Posts

Showing posts from July, 2021

రజనీకాంత్ సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్.. వచ్చే నెలలో పూర్తి.. ఆ టైమ్‌కి రిలీజ్ పక్కా..

Image
దక్షిణాది ఇండస్ట్రీల్లోనే కాదు.. ఆయన సినిమా విడుదల అవుతుందంటే.. యావత్ భారతదేశ సినీ ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటారు. ఆయన సినిమా రిలీజ్ అంటే చాలు కొన్ని కార్యాలయాలు సెలవులు కూడా ప్రకటిస్తాయి. ఆయన క్రేజ్ దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిపోయింది. ఆయన సూపర్‌స్టార్ రజనీకాంత్. స్టైల్‌కి, హీరోయిజంకి కేరాఫ్ అడ్రస్ ఏదైనా ఉంది అంటే అది అనే ఆయన అభిమానులు చెబుతారు. అయితే రజనీ వెండితెరపై కనిపించి చాలాకాలమైంది. చివరిగా ‘దర్బార్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘’. ‘సన్ పిక్చర్స్’ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. విశ్వాసం, వివేకం తదితర సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శివకుమార్ జయకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలమే అయినప్పటికీ.. ఈ మధ్యలో కరోనా రావడం.. ఆ తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల రజనీ షూటింగ్‌లో పాల్గొనలేకపోవడం తదితర అంశాలు సినిమా విడుదలను వాయిదా వేస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు అన్ని సజావుగా జరుగుతుండటంతో.. సినిమా షూటింగ్‌ని శేరవేగంగా జరుపుతోంది చిత్ర యూని

RRR దోస్తీ వచ్చేసింది: కీరవాణి మ్యాజిక్.. రాజమౌళి విజువల్ ట్రీట్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ అలా!

Image
దర్శకధీరుడు స్ట్రాటజీని అర్థం చేసుకోవడం అంత ఈజీ విషయం కాదు. ఆయన ఏది చేసినా కూడా పక్కా ప్రణాళికతో చేస్తుంటారు. జనాల్లోకి ఇట్టే రీచ్ అయ్యే విధంగా అప్‌డేట్స్ ఇస్తుంటారు. తాజాగా అలాంటి స్కెచ్చే వేసి స్నేహితుల దినోత్సవం కానుకగా 'RRR దోస్తీ' సాంగ్ రిలీజ్ చేశారు. నుంచి విడుదలైన ఈ ఫస్ట్ సాంగ్‌ క్షణాల్లో వైరల్ అయింది. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ అత్యంత వేగంగా దూసుకుపోతోంది. అంటూ సాగే ఈ ప్రమోషనల్ సాంగ్ కోసం 5 భాషల నుంచి ఐదుగురు సింగర్లను రంగంలోకి దించారు జక్కన్న. ఆగస్ట్ ఒకటో తారీఖున ఈ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు ముందే ప్రకటించి మెగా, నందమూరి అభిమానుల్లో జోష్ నింపారు. తాజాగా చెప్పిన సమయానికి ఈ సాంగ్ విడుదల చేసి అందరిలో సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టారు. , అనిరుధ్, అమిత్ త్రివేది, విజయ్ జేసుదాస్, యాజిన్ నిజర్ పాడిన ఈ పాటలో కీరవాణి అందించిన బాణీలు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. సాంగ్ చివరలో మెగా స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నడుస్తూ వస్తున్నట్లు కనిపించిన సీన్.. సరికొత్త వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. కీరవాణి భుజంపై చేయి వేసిన ఈ ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా

హోటల్ రూములో నగ్నంగా వీడియోలు! బలవంతంగా యువ నటి చేష్టలు.. ఇండస్ట్రీలో మరో సంచలనం

Image
ఓ వైపు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు సినీ వర్గాల్లో సంచలనంగా మారగా, ఇప్పుడు అనూహ్యంగా మరో యువనటి పోర్న్ రాకెట్ కేసు తెరపైకి రావడంతో అంతా షాకవుతున్నారు. యువ నటి నందితా దత్తాపై ఓ మోడల్ సంచలన ఆరోపణలు చేసింది. తనను బలవంతం చేసి న్యూడ్ వీడియోలు షూట్ చేసిందని చెప్పడంతో పోలీసులు ఈ ఇష్యూపై కఠిన చర్యలు తీసుకున్నారు. నందితా దత్తాతో పాటు ఆమె అసిస్టెంట్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. నందితా దత్తా, ఆమె ఫొటోగ్రాఫర్ మైనిక్ ఘోష్ ఇద్దరూ కలిసి కొంతమంది మోడల్స్‌తో బలవంతంగా ఓ స్టూడియోలో న్యూడ్ వీడియోలు చేసి వాటిని పోర్నోగ్రఫీ వెబ్‌ సైట్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులు అటాక్ చేశారు. న్యూడ్ ఫొటోషూట్ జరిగిన స్టూడియో ఓనర్ బలిగంజ్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని.. న్యూటౌన్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. స్టూడియోలోని కెమెరా, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకొని పలు విషయాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. నందితా దత్తా, తనను బలిగంజ్ స్టూడియోకి తెచ్చి బలి చేసిందని సదరు మోడల్ ఆరోపించింది. తనతో న్యూడ్ వీడియో బలవంతంగా చేయించారని, వద్దని వారిస్తున్నా అస్సలు వినలేదని చెప్పింది. అంతేకాదు తన ఫ్రెండ్స్‌లో ఓ

తిమ్మరుసు కలెక్షన్స్: బాక్సాఫీస్ వద్ద సత్యదేవ్ పర్‌ఫార్‌మెన్స్.. వసూళ్ల పరంగా రిపోర్ట్ చూస్తే!

Image
కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మూతపడ్డ థియేటర్స్ మళ్ళీ తెరుచుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ శుక్రవారం కొత్త సినిమాల హవా కనిపించింది. కరోనా పాండెమిక్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన ఫస్ట్ మూవీగా '' నిలిచింది. ఈ సినిమాకు తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ షో స్లోగానే ఓపెన్ అయినా మౌత్ టాక్ బాగా రావడంతో తర్వాతి షోలు పుంజుకున్నాయి. సినిమాలో నటన, కథపై డైరెక్టర్ గ్రిప్పింగ్ ప్రేక్షకులను ఆకర్షించాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మార్క్ కనిపించిందని అంటున్నారు. ట్రేడ్ వర్గాలు చెబుతున్న లెక్కల ప్రకారం 'తిమ్మరుసు' మూవీ తొలి రోజుకు గాను 47 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 27 లక్షల రూపాయల షేర్ వచ్చిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సత్యదేవ్ లాంటి హీరో సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే సినిమాకు మంచి ఆదరణే లభించిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమా బిజినెస్ లెక్క మొత్తం మీద 2.4 కోట్ల దాకా ఉండటంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 2.5 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ డే కలెక్షన్స్ తర్వాత చూస్తే మరో 2.30 కోట్ల

పవన్, మహేష్, ప్రభాస్ మధ్య వార్.. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమే! ఇవీ లెక్కలు

Image
సినీ ఇండీస్ట్రీలో బిగ్గెస్ట్ సీజన్ అంటే సంక్రాంతి. ప్రతి ఏడాది సంక్రాంతికి ఎన్నో సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. సంక్రాంతికి తమ సినిమా రిలీజ్ చేస్తే భారీ హిట్ ఖాయం అని కొందరు దర్శకనిర్మాతలు సైతం నమ్మకం పెట్టుకుంటారు. చిన్న, పెద్ద హీరోల సినిమాలతో థియేటర్స్ వద్ద సంక్రాంతి శోభ కనిపిస్తుంటుంది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం ఏకంగా ముగ్గురు బడా హీరోలు, అది కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ రంగంలోకి దిగనుండటం జనాల్లో చర్చనీయాంశం అయింది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ ఈ సారి 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపారు డైరెక్టర్ పరశురామ్. జనవరి 13న మూవీ రిలీజ్ ఉంటుందని చెప్పేశారు. మరోవైపు యంగ్ రెబల్ స్టార్ భారీ సినిమా 'రాధే శ్యామ్' కూడా జనవరి 14న రంగంలోకి దిగుతోంది. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు. అయితే వీళ్ళతో పోటీగా కూడా సంక్రాంతి బరిలో నిలవబోతున్నారని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది. మలయాళీ సూప

ఒలింపిక్ రజత పతాక విజేతపై మాధవన్ సంచలన కామెంట్స్.. ఇలా అన్నారేంటీ..

Image
మీరాభాయ్ ఛాను.. ఇప్పుడు ఈ పేరు తెలియని భారతీయులు లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి.. తన స్వశక్తితో వెయిట్‌లిఫ్టర్‌గా ఎదిగింది మీరా. తన అద్భుతమైన ప్రతిభతో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలను సొంతం చేసుకుంది. తాజాగా ఆమె మరో అద్భుతమైన ఘనతను సాధించింది. ప్రస్తుతం జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె భారత్‌కు తొలి పతకాన్ని సాధించింది. 49 కిలోల విభాగంలో ఆమె రజత పతాకం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మీరాభాయ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. అంతేకాదు.. టోక్యో నుంచి దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. అంతేకాక.. మిజోరాం ప్రభుత్వం ఆమెకు స్పోర్ట్స్ కోటాలో అడిషనల్ సూపరంటెండెంట్ అఫ్ పోలీస్‌గా పదవి కూడా ఇచ్చింది. ఇక ఆ తర్వాత మిజోరాంలోని తన స్వగృహానికి చెందిన ఆమె ముందు నుంచి ఎలా ఉందో అలాగే జీవనం ప్రారంభించింది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచాను అనే గర్వం ఏ మాత్రం లేకుండా సాధారణంగా ఉంటుంది. తాజాగా ఆమె నేలపై కూర్చొని భోజనం చేస్తున్న ఫోటో కూడా ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచాను అనే

