Posts

Showing posts from February, 2022

RRR మార్చ్ పోస్టర్ వైరల్.. జక్కన్న ప్రమోషన్ టెక్నిక్ అదుర్స్!!

Image
సినిమా గ్రాండ్‌గా రూపొందించడంలో ఎంత కేర్ తీసుకుంటారో చిత్ర ప్రమోషన్స్ విషయంలోనూ సరికొత్తగా ఆలోచిస్తూ మరింత శ్రద్ద పెడుతుంటారు రాజమౌళి. ఈ క్రమంలోనే రెండో దశ ప్రమోషన్స్ షురూ చేసిన ఆయన సరికొత్త స్ట్రాటజీని ప్రేక్షకుల ముందుంచారు. ఈ నెల అనగా మర్చి 25న ఈ భారీ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో RRR మార్చ్ అంటూ ఓ స్నాప్ షాట్ రిలీజ్ చేసి ప్రమోషన్స్‌లో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. RRR మార్చ్ అనే పేరుతో ఉన్న స్నాప్ షాట్ తీసుకొని ఇందులో మీకు ఇష్టమైన ఇమేజ్ పెట్టుకొని మీ మీ సోషల్ మీడియా వాల్స్‌పై పోస్ట్ చేసుకోండి అంటూ ఈ స్నాప్ షాట్ వదిలారు. దీంతో ఇంకేముంది నెటిజన్లు తమ తమ టాలెంట్‌కి పదును పెడుతూ ఈ స్నాప్ షాట్ పోస్టర్ వైరల్ చేసేస్తున్నారు. కొందరు ఎన్టీఆర్ ఫొటోతో ట్రెండ్ చేస్తుంటే, ఇంకొందరు రామ్ చరణ్ ఫొటోతో ట్రెండ్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఈ స్నాప్ షాట్‌లో తమ తమ పిక్స్ పెట్టుకొని షేర్ చేసుకుంటూ తెగ మురిసిపోతున్నారు. దీంతో ట్విట్టర్ వేదికపై మరోసారి RRR హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. 1920 బ్యాక్ డ్రాప్‌లో భారీ రేంజ్‌లో RRR మూవీ రూపొందించారు జక్కన్న. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మళ్ళీ మళ్ళీ ముద్దులు పెట్టించుకున్నారు.. చాలా ఇబ్బంది పడ్డా! ఓపెన్ అయిన సుప్రిత

Image
షూటింగ్ అన్నాక బోలెడన్ని టేక్స్ ఉండటం కామన్. సీన్ ఏదైనప్పటికీ దర్శకుడికి నచ్చే వరకు ఆ సీన్ షూట్ చేస్తూనే ఉంటారు. అయితే రొమాంటిక్ సీన్స్, ముద్దు సన్నివేశాల మాటేంటి అంటారా? అవన్నీ కూడా నటనలో ఓ భాగమే కాబట్టి షూటింగ్‌ విషయంలో దేనికీ మినహాయింపు ఉండదు. కొత్త నటీనటులైతే ఇలాంటి సీన్స్ చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సీనియర్ నటి సురేఖా వాణి కూతురు విషయంలో కూడా అదే జరిగిందట. ఓ సీన్ కోసం ఆమెతో మళ్ళీ మళ్ళీ ముద్దులు పెట్టించుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సుప్రితనే వెల్లడించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కెమెరా ముందుకు రాకుండానే తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది సుప్రిత. నిత్యం ఆన్ లైన్ వేదికపై తన డాన్సులు, ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ పాపులారిటీ పెంచుకుంది. ఈ క్రమంలోనే తల్లి సురేఖా వాణి బాటలో రీసెంట్‌గా కెమెరా ముందుకొచ్చి అట్రాక్ట్ చేసింది సుప్రిత. కాకపోతే సినిమాల్లో కాకుండా ఓ మ్యూజిక్ వీడియోలో న‌టించింది. ఇద్దరు ప్రేమికుల మ‌ధ్య ఎమోష‌న్స్‌ తెలియ‌జేసేలా ‘’ అనే పేరుతో ఈ ఆల్బమ్ షూట్ చేసి వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేశారు. ఇందులో సుప్రిత ప్రేమికుడిగా ర్యాప్ సింగ‌ర్ రాకీ జ

Bhola Shankar First Look : ‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. మెగాస్టార్ మాస్ మేనియా

Image
టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర కథానాయ‌కుడు మెగాస్టార్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘భోళా శంకర్’. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ రూపొందిస్తున్నాయి. రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత. ప్రముఖ నిర్మాత అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్నినిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మహా శివ రాత్రి సందర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్‌లో ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. మెగాభిమానులు ఆయ‌న్ని ఎలా తెర‌పై చూడాల‌నుకుంటారో అంత మాస్ మేనియాను క్రియేట్ చేస్తార‌ని భోళా శంక‌ర్ ఫ‌స్ట్ లుక్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. స్టైల్‌గా జీపు మీద కూర్చుని కీ చైన్‌ను తిప్పుతూ క‌నిపిస్తున్నారు చిరంజీవి. చాలా రోజుల త‌ర్వాత ప‌క్కా మాస్ లుక్‌, మాస్ పాత్ర‌లో చిరంజీవి క‌నిపించ‌బోతున్నారు. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా రూపొదుతోన్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలుగా క‌నిపించ‌నున్నారు. అలాగే మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా చిరంజీవి జోడీగా న‌టిస

భీమ్లా నాయక్ సీక్రెట్: అందుకే అలా చేశామంటూ తమన్ ఓపెన్

Image
కరోనా పరిస్థితుల తర్వాత థియేటర్ల వద్ద పండగ వాతావరణం తీసుకొచ్చాడు 'భీమ్లా నాయక్'. పవర్ స్టార్ స్టామినా ఏంటనేది ఈ సినిమాతో మరోసారి రుజువైంది. అన్ని సెంటర్లలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా యమ స్పీడులో ఉంది. విడుదల రోజే పాజిటివ్ రివ్యూలు రావడంతో సినిమాకు సూపర్ బూస్ట్ దొరికింది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తుండగా.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు మ్యూజిక్ డైరెక్టర్ . భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్, పోటాపోటీ నటన ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. ముఖ్యంగా అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చేలా కొన్ని సీన్స్ కట్ చేశారు. ఇందంతా బాగానే ఉన్నా సినిమాలో ఒక పాట కనిపించకపోవడం మాత్రం ప్రేక్షక లోకాన్ని ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్- నిత్య మీనన్ నడుమ షూట్ చేసిన 'అంత ఇష్టం ఏందయ్యా' అనే మెలోడీ సాంగ్ సినిమా విడుదలకు ముందే భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. తీరా విడుదల తర్వాత సినిమాలో ఈ సాంగ్ లేకపోవడం ఒకరకంగా ఫ్యాన్స్‌ని నిరాశ పరిచిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అసలు ఆ సాంగ్ ఎందుకు కట్ చేయాల్సి వచ్చిందనే విషయమ

