Posts

Showing posts from November, 2019

అడుగడుగో యాక్షన్‌ హీరో.. కార్పొరేట్‌ లీడర్‌గా బాలయ్య

Image
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రూలర్‌. ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు నిరాశపరచటంతో రూలర్‌తో అభిమానులను ఖుషీ చేయాలనుకుంటున్నాడు బాలయ్య. అందుకు తగ్గట్టుగా తమిళ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ డైరెక్షన్‌లో ఓ పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్‌ చౌహాన్‌, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఇటీవల టీజర్‌ను రిలీజ్‌ చేశారు. తాజాగా సినిమాలోని ఫస్ట్ లిరికల్‌ను రిలీజ్‌ చేశారు. బాలయ్య స్టైలిష్ కార్పోరేట్‌ లుక్‌కు సంబంధించిన ఈ పాటకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. చిరంతన్‌ భట్ స్వరాలందించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. సాయి చరణ్‌ భాస్కరుని ఆలపించారు. అడుగడుగో యాక్షన్‌ హీరో అంటూ సాగే ఈ పాట బాలయ్య అభిమానులకు ఇన్‌స్టాంట్‌గా నచ్చేలా ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే టీజర్‌లో ర

``ఇద్దరి లోకం ఒక్కటే`తో మరో హిట్ కన్‌ఫర్మ్‌`

Image
ఉయ్యలా జంపాల సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయిన రాజ్‌ తరువాత తరువాత మంచి విజయాలతో ఆకట్టుకున్నాడు. ఇటీవల సక్సెస్‌ల విషయంలో కాస్త తడబడినా.. త్వరలో అంటే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆడు మగాడ్రా బుజ్జి ఫేం జీఆర్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సక్సెస్‌ ఫుల్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌కు జోడిగా అర్జున్‌ రెడ్డి ఫేం షాలిని పాండే నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ రెండు పాటలను విడుదల చేశారు. ఈ రెండు పాటలకు మంచిరెస్సాన్స్‌ రావటంతో సినిమా మీద పాజిటివ్‌ బజ్‌ క్రియేట్ అయ్యింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథా కథనాలు సినిమా అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చిందన్న టాక్‌ వినిపిస్తోంది. అవుట్‌పుట్‌ మీద నమ్మకంతో సినిమాను సొంతంగా రిలీజ్ చేస్తున్నాడు. సినిమా సక్సెస్‌ను జెడ్జ్‌ చేయటంలో మంచి పేరున్న దిల్ రాజు ఈ సినిమాను స్వయంగా రిలీజ్‌ చ

నా కూతురూ డాక్టరే.. అలా జరిగితేనే సొసైటీలో భయం ఉంటుంది: ఆలీ

Image
రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారులో జరిగిన వెటర్నరీ డాక్టర్ హత్యాచార ఘటన చాలా బాధకరమని సినీ నటుడు, కమెడియన్ ఆలీ అన్నారు. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనతో నార్త్ ఇండియా మొత్తం కదిలిపోయిందని.. ఇన్ని సీసీటీవీ కెమెరాలు, ఇంత మంది పోలీసులు ఉన్నప్పటికీ హైదరాబాద్ నడిబొడ్డులో ఇలాంటి ఘటన జరగడం ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను ఆలీ పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ఘటన ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో జరగలేదు. సిటీలో జరిగింది. సిటీ నడిబొడ్డున జరిగింది. నిమిషానికి కొన్ని వందలు కార్లు తిరిగే హైవే పక్కన ఈ ఘటన జరిగిందంటే చాలా బాధాకరం. బాధితురాలి తండ్రి మాజీ ఆర్మీ ఉద్యోగి. ఆయన దేశానికి ఎంతో సేవ చేశారు. అలాంటి కుటుంబానికి ఇలా జరగడం చాలా బాధాకరం. ఆ ఫ్యామిలీకే కాదు ఏ కుటుంబానికి ఇలా జరగకూడదు. Also Read: 25 సంవత్సరాలు గుండెలపై మోసి పెంచుకున్న కూతురు, పైగా ఒక డాక్టర్ ఇలా ప్రాణాలు కోల్పోవడం జీర్ణించుకోలేని విషయం. శవం కూడా దొరకకుండా చేశారు. కనీసం శవమైనా దొరుకుంటే తల్లిదండ్రులు ఇంతగా బాధపడేవారు కాదు. ఒక

ఇలాంటి మగ మృగాలను నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు: చిరంజీవి

Image
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ హత్యాచార ఘటనపై మన తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలు స్పందించకపోవడంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ప్రతి విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించే స్టార్ హీరోలు.. ఇంత క్రూరమైన సంఘటన జరిగినా ఎందుకు స్పందించడం లేదంటూ చాలా మంది ప్రశ్నించారు. అయితే, ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ‘‘గత రెండు మూడు రోజులుగా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావం కలుగుతోంది. మగ మృగాల మధ్యా మనం బతుకుతోంది అనిపిస్తోంది. మనసు కలిచివేసిన ఈ సంఘటనల గురించి ఒక అన్నగా, ఒక తండ్రిగా స్పందిస్తున్నాను. ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. భయం కలిగించేలా ఉండాలి. నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు. త్వరగా నేరస్థులను పట్టుకోవడం అభినందనీయమే. అలాగే, త్వరితగతిన శిక్ష పడేలా చూడాలి. అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలంటే ఎవడైనా భయపడతాడు. ఆడపిల్లలు అందరికీ నేను చెప్పేది ఒక్కటే. మీ ఫోన్‌లో 100 నంబర్ స్టోర్

నేను చంద్రబాబు వ్యతిరేకిని కాదు.. ‘కమ్మ’ అంటే నాకు ఇష్టం: వర్మ ఇంటర్వ్యూ

Image
‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాతో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలనానికి తెరలేపారు. ఈ సినిమా ఇంకా విడుదలవ్వకపోయినా చేయాల్సినంత రచ్చ అయితే చేసేసింది. సినిమా టైటిల్ మొదలుకొని పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు, పాటలు ఇలా ప్రతి ఒక్కటీ వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా టైటిల్ రెండు కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉందని చాలా మంది విమర్శించారు. ఇలాంటి సినిమా విడుదల కావడానికి వీళ్లేదని వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ రాజకీయ నాయకుల పాత్రలను ప్రధానంగా చేసుకుని వివాదాస్పదమైన సెటైరికల్ సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మను తాజాగా ‘సమయం’ పలకరించింది. ఆయనతో కాసేపు ముచ్చటించింది. ఈ క్రమంలో ‘సమయం’ అడిగిన పలు ప్రశ్నలకు వర్మ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. Also Read: కడప అంటే తనకేమీ ప్రత్యేకమైన అభిమానం లేదని, కడపకే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని అన్నారు. కడప నుంచి రాజశేఖర్ రెడ్డి, జగన్ లాంటి ఎంతో మంది నాయకులు ప్రస్తుత రాజకీయాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని, సినిమా సబ్జెక్ట్ కూడా అదే కాబట్టి ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ అనే టైటిల్ పెట్టామని స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుక

వర్మకు షాక్.. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సెన్సార్‌కు నో

Image
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ రాజకీయ నాయకుల పాత్రలను ఆధారంగా చేసుకుని వర్మ తీసిన సెటైరికల్ మూవీ ఇది. టైటిల్‌తోనే తీవ్ర వివాదాస్పదమైన ఈ సినిమా ఆ తరవాత టీజర్లు, ట్రైలర్లు, పాటలతో మరింత కాకరేపింది. కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్న ఈ సినిమాను, చిత్ర టైటిల్‌ను చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక కేఏ పాల్ అయితే కోర్టుకెక్కారు. వాస్తవానికి ఈ చిత్రం ఈనెల 29న విడుదల కావాల్సి ఉంది. కానీ, అప్పటికి సెన్సార్ పూర్తికాలేదు. మరోవైపు హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ సినిమాను సెన్సార్ బోర్డు సభ్యులు చూసి వారం రోజుల్లో తమ అభిప్రాయం చెప్పాలని ఈనెల 28న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు సెన్సార్ బోర్డు సభ్యులు శనివారం ఈ చిత్రాన్ని చూశారు. ఇది చాలా వివాదాస్పద చిత్రమని, దీనికి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేది లేదని సభ్యులు తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో సెన్సార్ బోర్డు నిర్ణయంపై రివైవల్ కమిటీకి రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేయనున్నారని తెలిసింది. Also Read: ఇదిలా ఉంటే, ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ టైటిల్‌ప

BJPలో చేరిన సీనియర్ నటుడు.. షాకైన చిన్మయి శ్రీపాద

Image
నటి రాధిక సోదరుడు, సినీ నటుడు రాధా రవి బీజేపీలో చేరారట. ఈ విషాయన్ని ఆయన స్నేహితుడు శేఖర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ కంగ్రాట్స్ చెప్పారు. ఈ ఫొటోను ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద్ ట్వీట్ చేస్తూ.. ‘నమ్మలేకపోతున్నాను. నిజంగానా’ అంటూ షాకయ్యారు. ఎందుకంటే.. రాధారవి కొన్ని నెలల క్రితం లేడీ సూపర్‌స్టా్ర్ అయిన నయనతారపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నయనతార నటించిన ఓ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌కు రాధారవి గెస్ట్‌గా వెళ్లారు. ప్రమోషన్స్‌లో నయనతార పాల్గొనదన్న విషయం తెలిసిందే. తాను పెట్టుకున్న రూల్ ప్రకారం ఆడియో లాంచ్ వేడుకకు కూడా నయన్ వెళ్లలేదు. ఈ విషయం గురించి రాధా రవి స్పందిస్తూ.. “నయనతారతమిళ సినిమాల్లో దెయ్యంగా, తెలుగు సినిమాల్లో సీతాదేవిగా నటిస్తుంది. మా రోజుల్లే సీతాదేవి లాంటి దేవత పాత్రలకు కేఆర్ విజయను ఎంచుకొనేవాళ్లం. ఇవాళ సీతగా ఎవరైనా నటించేయవచ్చు. మర్యాద మన్ననలు పొందేవాళ్లనూ ఆ పాత్రకు తీసుకోవచ్చు, పడుకొనేవాళ్లనూ తీసుకోవచ్చు” అంటూ నయనతార వ్యక్తిత్వాన్ని కించపరిచే రీతిలో మాట్లాడాడు. రాధారవి చేసిన ఈ వ్యాఖ్యల్ని వెంటనే ఏ పేరుపొందిన నటుడు కానీ, దర్శకుడు కానీ, నిర్మాత కానీ ఖండించే సాహసం చెయ్యలేకపో

