ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. బిజినెస్ జరిగినా సినిమా ఆలస్యమైంది!
ఎన్నో అవాంతరాల తరువాత నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన ఈ శుక్రవారం (29-11-2019) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ ఈ సినిమాతో తన అనుబందాన్నీ, అనుభావాలను మీడియాతో పంచుకున్నాడు. సినిమా ఆలస్యానికి కారణాలను కూడా వెల్లడించాడు . ఈ ఏడాది మేలోనే రిలీజ్ కావాల్సిన అర్జున్ సురవరం దాదాపు 6 నెలలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అన్ని సినిమాలు ఆర్ధిక ఇబ్బందులతో ఆలస్యమవుతుంటాయి. కానీ మా సినిమాకు అలాంటి ఇబ్బందులు లేకపోయినా ఆలస్యమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమాతో సంబంధం లేని వ్యక్తుల కారణంగా రిలీజ్ ఆలస్యమైందని తెలిపాడు. Also Read: నిర్మాతలు, థియేటర్ల యజమానులు రిలీజ్కు ముందుకు వచ్చినా మధ్యలో ఉన్న వ్యక్తలు కారణంగానే సినిమా ఆలస్యమైందన్నాడు నిఖిల్. డిస్ట్రిబ్యూటర్ల నుంచి సరైన సహకారం అందకపోవటం కారణంగానే ఇలా జరిగిదని తెలిపాడు. తమకు సంబంధం లేని సినిమాలు, తమిళ సినిమాల బిజినెస్లతో లింక్ పెట్టి అర్జున్ సురవరం రిలీజ్ను వాయిదా వేయించారని తెలిపాడు. ఇది తన మనసుకు నచ్చిన సినిమా అన్న నిఖిల్.. అందుకే ఇన్ని అవాంతరాలు ఎదురైన సినిమా రిలీజ్ కోసం తాను ఇంత కష్టపడ్డానన్నాడు. ఈ సినిమా కోసం తాను సగం రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నానని, ఇన్నేళ్ల కెరీర్లో అలా రెమ్యూనరేషన్ వదులుకున్న సినిమా కూడా ఇదే అన్నాడు నిఖిల్. ఓ మంచి సినిమాను జనంలోకి తీసుకెళ్లాలనే ఇంత కష్టపడుతున్నామని తెలిపాడు. Also Read: చిత్ర దర్శకుడు సంతోష్ గురించి మాట్లాడుతూ.. `ఆయన పని రాక్షసుడు. అవుట్పుట్ కోసం నటుడ్ని ఎంత కష్టమైనా పడేలా చేస్తాడు. సినిమాలో ఓ సన్నివేశం కోసం నన్ను 36 సార్లు చెంపదెబ్బ కొట్టించాడు` అన్నాడు. ఈ సినిమారలో లావణ్య త్రిపాఠి పాత్ర కూడా ఎంతో కీలకమన్నాడు నిఖిల్. ఇన్నాళ్లు గ్లామర్ రోల్స్కే పరిమితమైన లావణ్య ఈ సినిమాలో యాక్షన్ ఎమోషనల్ సీన్స్లో నటించిందని తెలిపాడు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రాల వివరాలను కూడా వెల్లడించాడు నిఖిల్. ఇక మీదట రీమేక్ సినిమాలు చేయని చెప్పాడు. డిసెంబర్లో కార్తికేయ సీక్వెల్ ప్రారంభమవుతుందన్న యంగ్ హీరో గీతా ఆర్ట్స్ బ్యానర్లో వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా, హనుమాన్ అనే పేరుతో రొబోటిక్స్ నేపథ్యంలో మరో సినిమా చేస్తున్నాని తెలిపాడు. గతంలో ప్రకటించిన శ్వాస సినిమా ఆగిపోయిందని క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. Also Read:
Comments
Post a Comment