Official: ప్రభాస్ బిగ్ అప్‌డేట్.. ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఇచ్చేశారండోయ్

Image
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ కొట్టేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అదే ఫామ్‌లో బిగ్గెస్ట్ మూవీస్ చేస్తున్నారు. 'సాహో' తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నా ప్రస్తుతం పలు బిగ్ ప్రాజెక్టుల్లో భాగమవుతున్నారు. అందులో ఒకటే 'ఆదిపురుష్'. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ నేపథ్యంలో శివరాత్రి కానుకగా ఫ్యాన్స్ హుషారెత్తే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమా 'ఆదిపురుష్' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు డైరెక్టర్ ఓం రౌత్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 2023 సంవత్సరం జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు 3D వర్షన్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచబోతున్నట్లు ట్వీట్ పెట్టారు. దీంతో ఈ బిగ్ అప్‌డేట్ క్షణాల్లో వైరల్ అయింది. పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. ఈ భారీ మైథలాజికల్ వండర్‌‌లో రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీ

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య.. సమంత ఎమోషనల్ పోస్ట్

Image
ఉక్రెయిన్‌పై సైనిక చర్యపై స్పందించింది. ఇప్పటికే పలువురు సినీ తారలు ఈ చర్యను తప్పుబట్టారు. యుద్ధం అనేది ఏ కారణాలతో వచ్చినా అది మాత్రం పౌరుల, సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడమేనని అన్నారు. ఇదే విషయంపై గత రెండు రోజుల క్రితం రియాక్ట్ అయిన స్టార్ హీరోయిన్ సమంత.. తాజాగా మరోసారి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఉక్రెయిన్‌లోని ఓ ఆస్పత్రి ఐసీయూ నుంచి నవజాత శిశువులను బాంబ్‌ షెల్టర్‌లోకి తీసుకెళ్తున్న ఓ వీడియోను తన ఇన్స్‌స్టా స్టోరీలో షేర్‌ చేసిన సమంత.. అప్పుడే పుట్టిన బిడ్డకు ఎన్ని కష్టాలో అంటూ ఎమోషనల్ కామెంట్ చేసింది. అంతేకాదు యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర కనుగొంది. అతని తెగువ, ధైర్యసాహసాలే అందుకు సాక్ష్యం అని పేర్కొన్న ఓ న్యూస్‌ ఆర్టికల్‌ని కూడా సామ్ షేర్ చేసింది. ప్రస్తుతం పరిస్థితులపై ఎంతోమంది సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా కంప్లీట్ చేసింది. ఆమె కెరీర్‌లో రాబోతున్న తొలి పౌరాణిక సినిమా ఇది. దీంతో పాటు మరో ప్రయోగాత్మక సినిమా 'యశోద'లో భాగమవవుతోంది సమంత. ఈ సినిమాలో

కొడాలి నానిని హీరోగా పెట్టి సినిమా తీయండి.. వైసీపీ ప్రభుత్వంపై నాగబాబు ఫైర్

Image
రీసెంట్‌గా విడుదలైన 'భీమ్లా నాయక్' సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. తెలంగాణ సహా ఓవర్‌సీస్ మార్కెట్‌లో దుమ్ముదులుపుతోంది. అయితే ఒక్క ఆంధ్ర ఏరియాలో మాత్రం చెప్పుకోదగిన కలెక్షన్స్ రావడం లేదు. దీనికి ప్రధాన కారణం టికెట్ల రేట్ల తగ్గింపు. తాజాగా ఈ విషయమై మరోసారి భగ్గుమన్నారు. ‘భీమ్లా నాయక్’పై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును తప్పుపడుతూ ఓ వీడియో ద్వారా నిప్పులు చెరిగారు. కొడాలి నానిని హీరోగా పెట్టి సినిమా తీయండి అంటూ సెటైర్స్ వేశారు. వైసీపీ ప్రభుత్వానికి, ఆ మంత్రులకు సినిమా వాళ్ళ ఆపరేషన్స్ గురించి తెలియదని.. సామాన్యుడికి టిక్కెట్ ధర అందుబాటులో ఉండాలనే విషయాన్ని తాను కూడా ఏకీభవిస్తున్నానని అన్నారు. టోటల్ సినిమా బడ్జెట్‌లో హీరోల రెమ్యునరేషన్‌లు 10 లేదా 12 పర్సెంట్ ఉంటుంది. అజ్ఞానపు మాటలు మాట్లాడే వాళ్లకు సినిమా మేకింగ్ గురించి ఏం అర్థమవుతుందంటూ ఫైర్ అయ్యారు నాగబాబు. సినిమాకు నష్టం వాటిల్లితే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళు కూడా రెమ్యునరేషన్ తగ్గించడమో వెనక్కి ఇవ్వడమో జరిగింది. అలా అని అందరూ మెడలో బోర్డులు వేసుకొని తిరగరు. ఏ హిరో అయినా సినిమా బాగా బి

Pawan Kalyan Next Movie : ప్రభాస్ దర్శకుడితో పవన్ కళ్యాణ్.. మరోసారి అలాంటి పాత్రలోనే!