అభిమాని మృతదేహం చూసి కన్నీరుపెట్టిన కార్తి

Image
అభిమాని మరణాన్ని తట్టుకోలేకపోయారు ప్రముఖ తమిళ నటుడు కార్తి. చెన్నైకు చెందిన వ్యసాయ్ నిత్య అనే అభిమాని ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం అతను చనిపోయాడు. ఈ విషయం తెలీడంతో హుటాహుటిన అభిమాని స్వస్థలమైన ఉళుండూరుపేటకు బయలుదేరారు. అయితే అభిమాని మృతదేహాన్ని చూసి కార్తి ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వ్యసాయ్‌కి కార్తి అంటే ఎంతో అభిమానం. కార్తి ఫ్యాన్స్ అసోసియేషన్ అయిన మక్కల్ నాల మండ్రం పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. వ్యసాయ్ అంటే కార్తికి చాలా ఇష్టం. అలాంటి అభిమానిని కోల్పోవడంతో కార్తి తట్టుకోలేకపోయారు. వ్యసాయ్ కుటుంబీకులను కార్తి పరామర్శించారు. ఏ సాయం కావాలన్నా తాను ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఉళుండూరుపేట నుంచి కార్తి నేరుగా తాను నటించిన ‘తంబి’ సినిమా ఆడియో లాంచ్‌‌కు వెళ్లారు. ఆయన స్టేజ్‌పైకి ఎక్కగానే చనిపోయిన తన అభిమాని గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. అందరూ నిమిషం పాటు మౌనం వహించాలని కోరారు. కార్తికి తన అభి

మూడేళ్ల తరువాత తెలుగు సినిమాలో.. నానికి జోడిగా రీఎంట్రీ

Image
ప్రస్తుతం వి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న నేచురల్‌ స్టార్‌ తదుపరి చేయబోయే సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు. గతంలో నాని హీరోగా నిను కోరి సినిమాను తెరకెక్కించిన దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు నాని. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయిన ఈ సినిమా డిసెంబర్‌లో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో నానికి జోడిగా నటించనుంది. నాని కెరీర్‌ను ములపు తిప్పిన ఎవడే సుబ్రమణ్యం సినిమాతో నాని, రీతూలు కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరు జోడి కడుతుండటం ఆసక్తికరంగా మారింది. Also Read: నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా మ‌జిలీ లాంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత శివ నిర్వాణ ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. డిసెంబ‌ర్ నెల‌లో సినిమా లాంఛ‌నంగా ప్రారంభించి జ‌న‌వ‌రిలో రెగ్యుల‌ర్ షూటింగ్‌కు వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `వి` సినిమాలో నటిస్తున్నాడు

మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై లైంగిక వేధింపులు

Image
ఆడవాళ్లపై అఘాయిత్యాలకు అడ్డు అదుపు లేకుండాపోయింది. ఇలాంటి ఘటనలు కలకలం రేపుతున్నా కూడా కామాంధులు తమ వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. సామాన్య అమ్మాయిలపైనే కాదు కామాంధులు సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. తాజాగా మలయాళ బిగ్‌బాస్ షోలో పాల్గొన్న యువతిపై కదులుతున్న బస్సులో ఓ యువకుడు లైంగిక చర్యలకు పాల్పడ్డాడట. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురువారం తెల్లవారు జామున కేరళలో చోటుచేసుకుంది. బాధితురాలు అళువ నగరంలో బస్సు ఎక్కి వెళుతుండగా, అప్పర్ బెర్త్‌లో నిద్రిస్తున్న ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడట. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తుండడంతో కేకలు వేసింది. డ్రైవర్ బస్సు ఆపడంతో నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని కోరింది. అంతేకాదు తనకు జరిగిన సంఘటనను లైవ్ స్ట్రీమింగ్ చేసింది. అయితే తాను ఏమీ చేయలేదంటూ ఆ కుర్రాడు బుకాయించాడు. సారీ చెప్పి పోలీసులకు మాత్రం పట్టించొద్దంటూ వేడుకున్నాడు. అయినా ఆ బాధితురాలు వెనక్కు తగ్గలేదు. కొట్టక్కల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని ప్రశ్నించగా.. తాను ఆ అమ్మాయిపై ఎలాంటి అఘాయిత్యం చేయలేదని, బెర్త్ పక్కనున్

వైరల్ వీడియో: బంగారు కోడిపెట్ట.. ఖుష్బూ, జయప్రదతో చిరు స్టెప్పులు

Image
మెగాస్టార్ చిరంజీవి హీరోగా 1992లో వచ్చిన ‘ఘరానా మొగుడు’ సినిమాలోని ‘బంగారు కోడిపెట్ట’ సాంగ్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఇదే పాటను ‘మగధీర’లో రీమేక్ కూడా చేశారు. తన కెరీర్‌లో మంచి పాపులర్ సాంగ్ అయిన ‘బంగారు కోడిపెట్ట’కు ఇటీవల మెగాస్టార్ డ్యాన్స్ చేశారు. అది కూడా ఖుష్బూ, జయప్రద వంటి ఒకప్పటి టాప్ హీరోయిన్లతో కలిసి స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల చిరంజీవి ఇంట్లో 80ల తారల గెట్ టుగెదర్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన‌భైల‌ నాటి తార‌లంతా ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ పేరుతో ప్రతియేటా వార్షికోత్సవ వేడుక‌లు జ‌రుపుకుంటున్నారు. గ‌తంలో రకరకాల ప్రదేశాల్లో ఈ మీటింగ్ పార్టీ చేసుకున్నారు. ఈసారి ప‌దో వార్షికోత్సవ పార్టీ కావడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ కార్యక్రమానికి రూప‌క‌ల్పన చేశారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో కొత్తగా నిర్మించుకున్న తన ఇంట్లో ఈ వేడుకలు జరిపారు. Also Read: ఈనెల 23, 24వ తేదీల్లో జరిగిన ఈ వేడుకల్లో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్‌ నుంచి 40 మంది తారలు పాల్గొన్నారు. వీరంతా ఈ వేడుకల్లో బాగా ఎంజాయ్ చేశారు. తన మిత్రుల క

క్రూర మృగాలు కూడా సిగ్గుపడతాయి.. ప్రియాంక రెడ్డి హత్యపై అనుష్క

Image
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఒక అభాగ్యురాలిపై నలుగురు కామ పిశాచులు లైంగిక దాడిచేసి అత్యంత క్రూరంగా హత్య చేయడం పట్ల ప్రతి ఒక్కరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోషులను నడిరోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు శక్తిని, ధైర్యాన్ని అందించాలని ప్రార్థిస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు వరకు ప్రతి ఒక్కరూ ప్రియాంక రెడ్డి హత్యపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ప్రముఖులు ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటనపై సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. నటి అనుష్క శెట్టి అయితే కాస్త ఘాటుగానే స్పందించారు. ప్రియాంక రెడ్డిని అత్యంత దారుణంగా హత్యచేసిన ఆ క్రిమినల్స్ చూసి క్రూర మృగాలు కూడా సిగ్గుపడతాయన్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. Also Read: ‘‘అమాయకురాలైన ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. ఇది మానవత్వాన్ని కదిలించే విషాదకరమైన ఘటన. ఈ క్రిమినల్స్‌ను క్రూర మృగాలతో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతాయి. మన సమాజంలో ఒక మహిళగా పుట్టడం

Priyanka హత్య: ‘సినిమాలోనే చంపలేకపోయా, అలాంటిది నిజంగా ఎలా చంపారు’

Image
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యతో తెలుగు రాష్ట్రాలు షాక్‌కు గురయ్యాయి. సాధారణ ప్రజలే కాదు సినీ ప్రముఖులు కూడా ఈ హీనమైన ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు ఉరిశిక్ష పడి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై ‘ఆర్ ఎక్స్ 100’ ఫేం స్పందించారు. తాను నటించిన ‘గుణ 369’ సినిమాలో ఓ అమ్మాయిపై చేయి వేసినందుకే నలుగురు యువకులను దారుణంగా చంపేస్తాడు. ఈ ఘటనను గుర్తుచేసుకుంటూ ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ‘గుణ 369 సినిమాలో క్లైమాక్స్ సన్నివేశంలో నటిస్తున్నప్పుడే నాకు నాలుగైదు రోజులు చాలా డిస్టర్బింగ్‌గా ఉండేది. అలాంటిది నిజంగా అలాంటి ఘటన జరగడం మనం దాని గురించి ఏమీ చేయలేకపోవడం సిగ్గు చేటు. ప్రియాంక ఆత్మ ఎటూ శాంతించదు. అందుకే రెస్ట్ ఇన్ పీస్ సొసైటీ అనడం బెటర్. సారీ సిస్టర్ నిన్ను కాపాడుకోలేకపోయాం’ అని పేర్కొన్నారు. ‘గుణ 360’ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం దారుణంగా ఉంటుంది. ఓ ఆడపిల్లపై అఘాయిత్యం చేయాలని చూసిన దుండగులను కార్తికేయ దారుణంగా నరికేస్తుంటాడు. ఈ సన్నివేశం సినిమా మొత్తంలో హైలైట్‌గా నిలిచిందని చాలా మంది కామెంట్స్ చేశారు. చంపుతున్నట్లు నటించడానికే తనకు మనసే రాలేదంటే..