నేను బతికే ఉన్నా.. చనిపోలేదు: షకీలా వీడియో సందేశం

Image
శృంగార తార చనిపోయిందంటూ వస్తున్న పుకార్లపై స్పందించారామె. తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని.. తాను చనిపోయానని వస్తున్న వార్తల్ని ఖండిస్తూ వీడియో విడుదల చేసింది షకీలా. ‘నేను చనిపోయానని వార్తలు వస్తున్నాయి.. అలాంటిది ఏమీ లేదు.. నేను బాగానే ఉన్నాను. పూర్తి ఆరోగ్యంతో హ్యాపీగా ఉన్నాను. తన మొహంంలో చిరునవ్వు చూడండి.. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు ఏమైపోయిందో అని చాలామంది ఆందోళన చెందారు.. చాలామంది ఫోన్లు చేస్తున్నారు.. మెసేజ్‌లు పెడుతున్నారు. నాపై ప్రేమ చూపించిన వారందరికీ చాలా పెద్ద థాంక్స్. అలాగే నాపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తికి థాంక్స్.. తనని గుర్తు చేసుకునేలా చేశారు’ అంటూ వీడియో విడుదల చేసింది షకీలా. ఇదిలా ఉంటే ఒకప్పుడు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుని కోట్లు సంపాదించిన షకీలా.. ఇప్పుడు కనీసం బ్యాంక్ బ్యాలెన్స్ లేని దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. అయినవాళ్లతో పాటు ప్రేమించి వాళ్లు ఆమెను అన్ని విధాలా మోసం చేయడంతో ప్రస్తుతం ఒంటరిగానే జీవితాన్ని సాగిస్తున్నారు. ఆ మధ్య కొబ్బరి మట్ట చిత్రంలో కత్తి మహేష్‌కి వైఫ్‌గా నటించింది షకీలా. ఇక ‘లేడీస్ న

టుడే ఇన్‌స్టా హిట్స్: రుహాని గ్లామర్ హీట్.. రష్మి స్టైలింగ్ ట్రీట్.. వర్రీ కావొద్దంటున్న లావణ్య

Image
వేడెక్కిస్తున్న రుహానీ గ్లామర్ హీట్ ‘చి.ల.సౌ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి . ఆ తర్వాత ‘హిట్’, ‘డర్టీ హరీ’ వంటి సినిమాల్లో ఆమె నటించి ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాకపోయినా.. సోషల్‌మీడియా ద్వారా అమె ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది. తాజాగా తన అందాలను చూపిస్తూ.. ఓ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది రుహానీ. నీరసంగా ఉంటూనే.. ప్రకాశం అంటే ఇదే అంటున్న మడోనా ‘ప్రేమమ్’ సినిమాతో మంచి హిట్ అందుకొని.. ఆ తర్వాత మలయాళం సినిమాలతో బిజీ అయిపోయింది హీరోయిన్ . మంచి అభినయంతో.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె చేరువ అయింది. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా చాలా నీరసంగా కనిపిస్తూ.. కొన్ని పిక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది మడోనా.. వీటిని తన తల్లి తీసింది అంటూ ఆమె క్యాప్షన్ పెట్టింది. ‘ఎక్స్‌ట్రా’గా నవ్వులు చిందిస్తున్న రష్మి నటిగా ఎన్నో సినిమాలు చేసిన రాని గుర్తింపు ఒకే ఒక టీవీ షోతో సంపాదించుకుంది రష్మి. ‘జబర్ధస్త్’ షోతో యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ. ఆ త

Thimmarusu Heroine: బాడీ షేమింగ్‌పై ‘తిమ్మరుసు’ హీరోయిన్ భావోద్వేగం.. నటన అంటే షేప్, సైజ్‌నా?

Image
సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’ చిత్రం విజయవంతం కావడంతో ఫుల్ జోష్‌లో ఉంది హీరోయిన్ ప్రియాంకర్ జవాల్కర్. ఈ చిత్రంలో అను పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ కావడంతో హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్.. డ్యుయెట్స్ లాంటివి పెట్టలేదు. హీరోకి అసిస్టెంట్‌గా ఫుల్ లెంగ్స్ రోల్‌ చేసినప్పటికీ పెద్దగా స్కోప్ లభించలేదు. పెర్ఫామెన్స్ పరంగా ఉన్నంతలో పర్వేలేదు కానీ.. తిమ్మరుసు చిత్రంలో ప్రియాంకర్ జవాల్కర్ బాగా బొద్దుగా కనిపించింది.. ఫేస్‌లో కూడా కళ తప్పినట్టే అనిపించింది. టాక్సీవాలా చిత్రంతో డెబ్యూ మూవీలోనే గ్లామరస్ పెర్ఫామర్ అని అనిపించుకున్న ప్రియాంక జవాల్కర్ .. తిమ్మరుసులో మాత్రం ఓ మోస్తరుగానే కనిపించింది. పైగా బాగా లావు కావడంతో బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్లు రావడంతో ఎమోషనల్ అయ్యారు ప్రియాంకర్ జవాల్కర్. శనివారం నాడు ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగా.. హాజరైన ప్రియాంక బాడీ షేమింగ్‌పై కౌంటర్ ఇచ్చారు. హెల్త్ ఇష్యూస్ వల్ల లావు కావాల్సి వచ్చిందని చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ‘నేను వెయిట్ పెరిగాను.. లాక్ డౌన్ తరువాత కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఇదే విషయాన్ని

ఇది మామూలు రచ్చ కాదుగా.. యాంకర్ ఓంకార్ తమ్ముడి లేటెస్ట్ పోస్టర్ అదిరిపోయింది..

Image
పలు టీవీ షోలలో యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న వ్యక్తి.. ఓంకార్. నిజంగా చెప్పుకోవాలంటే తెలుగు బుల్లి తెరకు అసలైన రియాల్టీ షోలను పరిచయం చేసిన యాంకర్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఆయన ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. బుల్లితెరపై తన ప్రతిభను కనబరచిన ఆయన.. వెండితరపై కూడా అద్భుతమైన గుర్తింపు సాధించారు. ‘జీనియస్’ అనే సినిమాతో దర్శకుడిగా వెండితెరకు ఆయన పరిచయం అయ్యారు. ఆ సినిమాతో తన సోదరుడు అశ్విన్‌ బాబుని హీరో‌గా పరిచయం చేశారు ఓంకార్. ఆ సినిమా తర్వాత అశ్విన్ హీరోగా ‘రాజు గారి గది’ అనే సిరీస్‌లో ఆయన నటించిన మూడు సినిమాలు మంచి బ్లాక్‌బస్టర్ హిట్లు అయ్యాయి. అయితే ఓంకార్ సోదరిడిగా మాత్రమే కాకుండా.. నటుడిగా ఈ సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అశ్విన్. ప్రస్తుతం అతను హీరోగా ఓ సరికొత్త ప్రాజెక్టులో నటించబోతున్నాడు. తన కెరీర్‌లో ఏడవ సినిమాగా రూపొందుతున్న సినిమా ఇది కావడంతో. #AB7 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ విగ్నేస్ కార్తీక్ సినిమాస్ బ్యానర్ పై గంగపట్నం

‘మై నేమ్ ఈజ్ శృతి’ అంటున్న హన్సిక.. సోషల్‌మీడియాలో షూటింగ్ పిక్స్ వైరల్

Image
‘దేశముదురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ . యుక్తవయస్సులోనే ఈ సినిమా చేసినప్పటికీ.. తొలి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ భామ. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఈ భామ బిజీ అయిపోయింది. అయితే ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. హన్సిక చేసిన సినిమాలు వరుసగా వరుసగా ఫ్లాప్లు అయ్యాయి. దీంతో కాస్త గ్యాప్ ఇస్తూ సినిమాలు చేస్తూ వస్తుంది హన్సిక. కొన్ని రోజుల క్రితం ‘తెనాలి రామకృష్ణ’ అనే సినిమాలో ఈ భామ చివరిసారిగా కనిపించింది. అయితు తాజాగా హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’. ది హిడెన్‌ ట్రూత్‌ అనేది ఉపశీర్షిక. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై రమ్య బురుగు, నాగేందర్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకుడు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం తొలిషెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘బ్యాక్‌ అండ్‌ ఫోర్త్‌ స్క్రీన్‌ప్లేతో హన్సిక ఇప్పటి వరకు తన కెరియర్‌లో పోషించనటువంటి సరికొత్త పాత్రలో సస్సెన్స్‌ థ్ల్రిలర్‌ని ఎంజాయ్‌ చేసే ప్రేక్షకులు ఒక మంచి అనుభూతిని కలిగించే చిత్రమిది.

ఇస్మార్ట్ హీరో సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. రామ్‌తో జతకట్టనున్న కన్నడ బ్యూటీ

Image
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ ఇటీవలే ‘రెడ్’ మూవీతో డీసెంట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. క్లాస్, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న ఈ యంగ్ హీరో తాజాగా మరో సినిమాకు ఆయన కమిట్ అయ్యాడు. తమిళ దర్శకడు దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు .‘’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో రామ్ ఓ పోలీస్ అఫీసర్ పాత్రలో నటించనున్నాడని ఫిలిమ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ‘అత్తారింటికి దారేది’, ‘మిర్చి’, ‘అ..ఆ’ సినిమాలతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ చేసిన సీనియర్ నటి ‘నదియా’ సినిమాలో ఓ కీలక పాత్రో నటిస్తున్నారని ప్రకటన బయటకు వచ్చింది. అంతేకాక ఈ సినిమాలు తన లుక్‌ని నదియా స్వయంగా ట్వీట్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ బయటకు వచ్చింది. కృతి శెట్టితో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా నటిస్తుందట. ఆమె మరెవరో కాదు.. పలు తమిళ, కన్నడ సినిమాలతో పాటు మన్మథుడు-2 సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఈ సిన

Sarkaru Vaari Paata: మహేష్ అభిమానుల ఎదురుచూపులకు రిజల్ట్.. ‘ఫస్ట్ నోటీస్’ మాములుగా లేదుగా..