Image
రీసెంట్‌గా రిలీజైన ‘’తో సెన్సేష‌న‌ల్ హిట్ అందుకున్నారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఇక ఓవ‌ర్ సీస్‌లోనూ సినిమా రెండు మిలియ‌న్ వ్యూస్‌ను ద‌క్కించుకోవ‌డం విశేషం. క‌రోనా థర్డ్ వేవ్ త‌ర్వాత టాలీవుడ్‌కి ‘భీమ్లా నాయక్’ స‌క్సెస్ కొత్త ఉత్సాహాన్నిచ్చింద‌నే చెప్పాలి. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాబోయే చిత్రాల‌పై భీమ్లా నాయ‌క్ ఎఫెక్ట్ బాగానే క‌నిపిస్తుంది. అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేయాల్సిన చిత్రాలు చాలానే లిస్టులో ఉన్నాయి. ఇప్ప‌టికే ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ మూవీ సెట్స్‌పై ఉంది. చిత్రీక‌ర‌ణ‌న‌ను పూర్తి చేసుకుంటోంది. ఇది కాకుండా హ‌రీష్ శంక‌ర్ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇది కాకుండా డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి వెయిటింగ్‌లో ఉన్నారు. ఈ చిత్రాలు కాకుండా ప‌వ‌న్ కొత్త చిత్రాల‌కు సుముఖ‌త చూపిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి కూడా తెలిసిందే. త‌మిళ చిత్రం వినోద‌య సీత‌మ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌నున్నార‌ని, ఇందులో మేన‌ల్లుడితో క‌లిసి ప‌వ‌న్ న‌టించ‌బోతున్నా

Pawan Klayan : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ ... 100 కోట్లు మార్క్ ట‌చ్ చేసిన‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్‌

Image
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. రానా దగ్గుబాటి ఇందులో మ‌రో హీరోగా న‌టించారు. ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్ సంపాదించుకోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్‌ను గ‌ట్టిగానే రాబ‌డుతుంది. మూడు రోజుల్లోనే ‘భీమ్లా నాయక్’ వంద కోట్లు మార్క్‌ను ట‌చ్ చేసింది. క‌రోనా థ‌ర్డ్ వేవ్ త‌ర్వాత సినిమా థియేట‌ర్స్‌కు ప్రేక్ష‌కులు వ‌స్తారా? రారా? అనే మీమాంస‌ను నిర్మాత‌లు ఎదుర్కొంటున్న స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సత్తాను చూపించారు. ‘భీమ్లా నాయక్’ సినిమా వంద కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టుకోవ‌డంపై ఆయ‌న ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. సినీ స‌ర్కిల్స్‌లో సైతం ‘భీమ్లా నాయక్’ స‌మ్మ‌ర్ సినిమాల‌కు గేట్‌లాగా వ్య‌వ‌హ‌రించింద‌ని.. ఓ న‌మ్మ‌కాన్ని క్రియేట్ చేసింద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. 3వ రోజు ఏరియా వైజ్ షేర్ క‌లెక్ష‌న్స్ (కోట్ల‌లో..) నైజాం - రూ. 6.55 కోట్లుసీడెడ్ - రూ. 2.2 కోట్లుగుంటూరు - రూ. 0.72 కోట్లుకృష్ణా - రూ. 0.76 కోట్లునెల్లూరు - రూ. 0.41 కోట్లువెస్ట్ - రూ. 0.47 కోట్లుఈస్ట్ - రూ. 0.91 కోట్లుఉత్త‌రాంధ్ర - రూ. 1.5 మొత్తంగా చూస్తే రెండ

నా కల నిజమైన రోజు.. తమన్ ఎమోషనల్ కామెంట్స్

Image
పవర్ స్టార్ రేంజ్ తెలిసేలా మోత మోగించారు మ్యూజిక్ సెన్సేషన్ తమన్. ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా హైలైట్ అయిందని, బాణీలు పిచ్చెక్కించాయనే టాక్ బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్‌తో కలిసి భీమ్లా నాయక్ సినిమా వీక్షించిన తమన్.. ఈ విషయాన్ని చెబుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రసాద్ లాబ్స్‌లో ప్రత్యేకంగా భీమ్లా నాయక్ సినిమాను ప్రదర్శించగా.. ఈ షోను పవన్ కళ్యాణ్‌తో పాటు త్రివిక్రమ్, చినబాబు, సంయుక్త మీనన్‌, తమన్ వీక్షించారు. అయితే ఈ షో చూసిన అనంతరం తమన్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పవర్ స్టార్ అభిమానులను మరింత హుషారెత్తించింది. పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’ చూడడంతో ఇప్పటికి తన కల నెరవేరిందని తెలుపుతూ ట్వీట్ పెట్టారు తమన్. ఈ మేరకు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, చినబాబు, సంయుక్త మీనన్‌లతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ సినిమాకు తొలి షోతోనే పాజిటివ్ టాక్ రావడంతో జనం థియేటర్స్ బాట పట్టారు. వెండితెరపై పవన్- రానా పోటాపోటీ నటన భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీ

భీమ్లా నాయక్ వసూళ్ల సునామీ.. పవన్ క్రేజ్ అంటే ఇదే మరి!!

Image
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు దేశ విదేశాల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఇప్పటికే చాలా సార్లు చూశాం. తాజాగా మరోసారి అదే సీన్ రిపీట్ చేస్తోంది. ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనం నీరాజనం పలుకుతున్నారు. కోవిడ్ పరిస్థితుల తర్వాత జనంతో థియేటర్స్‌లో జాతర వాతావరణం తీసుకొచ్చాడు భీమ్లా నాయక్. ఇక కలెక్షన్స్ పరంగా చూస్తే ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో భారీగా వసూళ్లు నమోదవుతున్నాయి. క్లాస్, మాస్ సెంటర్స్ లా.. లా.. భీమ్లా సౌండ్‌తో మారు మోగుతున్నాయి. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు సినిమాకు భారీ స్థాయి వసూళ్లు తెచ్చిపెడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో భీమ్లా నాయక్ హవా నడుస్తోంది. విడుదలకు ఒకరోజు ముందే అనగా ఫిబ్ర‌వ‌రి 24నే యూఎస్‌లో ఈ సినిమా ప్రీమియ‌ర్స్ ప‌డ్డాయి. ప్రీమియ‌ర్ షోస్ ద్వారానే 875,292 డాల‌ర్స్‌ రాబట్టిన భీమ్లా నాయక్ అదే హంగామా కంటిన్యూ చేస్తున్నాడు. యూఎస్ మార్కెట్‌లో తొలి రోజుకు గాను 450,368 డాలర్స్ రాబట్టిన భీమ్లా నాయక్ మూవీ.. రెండు రోజుకు వచ్చేసరికి 470,128 డాలర్స్, మూడో రోజుకు గాను సుమారు 175,150 డాలర్స్ వసూలు చే