Poonam Kaur: లేచిపోయిందా అని అడగడానికి పోలీసులకు సిగ్గులేదా?

Image
ప్రియాంక రెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. వెటర్నరీ డాక్టర్ అయిన ప్రియాంక రెడ్డిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి అతిదారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అయితే ప్రియాంక ఎప్పటికీ ఇంటికి రాకపోయేసరికి ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో పోలీసులు ప్రియాంక తల్లిదండ్రులను ప్రశ్నించిన తీరు వివాదాస్పదమైంది. ‘అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు సర్’ అని ప్రియంక తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే.. ‘లేచిపోయిందేమో..’ అన్నారట. ఈ విషయాన్ని ప్రియాంక తల్లిదండ్రులు మీడియా ముందు బయటపెట్టడంతో ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. దీనిపై ప్రముఖ నటి స్పందించారు. ‘పోలీసులకు ఇది మర్యాదపూర్వకంగా అనిపించుకోదు. లేచిపోయిందేమో అని అడిగిన పోలీసులకు సిగ్గుగా లేదా. అసహ్యమేస్తోంది. వాట్ ద ఫ**’ అంటూ పూనమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క ప్రియాంక హత్య కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక రెడ్డి (22)ని లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్ చేసి హతమార్చినట్లు తెలుస్త

వెబ్‌ బాటలో మరో స్టార్‌ హీరోయిన్‌.. త్వరలోనే డిజిటల్‌ ఎంట్రీ!

Image
ప్రస్తుతం అంతా డిజిటల్‌ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. బడా బడా నిర్మాణ సంస్థలతో పాటు స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు తెలుగు స్టార్స్‌ డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లోకి అడుగుపెట్టగా తాజాగా మరో టాప్‌ హీరోయిన్‌ ఈ రంగం దిశగా అడుగులు వేస్తోంది. తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన అందాల భామ తమన్నా భాటియా. తన అందంతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ ఇటీవల వరుసగా పాన్‌ ఇండియా సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది. తాజాగా ఈ భామ మరో కొత్త ప్రయోగానికి రెడీ అవుతోంది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఓ వెబ్‌ సిరీస్‌లో ఈ భామ కీలక పాత్రలో నటిస్తోంది. Also Read: `నవంబర్‌ స్టోరి` పేరుతో తెరకెక్కుతున్న వెబ్‌ సిరీస్‌లో తమన్నా నటిస్తోంది. ఓ నేరుస్తుడైన తండ్రికి, అతని కూతురుతో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. జీఎం కుమార్‌ తండ్రి పాత్రలో నటిస్తుండగా తమన్నా కూతురి పాత్రలో కనిపించనుంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ తాను మరిన్ని విభిన్న పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నట్టుగా వెల్లడించింది. రెగ్యులర్‌ రెండున్నర

ఈ రోజు రిలీజ్‌ కావాల్సిన మరో సినిమా కూడా వాయిదా పడింది!

Image
కోలీవుడ్ స్టార్‌ హీరో హీరోగా, లెజెండరీ దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎన్నై నోకి పాయుమ్ తోట. గౌతమ్‌ మీనన్‌ స్వయంగా నిర్మించిన ఈ సినిమా చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తుంది. దాదాపు రెండున్నరేళ్లుగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు గౌతమ్‌ మీనన్‌. కానీ ఆ ప్రయత్నాలేవి ఫలించటం లేదు. ధనుష్‌ లాంటి స్టార్‌ హీరో నటించిన సినిమాకు ఆర్థిక కష్టాలు రావటంపై సినీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల కొంత తేరుకున్న గౌతమ్‌ మీనన్‌, ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్రయత్నాలు తిరిగి ప్రారంభించాడు. తమిళ్‌తో పాటు తెలుగులో తూటా పేరుతో ఈ సినిమా రిలీజ్‌ కు ప్లాన్‌ చేశాడు. గత నెల ఈ సినిమా రిలీజ్‌కు డేట్ ప్రకటించినా చివరి నిమిషంలో వాయిదా పడింది. Also Read: ఈ రోజు (29-11-2019) తూట రిలీజ్‌ అంటూ ప్రకటించారు చిత్రయూనిట్. పెద్దగా ప్రమోషన్‌ చేయకపోయినా సినిమాను వదిలేసి చేతులు దులుపుకోవాలని భావించారు. కానీ మరోసారి గౌతమ్‌ సినిమాను విడుదల చేయటంలో ఫెయిల్ అయ్యాడు. తెలుగుతో పాటు, చాలా చోట్ల తమిళ వర్షన్‌ రిలీజ్‌ కూడా ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. కారణాలు వెల్లడించకపోయినా ఈ రోజు రిలీజ్‌ లేనట్ట

వర్మ పెట్టిన సినిమా చిచ్చు.. సెన్సార్ బోర్డ్‌కి ఏపీ ప్రభుత్వం లేఖ

Image
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ సెటైరికల్ మూవీ ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ను షెడ్యూల్ ప్రకారం రేపు (నవంబర్ 29న) విడుదల చేయాల్సి ఉంది. కానీ, ఈ సినిమాకు ఇప్పటి వరకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాలేదు. దీనికి తోడు హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. చిత్ర విడుదలకు వీలులేకుండా ఈరోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లో సినిమాను చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. టైటిల్ విషయంలో కూడా హైకోర్టు సీరియస్ అయ్యింది. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా సినిమా టైటిల్ ఉందని, దాన్ని మార్చాలని సూచించింది. ఇదిలా ఉంటే, ఈ టైటిల్ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లోని ప్రాంతీయ సెన్సార్ బోర్డు ఒక లేఖ రాసింది. ప్రభుత్వ సలహాదారు (పబ్లిక్ అఫైర్స్) సజ్జల రామకృష్ణారెడ్డి పేరిట ఈరోజు రీజినల్ సెన్సార్ బోర్డుకు ఒక లేఖ అందింది. చిత్ర టైటిల్‌ను మార్చాల్సిందిగా ఈ లేఖలో రీజినల్ సెన్సార్ ఆఫీసర్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. ‘‘రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తెలుగు సినిమా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ నవంబర్ 29న ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రా

Ranga Marthanda అలీ రెజాకు కృష్ణవంశీ బంపర్ ఆఫర్.. షూటింగ్ క్లిక్స్ భలే కిక్

Image
సిక్స్ ప్యాక్ బాడీతో నాగార్జునతోనే బిగ్ బాస్ సీజన్ 3 గ్రీకువీరుడు అనిపించుకున్న కంటెస్టెంట్ బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ణవంశీ అప్ కమింగ్ మూవీ ‘రంగమార్తాండ’లో కీలకపాత్రలో కనిపంచబోతున్నాడు అలీ రెజా. లాంగ్ గ్యాప్ తరువాత ‘నట సామ్రాట్’ అనే మరాఠా చిత్రాన్ని కృష్ణవంశీ ‘రంగమార్తాండ’గా తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ జంటగా నటిస్తున్నారు. సుమారు 15 ఏళ్ల తరువాత భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో పనిచేస్తుంది రమ్యకృష్ణ. 2004లో కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన శ్రీఆంజనేయంలో కీలకపాత్రలో నటించిన రమ్యక్రిష్ణ 15 ఏళ్ల తరువాత భర్త డైరెక్షన్‌లో హీరోయిన్‌గా చేయడం విశేషం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కీలకపాత్రను దక్కించుకున్నాడు అలీ రెజా. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్‌కి సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు అలీ రెజా. క్రిష్ణవంశీకి ప్రస్తుతం హిట్లు లేకపోయినప్పటికీ ఆయన దగ్గర చిన్న హీరోలుగా కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్లు.. నేడు స్టార్ హీరోలుగా ఉన్నారు. మరి బుల్లితెర బుల్ డోజర్ అనిపించుకున్న అలీ రెజా లక్ ఎలా ఉండబోతుంద

బాల‌కృష్ణకి మంచు లక్ష్మి ఛాలెంజ్

Image
నటసింహా నందమూరి బాలకృష్ణకు నటి మంచు లక్ష్మి ఛాలెంజ్ విసిరారు. ఆయనతో పాటు తమ్ముడు మంచు మనోజ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా ఈ ఛాలెంజ్‌ను విసిరారు లక్ష్మి. ఇప్పటికే అర్థమైవుంటుంది ఆ ఛాలెంజ్ ఏంటో. అదేనండి.. మొక్కలు నాటే ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, క్రీడా ప్రముఖులు ఇందులో భాగం అవుతున్నారు. న‌వంబర్ 13న ప్రముఖ యాంక‌ర్ సుమ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించి మూడు మొక్కలు నాటారు. అనంతరం జూనియర్‌ ఎన్టీఆర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, మంచు లక్షి, యాంకర్‌ ఓంకార్‌కు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విసిరారు. సుమ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన మంచువార‌మ్మాయి త‌న ఇంట్లో మొక్క నాటారు. పర్యావరణాన్ని కాపాడే ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో భాగం అయినందుకు సంతోషంగా ఉంద‌ని మంచు ల‌క్ష్మి ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు. ‘‘గ్రీన్ ఛాలెంజ్ చాలా ముఖ్యమైన‌ది. ఎన్ని చెట్లు నాటితే అంత మంచిది. ఇది నిరంత‌రాయంగా కొన‌సాగాలి. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా.. మంచు మ‌నోజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, నంద‌మూరి

