ఒలింపిక్ రజత పతాక విజేతపై మాధవన్ సంచలన కామెంట్స్.. ఇలా అన్నారేంటీ..

మీరాభాయ్ ఛాను.. ఇప్పుడు ఈ పేరు తెలియని భారతీయులు లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి.. తన స్వశక్తితో వెయిట్‌లిఫ్టర్‌గా ఎదిగింది మీరా. తన అద్భుతమైన ప్రతిభతో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలను సొంతం చేసుకుంది. తాజాగా ఆమె మరో అద్భుతమైన ఘనతను సాధించింది. ప్రస్తుతం జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె భారత్‌కు తొలి పతకాన్ని సాధించింది. 49 కిలోల విభాగంలో ఆమె రజత పతాకం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మీరాభాయ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. అంతేకాదు.. టోక్యో నుంచి దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. అంతేకాక.. మిజోరాం ప్రభుత్వం ఆమెకు స్పోర్ట్స్ కోటాలో అడిషనల్ సూపరంటెండెంట్ అఫ్ పోలీస్‌గా పదవి కూడా ఇచ్చింది. ఇక ఆ తర్వాత మిజోరాంలోని తన స్వగృహానికి చెందిన ఆమె ముందు నుంచి ఎలా ఉందో అలాగే జీవనం ప్రారంభించింది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచాను అనే గర్వం ఏ మాత్రం లేకుండా సాధారణంగా ఉంటుంది. తాజాగా ఆమె నేలపై కూర్చొని భోజనం చేస్తున్న ఫోటో కూడా ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచాను అనే అహం ఏ మాత్రం లేకుండా చాలా సింపుల్‌గా ఉంటున్న మీరాభాయ్‌ని ఆమె అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ప్రశంసిస్తున్నారు. అయితే నటుడు ఈ ఫోటోపై చేసిన కామెంట్లు మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ పిక్‌పై స్పందించిన మాధవన్.. ‘అసలు ఇది నిజమేనా.. నేను నమ్మడం లేదు’ అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే ఇలా కామెంట్ చేయడం వెనుక ఆయన అంతరార్థం మరోటి ఉంది. ‘ఎలాంటి ఉపాధి లేకపోయినా మహిళలు ఇలానే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలి’ అనేది ఆయన ఉద్ధేశం. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