గ్యాంగ్ లీడర్ సమంత! ఆమె లేడీ పవన్ కళ్యాణ్ అంటూ సుకుమార్ ఓపెన్

Image
యంగ్ హీరోహీరోయిన్లు శర్వానంద్, రష్మిక మందన జంటగా తెరకెక్కిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. మార్చి 4వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న ఆదివారం (ఫిబ్రవరి 27) గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు కీర్తి సురేష్, , ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అయితే వేదికపైకి వచ్చి మైక్ పట్టుకున్న సుకుమార్.. సమంతతో పాటు సాయి పల్లవి, రష్మిక, కీర్తి సురేష్‌లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వేదికపై రాగానే యాంకర్ సుమకు థాంక్యూ చెప్పిన సుకుమార్.. టాపిక్ తీసుకొచ్చారు. గ్యాంగ్ లీడర్ సమంత మిస్ ఇక్కడ అంటూ అక్కడున్న కీర్తి సురేష్, రష్మిక మందన, సాయి పల్లవిలతో పాటు సమంతలను తెగ పొగిడేశారు. బ్యూటిఫుల్ బెస్ట్ పర్‌ఫార్‌మెన్స్ ఇస్తున్న హీరోయిన్స్ వీళ్ళు అంటూ కామెంట్ చేశారు. మై శ్రీవల్లి అంటూ అక్కడున్న రష్మిక అభిమానులను ఫిదా చేశారు. ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ ఆమెలో మంచి ఆరిస్ట్‌తో పాటు మంచి మనిషి దాగి ఉన్నారని అన్నారు. అంతేకాదు సాయి పల్లవి ఓ లేడీ పవన్ కళ్యాణ్ అంటూ వేదిక ప్రాంగణాన్ని హూషారెత్తించారు సుక్కు. ప్రకటనల ఆఫర్స్ వచ్చినా వాటిని రిజెక్ట్ చేసే విషయం

భీమ్లా నాయ‌క్‌పై పృథ్వీరాజ్ కామెంట్స్.. పవన్‌కి దిష్టి తగలొద్దంటూ!

Image
ప్రస్తుతం థియేటర్స్‌లో 'భీమ్లా నాయక్' మోత మోగుతోంది. గత శుక్రవారం (ఫిబ్రవరి 25) విడుదలైన ఈ సినిమా అన్ని సెంటర్లలో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. అభిమానులకు ఇది విజువల్ ట్రీట్ అని, పవన్ యాక్టింగ్ అద్భుతంగా ఉందనే టాక్ బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. మరోవైపు భీమ్లా నాయక్ చూసిన పలువురు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ నటనను పొగిడేస్తుండటం ఫ్యాన్స్‌లో మరింత సంబరం నింపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీపై పృథ్వీ రాజ్ రియాక్ట్ అయిన తీరు హాట్ టాపిక్ అయింది. భీమ్లా నాయక్ సినిమా చూసిన పృథ్వీ రాజ్ హీరో ప‌వ‌న్ కళ్యాణ్‌పై, ఆయన నటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రోజుల్లో సీనియ‌ర్ ఎన్టీఆర్ నటించిన అడ‌వి రాముడు సినిమా చూశాన‌ని అది త‌న‌ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని చెప్పిన పృథ్వీ రాజ్.. అప్ప‌ట్లో ఆ సినిమా చూసేందుకు తాడేపల్లి గూడెంలోని ఓ టాకీస్‌కు వెళ్లగా అక్కడికి భారీగా తరలివచ్చిన అభిమానానులు, వారిని నియంత్రించేందుకు పోలీసుల లాఠీచార్జ్‌ అన్నీ గుర్తున్నాయని, మళ్ళీ ఇప్పుడు అలాంటి సీన్ చూశానని చెప్పారు. సీనియ‌ర్ ఎన్టీఆర్‌ తర్వాత మ‌ళ్లీ అలాంటి క్రేజ్ ఒక్క పవన్ కళ్య

Covid 19 : కరోనా బారిన ప‌డ్డ శ్రుతి హాస‌న్‌

Image
ప్ర‌ముఖ హీరోయిన్ శ్రుతి హాస‌న్‌కు పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆమె త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మం ద్వారా తెలియ‌జేశారు. అన్నీ జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని, త్వ‌ర‌లోనే మిమ్మ‌ల్ని క‌లుసుకుంటాన‌ని చెబుతూ శ్రుతి హాస‌న్ మెసేజ్‌ను షేర్ చేశారు. క‌రోనా థ‌ర్డ్ వేవ్‌లో సినీసెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డ్డారు. అందులో శ్రుతి హాస‌న్ తండ్రి క‌మ‌ల్ హాసన్ కూడా ఉన్నారు. క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాయి అని అనుకున్న త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ శ్రుతి హాస‌న్ క‌రోనా బారిన ప‌డ‌టం కాస్త ఇబ్బంది క‌ర‌మైన ప‌రిస్థితే. శ్రుతి హాస‌న్ అభిమానులు ఫాలోవ‌ర్స్ ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటూ మెసేజ్‌లు చేస్తున్నారు. శ్రుతి హాస‌న్ ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస సినిమాల‌తో బిజీగా మారింది. ప్ర‌స్తుతం ఈమె తెలుగులో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 107వ చిత్రంలో హీరోయిన్‌గా క‌నిపించ‌నుంది. ఇవి కాకుండా ప్ర‌భాస్ జోడీగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స‌లార్ చిత్రంలోనూ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మైకేల్ కోర్స‌ల్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన శ

‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఖ‌రారు.. మెగా ఫ్యాన్స్‌కి పండ‌గే మ‌రి!

