలో విజయ్ క్లీన్ షేవ్‌లో కనిపించిన లుక్‌కి.. ఈ కొత్తలుక్‌కి తేడా ఉంది. ఈ కొత్త లుక్‌లో విజయ్ హెయిర్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంది. అంతేకాదు, ట్రిమ్ చేసిన గెడ్డం కూడా కొత్తగా ఉంది. దీంతో ఈ లుక్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ కేఎల్ఎం షాపింగ్ మాల్‌కు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీ హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌లో కొత్త షోరూంను ఏర్పాటుచేసింది

మెగాస్టార్ అంటే పిచ్చి.. అందుకే లేడీ ‘గ్యాంగ్ లీడర్’ అయ్యింది!

Image
చిరంజీవి సూపర్ హిట్ సినిమా ‘అభిలాష’ ఆ అమ్మాయి పేరు. మరో సూపర్ హిట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’ ఆమె క్యారక్టర్. ఇక మెగాస్టార్ చిరంజీవి అంటే అభిలాషకు ఎంత పిచ్చి అంటే.. ‘జై చిరంజీవా’ అంటూ చేతికి పచ్చ బొట్టు పొడిపించుకునేంత. ఇంతకీ ఈ అభిలాష కథేంటి? చిరంజీవి కోసం చచ్చిపోయేంతగా పెంచుకున్న మెగాభిమానం ఆమెకు చేసిన మేలేంటి? ‘గ్యాంగ్ లీడర్’గా ఆమె ఎందుకు మారాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ‘సురభి 70ఎం.ఎం’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాత వై.గంగాధర్. మెగా ఫ్యాన్‌గా అందాల భామ అక్షత శ్రీనివాస్ నటిస్తున్న ‘సురభి 70ఎం.ఎం’ చిత్రాన్ని శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి పిక్చర్స్, అద్వైత పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వై.గంగాధర్ సొంత నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్నారు. ‘సురభి 70ఎం.ఎం’ అనే ధియేటర్‌ను కబ్జా చేసేందుకు ప్రయత్నించే ఓ రౌడీని మెగా ఫ్యాన్ అయిన అక్షత శ్రీనివాస్ తన గ్యాంగ్‌తో ఎలా ప్రతిఘటించింది? ఆ క్రమంలో ఆమె ‘గ్యాంగ్ లీడర్’ ఎలా అయ్యింది? వంటి ఆసక్తికర విషయాలు వెండి తెరపై చూడాల్సిందే అంటున్నారు దర్సక నిర్మాత వై.గంగాధర్. మెగా ఫ్యాన్ అభిలాషగా నటిస్తున్న యువ కథానా

నేను, నా తమ్ముడు అందుకే ఓడాం.. రాజకీయాల్లోకి వద్దు: రజినీ, కమల్‌కు చిరు సూచన

Image
సున్నితమైన మనస్తత్వం కలిగినవారికి రాజకీయాలు సరిపడవని సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌ను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి అన్నారు. వీళ్లిద్దరూ రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సలహా ఇచ్చారు. తనను, తన తమ్ముడిని చూసైనా వారు రాజకీయాల్లోకి రావొద్దని సలహా ఇచ్చారు. ఈ మేరకు ప్రముఖ తమిళ మ్యాగజైన్ ‘ఆనంద వికటన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి వెల్లడించారు. రాజకీయాల గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘‘సినిమా కెరీర్‌లో నేను నంబర్ వన్‌గా ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. కానీ, ప్రస్తుతం రాజకీయాలు డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. నా ప్రత్యర్థులు కోట్ల రూపాయలు కుమ్మరించి నా సొంత నియోజకవర్గంలోనే నన్ను ఓడించారు. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఇదే జరిగింది. డబ్బు, కులం చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి’’ అని చిరంజీవి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వచ్చిన తరవాత ఓటమి, నిరుత్సాహం, అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చిరంజీవి అన్నారు. రజినీకాంత్, కమల్ హాసన్ కచ్చితంగా రాజకీయాల్లో ఉండాలని, ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకుంటే గనుకు ఎన్నో సవాళ్లను, నిరాశ నిస్ప