Image
తమ అభిమాన నటుడు ఏ సినిమాలో నటిస్తున్నాడు.. దానికి దర్శకుడు ఎవరూ.. ఆ సినిమా కథాంశం ఏంటీ అని అభిమానలు ఎంతో ఆతృతతో ఉంటారు. తమ ఫేవరేట్ హీరో సినిమాకు సంబంధించి ప్రకటన వస్తే చాలు దానిపై ఎన్నో ఊహాగానాలు రచిస్తుంటారు. సినిమా ఇలా ఉండబోతుంది.. ఏ రేంజ్‌లో ఉంటుంది అంటు అంచనాలు వేస్తుంటారు. అయితే ప్రకటన వచ్చి చాలాకాలం అయినప్పటికీ.. సినిమా నుంచి సరైన అప్‌డేట్ రాకపోవడం వారికి కాస్తేంటి చాలానే నిరాశపరుస్తుంది. సరిగ్గా ఇదే విషయం సూపర్‌స్టార్ అభిమానుల విషయంలో జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేష్‌ని వెండితెరపై అభిమానులు చూడలేదు. ఈ సినిమా తర్వాత ఆయన ‘గీతగోవిందం’ ఫేమ్ దర్శకుడు డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలమే అయింది. అయితే ఇంతకాలం కనీసం మహేష్ ముఖం పూర్తిగా కూడా చూపించకుండా ఫస్ట్‌లుక్ పోస్టర్లు వదిలింది చిత్ర యూనిట్. దీంతో మహేష్ అభిమానులు ఆగ్రహంలో మునిగిపోయారు. తమ హీరో సినిమా అప్‌డేట్ ఎప్పుడు వస్తుందా అని వాళ్లు ఎంతో ఆకలిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ తరుణం రానే వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా

బాలయ్య కారుపై తాగుబోతు రాళ్లదాడి.. గాయాలతో కారు దిగిన బాలయ్య ఏం చేశారో తెలిస్తే షాకే!! దటీజ్ లయన్

Image
తెరముందు ఒకలా.. తెరవెనుక ఒకలా ఉండరు బాలయ్య. ఏదైనా ఫేస్ టు ఫేస్.. నచ్చారంటే ప్రాణం ఇస్తారు.. చిరాకు తెప్పిస్తే మాత్రం దబిడిదిబిడే.. ఎనీ సెంటర్ ఎనీ హ్యాండ్ బాబుకి తిక్కరేగిందంటే చెంపలు వాచిపోవాల్సిందే. చివరికి అభిమాని అయినా సరే మోత మామూలుగా ఉండదు. అలాంటిది ఒక తాగుబోతు బాలయ్య ప్రయాణిస్తున్న కారుకి అడ్డంగా వచ్చి.. పెద్ద రాయి తీసుకుని అద్దాన్ని ఫట్ మని కొడితే బాలయ్య ఊరుకుంటారా?? ఆయన్ని ట్రోల్ చేసేవాళ్లు.. నెగిటివ్‌గా మాట్లాడుకునేవాళ్లైతే ఖచ్చితంగా రెండు పీకే ఉంటాడులే అనే అనుకుంటారు. కానీ అక్కడ జరిగిన సీన్ వేరు.. బాలయ్యలో ఈ కోణం కూడా ఉందా? అనిపించేలే రియల్ ఇన్సిడెంట్‌ను షేర్ చేసుకున్నారు నటుడు . ‘లెజెండ్ విజయయాత్రకి మేమంతా బస్‌లో ఊర్లు తిరుగుతున్నాం. ఊరు పేరు నాకు గుర్తు లేదు కానీ.. ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో థియేటర్ లేదు కానీ.. పక్క ఊరిలో లెజెండ్ సినిమా ఆడుతుంది.. ఆ థియేటర్‌కి మేమంతా బస్‌లో వెళ్తున్నాం.. కాకపోతే ఈ ఊరు వెళ్లాలంటే ఈ ఊరు మీదుగానే వెళ్లాలి. అయితే తమ ఊరి మీదుగా బస్ వెళ్తుందని తెలుసుకున్న కొంతమంది అభిమానులు బస్ ఆపారు. అయితే ఆ అభిమానుల మధ్యలో నుంచి ఒక వ్యక్తి పెద్ద రాయి తీసుకున

ఆయనే మా అందరికి ఆదర్శం.. తన తాత ‘రామలింగయ్య’కి అల్లు అర్జున్ నివాళి

Image
తెలుగు కమెడియన్లలో ఆయనదో ప్రత్యేకమైన స్థానం. ఆయన చేసిన కామెడి.. ఆయన బాడీ లాంగ్వేజీని మరెవరూ భర్తీ చేయలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘ముత్యాలు.. వస్తావా..’ అంటూ పాడినా.. దానికి స్పూఫ్‌గా ‘రంజు భలే రామ్ చిలకా’ అనే పాటలో హీరోయిన్‌తో చిందులు వేయాలన్నా ఆయనకు ఆయనే సాటి.. ఆయన పద్మశ్రీ . ఎన్నో చిత్రాల్లో ఆయన నటనతో ప్రేక్షకులను రాయలింగయ్య అలరించారు. తనదైన విలక్షణమైన కామెడీతో ఆయన ప్రేక్షకుల మదిలో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. ‘పుట్టిల్లు’ అనే సినిమాతో తన సినీ కెరీర్‌ని ప్రారంభించిన ఆయన.. దాదాపు ఐదు దశాబ్ధాలపాటు తెలుగు ప్రేక్షకులకు హాస్యం పంచారు. హాస్యం మాత్రమే కాదు.. సెంటిమెంట్ సీన్లలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. వృత్తిరీత్య హోమియోపతి డాక్టర్ అయిన ఆయన స్వతంత్ర సమరంలోనూ పాల్గొని జైలుకు వెళ్లారు. ఇక తెలుగు చలనచిత్రానికి ఆయన అందించన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డులను ప్రధానం చేసింది. నేడు (జూలై 31) అల్లు రామలింగయ్య వర్థంతి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, కుటుంబసభ్యలు ఆయన్ని గుర్తు చేసుకుంటూ సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆయన

తహశీల్దార్ కార్యాలయంలో ఎన్టీఆర్.. కోట్లు విలువైన భూమి కొనుగోలు కోసమేనట!

Image
నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్నారు యంగ్ టైగర్ . తన తొలి సినిమా నుంచి నటనలో విలక్షణత చూపిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆయన. కెరీర్ ఆరంభంలో మంచి సక్సెస్ అందుకున్న తారక్ తర్వాత వరుసగా ఫ్లాప్‌లు చవిచూశారు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన వరుస హిట్లలతో మంచి జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమాలో నటిస్తున్నారు తారక్. ఈ సినిమాలో ఆయనకు జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఇందులో ఆయన విప్లవ వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయనకు ‘జనత గ్యారేజ్’ సినిమాతో మంచి హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివతో మరో సినిమా చేయనున్నారు తారక్. దీని తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు అయన. అయితే ఇక అసలు విషయానికొస్తే.. తారక తాజాగా ఓ చోట అభిమానులకు దర్శనం ఇచ్చారు. అయితే అది సినిమా సెట్టో.. లేక థియేటరో కాదు.. ఎమ్మార్వో ఆఫీస్. కోట్లు విలువజైసే ఒక ఆర

నెటిజన్లకు షాక్ ఇచ్చిన సమంత.. ఆ ఒక్క అక్షరమే చాలు అంటున్న కుందనపు బొమ్మ

Image
మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి సమంతా. ఆ తర్వాత పలు స్టార్ హీరోలతో కలిసి సినిమాల్లో నటించిన ఆమె అనతి కాలంలోనే చాలా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక అక్కినేని నట వారసుడు నాగ చైతన్యతో ఆమె ప్రేమాయణం.. ఆ తర్వాత పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచాయి. అక్కినేని కోడలు అయిన తర్వాత.. సమంతకు పాపులారిటీ మరింత పెరిగిపోయింది. ఒకవైపు హీరోయిన్‌గా రాణిస్తూనే.. మరోవైపు యాంకర్‌గా కూడా పలు ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తూ ప్రేక్షకులను అలరించారు సమంత. రీసెంట్‌గా ఓటీటీలో కూడా ఆమె అడుగుపెట్టారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌తో ఆమె ప్రేక్షకులను పలకరించారు. ఇంతవరకు ఎన్నడూ చూడని విధంగా ఈ సిరీస్‌లో చేసిన ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఆమె ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే తాజాగా సమంత మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె తన సోషల్‌మీడియా ఖాతాల్లో అక్కినేని అనే పేరును తొలగించి.. కేవలం ‘ఎస్’ అనే ఒక అక్షరాన్ని మాత్రమే ఉంచింది. అయితే ఇది అభిమానుల మదిలో కాస్త కలవరపాటుని సృష్టించింది. అసలు ఇందుకు కారణం ఏంటీ.. సమంత ఏదైనా అనూహ్యమైన నిర్ణయం తీ

దాన్ని చూసి కఠిన సత్యాలు తెలుసుకోండి.. సుమంత్ వివరణపై ఆర్జీవీ సెటైర్స్

Image
ఈ మధ్య సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు వింత వింత దారులు తొక్కుతున్నారు. పెళ్లి,ఎంగేజ్మెంట్ అనే వాటిని అడ్డం పెట్టుకుని సినిమాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ఎందుకు వైరల్ అవుతుంది.. అది అలా ఎందకు అవుతోంది? అని ఆలోచనలు ఉండవు. అలా ఆ రూమర్ వైరస్‌లా వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. మొన్న అంతా కూడా రెండో పెళ్లి గురించి వార్తలు వైరల్ అయ్యాయి. వెడ్డింగ్ కార్డ్ అంటూ ఒకటి చక్కర్లు కొట్టింది. అందులో వివాహానికి సంబంధించిన వివరాలేవీ లేకపోయినా కూడా సోషల్ మీడియా మొత్తం సుమంత్ రెండో పెళ్లి గురించి చర్చించుకుంది. అలా మొత్తానికి తన రెండో పెళ్లి అంటూ వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. అంతకు ముందే వర్మ ఈ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి అంటే పెద్ద పెంట.. నీకు ఇంకా బుద్ది రాలేదా? మళ్లీ పెళ్లి చేసుకుంటావా? అని సుమంత్‌ని చెడామడా తిట్టేశాడు. తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని, ఆ వెడ్డింగ్ కార్డ్ తన తదుపరి సినిమా కాన్సెప్ట్‌కు సంబంధించింది అని చెప్పుకొచ్చారు. పెళ్లి, విడాకుల మీద రాబోతోన్న సినిమా అని అసలు విషయం క్లారిటీగా చెప్పారు. మొత్తానికి వాళ్లే లీక్ చేసి ఇలా తమ సినిమాను జనాల్లో హ

Chiranjeevi : జీవితసత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా.. అల్లు రామలింగయ్యపై చిరు కామెంట్స్

Image
తెలుగు వారికి పేరును పరిచయం చేయనక్కర్లేదు. నాటి తరం నేటి తరం అని తేడా లేకుండా ప్రతీ ఒక్క తెలుగు వ్యక్తికి ఆయన పేరు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా సినీ అభిమానులకు ఆయన ఎప్పుడూ ప్రత్యేకమే. ఆయన వేసిన పాత్రలు, తరతరాలను నవ్వించిన తీరు ఎప్పటికీ చిరస్మరణీయమే. ఎన్టీఆర్ ఏఎన్నార్ నుంచి.. దాదాపు మూడు నాలుగు జనరేషన్స్‌ అంటే సునీల్ వంటి వారితోనూ కలిసి కామెడీని పండించారు. చివరగా కళ్యాణ రాముడు చిత్రంలోనూ అందరినీ నవ్వించేశారు. అల్లు రామలింగయ్య 2004లో జూలై 31న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇక నేడు ఆయన వర్దంతి. ఈ క్రమంలో అల్లు, మెగా ఫ్యామిలీలే కాకుండా ఇతర సెలెబ్రిటీలు సైతం ఆ మహనీయుడిని తలుచుకుంటున్నారు. ఈ క్రమంలో మెగా స్టార్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘శ్రీ అల్లు రామలింగయ్య గారు భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన నేర్పిన జీవితసత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా వుంటాయి.ఒక డాక్టర్ గా,యాక్టర్ గా, ఫిలాసఫర్ గా,ఓ అద్భుతమైన మనిషిగా,నాకు మావయ్య గా ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు.ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు మరోసారి నెమరువేసుకుంటూ’ అని చెప్పుకొచ్చారు. ఇక మరో వైపు బండ్ల గణేష్ కూడా అల్లు రామలింగయ్య వర్దంతి గ