వర్మకు షాక్‌ ఇచ్చిన హైకోర్టు.. `కమ్మ రాజ్యంలో..` రిలీజ్‌కు బ్రేక్‌

Image
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం . ఈ శుక్రవారం (29-11-2019) రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమాకు తెలంగాణ హైకోర్ట్‌ బ్రేక్‌ వేసింది. వర్మ ఈ సినిమా టైటిల్ ప్రకటించిన దగ్గర నుంచే ఈ సినిమాపై వివాదాలు మొదలయ్యాయి. టైటిల్ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. కొంత మంది వ్యక్తులను కించపరిచేలా వర్మ తన సినిమాలో పాత్రలను చూపించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే విషయమై కేఏ పాల్‌ కోర్టును ఆశ్రయించారు. అయితే వర్మ ఇవేవి పట్టించుకోకుండా సినిమా రిలీజ్‌కు ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ రిలీజ్‌కు కొన్ని గంటల ముందు హైకోర్ట్‌ వర్మకు షాక్‌ ఇచ్చింది. Also Read: కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై దాఖలైన పిటీషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. సోలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వర్‌ రావు సినిమాకు ఇంకా సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వలేవని కోర్టుకు తెలిపారు. సినిమా విషయంలో తలెత్తిన వివాదాలను పరిష్కరించి అభ్యంతరాలను స్వీకరించాలని సెన్సార్‌ బోర్డ్‌కు హైకోర్టు సూచించింది. వారం రోజుల్లోగా వివాదాలను పరిష్కరించి సినిమాకు సెన్సార్‌ సర్టిఫికేట

ఆ నటిపై కోపం లేదు, తెలీకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు: విజయ్ దేవరకొండ

Image
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండకు కోపం వచ్చింది. మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి ‘అర్జున్ రెడ్డి’ సినిమాను చుట్టుముట్టిన వివాదంపై ప్రశ్నలు అడుగుతుంటే చిరాకుగా ఉంటోందని అంటున్నారు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో గెస్ట్‌గా పాల్గొన్నారు . ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అర్జున్ రెడ్డి సినిమాపై వస్తున్న కామెంట్స్ గురించి, ప్రముఖ మలయాళ నటి పార్వతి సినిమాపై చేసిన కామెంట్స్ గురించి మాట్లాడారు. ‘నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇక నా వల్ల కాదు. నేను దీని గురించే ఆలోచిస్తుంటే అది నా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నేను సాధారణంగా అర్థం చేసుకునే వ్యక్తిని. ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిలో నిజాయతీగా సమాజం గురించి ఆలోచిస్తూ ప్రశ్నలు వేసిన వారు ఉన్నారు. కానీ కొందరు అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీకుండా కామెంట్లు చేస్తున్నారు. వారు పొరపాటుపడ్డారని అనుకుంటున్నాను. అర్జు్న్ రెడ్డి గురించి చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు. నాకు ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు’ ‘అర్జున్ రెడ్డి సినిమాపై పార్వతి కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. అందుకు నాకు ఆమెపై ఎలాంటి కోప

ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. బిజినెస్ జరిగినా సినిమా ఆలస్యమైంది!

Image
ఎన్నో అవాంతరాల తరువాత నిఖిల్ సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కిన ఈ శుక్రవారం (29-11-2019) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ ఈ సినిమాతో తన అనుబందాన్నీ, అనుభావాలను మీడియాతో పంచుకున్నాడు. సినిమా ఆలస్యానికి కారణాలను కూడా వెల్లడించాడు . ఈ ఏడాది మేలోనే రిలీజ్‌ కావాల్సిన అర్జున్‌ సురవరం దాదాపు 6 నెలలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అన్ని సినిమాలు ఆర్ధిక ఇబ్బందులతో ఆలస్యమవుతుంటాయి. కానీ మా సినిమాకు అలాంటి ఇబ్బందులు లేకపోయినా ఆలస్యమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమాతో సంబంధం లేని వ్యక్తుల కారణంగా రిలీజ్‌ ఆలస్యమైందని తెలిపాడు. Also Read: నిర్మాతలు, థియేటర్ల యజమానులు రిలీజ్‌కు ముందుకు వచ్చినా మధ్యలో ఉన్న వ్యక్తలు కారణంగానే సినిమా ఆలస్యమైందన్నాడు నిఖిల్‌. డిస్ట్రిబ్యూటర్ల నుంచి సరైన సహకారం అందకపోవటం కారణంగానే ఇలా జరిగిదని తెలిపాడు. తమకు సంబంధం లేని సినిమాలు, తమిళ సినిమాల బిజినెస్‌లతో లింక్‌ పెట్టి అర్జున్‌ సురవరం రిలీజ్‌ను వాయిదా వేయించారని తెలిపాడు. ఇది తన మనసుకు నచ్చిన సినిమా అన్న నిఖిల్.. అందుకే ఇన్ని అవాంతరాలు ఎదురైన సినిమా రిలీజ్‌ కోసం తాను ఇంత కష్టపడ్డానన్నాడు. ఈ స

Ismart Shankar: ఆ కుర్రాడికి ఫిదా అయిపోయిన చార్మి

Image
డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. నిధి అగర్వాల్, నభా నటేష్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అయితే ఈ సినిమాలోని ‘సిలక సిలక’ పాటకు శ్రీకాంత్ అనే కుర్రాడు వేసిన డ్యాన్స్‌కి ఫిదా అయిపోయింది సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన చార్మి. రామ్‌లాగే అంతే ఎనర్జిటిక్‌గా పర్‌ఫెక్ట్‌గా డ్యాన్స్ చేసిన ఆ కుర్రాడి వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది. ‘అమేజింగ్ మ్యాన్. ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. అక్కడ నేను కూడా ఉంటే బాగుండేది నీతో పాటు డ్యాన్స్ చేసేదాన్ని’ అని ట్వీట్ చేశారు. ఈ వీడియోను యతీష్ యాదవ్ అనే నెటిజన్ ఈ వీడియోను షేర్ చేశాడు. పూరీ జగన్నాథ్, రామ్, చార్మీ, నిధి అగర్వాల్‌ని ట్యాగ్ చేశాడు. చాలా కాలం తర్వాత పూరీ జగన్నాథ్‌కి, రామ్‌కి ఈ సినిమాతో మంచి సక్సెస్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.75 కోట్లు రాబట్టింది. మెమొరీ మార్పిడి అనే కొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకున్న పూరీ.. హీరో డైలాగ్స్‌కు తెలంగాణ యాస‌ను జోడించి కుర్రకారులో జోష్ పెంచాడు. తన టేకింగ్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు

Amma Rajyamlo Kadapa Biddalu ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ పేరు మార్పు.. కొత్త టైటిల్ ప్రకటించిన వర్మ

Image
ఎట్టకేలకు వర్మ దిగిరాకతప్పలేదు.. ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ టైటిల్‌ను మార్చుతూ ప్రకటన చేశారు. ఈనెల 29న విడుదల కానున్న ఈ సినిమాకు ఇదే టైటిల్‌తో సెన్సార్‌కు వెళ్లితే తిరస్కరణ తప్పదనే భావనతో టైటిల్‌ను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ అనే టైటిల్‌ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చారు. రేపు సెన్సార్‌కు వెళ్తున్న ఈ సినిమాను వివాదాలు చుట్టేశాయి. ముఖ్యంగా ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్‌లే వివాదం కావడంతో ఈ టైటిల్ మార్పుతో రేపు సెన్సార్ బోర్డ్‌కు వెళ్తున్నారు వర్మ. కాగా ఈ సినిమాలో తనను కించపరుస్తూ చూపించారని సినిమాను వాయిదా వేయాలని కోర్టుకెక్కారు కేఏ పాల్. మరోవైపు చంద్రబాబు, లోకేష్ బాబులను కించపరుస్తూ ఈ సినిమాను రూపొందించడంతో ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా విడుదలపై గుర్రుగా ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ఇక విడుదలకు మధ్యలో ఒకే రోజు సమయం ఉండటం.. సెన్సార్ కార్యక్రమాలు ఇంకా కంప్లీట్ కాకపోవడంతో వర్మ గత సినిమాల మాదిరే ఈ సినిమా కూడా వాయిదా పడుతుందా? లేక సెన్సార్ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అన్నది సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Sri Reddy వర్మకి ఓపెన్ ఆఫర్.. వెనుక నుండి క్రేజీ డ్రైవ్ అంటూ అరాచకం

Image
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. నాతో డేట్‌కి వస్తావా? అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది. అయితే అక్కడితో ఆగితే ఆమె ఎందుకు అవుతుంది. కాకరేపు హాట్ ఫొటోలను షేర్ చేసి తనదైన శైలిలో బూతు పోస్ట్‌లు వదలింది. షార్ట్ ఫ్రాక్‌లో తన భారీ ఎదను కెమెరాకు విరివిగా వదిలేసి కవ్వించే కళ్లతో చేతిలో పెద్ద స్టిక్ పట్టుకుని.. మత్తుగా చూస్తూ.. ‘నా వెనుక ఉన్నట్టు .. చాలా క్రేజీగా డ్రైవ్ చేసి’ అంటూ శ్రీరెడ్డి మార్క్ పోస్ట్ పెట్టింది. ఇక ఆమె ఇంతగా కవ్విస్తుంటే ఆమె 6 మిలియన్ ఫాలోవర్స్ ఊరుకుంటారా?.. హలో శ్రీరెడ్డి.. మేం కూడా మంచి డ్రైవర్లమే అంటే నాటీ కామెంట్స్ చేస్తున్నారు. వాటిలో పచ్చి బూతులతో పాటు మంచి ఎంటర్ టైన్మెంట్ కూడా ఉండనే ఉంది. ఆమె సెక్సీ శరీరాన్ని చూసి తట్టుకోలేక కొంత మంది కామప్రియులు సొల్లు కార్చుతూ కామెంట్స్ పెడుతుంటే.. ‘ఎంత కరువులో ఉన్నారు భయ్యా!’ అంటూ ఓ నెటిజన్ స్పందించడం నవ్వుపుట్టిస్తోంది. మరి శ్రీరెడ్డి ఓపెన్ ఆఫర్‌పై వర్మ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