ALAVAIKUNTAPURAMULO: అల..వైకుంఠపురములో..అదిరే మెలోడీ

Image
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఏర్పడింది బన్నీకి. 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' ఫెయిల్యూర్‌తో పాటు ఆ సినిమా అనంతరం కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు బన్నీ. దాంతో మిగతా హీరోలతో పోలిస్తే మార్కెట్ పరంగా, హిట్స్ పరంగా కూడా బాగా వెనుకబడ్డాడు. దీంతో ఇప్పుడు అల..వైకుంఠపురములో సినిమాతో ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాల్సిన పరిస్థితి క్రియేట్ అయ్యింది. అందుకే అక్కడ ఉన్నది మాటల మాంత్రికుడు అయినా కూడా బౌండెడ్ స్క్రిప్ట్ పూర్తయ్యేవరకు సెట్స్‌కి వెళ్ళలేదు. Also Read: అల..వైకుంఠపురములో సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అందుకే ఇప్పటినుండి ఆ సినిమాకి ఫుల్‌గా బజ్ పెంచే పనిలో బిజీ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక ఫస్ట్ లుక్ అండ్ చిన్న టీజర్ రాగా ఇప్పుడు మాత్రం ఫుల్ ప్లెడ్జెడ్‌గా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఆ సినిమాకోసం థమన్ కంపోజ్ చేసిన ఒక అద్భుతమైన మెలోడీలోని ఒక రెండు లైన్స్‌ని శాంపిల్‌గా వదిలారు. సీతారామశాస్త్రి రాసిన ఈ పాటలోని మీనింగ్ ఫుల్ లిరిక్స్‌కి సిద్ శ్రీరామ్ వాయిస్‌లోని మ్యాజిక్ కూడా కలగలిసి అద్భుతహా అనిపించింది. కేవలం శాంపిల్ ఈ రకంగా ఉం

RIP Venu Madhav: వేణు మాధవ్‌ని 2 వేలు అప్పు అడిగా.. కాని: కోట శ్రీనివాస్ భావోద్వేగం

Image
కమెడియన్ బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ కొనియాడారు విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. వేణు మాధవ్ మరణం తనను కలచివేసిందంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు కోటా. వేణు మాధవ్‌లో ఐదారు కళలు ఉన్నాయి. తెలుగు సినిమా 75 సంవత్సరాల వేడుక జరిగినప్పుడు వేణు మాధవ్.. రామలింగయ్య గారి ముత్యాలు వస్తారా పాటకు నటించారు. స్వయంగా రామలింగయ్యగారే వచ్చినట్టు అనిపించింది. అంతగొప్పగా ఎమిటేట్ చేసేవారు. Read Also: వేణు మాధవ్‌ని 2 వేలు అడిగా.. ఒకసారి ఎయిర్ పోర్ట్‌లో ఏదో కొనుక్కోవల్సి వచ్చింది నాకు. రూ. 2 వేలు తక్కువ వచ్చాయి. వేణు మాధవ్‌ని ఓ రెండు వేలు కావాలి అని అడిగా. వెంటనే ఆయన తీసుకో బాబాయ్ అని ఇచ్చాడు. తరువాత అవి తిరిగి ఇవ్వడానికి చాలా ట్రై చేశా. కాని అతను నాకు వద్దు అన్నాడు. ఎందుకు అని అడిగితే.. ఓ మహానటుడు నాకు అప్పు ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఉంటాదన్నాడు. ఆ రెండువేలు ఇప్పటి వరకూ తీసుకోలేదు. అంత మంచి మనిషి చిన్న వయసులో చనిపోవడం బాధాకరం. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అన్నారు .

Chanakya: 'చాణక్య' ట్రైలర్: 'రా'ఏజెంట్‌కి బ్యాంక్ ఎంప్లాయ్‌కి ఏంటి సంబంధం?

