‘దర్బార్’ ఫస్ట్ సాంగ్.. ‘దుమ్ము’లేపిన ఎస్పీబీ

సూపర్ స్టార్ రజినీకాంత్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్న చిత్రం ‘దర్బార్’. నయనతార హీరోయిన్. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుబస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమా నుంచి తొలిపాటను బుధవారం విడుదల చేశారు. ‘దుమ్ము ధూళి’ అంటూ సాగే ఈ పాట నిజంగా దుమ్మురేగిపోయేలా ఉంది. దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ పాటను ఆలపించారు. తమిళం, తెలుగులోనూ ఆయనే పాడారు. ఎస్పీబీతో పాటు అనిరుధ్ కూడా గొంతు కలిపారు. తెలుగులో అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఎస్పీబీ ఎప్పటిలానే మంచి ఊపుతో పాడారు ఈ పాట. దుమ్ముదులిపారు. వాస్తవానికి రజినీకాంత్ సినిమాల్లో సోలో సాంగ్స్‌ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే పాడుతూ ఉంటారు. అయితే, ‘కబాలి’, ‘కాలా’ చిత్రాల్లో ఎస్పీబీ పాటలు లేవు. ఆ లోటును రజినీ ఇప్పుడు తీర్చేసుకున్నారు. ప్రస్తుతం ‘దర్బార్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే రజినీకాంత్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం పూర్తిచేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘దర్బార్’ చేయడం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అని, ఆయనతో చేసిన డబ్బింగ్ సెషన్ తన లైఫ్‌లో మెమొరబుల్ అని ఇటీవల దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ చెప్పారు. కాగా, ఈ చిత్రంలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటించింది. సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