Balamevvadu Title Song : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. సుహాసిని

Image
సినిమాకు ఎన్నో బలాలున్నాయి. ఓ వైపు మెలోడి బ్రహ్మా మణిశర్మ సంగీతం.. మరో వైపు కీరవాణి గాత్రం ఇంకో వైపు నటనలో వంకపెట్టలేనటు వంటి సీనియర్ నటి సుహాసిని. ఇలా బలమెవ్వడు సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆ మధ్య వదిలిన కాన్సెప్ట్ పోస్టర్ నెట్టింట్లో ఎంతగా హల్చల్ చేసిందో అందరికీ తెలిసిందే. కరోనా, మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించినట్టు కనిపిస్తోన్న ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌లో తళుక్కున మెరిశారు. తెలుగు, తమిళ చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్న సుహసినీ.. చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. "బలమెవ్వడు" సినిమాలో డాక్టర్ యశోద పాత్రలో నటిస్తున్నారు సుహసినీ. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడే నిజాయితీ గల వైద్యురాలి పాత్రలో సుహసినీ నటన అద్బుతంగా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్‌ను వదిలారు. దీనికి మణిశర్మ సంగీతం అందించగా.. కీరవాణి పాడారు. కళ్యాణ్ చక్రవర్తి అద్భుతంగా ఈ పాటను రాశారు. ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న "బలమెవ్వడు" సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రా

Kaatuka Kanule రేర్ ఫీట్.. ఇది సమష్టి విజయం

Image
హీరోగా అపర్ణా బాలమురళీ అనే అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ సుధా కొంగర తెరకెక్కించిన చిత్రం (తమిళంలో సూరారై పొట్రూ). ఎన్నో ఏళ్లుగా సరైన విజయం కోసం ఎదురుచూసిన సూర్యకు ఆకాశం నీ హద్దురా ఊపిరినిచ్చింది. అందరి మన్నళలు అందుకోవడమే కాకుండా ఆస్కార్ బరిలో నిలిచింది. ఇక సూర్య నటనను దేశం మొత్తం మరోసారి చూసింది. అలా ఓటీటీలో గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా అంతలా ఆదరణకు నోచుకోవడానికి బోలెడన్నీ కారణాలున్నాయి. అందులో సంగీతం కూడా ఒకటి. ఆ పాటలన్నీ కూడా సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాటిని తెరకెక్కించిన విధానం కూడా అంతే ముచ్చటగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అంటూ హీరోయిన్ పాడే పాట, చేసే అల్లరి అందరినీ ఫిదా చేసేసింది. ఆ పాటకు ఇప్పుడు యూట్యూబ్‌లో రేర్ ఫీట్ దక్కింది. వీడియో సాంగ్‌కు వంద మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ పాటను ఇంత అద్భుతంగా రాసిన భాస్కర భట్ల, పాడిన తమిళ సింగర్ ఢీ, సంగీతమందించిన జీవీ ప్రకాశ్, కొరియోగ్రఫీ చేసిన శోభీ, శేఖర్ మాస్టర్ ఇలా అందరూ కలిసి సమష్టిగా కృషి చేయడంతోనే ఆ

RC 15 : రామ్ చరణ్‌కు జోడి దొరికేసింది.. శంకర్‌తో కియారా మాటామంతీ!

Image
రామ్ చరణ్ దిల్ రాజు ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో జరిగే చర్చల గురించి అందరికీ తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన క్షణం నుంచి ఏదో ఒక టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు ఇప్పుడు తెర దించారు. పక్కన కియారా అద్వాణీ మరోసారి జోడి కట్టబోతోందని చెప్పేశారు. తమ 50వ చిత్రంలో కియారా అద్వాణీ హీరోయిన్ అని దిల్ రాజు ప్రకటించేశారు. మొత్తానికి ఇన్నాళ్ల రూమర్లకు శంకర్ ఓ క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ పక్కన బాలీవుడ్ బ్యూటీని దించుతారని ఇది వరకు రూమర్లు వచ్చాయి. అందులో ముఖ్యంగా కియారా అద్వాణీ పేరే ఎక్కువగా వినిపించింది. ఆల్రెడీ ఈ జోడి వినయ విదేయ రామతో అలరించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఫ్లాప్ అయినా కూడా ఈ జోడికి మంచి మార్కులే పడ్డాయి. అంతేకాకుండా మార్కెట్ పరంగానూ ఆలోచించి కియారాను తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కియారాకు బాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇక దక్షిణాదిలోనూ కియారాకు విపరీతమైన క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అందుకే దిల్ రాజు శంకర్ ఇలా కియారాను తీసుకొచ్చినట్టు టాక్. నేడు (జూలై 31) కియారా బర్త్ డే సందర్భంగా ఈ అప్డేట్‌ను ఇచ్చారు. ఇక ఇప్పటికే శంక

ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నా.. ఇక నాకు అదే పని : రష్మిక మందన్నా

Image
సోషల్ మీడియాలో చేసే అల్లరికి అభిమానులు ఫిదా అవుతుంటారు. ఇక అమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య ఆమె ఒక పని చేస్తున్నారు. నిత్యం తానేమీ చేశానో అభిమానులకు క్లియర్‌ కట్‌గా చెబుతున్నారు. ఓ రకంగా తన డైరీని సోషల్ మీడియాలో పెడుతున్నారు. పొద్దున లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఏమేం చేస్తుంటారో అలా చెప్పుకుంటూ వెళ్తారు. అయితే అందులో ఎక్కువగా తన పెట్ ఆరా గురించి ఉంటుంది. తాజాగా రష్మిక పోస్ట్ చేసిన తన డైరీలోనూ అదే ఉంది. ప్రస్తుతం రష్మిక పలు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు. ఒక రోజు ముంబైలోఉంటే మరో రోజు హైద్రాబాద్‌లో ఉంటున్నారు. అలా తెలుగులో , ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో మరో రెండు ప్రాజెక్ట్‌లు సెట్స్ మీదున్నాయి. మొత్తానికి అంత బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. తాజాగా తాను షూటింగ్‌లు ఏం లేక ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తన డైరీలో చెప్పుకొచ్చిన విశేషాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జూలై 29వ తారీఖున తానేం చేసిందో రష్మిక

ఇది మరీ అరాచకం.. లోపల ధరించేవాటిపై శ్రుతీ హాసన్ ఫోటోలు.. ప్రియుడి వెక్కిరింతలు!

Image
చర్యలు ఈ మధ్య శ్రుతి మించిపోతోన్నాయి. పబ్లిక్‌గా ప్రియుడి మీద పడిపోవడం, ముద్దులు పెట్టేయడం, ఇక ఇంట్లో అయితే ఆ ఆరాచకం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రోజూ ఏదో ఒకటి చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం ముంబైలో ఎంజాయ్ చేస్తున్నారు. శ్రుతీ హాసన్ తన పనిలో తాను బిజీగా ఉంటే.. తన ఆర్ట్ గీసుకునే పనిలో తాను బిజీగా ఉంటున్నారు. ఇక ఈ జంట చేసే చిలిపి పనులకు నెటిజన్లు షాక్ అవుతున్నారు. తాజాగా శ్రుతీ హాసన్ చేసిన పనికి ప్రియుడు సైతం నవ్వుకున్నారు. మొన్నటికి మొన్న ముంబైలోని ఓ సూపర్ మార్కెట్‌లో ఈ జంట హల్చల్ చేసింది. ప్రియుడి మీద కాలు ఎత్తి మరీ.. అతడిని ముద్దుల్లో ముంచెత్తింది. ఇక రెండ్రోజుల క్రితం తమ ఇంట్లోనే శ్రుతీ హాసన్ పిచ్చి పిచ్చిగా ఎగిరారు. ఆమెతో పాటుగా శంతను కూడా కాలు కదిపాడు. అకస్మాత్తుగా శ్రుతీ హాసన్ ఎగిరి వచ్చి ఆయన మీద పడింది. దీంతో శంతను ఒక్కసారిగా షాక్ అయ్యారు. అలా ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఇక శంతను గోడ మీద ఆర్ట్ వేసుకుని ప్రాక్టీస్ చేసుకోకుండా.. శ్రుతీ హాసన్ శరీరాన్ని వాడేసుకున్నారు. ఆమె నడుము భాగం మీద తన ప్రతిభను చూపించారు. నడుము చుట్టూ కూడా శంతను ఆర్ట్ వేసే

ఆన్ లైన్ క్లాసుల మహిమ.. అల్లు అర్హ ఎంత బుద్దిగా వింటోంది?

Image
ప్రస్తుత పరిస్థితుల్లో చదువులు ఎలా కొనసాగుతున్నాయో అందరికీ తెలిసిందే. గత ఏడాది నుంచి అంతా ఆన్ లైన్ చదువులే అయిపోయాయి. మధ్యలో బడులు తెరిచినా కూడా కరోనా దెబ్బకు మూసేయాల్సి వచ్చింది. అలా ప్రతీ సారి ప్రభుత్వాలకు ఎదురుదెబ్బే తగులుతోంది. ఇక ఇప్పుడు అందరూ కూడా ఆన్ లైన్ బాటే పడుతున్నారు. పిల్లలందరూ ఇంట్లోనే క్లాసులు వింటున్నారు. జూమ్ మీటింగ్ అంటూ అటెండ్ అవుతున్నారు. మొత్తానికి చదువులన్నీ కూడా ఫోన్లు, ల్యాప్ టాప్‌ల్లోకి ఎక్కేశాయి. ఇంట్లో ఉంటే పిల్లలు క్లాసులు ఎలా వింటారో అందరికీ తెలిసిందే. ఎవ్వరూ కూడా మనసు పెట్టి క్లాసులు వినరు. కానీ అల్లు పిల్లలు మాత్రం ఎంతో బుద్దిగా వింటున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఆన్ లైన్‌లో క్లాసుల్లో బిజీగా ఉంది. తాజాగా ఓ వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు. ఇందులో అల్లు అర్హ ఎంతో బుద్దిగా కూర్చుని ఆన్ లైన్ క్లాసులు వింటోంది. అందులో తన తోటీ వారంతా జూమ్ మీటింగ్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. అందరూ విఘ్నేశ్వరుని శ్లోకంతో ప్రారంభించినట్టున్నారు. వారిని వంత పాడుతూ ఆ శ్లోకాన్ని అల్లు అర్హ కూడా చెప్పేస్తోంది. మొత్తానికి అర్హ మాత్రం అల్లరి పిల్ల మాత్రమే కాదు.. ఎంతో వినయం, వ

RRR డేరింగ్ స్టెప్... క్లిష్ట పరిస్థితుల్లోనూ అలాంటి నిర్ణయం.. హీరోలిద్దరికీ రిస్కే!