Image
హీరోగా, హీరోయిన్‌గా తమిళ్ డైరెక్టర్ తిరు డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా . ఈ సినిమా అక్టోబర్ 5కి రిలీజ్ అవుతుండడంతో సినిమా యూనిట్ ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. ఆ‌ట్రైలర్‌ని ముందుగా ఒక చిన్న యాక్షన్ మోడ్‌లో ఓపెన్ చేసారు. కానీ ఆ తరువాత మాత్రం అతన్ని ఒక బ్యాంకు ఎంప్లాయిగా చూపించారు. అక్కడే మెహ్రీన్ క్యారెక్టర్‌ని కూడా తీసుకొచ్చి కాస్త కామెడీగా అలా అలా నడించింది వ్యవహారం. అయితే రా ఆఫీసర్ అర్జున్ శ్రీకర్‌కి, బ్యాంకు ఏజెంట్ రామకృష్ణకి ఉన్న సంబంధం ఏంటి అనేది ట్రైలర్‌లో ఉన్న మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. సినిమాకి కూడా అదే కీలకం కావచ్చు. Also Read: ఇక ఈ సినిమా ఎక్కువభాగం పాకిస్థాన్‌లో జరుగుతున్నట్టు చూపించారు. దానివల్ల అక్కడక్కడా గోపీచంద్ హీరోగా నటించిన సాహసం సినిమా ఛాయలు కనిపించాయి. అయితే ఈ సినిమాలో డైరెక్టర్ గోపీచంద్‌ని స్టైలిష్‌గా చూపించడానికి ట్రై చేసాడు. అలాగే లావిష్ యాక్షన్ ఎంటెర్టైనెర్ ఈ సినిమాని తెరకెక్కించడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ విషయం ఈ ట్రైలర్‌లో స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఒక పక్క పాక్‌లో ఆపరేషన్ కోసం వెళ్లిన మన రా ఏజెంట్‌‌ని మనవాళ్ళే కనిపిస్తే కాల్చెయ్యమని ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారు

Comedian Venu Madhav: వేణు మాధవ్ చివరి కోరిక తీర్చిన హైపర్ ఆది

Image
నవ్వుల ‘వేణు’వు అంత్యక్రియలకు ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చింది. 23 ఏళ్లుగా ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉన్న ఇండస్ట్రీ ప్రముఖులు, తోటి నటులు వేణు మాధవ్‌కి కన్నీటి వీడ్కోలు పలికారు. నవ్వుతూ నవ్విస్తూ ఉండే వేణుని తలచుకుని ఇండస్ట్రీకి చెందిన హాస్య నటులు కన్నీరుమున్నీరయ్యారు. బజర్దస్త్ కమెడియన్ వేణు మాధవ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ‘వేణు మాధవ్ అన్న మాకు ఎప్పటి నుండో పరిచయం. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే కమెడియన్స్‌కి ఆయనే ఇన్స్‌పిరేషన్. జబర్దస్త్‌ స్కిట్‌లను చూసి ఫోన్ చేసి మరీ మమ్మల్ని ప్రోత్సహించేవారు. ఆయన చనిపోవడానికి నాలుగురోజుల ముందు నాకు ఫోన్ చేసి జబర్దస్త్‌లో వాళ్ల చుట్టాల అబ్బాయికి అవకాశం ఇవ్వమని సాయం కోరారు. నేను ఓ స్కిట్‌లో ఆయన చెప్పిన అబ్బాయిని పెట్టడం జరిగింది. అదే ఆయన నన్ను అడిగిన చివరి కోరిక. ఇండస్ట్రీలో వ్యక్తులకే కాకుండా బయట వ్యక్తులకు కూడా ఆయన ఎంతో సాయం చేశారు. ఆపద వచ్చిందంటే ముందుకు వచ్చి సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి మనమధ్య లేకపోవడం చాలా బాధాకరం అన్నారు హైపర్ ఆది. జబర్దస్త్ కమెడియన్ దొరబాబు మాట్లాడుతూ.. ‘నేను కమెడియన్‌ కావడానికి ప్రేరణ