‘దర్బార్’ ఫస్ట్ సాంగ్.. ‘దుమ్ము’లేపిన ఎస్పీబీ

Image
సూపర్ స్టార్ రజినీకాంత్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్న చిత్రం ‘దర్బార్’. నయనతార హీరోయిన్. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుబస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమా నుంచి తొలిపాటను బుధవారం విడుదల చేశారు. ‘దుమ్ము ధూళి’ అంటూ సాగే ఈ పాట నిజంగా దుమ్మురేగిపోయేలా ఉంది. దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ పాటను ఆలపించారు. తమిళం, తెలుగులోనూ ఆయనే పాడారు. ఎస్పీబీతో పాటు అనిరుధ్ కూడా గొంతు కలిపారు. తెలుగులో అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఎస్పీబీ ఎప్పటిలానే మంచి ఊపుతో పాడారు ఈ పాట. దుమ్ముదులిపారు. వాస్తవానికి రజినీకాంత్ సినిమాల్లో సోలో సాంగ్స్‌ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే పాడుతూ ఉంటారు. అయితే, ‘కబాలి’, ‘కాలా’ చిత్రాల్లో ఎస్పీబీ పాటలు లేవు. ఆ లోటును రజినీ ఇప్పుడు తీర్చేసుకున్నారు. ప్రస్తుతం ‘దర్బార్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే రజినీకాంత్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం పూర్తిచేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్

కొడుక్కి ఫ్లాప్‌ ఇచ్చిన దర్శకుడికి మరో ఛాన్స్‌ ఇస్తున్న స్టార్‌ ప్రొడ్యూసర్‌

Image
టాలీవుడ్‌లో రచయితగా వరుస బ్లాక్‌ బస్టర్లు అందించిన రైటర్‌ . స్టార్‌ డైరెక్టర్లకు ఎన్నో సూపర్‌ హిట్ కథలను అందించిన వంశీ తాను దర్శకుడిగా మాత్రం సక్సెస్‌ కాలేకపోయాడు. టాలీవుడ్‌ స్టార్ హీరో ఛాన్స్‌ ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు వక్కంతం వంశీ. దర్శకుడిగా వక్కంతం వంశీకి తొలి ప్రయత్నంలో దారుణమైన రిజల్ట్‌ వచ్చింది. ఈ సినిమా తరువాత వంశీ ఇండస్ట్రీలో కనిపించటం మానేశాడు. ఇతర దర్శకుల చిత్రాలకు కథలు ఇవ్వటం కూడా మానేశాడు. అయితే త్వరలో మరోసారి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. Also Read: తనయుడు అల్లు అర్జున్‌కు భారీ డిజాస్టర్‌ ఇచ్చినా వంశీకి మరో చాన్స్‌ ఇస్తున్నాడు మెగా ప్రొడ్యూసర్‌ . అయితే ఈ సారి భారీ బడ్జెట్‌ సినిమాగా కాకుండా లో బడ్జెట్‌లో ఓ యంగ్ హీరోతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కథ రెడీ చేసే పనిలో వంశీ హీరో ఎవరన్నది ఇంకా ఫిక్స్‌ చేయలేదు. గతంలో పరుశురామ్‌కు కూడా ఇలాగే గీతా గోవిందం సినిమాతో బ్రేక్‌ ఇచ్చిన అల్లు అరవింద్‌. ప్రస్తుతం బొమ్మరిల్లు

ఆ దర్శకుడితో `అర్జున్‌ రెడ్డి`.. ఎలా సింక్‌ అవుతుంది?

Image
అర్జున్‌ రెడ్డి సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా మారిపోయాడు టాలీవుడ్‌ యంగ్ హీరో . ఒక్క సినిమాతోనే స్టార్‌ ఇమేజ్‌ అందుకున్న విజయ్‌ ప్రస్తుతం వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ అనే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా నలుగురు భామలు నటిస్తుండటం విశేషం. విజయ్‌ మూడు డిఫరెంట్ లుక్స్‌లో నటిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, కేథరిన్‌ థ్రెస్సా, ఐశ్వర్యా రాజేష్‌, ఇసా బెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలెంటైన్స్‌ డే కానుకగా 2020 ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే మరో రెండు సినిమాలు లైన్‌లో పెట్టాడు అర్జున్‌ రెడ్డి. Also Read: వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ షూటింగ్ పూర్తయిన వెంటనే డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్‌ చేసేందుకు ఓకె చెప్పాడు. పూరీ, చార్మీలు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ప్రస్తుతం ఆకాష్‌ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్‌ సినిమా నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న పూరీ, ఆ పనులు పూర్తయిన వెంటనే విజయ

నాకు గిల్లడం ఇష్టం.. అందుకే `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` తీశా: ఆర్జీవి

Image
సంచలన దర్శకుడు తెరకెక్కిస్తున్న మరో వివాదాస్పద చిత్రం . ప్రస్తుతం రాజకీయ పరిస్థితులపై వర్మ సెటైరికల్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా శుక్రవారం (29-110-2019) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్‌, కేఏ పాల్‌, పవన్‌ కళ్యాణ్‌లను పోలిన పాత్రలు ఉన్నాయి. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌తో సినిమాకు కావాల్సినంత క్రేజ్‌ని తెచ్చి పెట్టాడు వర్మ. సినిమా రిలీజ్‌కు డేట్‌ దగ్గర పడుతుండటంతో సినిమా విశేషాలు తెలియజేసేందుకు మీడియా సమావేశం నిర్వహించాడు. హైదరాబాద్‌లోని తన ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వర్మ. Also Read: కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఓ మెసేజ్‌ ఓరియంటెడ్ సినిమా అంటున్నాడు వర్మ. ఈ సినిమాలో ఏ వర్గాన్ని తక్కువగా చేసి చూపించటం లేదన్నాడు. కేవలం కొన్ని సంఘటనల ఆధారంగా కథ రెడీ చేసుకున్నట్టుగా వెల్లడించాడు. తాను ఎవరినీ టార్గెట్‌ చేసి సినిమా చేయనని కేవలం తనకు ఇంట్రస్టింగ్‌గా అనిపించిన పాయింట్‌ను మాత్రమే సినిమాగా తెరకెక్కిస్తానని తెలిపాడు. మామూలు క్రైమ్‌ కన్నా.. పొలిటికల

నటుడు సంపూర్ణేశ్ బాబు కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Image
న టుడు రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సంపూర్ణేశ్ బాబుతో పాటు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. సిద్దిపేట పట్టణంలో కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సంపూర్ణేశ్ బాబు త‌న భార్య, పిల్లలతో కారులో ప్రయాణిస్తుండ‌గా.. ఆర్టీసీ బ‌స్సు ఆయ‌న కారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంపూతో పాటు ఆయ‌న‌ భార్య, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలికి వచ్చి సంపూర్ణేశ్ బాబుతో పాటు కుటుంబ సభ్యులకు సాయం అందించారు. అనంతరం పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. స్థానికులు సమాచారంతో ఘ‌ట‌నా స్థలికి చేరుకున్న పోలీసులు సంపూతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. Also Read:

విజయ్ దేవరకొండ కొత్తింటి కోసం అంత ఖర్చుపెట్టారా!

Image
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సొంతింటికి మారిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు శ్రీనగర్ కాలనీలో ఉంటున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ తాజాగా ఫిల్మ్ నగర్‌లోని కొత్త ఇంటికి మారింది. ఫిల్మ్ నగర్‌లోని హీరో శ్రీకాంత్‌ ఇంటికి సమీపంలో ఈ ఇంటికి విజయ్ దేవరకొండ కొనుగోలు చేశారు. ఆదివారం తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి గృహప్రవేశం చేశారు విజయ్. అయితే, ప్రస్తుతం ఈ ఇంటి గురించి ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఈ కొత్త సొంతింటి కోసం విజయ్ దేవరకొండ రూ.20 కోట్లు వెచ్చించినట్టు ఇండస్ట్రీ టాక్. ఈ ఇంటిని చాలా విశాలంగా నిర్మించుకున్నారట విజయ్. ప్రస్తుతం విజయ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ‘గీతగోవిందం’ సినిమాతో విజయ్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం ఆయన రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని టాక్. Also Read: అంతేకాకుండా సొంతంగా రౌడీ బ్రాండ్‌ పేరుతో బట్టల వ్యాపారం కూడా చేస్తున్నారు. ఇది కూడా బాగా కలిసొస్తోందట. వీటన్నిటికీ తోడు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చేది కూడా పెద్దమొత్తంలోనే ఉంటుందని అంటున్నారు. పలు బ్రాండ్లకు విజయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వీటి ద్వారా కూడా కోట్లలో ఆదాయం వస్తోంది. అంతేకాకుం

LIVE: ‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ వేడుక.. చిరంజీవి చీఫ్ గెస్ట్

Image
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ చాలా రోజులుగా ఎదురుచూస్తోన్న సమయం ఆసన్నమైంది. ఆయన హీరోగా నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా వాయిదాలు పడుతూ వస్తూ ఎట్టకేలకు విడుదలకు నోచుకుంది. ఈ సినిమా విడుదల ఆలస్యమైనా ప్రేక్షకులకు మాత్రం బాగానే గుర్తుండిపోయింది. దీనికి తోడు చిత్ర యూనిట్ మంచి ప్రచారం కల్పించడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచేందుకు, చిత్ర ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా‌లో నిర్వహిస్తోన్న ఈ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరవ్వటం విశేషం. కాగా, ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు. టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్’ మ‌ధు స‌మ‌ర్పణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రాజ్‌ కుమార్ ఆకెళ్ల నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పోసాని కృష్ణముర‌ళి, సత్య, త‌రుణ్ అరోరా, వెన్నెల కిషోర్, నాగినీడు, విద్యుల్లేఖ రామన్ తదితరులు న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం సమకూర్చారు. ఇదిలా ఉంటే, ఇటీవల విడుదలైన ‘అర్జున్ సురవరం’ ట్రైలర్‌కు మంచి రెస