Image
టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర కథానాయ‌కుడు మెగాస్టార్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘’. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ రూపొందిస్తున్నాయి. రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత. ప్రముఖ నిర్మాత అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్నినిర్మాణపరమైన బాధ్యతలను పర్యవేక్షిస్తుంటారు. తాజాగా ఈ సినిమాను మెగా అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ఖ‌రారు చేసింది. బోళా శంక‌ర్ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను మహా శివరాత్రి సందర్భంగా మార్చి 1న ఉద‌యం 9 గంట‌ల 5 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. త‌మిళ చిత్రం వేదాళంకు రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా ఉంటుంది. ఇందులో చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో ప్ర‌ముఖ హీరోయిన్‌ న‌టిస్తున్నారు. చిరంజీవి మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. డూడ్లే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది మెగా ఫ్యాన

Bheemla Nayak Location : భీమ్లా నాయక్ లొకేషన్‌లో స్టిల్ ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్.. ఫొటో వైరల్

Image
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌ర‌నే సంగ‌తి అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే ఆయ‌న మంచి టెక్నీషియ‌న్‌. జానీ సినిమాకు ఆయ‌నే డైరెక్ట‌ర్‌. సాధార‌ణంగా కెరీర్ ప్రారంభంలో ఆయ‌న సినిమాల‌కు ఆయ‌నే యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కూడా కంపోజ్ చేసుకునే వారు. ఇప్పుడు ఆయ‌న‌లోని టెక్నీషియ‌న్ గురించి ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌చ్చిందంటే.. ఆయ‌న‌లోని సాంకేతిక‌మైన ఆస‌క్తి భీమ్లా నాయ‌క్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో క‌నిపించింది. ఇంత‌కీ అదేంటంటారా!.. భీమ్లా నాయ‌క్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్‌గా మారిపోయారు. వివ‌రాల్లోకి వెళితే, భీమ్లా నాయ‌క్ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీక‌రించే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి, న‌ర్రా శీను, త్రివిక్ర‌మ్‌ల‌ను క‌లిసి డిస్క‌స్ చేసుకునే స‌మ‌యంలో ఏమ‌నిపించిందో ఏమో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెమెరా చేత ప‌ట్టుకున్నారు. త్రివిక్ర‌మ్‌, న‌ర్రా శీను, రానాల‌ను క‌లిపి ఓ ఫొటోను క్లిక్ మ‌నిపించారు. ఆ స‌న్నివేశాన్ని మ‌రొక‌రు త‌మ కెమెరాలో బంధించారు ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. లుంగీ క‌ట్టుకుని త్రివిక్ర‌మ్‌, న‌ర్రా శీను, రానాల‌ను ఫొటో తీస్తున్న ప‌వ‌న్ క‌ళ

Telugu Film Industry : ఇండ‌స్ట్రీ పెద్ద‌పై హీరో శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు..!

Image
తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు పెద్ద ఎవ‌రు? అనే దానిపై చ‌ర్చ చాలా రోజులుగానే ఇండ‌స్ట్రీలో న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇండ‌స్ట్రీ పెద్దరికంపై మెగాస్టార్ ఈ మ‌ధ్య కాలంలో స్పందిస్తూ.. తాను ఇండ‌స్ట్రీ బిడ్డ‌గా స‌మ‌స్య ఉన్న‌ప్పుడు ముందు ఉంటానే త‌ప్ప దుప్ప‌టి పంచాయతీలు చేయ‌న‌ని క్లారిటీ ఇచ్చేశారు. సీనియ‌ర్ న‌రేష్ వంటి వారైతే ‘మా’ ఎన్నిక‌లు జ‌రిగిన సంద‌ర్భంలో మోహన్ బాబు వంటివారే ఇండ‌స్ట్రీ పెద్ద కావాల‌న్నారు. ఇండ‌స్ట్రీ పెద్ద‌రికంపై కొన్ని రోజుల పాటు పెద్ద రేంజ్‌లో జ‌రిగినా ఎందుక‌నో త‌ర్వాత సైలెంట్‌గా మారిపోయింది. అయితే అడ‌పా ద‌డ‌పా కొంత మంది వ్య‌క్తులు మాత్రం సినీ ఇండస్ట్రీలో పెద్దరికం అనే ప్రశ్న వచ్చినప్పుడల్లా తమ అభిప్రాయాన్ని చెబుతూ వచ్చారు. తాజాగా ఈ లిస్టులో సీనియ‌ర్ నటుడు, హీరో శ్రీకాంత్ కూడా చేరారు. రీసెంట్‌గా ఆయ‌న సినీ ఇండ‌స్ట్రీలో పెద్ద రికం గురించి మాట్లాడుతూ ‘‘నాకు తెలిసినంత వరకు చిరంజీవిగారే ఇండ‌స్ట్రీ పెద్ద‌. చాలా కాలంగా ఆయ‌న ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టి ప‌రిస్థితుల్లో ఎవ‌రికీ ఏ స‌మ‌స్య వ‌చ్చినా మెగాస్టార్‌గారే క‌నిపిస్తున్నారు. అందుక త‌గిన‌ట్లు ఆయ‌

Bheemla Nayak Success : పవ‌న్ క‌ళ్యాణ్ చేల‌రేగిపోయారు.. ‘భీమ్లా నాయ‌క్‌’పై సూపర్ స్టార్ ప్రశంసలు..!

Image
పవర్ స్టార్ , వెర్సటైల్ హీరో రానా దగ్గుబాటిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సిన్సియర్ పోలీస్ ఆఫీస‌ర్ భీమ్లా నాయ‌క్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రిటైర్డ్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్ డానియ‌ల్ శేఖ‌ర్‌గా రానా ద‌గ్గుబాటి పోటీ ప‌డి న‌టించారు. ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ అయిన ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్బ్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకుంటోందీ చిత్రం. ఇక ‘భీమ్లా నాయ‌క్‌’పై ఫ్యాన్స్‌తో పాటు సినీ సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో సూప‌ర్ స్టార్ మ‌హేష్ చేరారు. ‘భీమ్లా నాయ‌క్‌’ హిట్‌ను ప్ర‌శంసిస్తూ ఆయ‌న ట్వీట్ చేశారు. ‘‘‘భీమ్లా నాయ‌క్‌’ అద్భుతంగా ఉంది. ప‌వన్ క‌ళ్యాణ్ స్క్రీన్‌పై చేల‌రేగి పోయారు. డానియ‌ల్ శేఖ‌ర్‌గా రానా ద‌గ్గుబాటి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. త్రివిక్ర‌మ్ త‌న‌దైన స్టైల్లో ఎప్ప‌టిలాగానే త‌న పెన్ ప‌వ‌ర్ చూపించారు. ఇక సినిమాటోగ్రాఫ‌ర్ కె.ర‌వి చంద్ర‌న్ విజువ‌ల్స్‌తో మాయ చేశారు. త‌మ‌న్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఆయ‌న బ్యాగ్రౌండ్ స్కోర్ థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంటాడుతుంది. ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె.చంద్ర‌, నిత్యా మీన‌న్‌, సంయుక్తా మీన‌న్‌,

Radhe Shyam : డార్లింగ్ ప్రభాస్ కోసం రాజమౌళి ..‘రాధే శ్యామ్‌’కు జక్కన్న సాయం!