రెడ్ డ్రెస్సులో రెచ్చిపోతున్న 'రకుల్'.. నెటిజెన్స్ ఫిదా

Image
చాలా తక్కువకాలంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కానీ అక్కడ ఎక్కువరోజులు నిలవలేకపోయింది. ఒక పక్క ఫ్లాపులు పలకరించడం మరొకపక్క నిలకడలేకుండా బాలీవుడ్, కోలీవుడ్ అని తిరగడంతో తెలుగులో చాలామంది కొత్త హీరోయిన్స్ వచ్చి ఆ ప్లేస్‌ని భర్తీ చేసారు. దాంతో ఇప్పుడు కేవలం సీనియర్ హీరోల సరసన మాత్రమే ఆఫర్స్ దక్కుతున్నాయి. అయినా కూడా అలుపెరగకుండా ఒక హిట్ అయినా పలకరించకపోతుందా అనే ఆశతో వచ్చిన సినిమాలు చేసుకుంటూ పోతుంది. ప్రస్తుతం హిందీలో మార్జావాలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే తమిళ్‌లో శివ కార్తికేయన్ సినిమా, భారతీయుడులో కూడా సెకండ్ హీరోయిన్‌గా చేస్తుంది. Also Read: అయితే సినిమాల పరంగా బిజీగానే ఉన్నా కూడా మధ్య మధ్యలో మాత్రం సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తూ వాళ్లకు కనువిందు చెయ్యడానికి మొహమాటపడదు. అవసరమయితే దానికి ప్రత్యేకంగా టైమ్ కూడా కేటాయిస్తుంది. రీసెంట్‌గా జరిగిన కోసం ఒక రెడ్ కలర్ గౌన్‌తో రెడీ అయ్యింది రకుల్. ఆ ఈవెంట్‌లో ఒక పక్క ధగ ధగమనే రెడ్ డ్రెస్సు అందాలు, మళ్ళీ మధ్యలో తొంగి చూస్తునట్టు ఆకర్షించే ఎద అందాలతో ఆ ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రకుల్ ప్రీత్. ఉండడానికి ఆ గౌన్ ప

Jabardasth ట్విస్ట్: ‘రోజాకి జగన్ వార్నింగ్’.. పులిహోర బాగా కలిపారే

Image
చిక్కుల్లో ఎమ్మెల్యే .. స్వీట్ వార్నింగ్.. ఎటూ తేల్చుకోలేక డైలామాలో ఉన్న రోజా.. ఇవీ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. ఇంతకీ రోజాపై జగన్ సీరియస్ కావడానికి కారణం ఏంటంటే.. ఆమె కామెడీ షోకి జడ్జ్‌గా వ్యవహరించమే అనేది ఆ వార్తల్లోని సారాంశం. ఇంతకీ నిజంగానే జగన్ రోజాపై సీరియస్ అయ్యారా? జబర్దస్త్ కామెడీ షోనా.. లేక ఎమ్మెల్యేగా ఫుల్ టైం పనిచేయడమో తేల్చుకోవాలని హుకుం జారీచేశారా అంటే.. ఇవన్నీ వట్టి పుకార్లే అంటూ కొట్టిపారేస్తున్నారు రోజా. అసలు తమ మధ్య జబర్దస్త్, ఇతర అంశాల ప్రస్తావనే రాలేదంటూ క్లారిటీ ఇచ్చారు రోజా. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే నగరి ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీచైర్ పర్సన్‌గా విధులు నిర్వహిస్తున్న రోజా.. బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు కూడా. అయితే అటు జబర్దస్త్ షో, ఇటు ఏపీఐఐసీ చైర్మన్‌గా రెండు బండ్ల మీద ప్రయాణం ఇక సాగదని ఇందులో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలని జగన్.. రోజాను హెచ్చరించినట్టు