బాహుబలి చూస్తారు.. సైరా చూడరని చిరుకి ముందే చెప్పా: గిరిబాబు హాట్ కామెంట్స్

Image
నరసింహారెడ్డి.. మెగాస్టార్ కలల ప్రాజెక్ట్‌ను రామ్ చరణ్‌ తేజ్ భారీ బడ్జెట్‌తో నిర్మించి అక్టోబర్ 2న విడుదల చేసిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ ఆశించిన స్థాయి విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. క్లోజింగ్ కలెక్షన్స్‌లో బయ్యర్లకు నష్టాలు వచ్చాయనేది ఇండస్ట్రీ టాక్. ఇదిలాఉంటే.. ఈ చిత్రంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు సీనియర్ నటుడు గిరిబాబు. ‘చిరంజీవి నేను కలిసి చాలా సినిమాలు చేశాం. ఇప్పటికీ నా తమ్ముడులాగే బిహేవ్ చేస్తాడు. కనిపిస్తే ఆత్మీయంగా పలకరిస్తాడు. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య మంచి ఆత్మీయత ఉంది. ఇటీవలే ఆయన నటించిన ‘సైరా’ కూడా చూశా. అద్భుతమైన సినిమా తీశావ్ అని చెప్పా. కాని.. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తరువాత సినిమా తీశాం కాబట్టి.. అది యూత్‌ని కనెక్ట్ కాదు. జనరేషన్ గ్యాప్ వచ్చేసింది.. ఎప్పుడో జరిగింది ఇప్పుడు తీస్తే లాభం ఉండదని చెప్పా. స్వాతంత్ర్యం వచ్చి మూడు జనరేషన్‌లు అయిపోయిపోయింది. ఇప్పుడు స్వాతంత్ర్య పోరా

హిందూపురంలో బాలకృష్ణ కోటి దీపోత్సవం.. హాజరైన అల్లుళ్లు

Image
హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో సామూహిక కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆఖరి కార్తీక సోమవారం పురస్కరించుకుని అనంతపురం జిల్లా హిందూపురంలోని ఎంజీఎం గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి బాలకృష్ణ పాల్గొన్నారు. బాలకృష్ణతోపాటు ఆయన భార్య వసుంధరాదేవి, పెద్దల్లుడు - టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, చిన్న అల్లుడు భరత్‌ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన ఈ దీపోత్సవాన్ని పండుగలా నిర్వహించారు. ఈ కోటి దీపోత్సవానికి హిందూపురం పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎంజీఎం గ్రౌండ్ శివనామ స్మరణతో మార్మోగిపోయింది. కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. వీటిని ఎవరూ మరువవద్దు, కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని అన్నారు. అలాగే, హిందూపురంలో సామూహిక కోటి దీపోత్సవాన్ని నిర్వహించినట్టు ఫేస్‌బుక్ ద్వారా కూడా బాలకృష్ణ వెల్లడించారు. కుటుంబ సభ్యులతో పూజలు చేసిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు

స్వీట్‌హార్ట్‌తో హాట్ నటి స్నానం.. వీడియో వైరల్

Image
ప్రముఖ తమిళ నటి సాక్షి అగర్వా్ల్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2020 క్యాలెండర్ ఫొటోషూట్‌లో భాగంగా సాక్షి కేరళలోని అలెప్పీ వెళ్లారు. అక్కడ ఓ ఏనుగుపై కూర్చుని సెక్సీ డ్రెస్‌లో ఫొటోలకు పోజులిచ్చారు. ఏనుగు సాక్షిపై తొండంతో నీళ్లు పోస్తుంటే ఆ వీడియోను సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘రాజా (ఏనుగు పేరు)తో కలిసి షూట్ చేస్తుంటే ఎన్నో భావోద్వేగాలు కలిగాయి. రాజా నా స్వీట్ హార్ట్. ఏనుగుతో షూట్ చేయడానికి ముందు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. నా వల్ల కానీ ఫొటోల వల్ల కానీ ఏనుగుకు ఎలాంటి హాని కలిగించలేదు’ అని పేర్కొన్నారు. తమిళంలో ‘రాజా రాణి’ చిత్రంతో సాక్షి సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత ‘కాలా’ సినిమాలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ కోడిల పాత్రలో కనిపించింది. కమల్ హాసన్ హోస్ట్ చేసిన సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్ 3లోనూ పాల్గొంది. సినీ ఇండస్ట్రీలో క్యాలెండర్ ఫొటోషూట్స్‌కు బాగా పాపులారిటీ ఉంది. ఓ క్యాలెండర్ నిండా హీరో, హీరోయిన్ల ఫొటోలను ప్రింట్ చేస్తుంటారు. వివిధ పోజుల్లో సెలబ్రిటీలు పోజులిస్తే చాలు హీరో, హీరోయిన్లకు భారీ మొత్తంలో పారితోషికం ఇస్తుంటారు. ముఖ

నిర్మాతగా మారుతున్న స్టార్‌ హీరోయిన్‌.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తుందట!

Image
హీరోయిన్‌గా మంచి ఫాంలో ఉన్న సమంత త్వరలో కొత్త అవతారం ఎత్తబోతుందట. ప్రస్తుతం 96కు రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాతో శర్వానంద్‌కు జోడిగా నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో నిర్మాణ సంస్థను ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ నుంచి అన్నపూర్ణ ప్రొడక్షన్స్‌తో పాటు మనం ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మాణ సంస్థలు ఉన్నాయి. తాజాగా సమంత కూడా తన సొంత బ్యానర్‌ను స్థాపిస్తే ఆ ఫ్యామిలీ నుంచి మూడో నిర్మాణ సంస్థ అవుతుంది. అక్కినేని నాగచైతన్యతో పెళ్లి తరువాత సమంతలో చాలా మార్పు వచ్చింది. అప్పటి వరకు కమర్షియల్‌ సినిమాలు మాత్రమే చేసిన సమంత పెళ్లి తరువాత రూట్‌ మార్చింది. ఫార్ములా సినిమాలను పక్కన పెట్టి లేడి ఓరియంటెడ్‌ సినిమాల వైపు అడుగులు వేస్తోంది. యూ టర్న్‌, ఓ బేబీ లాంటి సినిమాలో మంచి విజయాలు సాధించింది. Also Read: నిర్మాతగానూ తన మార్క్‌చూపించాలని భావిస్తుందట సమంత. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేసేందుకే సమంత ఈ నిర్ణయం తీసుకుంది. తన సొంత బ్యానర్‌లో కొత్త దర్శకులతో సినిమాలను నిర్మించనుంది సామ్‌. అయితే బ్యానర్‌ను ఎప్పుడు స్థాపించనుంది. తొలి సినిమా ఎవరు డైరెక్ట్ చేయనున్నారన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్

అయోధ్య తీర్పు నేపథ్యంలో సినిమా.. వివాదానికి తెర తీస్తున్న బాహుబలి రచయిత

Image
బాహుబలి సినిమాతో కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన భజరంగీ బాయ్‌జాన్‌కు కూడా విజయేంద్ర ప్రసాదే కథ అందించారు. ఆ తరువాత కూడా మణికర్ణిక లాంటి చారిత్రక చిత్రాలకు కొన్ని కమర్షియల్‌ సినిమాలకు పనిచేశారు ఈ స్టార్‌ రైటర్‌. ప్రస్తుతం దక్షిణాదిలో వివాదాస్పద బయోపిక్‌గా తెరకెక్కుతున్న తలైవి (జయ లలిత) బయోగ్రాఫికల్‌ మూవీకి కథ అందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కంగనా జయ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ వచ్చే ఏడాది జూలైలో ఈ సినిమా విడుదల కానుంది. Also Read: తాజాగా విజయేంద్ర ప్రసాద్‌ మరో వివాదాస్పద కథకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. ఎన్నో దశాబ్దాలుగా నలిగిన అయోధ్య రామమందిర విషయంలో ఇటీవల తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. వివాదాస్పద స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి అప్పగిస్తూ తీర్పు వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా బిన్న వాదనలు వినిపించాయి. అయితే ఈ అంశంపై విజయేంద్ర ప్రసాద్‌ ఓ కథ రెడీ చేస్తున్నాడట. ఈ కథకు అపరాజిత అయోధ్య అనే టైటిల్‌ను పరిశీలిస్తున్

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో టాలీవుడ్‌ హీరోకు జరిమానా

Image
ఇటీవల సినీ, టెలివిజన్‌ సెలబ్రిటీలు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడుతున్న ఉదంతాలు తరచూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు తారలు ఈ కేసులో పట్టుబడి జరిమానాలు చెల్లించగా తాజాగా మరో టాలీవుడ్‌ హీరోకు కూడా కోర్టు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో జరిమానా విధించింది. తెలుగు ఈ నెల 24న మధ్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. బాచుపల్లిలో వీఎంఆర్ కాలేజ్ దగ్గర పట్టుబడ్డ ప్రిన్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై ఈ రోజు (మంగళవారం) కూకట్‌పల్లి కోర్టుకు హాజరయ్యాడు ప్రిన్స్‌. విచారణ జరిపిన న్యాయస్థానం ప్రిన్స్‌కు జరిమానా విధించింది. జరిమానా చెల్లించి వెళ్లిపోయాడు. Also Read: తెలుగులో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నీకు నాడు డాష్ డాష్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ప్రిన్స్‌ సెసిల్‌. తరువాత బస్‌ స్టాప్‌, రొమాన్స్‌ సినిమాలతో సక్సెస్‌లు అందుకున్నా ఆ ఫాంను కంటిన్యూ చేయటంలో ఫెయిల్ అయ్యాడు. వరుస ఫ్లాప్‌లు ఎదురుకావటంతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టర్న్‌ అయ్యి నేను శైలజ, మిస్టర్‌ లాంట సినిమాల్లో నటించాడు. నాని వ్యాఖ్యతగా వ్యవహరించిన బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 2లో కంటెస్టంట్‌గానూ కనిపించాడు. కొంతక