Image
ప్రస్తుతం ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులున్నాయో అందరికీ తెలిసిందే. ఇంకా కరోనా మహమ్మారి మానవాళిని వెంటాడుతూనేఉంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. ఇలాంటి సమయంలో ఇక్కడ షూటింగ్‌లు చేసుకోవడం కూడా కష్టమే. కానీ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సినిమాను పూర్తి చేస్తున్నారు మేకర్స్. ఇలాంటి సమయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. హీరోలిద్దరి సీన్లను తెరకెక్కించేందుకు టీం మొత్తానికి ఉక్రెయిన్‌కు తరలించారట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ కోసం ఉక్రెయిన్‌కు పయనమైందని సమాచారం. కరోనా సెకెండ్‌ వేవ్‌ తర్వాత హైదరాబాద్‌లో షెడ్యూల్‌ ప్రారంభించిన రాజమౌళి అండ్‌ కో ఇటీవల ఈ షూటింగ్‌ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దోస్తీ పేరిటి మొదటి సాంగ్‌తో రచ్చ చేసేందుకు టీం మొత్తం రెడీ అయింది. ఐదు భాషలు.. ఐదుగురు సింగర్లతో కీరవాణి మ్యాజిక్ చేయబోతోన్నారు. ఒక వైపు రాజమౌళి తన హీరోలను విదేశాలకు పట్టుకెళ్తున్నారు. మొన్నటి హైద్రాబాద్ షెడ్యూల్‌లో హీరోలిద్దరిపై కీలక సన్నివేశాలను రామ్‌చరణ్‌పై ఓ పాటను చిత్రీకరించారు. ఆగస్ట్‌ ఒకటో తేదీ నుంచి ఉక్రెయిన్‌లో చివరి షెడ్యూల్‌ ప్రారంభిస్తారని తెలిసింది. ఇప్పటికే చిత్ర బృ

Narappa Success meet : ధనుష్‌పై ప్రశంసలు.. దటీజ్ వెంకీ

Image
విక్టరీ ఎప్పుడూ కూడా తన సినిమాల గురించి గొప్పలు చెప్పుకోరు. తన నటన, తన సినిమాల ఫలితం గురించి అంతగా చెప్పుకోరు. అయితే తన సినిమా సక్సెస్ ఫంక్షన్‌లో కూడా దాని ఒరిజినల్ సినిమా గురించి మాట్లాడుతూ అక్కడి దర్శకుడు, హీరోల గురించి కామెంట్ చేశారు. ఈ క్రమంలో దటీజ్ వెంకీ అని అభిమానులు ఆయన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న జరిగిన ఈ సక్సెస్ మీట్‌లో వెంకటేష్ మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. థియేటర్లలో చూడాల్సిన ‘నారప్ప’ ఓటీటీలో వచ్చినందుకు ప్రేక్షకులకు బాధగా అనిపించినా.. మా పరిస్థితిని అర్థం చేసుకుని గొప్పగా ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను అని వెంకటేష్‌ ఎమోషనల్ అయ్యారు. సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. 25ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఛాలెంజింగ్‌ పాత్రలు చేశాను. కానీ, ఈ సినిమా, ఇందులో నా పాత్ర చాలా విభిన్నమైనది. నటుడిగా నాకెంతో సవాల్‌గా నిలిచింది. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు వెట్రిమారన్‌, ధనుష్‌లకు థ్యాంక్స్‌. వాళ్లు ‘అసురన్‌’ చేయకపోతే.. ఈరోజు ఈ ‘నారప్ప’ లేదు. కచ్చితంగా ప్రేక్షకులందరికీ థియేటర్లో మరో మంచి సినిమా చూపిస్తానని మనస్ఫూ

రాజ్ తరుణ్ సినిమాలోని పాటని విడుదల చేసిన విజయ్.. ‘థాంక్యూ బ్రో’ అన్న యువ హీరో

Image
ఈ మధ్యకాలంలో ఓ హీరో సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లను మరో హీరోలతో విడుదల చేయించడం చాలా ఎక్కువైపోయింది. ముఖ్యంగా సోషల్‌మీడియా వాడకం పెరిగిన తర్వాత ఇది సహజంగా మారింది. తమ సినిమాకు పాపులారిటీ పెంచుకొనేందుకు మంచి క్రేజ్ ఉన్న హీరోలతో సినిమాకు సంబంధించిన పోస్టర్లు కానీ, పాటలు కానీ, టీజర్ కానీ విడుదల చేయిస్తున్నాయి చిత్ర యూనిట్లు. చిన్న హీరోల విషయంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంది. తాజాగా తన సినిమా పాటను విడుదల చేసినందుకు హీరో విజయ్ దేవరకొండకు హీరో థాంక్స్ చెప్పాడు. రాజ్ తరుణ్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టినా కూడా ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా మారాడు. అలా కెరీర్ ప్రారంభంలోనే మంచి హిట్లు పడ్డాయి. వరుస బ్లాక్ బస్టర్‌లతో రాజ్ తరుణ్ దూసుకుపోయారు. కానీ ఆ తరువాతే అసలు సమస్య మొదలైంది. కుమారి 21ఎఫ్ తరువాత రాజ్ తరుణ్‌కు మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. ఇంకా ఓ సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ‘ఒరేయ్ బుజ్జిగా’ అంటూ చివరగా ప్రేక్షకులను పలకరించాడు రాజ్ తరుణ్. కానీ అది కూడా బోల్తా కొట్టేసింది. ఇక ఇప్పుడు రాజ్ తరుణ్ మరో కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్నాడు. స

Nara Lokesh: తిమ్మరుసులో ‘తియ్యగుందీ’.. లోకేష్ బాబుపై సెటైర్.. థియేటర్స్‌లో నవ్వులే నవ్వులు

Image
సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’ చిత్రం నేడు (జూలై 30) థియేటర్స్‌లో విడులైంది. లాక్ డౌన్ ప్రభావంతో ప్రేక్షకులకు వినోదం కరువైంది. ఓటీటీ ఉన్నా.. ఆహా, నెట్ ఫ్లిక్స్, ప్రైమ్, హాట్ స్టార్, జీ 5 ఇలా దేనికది సెపరేటు రేట్లు ఉండటంతో పేదోడు, మధ్యతరగతి వాళ్లకి ఓటీటీ ఉన్నా లేనట్టే. ఆ విషయాన్ని పక్కనపెడితే.. థియేటర్స్‌లో సినిమా చూస్తే ఆ మజానే వేరు. మొత్తానికి సెకండ్ వేవ్ తరువాత ‘తిమ్మరుసు’ చిత్రంలో థియేటర్స్ వద్ద పండగ వాతావరణాన్ని తీసుకుని వచ్చింది. ఇక సినిమాకి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడం శుభపరిణామం. ఇక అసలు విషయానికి వస్తే.. క్రైమ్ థ్రిల్లర్ కథల్లో సీరియస్ నెస్ పోతుందని వినోదానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. అయితే తిమ్మరుసు చిత్రంలో బ్రహ్మాజీ పాత్ర ద్వారా పూర్తి స్థాయిలో వినోదాన్ని పండించారు. సుధాకర్ పాత్రలో బ్రహ్మాజీ కామెడీ పండించారు. అతని ప్రతి పంచ్‌కి థియేటర్స్‌లో రెస్పాన్స్ అదిరిపోయింది. అయితే ఓ సందర్భంలో హీరోతో పాటు బొండం తాగుతూ.. ‘తియ్యగుందీ’ అనే డైలాగ్‌కి థియేటర్స్‌లో ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంలో నారా లోకేష్ బాబుని గుర్తుచేశారు బ్రహ్మాజీ. గత ఎన్నికల టైంలో గతంలో మంగళగిరి పర్యటనలో

మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమైన అనసూయ.. ఈసారి అలాంటి పాత్రలో..

Image
బుల్లితెర యాంకర్‌గా భారీ పాపులారిటీ సంపాదించిన అనసూయ వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తోంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మతగా నటించిన ఈ ‘జబర్దస్త్’ బ్యూటీ తన గ్లామర్‌తో యమ అట్రాక్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం అమ్మడి డేట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రీసెంట్‌గా ‘థాంక్యూ బ్రదర్’ అనే సినిమాతో ఆమె ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో ఆమె అనుకోని పరిస్థితుల్లో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన గర్భిణి స్త్రీగా ఆమె నటించింది. నిజానికి థియేటర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఆమె ‘పుష్ప’ అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ సినిమాలో అనసూయ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె మరిన్ని ప్రాజెక్టులతో బిజీగా మారిపోతుంది. ఆమె తన తదుపరి సినిమాలో ‘’ పాత్రలో కనిపించననున్నట్లు తెలుస్తోంది. ‘పేపర్‌‌బాయ్’ సినిమాతో మంచి గురింపు సంపాదించుకున్న దర్శకుడు . ఆయన త్వరలో ఓ విభిన్నమైన కథా

టుడే ఇన్‌స్టా హిట్స్: రాశీ గ్లామర్ షో.. ఇదే సంతోషం అంటున్న అనుపమ.. నడుము అందాలతో మాళవిక

Image
అందాల విందు ముద్దుగా, బొద్దుగా తెలుగు వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ రాశీ ఖన్నా. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కొంతకాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అయితే ఈ మధ్యకాలంలో తన ఫిట్‌నెస్‌పై బాగా దృష్టి పెట్టిన రాశీ.. జీరో సైజ్ ఫిగర్‌కి వచ్చేసింది. తాజాగా అందుకు సంబంధించిన కొన్ని పిక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఏదీ అసాధ్యం కాదు అంటున్న రకుల్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌కు తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఏడాది ‘చెక్’ అనే సినిమాతో ప్రేక్షకులను ఆమె పలకరించింది.. అయితే ఆ సినిమా మాత్రం ఆమె నిరాశపరిచింది. ఇక సోషల్‌మీడియాలో రకుల్ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలపై పాజిటివ్ కామెంట్లతో పాటు.. ఈ మధ్యకాలంలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అయితే తాజాగా ఓ షోలో పాల్గొన్న రకుల్ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ‘అవి ఉంటే ఏది అసాధ్యం కాదు’ అంటూ దానికి ఆమె క్యాప్షన్ పెట్టింది. అసలైన ఆనందం అంటే ఇదే : అనుపమ రింగురింగుల జుట్టుతో.. మలయాళం ‘ప్రేమమ్’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ . ఆ తర్వాత ‘అ..ఆ’ సినిమాతో త

HBD Sonu Sood: రియల్ హీరోకి అభినందనల వెల్లువ.. గ్రాండ్ ట్రీట్ ఇచ్చిన ‘ఆచార్య’ యూనిట్

Image
‘ఆపద్భాంధవుడు’ అంటే ఇప్పుడు అందరికీ గుర్తుకు వచ్చేది ఒకే ఒక పేరు.. అదే . కరోనా లాక్‌డౌన్‌లో సమయంలో కష్టాల్లో ఉన్న ఎందరో వలస కార్మికులు, నిరుపేదలకు ఆయన అండగా నిలిచారు. తమ స్వస్థలాలకు చేరుకోలే ఇబ్బందులు పడుతున్న ఎందరినో ఆయన తన సొంత ఖర్చుతో స్వస్థలాలకు చేర్చారు. కొద్ది రోజుల క్రితం వరకూ రెండో దశలోనూ విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేశారు. ప్రధానంగా ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో ఆయన, తన ఫౌండేషన్ తరఫున ఆక్సిజన్ ప్లాంటులను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా పలు ప్రధాన రాష్ట్రాల్లో ఈ ప్లాంటులను ఏర్పాటు చేశారు సోనూ. ఈ క్రమంలో గత ఏడాది నుంచి సోనూసూద్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని.. అభిమానులు కూడా అదే దారిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోనూసూద్ పేరిట కొన్ని ఫౌండేషన్లు ఏర్పాటు చేసి.. ఎందరికో సహాయం చేస్తున్నారు. కాగా, నేడు (జూలై 30) సోనూసూద్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రియల్ హీరోకి విషెస్ చెబుతూ అభిమానులు సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ చిత్ర యూనిట్ కూడా ఆయనకు పుట్టినరోజు సందర్భంగా ట్రీట్

గుమ్మడి నర్సయ్య బయోపిక్.. బయటకు వచ్చిన సుకుమార్!

Image
రాజకీయ నాయకులు అనగానే సహజంగానే కొన్ని అభిప్రాయాలు, ముద్రలు వేసేస్తుంటారు. అవినీతి, అక్రమ సంపాదన అంటూ రకరకాలుగా ట్యాగులు తగిలిస్తుంటారు. కానీ రాజకీయ నాయకులందరూ అలానే ఉండరు. ఒక్క రూపాయి అవినీతి కూడా చేయని వారుంటారు. అలాంటిది ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి, ఓ పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినా నిజాతీయికి నిలువుటద్దంలా రాజకీయ ప్రస్థానం సాగించారు సీపీఐ (ఎంఎల్) నేత . శాసనసభకు బస్సులో వచ్చే ఏకైక ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సయ్య నిరాడంబర జీవితం ఆదర్శనీయంగా మీడియా ప్రశంసించింది. ప్రజా జీవితంలోనే తన జీవితాన్ని చూసుకున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథతో సినిమా రూపొందుతోంది. పరమేశ్వర్ అనే కొత్త దర్శకుడు ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా గుమ్మడి నర్సయ్య బయోపిక్ టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు విడుదల చేశారు. టైటిల్ లోగో విడుదల చేసిన అనంతరం దర్శకుడు సుకుమార్ చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు. ఒక ఆదర్శవంతమైన నాయకుడి గురించి ఈతరంతో పాటు రాబోయే తరాల ప్రజలకు, రాజకీయ నాయకులకు తెలిసేలా గుమ్మడి నర్సయ్య బయోపిక్ ఉండబోతోంది. ఈ సినిమాలో నటించే నటీనటులు, సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ వివరాలు త్వరల

తొలిసారిగా అలాంటి విలక్షణమైన పాత్రలో నయనతార.. ఆసక్తికరంగా ‘నేత్రికన్’ ట్రైలర్

Image
కొందరు హీరోయిన్లు మాత్రమే హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంటారు. అలా హీరోలతో సమానంగా దక్షిణాదితో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న నటి . కెరీర్ ఆరంభంలో పలు గ్లామరస్ పాత్రల్లో నటించిన ఆమె స్టార్ హీరోయిన్ స్టాయిని సంపాదించుకుంది. అలాగే మంచి కెరీర్‌ని ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లోనూ కొనసాగించింది. అయితే కొంతకాలం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది నయనతార. ఆ తర్వాత ఎక్కువ శాతం లేడీ ఓరియేంటెడ్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. మధ్యలో కొన్ని కమర్షిషల్ సినిమాలు చేస్తూనే.. లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేస్తున్నారు ఆమె. కొన్ని రోజుల క్రితం ‘ముక్కుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరోసారి ఓ ఆసక్తికర కథనంతో, విభిన్నమైన పాత్రతో ఆమెను ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘’. ఈ సినిమాలో నయనతార తొలిసారిగా ఓ అంధురాలి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలో ఓ ప్రముఖ ఓటీటీలో విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషలతో పాటు మలయాళ, కన్నడ భాషలలోనూ ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ని చిత్ర యూన

బండ్లన్న ఇంట్లో పవర్ స్టార్.. అలా బయటపడ్డ ఫోటో.. అదే బండ్ల గణేష్ భక్తి!

Image
ట్వీట్లు, ఆయన వేసే పోస్ట్‌లు, చేసే కామెంట్లు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆ పోస్టుల్లో ఉంటే అవి ఇంకా హల్చల్ చేస్తుంటారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే హంగామా అందరికీ తెలిసిందే. వారెప్పుడూ కూడా బండ్ల గణేష్ ట్వీట్ల మీద ఓ కన్నేసి ఉంచుతారు. అలా బండ్లన్న ట్వీట్ వేయడం ఆలస్యం ఇలా పవర్ స్టార్ ఫ్యాన్స్ దుమ్ములేపేస్తుంటారు. తాజాగా బండ్ల గణేష్ వేసిన ఓ ట్వీట్, షేర్ చేసిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. బండ్ల గణేష్ తాజాగా తెలుగు రాష్ట్రాల‌ బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో సమయం గడిపారు. ఆండ్రూ ఫ్లెమింగ్ బండ్లన్న ఆతిథ్యాన్ని స్వీకరించినట్టున్నారు. సకుటుంబ సపరివారసమేతంగా బండ్ల గణేష్ అతనికి అతిథి మర్యాదలు చేశారు. ఈ క్రమంలో కొన్ని ఫోటోలను బండ్ల గణేష్ షేర్ చేశారు. ఆ ఫోటోల్లో బండ్ల గణేష్ ఇంట్లోని ఓ రూం, ఆ రూంలోని ఓ గోడ, ఆ గోడ మీదున్న ఓ ఫోటో అందరినీ ఆకట్టుకుంది. ఆ రూంలో ఇంకా మరేతర దేవుడి ఫోటోలు గానీ, ఇతర ఫోటోలు గానీ లేవు. గబ్బర్ సింగ్ సమయంలో పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోను మాత్రమే గోడకు వేలాడిదీసి ఉంచాడు. అదే భక్తి అంటే అని పవర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నా

Devineni Uma: దేవినేని ఉమక్క చిప్పకూడు తింటుందే.. చెలరేగిన రోజా.. సంచలన వ్యాఖ్యలు

Image
అరెస్ట్ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ అవుతుంది. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమమైనింగ్ చేస్తున్నారని తన అనుచరులతో కలసి నిరసన చేపట్టారు ఉమ. ఈ సమయంలో తెలుగుదేశం, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుని రాళ్లదాడి జరిగింది. ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా.. దేవినేన ఉమ ఉద్దేశ పూర్వకంగానే జి. కొండూరులో అలజడి సృష్టించారని ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టి జైలుకి పంపారు పోలీసులు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే.. సినీ నటి స్పందిస్తూ.. దేవినేని ఉమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమక్క జైల్లో చిప్పకూడు తింటుంది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ.. ‘పేదల ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలాలు సేకరిస్తుంటే.. ల్యాండ్ మాఫియా అని తెలుగుదేశం పార్టీ వాళ్లు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈరోజు అక్కడ మహిళలు ఇల్లులు కట్టుకుంటుంటే.. అక్కడ ఎవరూ ఇల్లు నిర్మించుకోవడం లేదు.. కేవలం మైనింగ్ మాత్రమే జరుగుతుందని దేవినేని ఉమక్క అక్కడకు వెళ్లి తెగ హడావిడి చేసి జైలుపాలయ్యాడు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డిగారు చేస్తున్న అభివృద్ధి చూసి సహించలేని తెలు

Samapath Nandi : మరిచిపోలేని రోజు.. దేవుడిని కలిశాను.. చిరుపై ‘రచ్చ’ డైరెక్టర్ కామెంట్స్

Image
టాలీవుడ్ డైరెక్టర్ గురించి, ఆయన మేకింగ్ గురించి అందరికీ తెలిసిందే. మొదటి సినిమా ఏమైంది ఈవేళతో ఇండస్ట్రీలోని స్టార్ హీరోలను ఆశ్చర్యపరిచారు. అలా రెండో చాన్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సంపత్ నందికి దక్కింది. వచ్చిన అవకాశాన్ని సంపత్ నంది ఉపయోగించుకుని రచ్చ వంటి మాస్ మసాలా కమర్షియల్ సినిమాను తెరకెక్కించాడు. అలా సంపత్ నంది మెగా హీరోకు హిట్టిచ్చారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌తోనూ ఓ చాన్స్ వచ్చిందన, ఆయన కోసం చాలా ఏళ్లు ఎదురుచూశాడన్న సంగతి తెలిసిందే. ఇక సంపత్ నంది తెరకెక్కించిన బెంగాల్ టైగర్, గౌతమ్ నందా పర్వాలేదనిపించాయి. ఇప్పుడు సంపత్ నంది నిర్మాతగా, దర్శకుడిగా బిజీగా ఉన్నారు. గోపీచంద్ తమన్నా కాంబినేషన్‌లో రాబోతోన్న సీటీమార్ సినిమాను సంపత్ నంది రెడీ చేశాడు. మామూలుగా అయితే ఈ సమ్మర్‌లోనే రావాల్సింది. కానీ కరోనా వల్ల అంతా తారుమారైంది. ఇప్పుడు సంపత్ నంది కలిశారు. తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కలిశాడా? లేదా? మరేతర కారణంతో కలిశాడో తెలియడం లేదు గానీ ఆయన చేసిన కామెంట్లు మాత్రం వైరల్ అవుతున్నాయి. చిరుతో దిగిన సెల్ఫీని షేర్ చేసిన సంపత్ నంది.. నా జీవితంలో మరో మరిచిపోలేని అద్భుతమైన రోజు. మన దేవుడు చిరం

ప్రస్తుతం నా దృష్టి మొత్తం దానిపైనే.. పెళ్లి వార్తలపై ఎట్టకేలకు నోరు విప్పిన హీరోయిన్ త్రిష

Image
‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’,‘బాడీగార్డ్‌’, ‘స్టాలిన్‌’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి . తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఇంతకాలం అలరిస్తున్న ఆమె.. గత కొంతకాలంగా మాత్రం కాస్త స్లో అయ్యారు. సరైన అవకాశాలు రాకపోవడం.. వచ్చిన మంచి హిట్లు దొరక్కపోవడంతో సినిమాల విషయంలో ఆమె కాస్త గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే చాలాకాలంగా గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ఆమె ఓ ప్రముఖ హీరోతో డేటింగ్‌లో ఉందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. మరి దీంతో ఎంతవరకూ నిజం ఉందో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత కూడా ఆమె మరో స్టార్ హీరోని వివాహం చేసుకోనుందంటూ వార్తలు వచ్చాయి. అవీ అవాస్తవమని తేలిపోయాయి. అయితే ఈ మధ్యకాలంలో త్రిష పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ గుసగుసలు వినిపించాయి. ఓ ప్రముఖ తమిళ డైరెక్టర్‌తో ఆమె ఏడు అడుగులు వేయబోతుంది అంటూ తెలిసింది. అయితే దీనిపై తాజాగా త్రిష టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదంటూ స్పష్టం చేసింది. ప్రస్తుతం త్రిష దృష్టి మొత్తం సినిమాలు, నటన మీదనే ఉందని.. అది తప్ప ఆమెకు మరో

నాన్న కోరిక అది.. వాళ్ళు చనిపోయాక 7 రోజుల పాటు! వరుస విషాదాలపై నోరువిప్పిన రాజీవ్ కనకాల

Image
తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజీవ్ కనకాల. సినిమా ఏదైనా, అందులో తన క్యారెక్టర్ ఎలాంటిదైనా ఇట్టే ఒదిగిపోయే ఎన్నో హిట్ సినిమాల్లో భాగమయ్యారు. అయితే రాజీవ్ ఇంట్లో ఆయన తల్లి, తండ్రి, చెల్లి వరుస మరణాలు తీవ్ర విషాదం నింపాయి. ముందు తల్లి లక్ష్మి కనకాల, ఆ తర్వాత తండ్రి దేవదాస్ కనకాల, ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడక ముందే సిస్టర్ శ్రీ లక్ష్మి మరణాలు రాజీవ్ కుటుంబాన్ని కుదిపేశాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ విషాద ఘటనలపై ఓపెన్ అయ్యారు రాజీవ్ కనకాల. మీ నాన్న గారికి ఓ డ్రీమ్ ఉండేదటగా అని యాంకర్ అడిగిన ప్రశ్నపై స్పందించిన రాజీవ్.. నాన్న డైరెక్ట్ చేయమని ఫోర్స్ చేయడంతో ఓ సారి పైలెట్ ఎపిసోడ్ డైరెక్షన్ చేశానని చెప్పారు. నాన్న డైరెక్షన్ చేయాల్సిన సీన్లు తనతో చేయించారని తెలిపారు. అలా దూరదర్శన్‌లో వచ్చే ప్రోగ్రాం కోసం చాలా ఎపిసోడ్స్ డైరెక్షన్ చేశానని అన్నారు. ఆ తర్వాత తన కుటుంబంలో జరిగిన వరుస విషాదాలపై ఆయన రియాక్ట్ అయ్యారు. తన తల్లి 2018లో మరణించారని, ఆ తర్వాత ఏడాదిన్నరకు తన తండ్రి కూడా కన్నుమూశారని తెలిపారు రాజీవ్ కనకాల. సోఫాలో కూర్చొని అలాగే కిందపడటంతో ఆయనకు ఫ

సూపర్‌స్టార్ మహేష్ సినిమాపై మరో లేటెస్ట్ అప్‌డేట్.. ఆడియో రైట్స్ ఎవరివంటే..

Image
‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి వరుస భారీ సక్సెస్‌లు అందుకొని సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్న తన 27వ సినిమాను ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ‘’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా గురించి ప్రకటించి చాలాకాలమే అయినా.. వచ్చిన అప్‌డేట్‌లు మాత్రం తక్కువే. ఇంతకాలం వరకూ సినిమా నుంచి ఎలాంటి అప్‌డైట్‌లు లేకపోవడంతో చిత్రయూనిట్‌పై మహేష్ అభిమానులు ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. తమ అభిమాన నటుడి సినిమాపై ఎప్పుడు అప్‌డేట్ వస్తుందా అంటూ వాళ్లు ఎంతో ఆకలిగా ఎదురుచూస్తున్నారు. అలా ఆతృతగా ఉన్న అభిమానులకు తాజాగా చిత్ర యూనిట్ మంచి శుభవార్త అందించింది. ఈ నెల 31వ తేదీన సినిమా నుంచి ఫస్ట్‌లుక్ విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా యూనిట్ నుంచి మరో అప్‌డేట్ బయటకు వచ్చింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను ‘సరిగమ సౌత్’ సంస్థ సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. దీంతో త్వరలోనే ‘సర్కారు వారి పాట’ నుంచి పాటల సందడి కూడా ప్రారంభం అవుతుందని సంకేతం వచ్చినట్లే. ఇక ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర

పవన్ కళ్యాణ్‌తో నిత్యామీనన్ రొమాన్స్.. కన్ఫర్మ్ చేసిన మేకర్స్! చీరకట్టులో సూపర్బ్ లుక్

Image
రీ- ఎంట్రీ తర్వాత కెమెరా ముందు దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్.. రానాతో కలిసి '' తెలుగు రీమేక్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తుండగా.. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ హీరోయిన్ విషయమై అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్నట్లుగా ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తొలిసారి పవన్‌ కళ్యాణ్‌తో జోడీ కడుతున్న ఈ బొద్దుగుమ్మ త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ కానుందని చెప్పుకున్నారు. తాజాగా దీనిపై క్లారిటీ ఇస్తూ నిత్యామీనన్ షూటింగ్‌లో జాయిన్ అయిందని పేర్కొంది చిత్రయూనిట్. ఈ మేరకు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌లో చీరకట్టులో కనిపించి అట్రాక్ట్ చేసింది నిత్య. ఈ సినిమాలో పవన్ భార్యగా ఆమె నటించనుందని తెలుస్తోంది. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ సినిమాలో భీమ్లా నాయక్‌గా పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఆయన లుక్ పవర్ స్టార్ అభిమానులకు పూనకాలు తెప్పించి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. సితార ఎంటర్‌టై

‘లక్ష్య’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. హీరోని అక్కడ ముద్దు పెట్టుకుంటున్న హీరోయిన్..

Image
నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్రలో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. ఆర్చరీ క్రీడా ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య మాజీ ఆర్చరీ ప్లేయర్ పాత్రలో కనిపించనున్నారు. కరోనా సెకండ్ వేవ్‌కి ముందు ఈ ఏడాది జవనరిలో సినిమా షూటింగ్‌ని మళ్లీ ప్రారంభించినట్లు ప్రకటించిన చిత్ర యూనిట్. కొద్ది రోజుల తర్వాత సినిమా టీజర్‌ని కూడా విడుదల చేసింది. ఈ టీజర్‌లో నాగశౌర్య లుక్స్.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. తదితర విషయాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హీరో నుదుటిపై హీరోయిన్ ముద్దు పెట్టడం మనం చూడొచ్చు. ఈ అప్‌డేట్ చూసిన తర్వాత సినిమా నుంచి మరిన్ని అప్‌డేట్స్ వస్తాయని అ

కెమెరా ముందు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు స్పీడ్.. షాకింగ్ లుక్! రాజమౌళి, పవన్ కామెంట్స్ వైరల్

Image
శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు, టాలీవుడ్ దిగ్గజం తొలిసారి కెమెరా ముందుకొచ్చారు. తన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న '' సినిమాతో ఆయన వెండితెరపై అలరించబోతున్నారు. విశిష్ట అనే పాత్రలో రాఘవేంద్రుడిని చూడబోతున్నాం. తాజాగా ఆయన ఇంట్రడ్యూసింగ్ వీడియో రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఫిదా చేసేలా ఉంది. సూటు, బూటు వేసి గాగుల్స్ పెట్టి యమ స్టైలిష్‌గా కనిపించారు రాఘవేంద్ర రావు. దర్శకేంద్రుడి శిష్యుడు, దర్శక ధీరుడ రాజమౌళి ఈ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి 'మౌనముని' ఇప్పుడు కెమెరా ముందుకొచ్చారు. ఆయన ఫస్ట్ లుక్ చూడండి అంటూ 'పెళ్లి సందD'వీడియోను ప్రేక్షకులతో పంచుకున్నారు రాజమౌళి. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా రాఘవేంద్ర రావుకు బెస్ట్ విషెష్ చెబుతూ ఓ లేఖ రాశారు. మొత్తానికైతే రాఘవేంద్ర రావు అలా కెమెరా ముందు చూసి తెలుగు ప్రేక్షకలోకం మురిసిపోతోంది. పాతికేళ్ల క్రిందట శ్రీకాంత్ హీరోగా 'పెళ్లి సందడి' సినిమాతో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.. ఇప్ప

సేవ్ సినిమా.. రివ్యూ రైటర్స్‌కి బ్రహ్మాజీ అభ్యర్థన! అలా చేయండంటూ నేరుగా చెప్పిన యాక్టర్

Image
సినిమా అనే రంగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమే. నిర్మాత, దర్శకుడు మొదలుకొని చిత్ర నిర్మాణంలో భాగమయ్యే నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరిపై ఒక్కో బాధ్యత ఉంటుంది. ఎవరికి వారు వారి వారి పనులకు న్యాయం చేస్తేనే అనుకున్న అవుట్‌పుట్ బయటకొస్తుంది. ఇక ఆ సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో రివ్యూ రైటర్స్‌ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. మూవీ రిలీజ్ అయ్యాక రివ్యూ రైటర్స్ సగటు ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకొని సినిమాపై వారి వారి ఒపీనియన్స్ బయటపెడుతుంటారు. హీరో హీరోయిన్ల నటనతో పాటు దర్శకుడి ప్రతిభ, నిర్మాణ విలువలు, సాంకేతిక నిపుణుల పనితీరుపై ఓ వివరణ ఇస్తుంటారు. ఇవన్నీ కూడా సినిమా హిట్ కావడం, కాకపోవడంపై ఎంతోకొంత ప్రభావం చూపుతుంటాయి. అయితే తాజా పరిస్థితుల నడుమ సీనియర్ నటుడు రివ్యూ రైటర్స్‌కి బ్రహ్మాజీ ఓ అభ్యర్థన పెట్టడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ''ఈ గడ్డు కాలంలో ఓ రెండు మంచి మాటలు రాసి జనాలను థియేటర్‌కి రప్పించండి. లేకపోతే రివ్యూ రాయడానికి సినిమాలు ఉండవు.. సినిమా చూడడానికి థియేటర

Sridevi Soda Centre Teaser: సోడాల శ్రీదేవి ఇక్కడ.. పగిలిపోద్ది! సుధీర్ బాబుకు పంచ్ ఇచ్చిన హీరోయిన్.. వీడియో వైరల్

Image
యంగ్ హీరో హీరోగా రాబోతున్న కొత్త సినిమా ''. ఈ సినిమాలో సుధీర్ బాబు క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. 'అక్కడుంది లైటింగ్ సూరి బాబు.. కొంచెం ఓల్టేజ్ ఎక్కువే ఉంటది' అంటూ మాస్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోందని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు చెప్పకనే చెప్పేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా సోడాల శ్రీదేవిని పరిచయం చేస్తూ ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. చిత్రంలో సుధీర్ బాబు సరసన నటిస్తున్న హీరోయిన్ 'సోడాల శ్రీదేవి'గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ఇంట్రో వీడియోలో ఆమె లుక్, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 'గోలి గొంతులోకి దిగుద్ది జాగత్త', 'ఒకడు సోడా సోడా అని మా కొట్టు దగ్గర తిరిగితే సోడా తీసి వాడి నెత్తిమీద కొట్టా. అప్పటినుంచి నా పేరు అయింది' అంటూ వచ్చిన డైలాగ్స్ ఆసక్తి రేకెత్తించాయి. ఇకపోతే ఈ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న సుధీర్ బాబు.. ''తట్టుకోలేనంత కోపం, పట్టలేనంత ప్రేమ'' అంటూ ట్యాగ్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప‌లాస 1978 సినిమాతో అరంగేట్రంలోనే మంచి పే

Radhe Shyam Release Date: రాధే శ్యామ్ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. సంక్రాంతి రేసులో ప్రభాస్

Image
యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న '' సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. భారీ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత లాక్ డౌన్ రావడం, షూటింగ్స్ వాయిదా పడటంతో చిత్ర యూనిట్ అప్‌డేట్స్ కరువయ్యాయి. పైగా ముందుగా చెప్పిన రిలీజ్ డేట్ జులై 30కి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. ఈ నేపథ్యంలో అదే రోజు జులై 30న కీలక అప్‌డేట్ ఇస్తామని ప్రకటించిన చిత్రయూనిట్.. తాజాగా కొత్త పోస్టర్ వదులుతూ న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ప్రభాస్ సంక్రాంతి బరిలో నిలుస్తారని తెలుపుతూ అధికారిక ప్రకటన ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన 'రాధే శ్యామ్' ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఈ మేరకు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌లో చేతిలో సూట్ కేసు పట్టుకొని యమ స్టైలిష్ లుక్‌లో కనిపించి అట్రాక్ట్ చేశారు ప్రభాస్. విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్ ఫ్యాన్స్ లైకులతో మోత మోగిస్తున్నారు. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా యూవీ క్ర

KTR: మరీ ఇంత దారుణమా? పరిష్కారం మీరే చూపాలంటూ రష్మి తీవ్ర ఆవేదన.. మంత్రి కేటీఆర్‌‌కి రిక్వెస్ట్

Image
బుల్లితెర యాంకర్‌గా జబర్దస్తీ చేస్తూ అప్పుడప్పుడూ వెండితెరపై తళుక్కున మెరుస్తున్న యాంకర్ తాజాగా ఓ విషయమై తీవ్ర ఆవేదన చెందింది. తన ప్రోగ్రామ్స్, షూటింగ్స్ తదితర కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ నిత్యం పలు విషయాలపై రియాక్ట్ అవుతుంటుంది ఈ జబర్దస్త్ యాంకర్. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఆవేదనతో తాజాగా మంత్రి కేటీఆర్‌ని ట్యాగ్ చేస్తూ ఓ రిక్వెస్ట్ చేసింది రష్మి. ఈ సృష్టిలోని మూగ జీవాలంటే రష్మికి ఎంతో ఇష్టం. మూగ జీవులను రక్షించే బాధ్యత మనుషులపై ఉందని ఇప్పటికే పలుసార్లు సూచించింది రష్మి. మూగ జీవాలన్నాక చిన్న పెద్ద అనే తేడాలేదని, సృష్టి లోని జీవాలన్నింటినీ కాపాడుకోవాలంటూ పలు సందర్భాల్లో ఆమె చెప్పుకొచ్చింది. ఈ సృష్టిలోని మూగ జీవాలను ఏ చిన్న హాని కలిగిందని తెలిసినా ఓ జంతు ప్రేమికురాలిగా వెంటనే దాన్ని ఖండిస్తూ వస్తోంది రష్మి. లాక్ డౌన్ వేళ అంతా అన్నదానాలు, ఆర్ధిక సాయాలు చేస్తుంటే రష్మి మాత్రం మూగ జీవాల ఆకలి తీర్చింది. వీధి కుక్కలకు స్వయంగా ఆహారం పంచుతూ వాటిపై ప్రేమను చాటుకుంది. అయితే కొంతకాలంగా హైదరాబాద్‌ (GHMC) పరిధిలో వీధి కుక్కల సంతతిని తగ్గించేందుకు గాను వీధుల్లోని శున

తిమ్మరుసు ట్విట్టర్ రివ్యూ: సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయం ఎలా ఉందంటే..

Image
వైవిద్యభరితమైన సినిమాలు ఎంచుకుంటూ తనదంటూ ప్రత్యేకమైన దారి అని నిరూపించుకుంటున్నారు యాక్టర్ సత్యదేవ్. సినిమా సినిమాకీ వైవిధ్యం ప్రదర్శించే నటుల్లో ఈయన ఒకరని చెప్పుకోవచ్చు. లీడ్ రోల్ పోషించిన తాజా సినిమా ''. నేడు (జులై 30) ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటికే యూఎస్ షోస్, ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ఈ సినిమాపై తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. అందులో కొన్ని పరిశీలించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందామా.. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ 'తిమ్మరుసు' సినిమాను క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో వినోదమే ప్రధానమని, ఆ తర్వాత నెమ్మదిగా కథలోకి తీసుకెళ్తామని మూవీ ప్రమోషన్స్‌లో యాక్టర్ సత్యదేవ్ అన్నారు. డిఫరెంట్ మూవీ కాన్సెప్ట్ అని తెలియడం, పైగా కరోనా సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. అయితే 'తిమ్మరుసు' ప్రీమియర్స్ చూసిన జనం చేస్తున్న ట్వీట్లను బట్టి చూస్తే ఈ సినిమా అంచన

పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్‌.. ఆయన భార్యకు కూడా! ఆసుపత్రిలో చికిత్స

Image
మహమ్మారి ఉదృతితో ఇప్పటికే సినీ ఇండీస్ట్రీ కకావికలం అయింది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తాకిడిలో కొందరు సినీ నటులు కన్నుమూయగా, ఎంతోమంది యాక్టర్స్ కోవిడ్ బారినపడి తిరిగి కోలుకున్నారు. అయితే రీసెంట్‌గా కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని ఉపిరిపీల్చుకున్న జనానికి.. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ పట్టుకుంది. కొత్త కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల నడుమ తాజాగా తనకు, తన కుటుంబసభ్యులకు కరోనా సోకిందని అధికారికంగా తెలిపారు నటుడు . గత కొన్నిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళి.. ఇటీవల ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా అని తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్ టెస్ట్ చేశారు. వాళ్లకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో అంతా గచ్చిబౌళిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన పోసాని.. తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను క్షమించమని కోరారు. కరోనా రావడం వల్ల తాను నటిస్తున్న రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడ్డాయని, తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్య

MAA Elections: ‘మా’ని చెడగొడుతున్న చీడపురుగులు.. షాకింగ్ కామెంట్స్ చేసిన బాబు మోహన్

Image
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్‌లో కొన్ని చీడ పురుగులు చేరి చెడగొడుతున్నాయని అన్నారు నటుడు . టాలీవుడ్‌లో వివాదాస్పదంగా మారిన MAA ప్రెసిడెంట్స్ ఎలక్షన్స్ ఇష్యూపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ‘మా’ అంటే మా కుటుంబం అని ఇందులో జరిగే వాటిని ఎన్నికలుగా చూడమని చెప్పిన ఆయన.. కావాలనే కొంతమంది ‘మా’ని వివాదం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికలు జరగడానికి ఇంకా టైం ఉంది.. నోటిఫికేషన్ కూడా రాలేదు. ఈ ఎన్నికలు పదిరోజుల హడావిడి మాత్రమే. అయితే ఆ మధ్య ‘మా’ అనేది బాగా వివాదం అవుతుంది. అది కొందరివల్ల మాత్రమే. చెడగొట్టే ఛీడపురుగులు అన్ని చోట్లా ఉంటాయి. అన్ని వృత్తులలోనూ ఈ ఛీడ పురుగులు ఉంటాయి.. అలాగే ‘మా’ వృత్తికి కూడా దాపరించింది. ‘మా’ ఎలక్షన్స్‌ జరగాల్సిందే అని అంటున్నారు.. దీన్ని మేం ఎలక్షన్స్‌లా భావించం. మా ఇంటి ఎన్నికలుగా మాత్రమే చూస్తాం.. మా బ్రదర్‌కి మా సిస్టర్‌కి ఓటు వేస్తున్నాం అని మాత్రమే అనుకుంటాం. మా అనేది ఒక ఫ్యామిలీ. పొలిటికల్ స్టంట్లు ఏమీ ఉండవు. కానీ ఈ మధ్య కొంతమంది ‘మా’లోకి దూరి చెడగొట్టడానికి ట్రై చేస్తున్నారు. చిరంజీవి, దాసరి లాంటి పెద్దలు ‘మా’ చెడగొట్టకుండా కాపాడారు. కానీ