వేణుమాధవ్‌కు చిరంజీవి సహా ప్రముఖుల కన్నీటి నివాళి

Image
హాస్యనటుడు వేణుమాధవ్ పార్థివదేహానికి సినీ ప్రముఖులు నివాళులర్పించారు. వేణుమాధవ్ పార్థివదేహాన్ని గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకొచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో టెంట్‌లు ఏర్పాటుచేసి వేణుమాధవ్ పార్థివదేహాన్ని ఉంచారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు వేణుమాధవ్‌కు నివాళులర్పించారు. నాగబాబు, రాజశేఖర్, జీవిత, మురళీ మోహన్, రాజీవ్ కనకాల, రఘుబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, దర్శకుడు కరుణాకరన్, ఉదయభాను తదితర సినీ ప్రముఖులు వేణుమాధవ్ పార్థివదేహం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. అయితే, వేణుమాధవ్ మృతదేహాన్ని చూసి ఉదయభాను తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఉదయభానుతో కలిసి వేణుమాధవ్ ‘వన్స్ మోర్ ప్లీజ్’ కామెడీ షో చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. Also Read: కాగా, సినీ ప్రముఖుల నివాళులర్పించిన అనంతరం వేణుమాధవ్ పార్థివదేహాన్ని మౌలాలిలోని లక్ష్మీనగర్ శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ ఈ సాయంత్రం వేణుమాధవ్‌కు అంత్యక

బెల్లంకొండ కాంపౌండ్ నుండి మరొక హీరో..మళ్ళీ అదే ఖర్చు?

Image
బెల్లంకొండ సాయి శ్రీనివాస్..వస్తూ వస్తూనే అల్లుడు శీను అనే భారీబడ్జెట్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో సమంత నటించడానికి ఏకంగా రెండున్నర కోట్లు ఇచ్చారు అని టాక్. అలాగే వినాయక్ ఆ సినిమా చెయ్యడానికి పది కోట్లు పుచుకున్నాడు అని కూడా గుసగుసలాడారు. అంతేకాదు ఆ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒక సాంగ్‌లో ఆడిపాడడానికి కూడా బాగానే తీసుకుంది. అలా అతని మొదటి సినిమా చాలా విషయాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా హిట్ అనిపించుకున్నా కూడా కాస్ట్ ఫెయిల్యూర్‌గా మిగిలింది. అయినా కూడా బెల్లంకొండ సురేష్ మాత్రం తన కొడుకుని ప్రోమోట్ చేసుకునే విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. Also Read: వరుసగా బయటి ప్రొడ్యూసర్స్ కూడా బెల్లంకొండ శ్రీనివాస్‌తో భారీ బడ్జెట్ సినిమాలే చేసారు. అయితే బ్యాక్ డోర్‌లో సురేష్ డబ్బు సర్దుబాటు చేసేవాళ్ళు అనే టాక్ ఉండేది. అయినా కూడా సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. అనుకోకుండా తమిళ్‌లో హిట్ అయిన రాచ్చసన్ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యాలి అనుకుంటే బెల్లంకొండ హీరో ఒప్పుకున్నాడు. కానీ ఆ సినిమాపై ముందు ఎవ్వరికి పెద్ద అంచనాలు లేవు, హీరోకి కూడా.

RIP Venu Madhav: వేణు మాధవ్ పార్థీవదేహం వద్ద విలపించిన ఉదయభాను

Image
నవ్వుల వేణువు మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది టాలీవుడ్. సుమారు 23 ఏళ్లు పాటు ఇండస్ట్రీతో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకున్న కమెడియన్ వేణు మాధవ్ మరణం ఇండస్ట్రీ వర్గాలను కలచివేసింది. బుధవారం నాడు వేణు మాధవ్ ఆకస్మిక మరణించడంతో నేడు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం అభిమానులు.. సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్‌లో ఉంచారు. నిన్నమొన్నటి వరకూ అందర్నీ నవ్విస్తూ.. నవ్వుతూ ఉంటే వేణు మాధవ్‌.. భౌతికకాయాన్ని చూసి కన్నీరు మున్నీరౌతున్నారు తోటి ఆర్టిస్టులు. ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పించడానికి వచ్చిన ప్రముఖ యాంకర్, నటి కన్నీరు మున్నీరైంది. ‘నా అన్నయ్య వేణు మాధవ్‌ను ఇలా చూస్తానని ఊహించలేదు. నా కెరియర్ స్టార్టింగ్‌లో నన్ను సొంత చెల్లిలిగా చూసుకున్నాడు. ఇద్దరం కలిసి ‘వన్స్ మోర్ ప్లీజ్’ ప్రోగ్రామ్ చేసేవాళ్లం. చాలా అల్లరి చేసేవాళ్లం. అందరితో చాలా డిఫరెంట్‌గా ఉండే వారు కాని.. నన్ను సొంత చెల్లిని అన్న ఎలా ప్రొటక్ట్ చేస్తాడో నన్ను అలా చూసుకునేవాడు. తను తినడానికి తెచ్చుకున్నది నాకు పెట్టేవాడు. ఆయన ఎక్కడ ఉన్నా చాలా అల్లరిగా సరదాగా ఉండేవారు. చుట్టుపక్కల వాతావ

త్రివిక్రమ్‌ను థ్రిల్ చేసిన ‘రాగల 24 గంటల్లో’ టీజర్

Image
టాలెండెట్ యాక్టర్ సత్యదేవ్, తెలుగమ్మాయి ఇషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ‘రాగల 24 గంటల్లో’. ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘యమగోల - మళ్లీ మొదలైంది’, ‘బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్’, ‘ఢమరుకం’ సినిమాల దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సమర్పణలో శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ కానూరు నిర్మిస్తు్న్నారు. శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, కృష్ణభగవాన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు చిత్ర ప్రచారంలో భాగంగా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సినిమా టైటిల్‌ బావుంది. టీజర్‌ చూశాను. నిజంగా చాలా థ్రిల్‌ ఫీలయ్యాను. రఘు కుంచె మ్యూజిక్, కెమెరామేన్‌ అంజి వర్క్‌ బావుంది. దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డికి, నిర్మాత శ్రీనివాస్‌ కానూరుకు ఆల్‌ ది బెస్ట్‌’’ అని అన్నారు. త్రివిక్రమ్ చెప్పినట్టు టీజర్ నిజంగానే థ్రిల్లింగ్‌గా ఉంది. టీజర్ చూస్తుంటే ఈ

Sudigali Sudheer: రేణు దేశాయ్ సాక్షిగా.. రష్మికోసం సుధీర్ ఐదేళ్లు కాదు, ఐదొందల ఏళ్లైనా ఆగుతాడట!

Image
బుల్లితెరపై , కెమిస్ట్రీ గురించి చెప్పాలంటే అదో పెద్ద ‘అంతరంగాలు’ సీరియల్ అవుతుంది. జబర్దస్త్ కామెడీ షో అయినా, ఢీ అయినా వేరే ఇతర స్పెషల్ కార్యక్రమాలేవైనా.. ఈ ఇద్దరూ కలిశారంటే పంచ్‌లు పేలిపోవాల్సిందే. ఇక ఈ ఇద్దరి మధ్య తెరవెనుక ఏం కథ నడుస్తోందో తెలియదు కాని.. ఆన్ స్క్రీన్‌పై మాత్రం ప్రేమ పావరాలు మాదిరే జీవిస్తారు. లవ్, రొమాన్స్ విషయాల్లో వీళ్ల పెర్ఫామెన్స్ పీక్స్‌లో ఉంటుంది. రష్మికి పులిహోర కలిపే పనిలో సుధీర్ ఎప్పుడూ బిజీగా ఉంటే.. అతన్ని ఆటపట్టిస్తూ ఇష్టం ఉండీ లేనట్టుగా రష్మి పోజుకొడుతూ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తుంటుంది. ఇక ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీని బేస్ చేసుకునే స్కిట్‌లు ఉంటాయి. వీటిలో చాలావరకూ.. రష్మికి సుధీర్ ప్రపోజ్ చేయడం.. ఆమెతో రొమాన్స్ చేయడం.. ఓ బ్యూటిఫుల్ మెలోడీ లవ్ సాంగ్‌కి స్టెప్పులు వేయడం.. ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ ప్రేమ మైకంలో తేలిపోవడం.. పెళ్లి పీటలు కూడా ఎక్కేయడం లాంటివి చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ ఇద్దరూ టీం లీడర్స్‌గా చేస్తున్న ‘ఢీ’ సీజన్ 12కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో కూడా రష్మి, సుధీర్ లవ్ ట్రాక్‌ని హైలైట్ చేశారు. ఇందులో పవన్ మాజీ భార్య, హీరోయిన్