LIVE: ‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ వేడుక.. చిరంజీవి చీఫ్ గెస్ట్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ చాలా రోజులుగా ఎదురుచూస్తోన్న సమయం ఆసన్నమైంది. ఆయన హీరోగా నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా వాయిదాలు పడుతూ వస్తూ ఎట్టకేలకు విడుదలకు నోచుకుంది. ఈ సినిమా విడుదల ఆలస్యమైనా ప్రేక్షకులకు మాత్రం బాగానే గుర్తుండిపోయింది. దీనికి తోడు చిత్ర యూనిట్ మంచి ప్రచారం కల్పించడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచేందుకు, చిత్ర ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా‌లో నిర్వహిస్తోన్న ఈ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరవ్వటం విశేషం. కాగా, ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు. టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్’ మ‌ధు స‌మ‌ర్పణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రాజ్‌ కుమార్ ఆకెళ్ల నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పోసాని కృష్ణముర‌ళి, సత్య, త‌రుణ్ అరోరా, వెన్నెల కిషోర్, నాగినీడు, విద్యుల్లేఖ రామన్ తదితరులు న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం సమకూర్చారు. ఇదిలా ఉంటే, ఇటీవల విడుదలైన ‘అర్జున్ సురవరం’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న నిఖిల్ ఫ్యాన్స్ ట్రైలర్‌ చూసి తెగ సంబరపడిపోయారు. ట్రైలర్ సూపర్‌గా ఉందని, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకున్నారు. నిఖిల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దీనితో పాటు తాజాగా విడుదలైన ‘కన్నే కన్నే’ సాంగ్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం మరో ప్రధాన బలమని ఇటీవల నిఖిల్ అన్నారు. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయని చెప్పారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