ఆ నటిపై కోపం లేదు, తెలీకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు: విజయ్ దేవరకొండ

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండకు కోపం వచ్చింది. మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి ‘అర్జున్ రెడ్డి’ సినిమాను చుట్టుముట్టిన వివాదంపై ప్రశ్నలు అడుగుతుంటే చిరాకుగా ఉంటోందని అంటున్నారు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో గెస్ట్‌గా పాల్గొన్నారు . ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అర్జున్ రెడ్డి సినిమాపై వస్తున్న కామెంట్స్ గురించి, ప్రముఖ మలయాళ నటి పార్వతి సినిమాపై చేసిన కామెంట్స్ గురించి మాట్లాడారు. ‘నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇక నా వల్ల కాదు. నేను దీని గురించే ఆలోచిస్తుంటే అది నా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నేను సాధారణంగా అర్థం చేసుకునే వ్యక్తిని. ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిలో నిజాయతీగా సమాజం గురించి ఆలోచిస్తూ ప్రశ్నలు వేసిన వారు ఉన్నారు. కానీ కొందరు అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీకుండా కామెంట్లు చేస్తున్నారు. వారు పొరపాటుపడ్డారని అనుకుంటున్నాను. అర్జు్న్ రెడ్డి గురించి చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు. నాకు ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు’ ‘అర్జున్ రెడ్డి సినిమాపై పార్వతి కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. అందుకు నాకు ఆమెపై ఎలాంటి కోపం లేదు. ఆమె సినిమలు కూడా నాకు చాలా నచ్చాయి. కానీ నాకు కోపం వచ్చేది ఎక్కడంటే.. సోషల్ మీడియాలో ఈ సినిమాపై జరుగుతున్న హడావుడి. నెటిజన్స్ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. అసలు వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకావడంలేదు. నా అడ్డుపెట్టుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది నాకు నచ్చడంలేదు. అంతేకానీ మీరు అర్జున్ రెడ్డి సినిమా గురించి ఏం అనుకున్నా నేను పట్టించుకోను’ అని వెల్లడించారు విజయ్ దేవరకొండ.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