Image
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన చిత్రం ‘రాధే శ్యామ్‌’. ఈ పాన్ ఇండియా మూవీ మార్చి 11న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంద‌రూ ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ఇప్ప‌టికే ఉన్న క్రేజ్ చాలద‌న్న‌ట్లు ఇంకా హైప్‌ను ఒక్కో స్టెప్ పెంచుతూ వ‌స్తున్నారు మేక‌ర్స్‌. ఇప్ప‌టికే ఈ సినిమా హిందీ సినిమా నెరేష‌న్‌కు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ వాయిస్ ఓవ‌ర్ అందించారు. ఇప్పుడు ఇదే నెరేష‌న్‌ను తెలుగు వెర్ష‌న్‌కు ఎవ‌రు ఇస్తార‌నే దానిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వ‌లేదు. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ‘రాధే శ్యామ్‌’ తెలుగు వెర్షన్ నెరేషన్‌కు రాజ‌మౌళి త‌న వాయిస్ ఓవ‌ర్‌ను అందించారు. రీసెంట్‌గానే రాజ‌మౌళికి సంబంధించిన వ‌ర్క్‌ను ‘రాధే శ్యామ్‌’ యూనిట్ పూర్తి చేసిందని టాక్‌. పూర్తి స్థాయి ప్ర‌మోష‌న్స్‌ను మార్చి మొద‌టి వారం నుంచి ప్రారంభించ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ సినిమాపై అంచనాల‌ను మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లింది. అదే స‌మ‌యంలో ఈ సినిమా నుంచి మ‌రో ట్రైల‌ర్

Nagababu : సినీ ఇండ‌స్ట్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స‌పోర్ట్ ఇవ్వ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం : నాగ‌బాబు

Image
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’. ఫిబ్ర‌వ‌రి 25న సినిమా విడుద‌లైంది. సినిమా టికెట్స్ పెంపుకు సంబంధించిన జీవోను ఎందుకు ఆల‌స్యం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ వీడియో విడుద‌ల చేశారు. అందులో మాట్లాడుతూ ‘‘వకీల్ సాబ్ సినిమా నుంచి ప్రభుత్వం నేటి వరకు సినీ పరిశ్రమను, పవన్ కళ్యాణ్‌ను ఏపీ ప్ర‌భుత్వం టార్గెట్ చేసింది. ప్ర‌భుత్వం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప‌గ‌తో ఇలా చేస్తున్న‌ప్ప‌టికీ సినీ ప‌రిశ‌మ్ర నుంచి, సినీ పెద్ద‌లు నుంచి మ‌ద్ద‌తు రాక‌పోవ‌డం శోచ‌నీయం. ఇలా చేయ‌డం త‌ప్పు అని చెప్ప‌డం కానీ, ట్వీట్స్ వేయ‌డం కానీ ఎవ‌రూ చేయ‌డం లేదు. సినీ ప‌రిశ్ర‌మ అభ‌ద్ర‌త‌ను క‌ళ్యాణ్‌బాబు, ఆయ‌న‌తో ఉన్న నాలాంటి వాళ్లు అర్థం చేసుకోగ‌లం. పెద్ద హీరోకే ఇలా ఉంటే సామాన్య మాన‌వుడి పరిస్థితి ఏంటి? వాళ్లు ఎంత బాధ‌ప‌డుతున్నారు. నాపై ఏమైనా కోపం ఉంటే నాపైనే చూపించండి. ఇండ‌స్ట్రీ మీద కాదు అని రిప‌బ్లిక్ సినిమా వేడుక‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న మాట‌ల‌కు ఇప్పుడు వాళ్లు క‌రెక్ట్ ఉప‌యోగించుకుంటున్నారు. అయితే మీరెవ‌రూ దానిపై ఒక మాట కూడా మాట్లాడ‌క‌పోవ‌డం దురదృష్ట‌క‌రం. భీమ

Sukumar : మెగాస్టార్ చిరంజీవి విష‌యంలో సుకుమార్ ప‌క్క దారి ప‌ట్టించారా?

Image
సినిమాల‌ను ఎంత స్పీడుగా పూర్తి చేస్తున్నారంటే కుర్ర హీరోలు సైతం ఆయ‌న స్పీడు చూసి షాక‌వుతున్నారు. ఇప్ప‌టికే ఆచార్య సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేసిన చిరంజీవి గాడ్ ఫాద‌ర్ సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. మ‌రో వైపు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భోళా శంక‌ర్‌, బాబి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న మ‌రో చిత్రం సెట్స్‌పై ఉంది. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల్సి ఉంది. ఇవ‌న్నీ కాకుండానే ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఉంటుంద‌నే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. దానికి తోడు చిరంజీవితో సుకుమార్ ఉన్న ఫొటో కూడా నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. ఓ వైపు సుకుమార్‌, మ‌రో వైపు చిరంజీవి వారి వారి ప్రాజెక్టుల‌తో ఫుల్ బిజీగా ఉన్నారుగా. వారి కాంబినేష‌న్‌లో సినిమా ఎప్పుడు ఉంటుందోన‌ని ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. అయితే తాజాగా, మెగాస్టార్ చిరంజీవి - సుకుమార్ కాంబో విష‌యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేంటంటే.. చిరంజీవిని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న మాట నిజ‌మే. అయితే అది సినిమా కాద‌ట‌. క‌మ‌ర్షియ‌ల్ యాడ్ అని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అయితే అది బ‌య‌ట‌కు సినిమా చేయ‌బోతున్నారంటూ వార్త‌లు వచ్చాయి

Supritha Interview: మా అమ్మకి మళ్లీ పెళ్లి చేస్తా.. టైం డిసైడ్ చేస్తుంది: సురేఖా వాణి కూతురు

Image
సింగర్ సునీత పెళ్లి తరువాత టాలీవుడ్‌లో ఉన్న చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు పెళ్లి వార్తల్లో నిలిచారు. వారిలో సురేఖావాణి ఒకరు. మూడేళ్ల క్రితం భర్త చనిపోవడంతో సుప్రితతో కలిసి ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండటంతో పాటు.. పొట్టి పొట్టి డ్రెస్‌‌లతో కూతురికి పోటీగా నిలుస్తున్న మళ్లీ పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయితే ఇందులో నిజం లేదని.. అవన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు తల్లీకూతుళ్లు. అయితే తాజా ఇంటర్వ్యూలో తన తల్లి పెళ్లిపై ఓపెన్ అయ్యింది సుప్రిత. ఖచ్చితంగా తన తల్లికి పెళ్లి చేయాలనే ఉందని మనసులో మాట చెప్పింది. సుప్రిత మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో పూర్తిగా అమ్మదే నిర్ణయం. నాకైతే అమ్మకి పెళ్లి చేయాలని ఉంది.. ఖచ్చితంగా అమ్మకి పెళ్లి చేస్తేనే బాగుంటుందని నాకైతే ఉంది. అయితే ఏం జరుగుతుందన్నది టైం డిసైడ్ చేస్తుంది. నాన్న చనిపోయి మూడేళ్లు అవుతుంది.. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతుంది. అమ్మ తన కెరియర్ కంటే కూడా నా కెరియర్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతుంది. నాకు అమ్మ ఏది చెప్తే అది. తను ఏం చెప్తే అదే చేస్తున్నా. నా నిర్ణయాన్ని కూడా గౌరవిస్తుంది. మా ఫ్యామిలీలోకి బ్యాక్ బో

Supritha: తండ్రికి కొరివిపెట్టిన సురేఖావాణి కూతురు.. బంధువుల అరాచకంపై నోరు విప్పింది

Image
బట్టల్ని చూసి క్యారెక్టర్‌ని డిసైడ్ చేయడం.. వాళ్ల ప్రవర్తనని బట్టి బతుకుని బజారున పెట్టడం.. సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు ఎదురయ్యే అవమానాలు రోజూ చూస్తేనే ఉంటాం. అయితే పైకి నవ్వుతూ నవ్విస్తూ అలరిస్తూ ఉన్నా.. వాళ్లు మనుషులే కదా.. వాళ్లకి బాధలు ఉంటాయి.. బంధాలు ఉంటాయి.. బంధుత్వాలు ఉంటాయి.. అయితే బంధాన్ని నిలిపే బంధువులు కూడా కాకుల్లా పొడుకుని తింటే ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుందో చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది సురేఖా వాణి కూతురు సుప్రితి. సురేఖవాణి-సుప్రిత అంటే సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు.. పొట్టి బట్టలతో పార్టీలు పబ్‌లని తెగ ఎంజాయ్ చేస్తుంటారు.. వీళ్లిద్దరిలో తల్లి ఎవరూ కూతురు ఎవరో తెలియట్లేదే.. ఇవే మనకి కనిపింపే వార్తలు. అయితే పైకి ఇంత సంతోషంగా ఉన్నా.. తాము ఎన్ని కష్టాలు పడ్డామో పడుతున్నామో కళ్లకు కట్టింది సురేఖా వాణి కూతురు . అందరూ తన తండ్రి చావు గురించి కామెంట్లు చేస్తుంటారని.. అసలు తన తండ్రి చనిపోయినప్పుడు ఏమైందో మీకు తెలుసా? అంటూ నాటి విషయాలను చెప్పుకుని ఎమోషనల్ అయ్యింది సుప్రిత. ‘మా నాన్న చనిపోయినప్పుడు పరిస్థితులు చాలా దారుణం. నాన్న బంధువల వైపు నుంచి మాకు సపోర్ట్ లేదు. వాళ్లు ఈ మాటలు

పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ తొలి రోజు వసూళ్లు.. పవర్ స్టార్ మేనియా పీక్స్!

Image
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘’. రానా దగ్గుబాటి ఈ మూవీలో డానియ‌ల్ శేఖ‌ర్ అనే పవ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టించారు. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌కుడు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల సునానీ మొద‌లైంది. అస‌లు ‘భీమ్లా నాయక్’ చిత్రానికి తొలిరోజు వ‌చ్చిన వ‌సూళ్లు ఎంతనే వివ‌రాల్లోకి వెళితే..‘భీమ్లా నాయక్’ చిత్రం తొలిరోజు రూ.43.10 కోట్లు గ్రాస్ (నెట్ క‌లెక్ష‌న్స్ రూ.37.15 కోట్లు) వ‌సూళ్ల‌ను సాధించింది. ఏరియా వైజ్ తొలిరోజు క‌లెక్ష‌న్స్ (కోట్ల రూపాయ‌ల్లో) .. నైజాం - 13.6 సీడెడ్ - 3.25 గుంటూరు - 2.51 కృష్ణా - 0.89 కోట్లు నెల్లూరు - 1.04 కోట్లు వెస్ట్ - 3.02 కోట్లు ఈస్ట్ - 1.94 కోట్లు అంటే మొత్తం రూ.28.15 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌సూళ్ల‌ను భీమ్లా నాయ‌క్ సాధించింది. ఓవ‌ర్ సీస్‌లో.. ఒవ‌ర్ సీస్‌లో భీమ్లా నాయ‌క్ చిత్రం శుక్ర‌వారం సాయంత్రానికి 1 మిలియ‌న్ డాల‌ర్

ఆ ఒక్క ఏరియాలో దుమ్ముదుమారం.. బాహుబలిని మించేసిన భీమ్లా నాయక్

Image
భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'భీమ్లా నాయక్' మూవీ ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. విడుదలకు ముందు నుంచే నెలకొన్న హైప్ థియేటర్ల వద్ద జాతర వాతావరణం నెలకొల్పింది. తొలి రోజే భీమ్లా నాయక్ సినిమా చూసేందుకు జనమంతా థియేటర్ల బాట పట్టారు. దీంతో కలెక్షన్స్ పరంగా తొలి రోజే ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. బాహుబలి సినిమాను సైతం వెనక్కినెట్టి మొదటి స్థానంలో తన పేరు లిఖించుకున్నాడు భీమ్లా నాయక్. రిలీజ్‌కి ముందు వచ్చిన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేయడంతో మొదటి రోజు ఈ సినిమాకు హ్యూజ్ రెస్పాన్స్ లభించింది. అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సత్తా చాటిన భీమ్లా నాయక్ ఒక్క నైజాం ఏరియాలో మాత్రం బాహుబలిని మించేసి వసూళ్లు రాబట్టాడు. నైజాం ఏరియాలో మెగా హీరోలకు మంచి మార్కెట్ ఉంటుందని తెలుసు. కానీ ఆ అంచనాలను మించి కలెక్షన్స్ రావడం విశేషం. తొలి రోజుకు గాను ఒక్క నైజాం ఏరియాలోనే 11.85 కోట్ల రూపాయలు రాబట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు భీమ్లా నాయక్. దీంతో నైజాం ఏరియాలో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా భీమ్లా నాయక్ నిలిచిం

Bheemla Nayak : ‘భీమ్లా నాయ‌క్’ వివాదంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ఎప్పుడైనా అలా స్పందించారా? అంటూ ప్ర‌శ్నించిన పేర్ని నాని

Image
‘భీమ్లా నాయ‌క్’ సినిమా విష‌యంలో ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ఓ రేంజ్‌లో వినిపించాయి. ప్ర‌భుత్వంపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ క్ర‌మంలో ‘భీమ్లా నాయ‌క్’ సినిమాకు అస్స‌లు సంబంధం లేని జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరుని ఆయ‌న ప్ర‌స్తావించారు. అస‌లు ‘భీమ్లా నాయ‌క్’ సినిమాకు ఎన్టీఆర్ ఏంటి సంబంధం అనే వివ‌రాల్లోకి వెళితే.. ‘‘భీమ్లా నాయక్ సినిమాను తొక్కేస్తున్నామ‌ని అంటున్నారు. సినిమాన ఎక్క‌డైనా తొక్కేయ‌డాని వీల‌వుతుందా? సినిమా బావుంటే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. ఇక ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో బ్లాక్ టికెటింగ్‌ను రూపు మాప‌డానికి. కానీ ప్ర‌తి ప‌క్ష పార్టీలు అన్నీ బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్స‌హిస్తున్నాయి. అలాగే బ్లాక్ మార్కెటింగ్‌ను త‌ప్పు ప‌ట్టాల్సిన మీడియాలో కొంత మందికి దానికి అనుకూలంగా మాట్లాడ‌టం వింటే ఆశ్చ‌ర్యంగా అనిపించింది. టికెట్ రేట్స్‌పై జీవోను నిలిపి కలెక్ట‌ర్‌ను సంప్ర‌దించి టికెట్ రేట్స్ పెంపుద‌ల‌పై అనుమ‌తులు తీసుకోవ‌చ్చున‌ని హైకోర్టు తీర్పు చెప్పింది. కానీ ఎవ‌రూ అలా చేయ‌డం లేదు. మీకు కోర్టులు, ప్ర‌భుత్వాలు అంటే లెక్క‌లేదంటే ఎలా? మా ఇష్ట

Prabhas : ‘రాధే శ్యామ్’ లెక్కలు తెలిస్తే కళ్లు తిరగాల్సిందే.. ఓవర్ సీస్‌లో డార్లింగ్ పక్కా స్కెచ్!

Image
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘రాధే శ్యామ్‌’. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో సందడి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న గ‌త చిత్రం సాహో విడుద‌లై రెండున్న‌రేళ్లు అవుతుంది. ఆయ‌న అభిమానులేమో ప్ర‌భాస్‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ‌టానికి ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. మార్చి 11న డార్లింగ్ ప్ర‌భాస్ బాక్సాఫీస్ వ‌ద్ద త‌న స‌త్తా చాట‌డానికి రెడీ అంటున్నారు. లేటెస్ట్‌గా ఓవ‌ర్ సీస్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డానికి చిత్రాన్ని మేక‌ర్స్ సిద్ధం చేస్తున్నారు. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఓవ‌ర్‌సీస్‌లో మ‌రే చిత్రం విడుద‌ల కాన‌న్ని లొకేష‌న్స్‌లో అంటే హిందీ వెర్ష‌న్‌ 1116, తెలుగు వెర్ష‌న్‌ 1116, త‌మిళం 200 లొకేష‌న్స్‌లో విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. 31116 స్క్రీన్స్‌లో..11116 షోస్‌ను ప్ర‌దర్శించ‌బోతున్నారు. మ‌రి ఇంత భారీగా రాధే శ్యామ్ విడుద‌లైతే వ‌సూళ్ల ప‌రంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి మ‌రి. పీరియాడిక్ ల‌వ్ స్టోరిగా రూపొందిన ఈ చిత్రంలో ప్ర‌భాస్ జోడీగా పూజా హెగ్డే న‌టించింది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్

Bheemla Nayak Success : తమన్ థియేట‌ర్‌లో చేసిన ర‌చ్చ పీక్స్‌.. వారిద్ద‌రి థాంక్స్ చెప్పిన మ్యూజిక్ సెన్సేష‌న్‌ !

Image
ప్ర‌స్తుతం టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేష‌న్ ఎవ‌రంటే ట‌క్కున వినిపిస్తోన్న స‌మాధానం త‌మ‌న్‌. ఇప్పుడు త‌మ‌న్ ఆనందానికి ప‌ట్ట‌ప‌గ్గాలు లేవు. అందుకు కార‌ణం.. ‘భీమ్లా నాయ‌క్‌’ సినిమా. శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమా విజ‌య‌వంత‌మైన టాక్ సంపాదించుకుంది. ముఖ్యంగా సినిమా రిలీజ్ కంటే విడుద‌లైన లిరిక‌ల్ సాంగ్స్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చాయి. సినిమా రిలీజ్ త‌ర్వాత బ్యాగ్రౌండ్ స్కోర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కులు, ఫ్యాన్స్ పాటలు వ‌స్తున్నప్పుడు చేస్తున్న సంద‌డి అంతా ఇంత కాదు. సాధార‌ణంగా హీరో పాట‌ల‌కు అభిమానులు స్క్రీన్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి స్టెప్పులేయ‌డం అనేది కామ‌న్‌గా జ‌రిగే విష‌యం. అయితే, మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌, డ్రమ్స్ శివ మ‌ణి కూడా ఇప్పుడు ