మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమైన అనసూయ.. ఈసారి అలాంటి పాత్రలో..
బుల్లితెర యాంకర్గా భారీ పాపులారిటీ సంపాదించిన అనసూయ వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తోంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మతగా నటించిన ఈ ‘జబర్దస్త్’ బ్యూటీ తన గ్లామర్తో యమ అట్రాక్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం అమ్మడి డేట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రీసెంట్గా ‘థాంక్యూ బ్రదర్’ అనే సినిమాతో ఆమె ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో ఆమె అనుకోని పరిస్థితుల్లో లిఫ్ట్లో ఇరుక్కుపోయిన గర్భిణి స్త్రీగా ఆమె నటించింది. నిజానికి థియేటర్లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఆమె ‘పుష్ప’ అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ సినిమాలో అనసూయ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె మరిన్ని ప్రాజెక్టులతో బిజీగా మారిపోతుంది. ఆమె తన తదుపరి సినిమాలో ‘’ పాత్రలో కనిపించననున్నట్లు తెలుస్తోంది. ‘పేపర్బాయ్’ సినిమాతో మంచి గురింపు సంపాదించుకున్న దర్శకుడు . ఆయన త్వరలో ఓ విభిన్నమైన కథాంశంతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఆరు ప్రధాన పాత్రలు ఉండనున్నాయి. ఈ ఆరు పాత్రల్లో ఒకటి ‘ఎయిర్హోస్టెస్’ పాత్ర కాగా.. అందులో అనసూయ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా.. అనసూయ వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
Comments
Post a Comment