డార్లింగే కావాలంటున్న బడా నిర్మాత.. కాంబినేషన్‌ సెట్‌ చేసే పనిలో ప్రభాస్‌

Image
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్న టాలీవుడ్‌ హీరో ప్రభాస్‌. రెండు భాగాలుగా రిలీజ్‌ అయిన బాహుబలి బాలీవుడ్‌ సినిమాలకు కూడా సాధ్యం కాని వసూళ్లు సాదించటంతో ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. జాతీయ స్థాయిలో యంగ్ రెబల్‌ స్టార్‌ క్రేజ్‌ తారా స్థాయికి చేరింది. దీంతో ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు. ప్రభాస్‌తో సినిమా చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ చాలా ప్రయత్నాలు చేశాడు. బాహుబలి సినిమాను బాలీవుడ్‌లో రిలీజ్ చేసిన కరణ్‌కు అక్కడ ప్రభాస్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో చాలా బాగా తెలుసు. అందుకే ప్రభాస్‌తో ఓ భారీ బడ్జెట్‌ సినిమా చేస్తే బాగుంటుదంని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ప్రభాస్‌ను ఇంత వరకు బాలీవుడ్ నిర్మాతలెవరకీ ఓకే చెప్పలేదు. గతంలో ఇదే విషయంలో ప్రభాస్‌, కరణ్‌ మధ్య దూరం పెరిగినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్స్‌ అంటూ కొట్టి పారేశాడు కరణ్‌. ఇటీవల ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా కూడా బాలీవుడ్‌లో భారీ వసూళ్లనే సాధించింది. ఈ సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వచ్చినా బాలీవుడ్‌ నిర్మాతలకు మాత్రం భారీ లాభాలను తెచ్చిపెట్ట

‘ఖైదీ’ బ్లాక్ బస్టర్.. తెలుగులో భారీగా లాభం రాబట్టిన కార్తి సినిమా

Image
రూ.100 కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా రూ.2 కోట్లు లాభం తెచ్చిపెడితే పెద్ద విషయం కాదు. కానీ, కోటి రూపాయల బడ్జెట్‌తో తీసిన సినిమా ఇంకో కోటి రూపాయల లాభం తీసుకొస్తే అది పెద్ద విషయం. ఇలాంటి సినిమాలు తెలుగులో ఎన్నో ఉన్నాయి. అయితే, తమిళం నుంచి తెలుగులోకి అనువాదమైన సినిమాలు కూడా ఈ స్థాయిలో లాభాలు తీసుకురావడం చాలా అరుదు. అలాంటి అరుదైన చిత్రం ‘ఖైదీ’. కార్తి హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రదర్శనను పూర్తిచేసుకున్న ఈ సినిమా రూ. 7.05 కోట్ల షేర్ వసూలుచేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను రూ.3.5 కోట్లకు విక్రయించారు. దానికి రెండింతలు వసూలైంది. అంటే, 100 శాతం లాభం వచ్చింది. ఈ చిత్ర తెలుగు విడుదల హక్కులను ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకున్నారు. వాస్తవానికి ఈ సినిమాకు ముందు ఆయన ‘కల్కి’, ‘బందోబస్త్’, ‘ఎన్జీకే’ సినిమాల విడుదల హక్కులను కొనుగోలు చేశారు. ఈ రెండు సినిమాలు ఆయనకు నష్టాల్నే మిగిల్చాయి. ఇప్పుడు ‘ఖైదీ’తో ఆయన లాభాలు అందుకున్నారు. వాస్తవానికి దళపతి విజయ్ ‘విజిల్’, కార్తి ‘ఖైదీ’ సినిమాలు ఒకేర

అందుకే మగాళ్ల చూపు వక్షోజాలపై ఉంటాయా: సింగర్ చిన్మయి

Image
ప్రముఖ సింగర్ ఓ మహిళ ఎదుర్కొన్న షాకింగ్ ఘటన గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి ఓ యువతి వద్దకు వెళ్లాడు. అయితే ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన ఆ యువతిని చూసి ‘అన్నీ కనిపిస్తున్నాయి చున్నీ కప్పుకోండి’ అన్నాడట. దాంతో ఆమెకు ఒళ్లుమండింది. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి సోషల్ మీడియాలో పేర్కొంది. ‘స్విగ్గీ.. మీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు వారి పని వారు చేసుకుంటే మంచిది అని చెప్పండి. మీ సంస్థకు చెందిన ఓ డెలివరీ ఏజెంట్ పార్సిల్ ఇవ్వడానికి వచ్చి చున్నీ కప్పుకో అని నాకు చెప్పి సలహా ఇచ్చి వెళ్తున్నాడు. నా ఇంట్లో నేను ఎలా ఉండాలో చెప్పడానికి వాడెవడు. అసలు నేనెలా ఉంటే వాడికేంటి? వారికి ఇతరులతో ఎలా నడుచుకోవాలో కూడా మేమే నేర్పించాలా?’ అని మండిపడింది. దాంతో కొద్ది సేపట్లోనే ఆమె ట్వీట్ వైరల్ అయింది. కొందరు నెటిజన్స్ ఆమెకు సపోర్ట్ చేస్తే మరికొందరు కామెంట్స్ చేశారు. తనను ఎగతాళి చేస్తున్నవారిపై స్పందిస్తూ.. ‘ఈ ఘటన గురించి ఎవరైనా జోక్‌గా కామెంట్లు చేస్తే అందరినీ బ్లాక్ చేస్తాను’ అని బెదిరించింది. అయితే ఈ ట్వీట్స్‌పై చిన్మయి ఆ మహిళకు మద్దతు తెలుపుతూ పచ్చిగా

బాబోయ్ యాంకర్‌గా Nayanthara ఎలా ఉందో చూశారా?

Image
ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని నేడు లేడీ సూపర్‌స్టార్ అనిపించుకునే స్థాయికి ఎదిగారు . 2003లో వచ్చిన ‘మనస్సినక్కరే’ అనే మలయాళం సినిమాతో నయన్‌ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. అయితే నయన్ సినిమాల్లోకి రాకముందు ఓ మలయాళం ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేసేవారన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలీదు. నయన్ యాంకర్‌గా వార్తలు చదువుతున్నప్పుడు తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ‘నా పేరు డయానా మరియం కురియన్’ అంటూ తన గురించి తాను పనిచేసుకుంటూ కనిపించారు. యాంకర్‌గానూ నయన్ స్టైలిష్‌గా ఉన్నారు కానీ చాలా మంది ఆమె లుక్స్ చూసి షాకయ్యారు. స్టార్ నటీనటుల పాత కాలం నాటి ఫొటోలు, వీడియోలు బయటికి వస్తే అవి ఎంత వైరల్ అవుతాయో తెలిసిందే. ఎందుకంటే ఇలాంటి వాటి గురించి ఫ్యాన్స్‌కి కూడా తెలీకపోవచ్చు. వీడియోలో నయన్ వాయిస్ కూడా చాలా షాకింగ్‌గా ఉంది. తమిళం, మలయాళం సినిమాల్లో మాత్రమే నయన్ తన సినిమాలకు తాను డబ్బింగ్ చెప్పుకుంటారు. కానీ తెలుగు ప్రేక్షకులు నయన్ సొంత వాయిస్ ఎప్పుడూ వినలేదు. దాంతో తొలిసారి నయన్ ఒరిజినల్ వాయిస్ విని తెలుగు ఫ్యాన్స్‌ కూడా షాకవుతున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు నయన్.. లేడీ రజినీకాంత్, కమల్ హాసన్

ఆడ డ్రాగన్‌ని వదులుతున్న Ram Gopal Varma.. లెజెండ్‌ ఫ్యాన్స్‌కి పండగే

Image
వివాదాలకు మారు పేరుగా నిలిచిన నుంచి ఓ అద్భుతమైన సినిమా రాబోతోంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాల తర్వాత ఇంకేం షాక్ ఇవ్వబోతున్నారబ్బా అనుకుంటున్న ఫ్యాన్స్‌కు ఈసారి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌తో సర్‌ప్రైజ్ చేశారు. ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ అనే ఇండో చైనీస్ సినిమాను వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి గతంలో ఎప్పుడూ ప్రకటించలేదు. ఈపాటికే సినిమా షూటింగ్ కూడా మొదలెట్టేసి ట్రైలర్‌ను వదలబోతున్నారు. దీని గురించి తాజగా వర్మ సోషల్ మీడియాలో ప్రకటించారు. ‘నా కెరీర్‌లోనే యాంబీషియస్ సినిమా ఈ ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’. భారతదేశం నుంచి రాబోతున్న తొలి మార్షల్ ఆర్ట్స్ సినిమా. మార్షల్ ఆర్ట్స్ కింగ్ బ్రూస్లీ 80వ జయంతి సందర్భంగా నవంబర్ 27న టీజర్‌ను విడుదల చేయబోతున్నా. బ్రూస్లీ యూనివర్సల్ బర్త్ ‌టైం ప్రకారం 3.12కు టీజర్ రిలీజ్ చేస్తాం. ఈ సినిమా ట్రైలర్‌ను బ్రూస్లీ పుట్టిన చైనాలోని ఫోషాన్ సిటీలో డిసెంబర్ 13న రిలీజ్ చేస్తాం’ అని ప్రకటిస్తూ ఈ సినిమాకు సంబంధించని పోస్టర్‌ను షేర్ చేశారు. పోస్టర్‌లో ఈ సినిమాలో టైటిల్ రోల్‌ పోషిస్తున్న హీరోయిన్ బ్రూస్లీ సిగ్నేచర్ స్టైల్‌లో ఫైట్ చేస్తున్

బిగ్‌బాస్ భామ హాట్ ఫొటో..నెంబర్ కావాలంటూ చుక్కలు చూపించిన ఫ్యాన్స్

Image
హాట్ హీరోయిన్ సరదాగా ఫొటో పోస్ట్ చేస్తే అభిమానులు ఆమెకు కామెంట్స్‌తో చుక్కలు చూపించారు. ప్రముఖ తమిళ నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. బెడ్‌పై పడుకుని పక్కన ఓ టెలిఫోన్ పెట్టుకుని అదిరిపోయే స్టిల్ దిగింది. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయింది. ఇందుకు కారణం రైజా ఆ ఫొటోకు ఇచ్చిన క్యాప్షనే. ‘నా ల్యాండ్‌లైన్‌కు కాల్ చేయండి’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక నెటిజన్స్ ఊరుకుంటారా? నెంబర్ ఇవ్వకుండా ఎలా కాల్ చేయమంటారా? నెంబర్ ఇవ్వండి అంటూ వరుసగా కామెంట్లు పెట్టారు. ఈ ఫొటోకు దాదాపు ఐదు వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 2017లో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన రైజా విల్సన్ ‘వీఐపీ 2’ సినిమాలో కాజోల్‌ పక్కన అసిస్టెంట్‌గా చిన్న పాత్రలో కనిపించారు. అయితే ఈ పాత్రకు ఆమెకు క్రెడిట్ దక్కలేదు. ఆ తర్వాత ‘ప్యార్ ప్రేమా కాదల్’ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో ఆమె హరీష్ కళ్యాణ్‌కు జోడీగా నటించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. అంతేకాదు ఈ సినిమా తర్వాత రైజాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అ

Samantha: ఆ చావుకు నేనే కారణం అనుకున్నా, గుండె పగిలేలా ఏడ్చా

Image
అక్కినేని నాగచైతన్య, రెండు అమెరికన్ పిట్ బుల్స్‌ను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. వాటి పేర్లు హష్ అక్కినేని, డ్రోగో అక్కినేని. ఇటీవల సమంత, నాగ చైతన్య హష్ తొలి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు. తన ఫ్రెండ్స్‌ని పిలిపించి గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటుచేశారు. అయితే హష్, డ్రోగో కంటే ముందు సమంత బూగబూ అనే కుక్క పిల్లను పెంచుకునేదట. అయితే దానికి ఓ వింత వైరస్ సోకి నాలుగు నెలల వయసులోనే చనిపోయిందట. ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘వీడియోలో మీరు చూస్తున్న కుక్కపిల్ల హష్ కాదు. దాని పేరు బుగాబూ. దీనిని ఇంటికి తెచ్చుకోవడానికి ముందు కుక్కల్ని ఎలా పెంచాలో 30 రోజుల పాటు కోర్స్ తీసుకున్నాను. నాకు జీవితాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలిసింది కాబట్టి కుక్క విషయంలోనూ అలాగే ఉండాలని అనుకున్నాను. కానీ నేను నిజానికి చాలా దూరంలో ఉన్నానని తక్కువ సమయంలోనే తెలిసింది. బుగాబూని ఇంటికి తెచ్చుకున్నప్పుడు దానికి పార్వో అనే వైరస్ సోకిందని తెలిసింది. ఇంట్లోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే అది చనిపోయింది. ఆ సమయంలో నేను గుండె పగిలేలా ఎంతగా ఏడ్చానో నాకు ఇప్పటికీ గుర్తే’ ‘దాని చావుకు నేనే కా

తమన్‌కు సాయి తేజ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఇదో వెరైటీ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్!

Image
మనకు వినిపించే ప్రతి శబ్దంలోనూ సంగీతం దాగి ఉంటుంది. కాకపోతే, ఆ శబ్ధాన్ని సప్త స్వరాలైన ‘‘స రి గ మ ప ద ని’’ ఆధారంగా సరైన క్రమంలో మళిచినప్పుడు మాత్రమే వినసొంపైన సంగీతం వస్తుంది. ఈ సంగీతాన్ని వినిపించడానికి ఎన్నో రకాలైన మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఘటం, హార్మోనియం, డప్పు, డోలక్ ఇవే మన సంగీత పరికరాలు. కానీ, కాలంతో పాటు సంగీతంలో రకరకాల మార్పులు వచ్చాయి. కొత్త కొత్త సంగీత పరికరాలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం సినిమా రంగంలో సంగీత దర్శకులు ఎన్నో కొత్తరకం ఇన్‌స్ట్రుమెంట్లు వాడుతున్నారు. చాలా వరకు అన్నీ ఎలక్ట్రానిక్ పరికరాలే. ఎలక్ట్రానిక్ కీబోర్డ్, ఎలక్ట్రిక్ గిటార్, రిథమ్ ప్యాడ్స్, ఎలక్ట్రానిక్ ఫ్లూట్.. ఇలా చాలా రకాలున్నాయి. ఎ.ఆర్.రెహమాన్ లాంటి సంగీత దర్శకులైతే ప్రపంచ వ్యాప్తంగా జల్లెడ పట్టి మరీ కొత్తరకం పరికరాలు తీసుకొస్తారు. అయితే, ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఒక కొత్త మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ ఉంది. దాని పేరు పెర్ల్ మాలెట్‌స్టేషన్. దీనిపై ఎలాంటి సౌండ్‌ అయినా వచ్చేస్తుంది. కీబోర్డ్, డ్రమ్స్ ఇలా రకరకాల సౌండ్స్ దీనిపై వాయించొచ్చు. ఇలాంటి విచిత్రమైన మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్‌ను మ

కొత్త ఇంట్లోకి విజయ్ దేవరకొండ.. శ్రీకాంత్‌కు దగ్గరలో రౌడీ!

Image
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ శ్రీనగర్ కాలనీ నుంచి ఫిల్మ్ నగర్‌కు మకాం మార్చారు. ఫిల్మ్‌నగర్‌లో ఆయన కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్టు సమాచారం. హీరో శ్రీకాంత్ ఇంటికి సమీపంలో నిర్మించిన ఇంటిని విజయ్ దేవరకొండ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్టు తెలిసింది. అంతేకాదు, ఆదివారం గృహప్రవేశం కూడా చేసినట్టు సమాచారం. తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఆదివారం కొత్త ఇంట్లో దిగారట విజయ్. టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ భారీగానే సంపాదిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’తో ఎక్కడలేని క్రేజ్ సంపాదించిన విజయ్.. ‘గీతగోవిందం’తో తన మార్కెట్‌ను భారీగా పెంచుకున్నారు. ఇక అక్కడి నుంచి ఆయనకు అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ క్రేజ్ కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే సొంతం కాలేదు. అందుకే, ఆయన సినిమాలను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. Also Read: ఇటీవల దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదలైన ‘డియర్ కామ్రేడ్’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఇప్పుడు విజయ్ తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ మీద మాత్రమే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే తన తరవాత సినిమా ‘వరల్డ్ ఫేమస్ ల

‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌.. సూపర్ స్టార్ సరికొత్త రికార్డ్

Image
సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటున్నారు. ఈ విషయాన్ని ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ లెక్కలు స్పష్టం చేస్తు్న్నాయి. శక్రవారం విడుదలైన ఈ టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. కేవలం 40 గంటల్లో 20 మిలియన్లకు పైగా రియల్‌టైమ్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. అంతేకాదు, 40 గంటలకు పైగా యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంది ఈ టీజర్. ఈ టీజర్‌తో సినిమాపై అటు ప్రేక్షకుల‌లో, ఇటు మ‌హేష్ అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. Also Read: కాగా, ఈ సినిమాకు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రల

గారు వద్దు ప్లీజ్.. సాయి పల్లవికి నాగ చైతన్య రిక్వెస్ట్

Image
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇది నాగ చైతన్యకు 19వ సినిమా. అంతేకాదు.. నాగ చైతన్యతో సాయి పల్లవికి ఇదే తొలి సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే, నిన్న (నవంబర్ 23న) నాగ చైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సాయి పల్లవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కలమషంలేని చిరునవ్వు, దయగల హృదయం కలిగిన మనిషి చే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని సాయి పల్లవి నిన్న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఈరోజు నాగ చైతన్య స్పందించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు థ్యాంక్స్ చెప్పారు. అయితే, తనను ‘గారు’ అని సంబోధించొద్దని సాయి పల్లవిని చైతూ రిక్వెస్ట్ చేశారు. ఇలా పిలిచి తన వయస్సును పెంచేవద్దన్నారు. అయితే, ఈ కాన్వర్జేషన్ అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు సాయి పల్లవి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీరి కాంబినేషన్‌లో సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు, తన భార్య సమంత చేసిన ట్వీట్‌కు కూడా నాగ చైతన్య స్పందించారు. కాకపోతే చాలా ఆసల్యం

అడవిలో అనిల్ రావిపూడి బర్త్ డే.. మహేష్ స్పెషల్ విషెస్

Image
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. ‘పటాస్’తో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే సూపర్ హిట్ సాధించి.. ఆ తరువాత వరుసగా ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘F2’ వంటి భారీ హిట్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సంక్రాంతికి మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను సిద్ధం చేస్తున్నారు. కాగా, నిన్న (నవంబర్ 23న) అనిల్ రావిపూడి పుట్టినరోజు. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ అంగమలై ఫారెస్ట్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్ స్పాట్‌లోనే అనిల్ రావిపూడి పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ సెలబ్రేషన్స్‌లో సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో పాటు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధిపతుల్లో ఒకరైన శిరీష్, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్‌కు మహేష్ కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనిల్‌తో పనిచేయడం అన్ని విధాలుగా ఇన్‌క్రెడిబుల్ ఎక్స్‌పీరియన్స్ అని మహేష్ బాబు అన్నారు. అనిల్ మరింత సంతోషంగా ఉండాలని, మరెన్నో బ్లాక్ బస్టర్స్ అందుకోవాలని ఆకాంక్షించారు. Also Read: బర్త్ డే బోయ్ అనిల్ రావిపూడి.. మహేష్‌కి థాంక్స్ చెప్పారు. ‘‘మీ వ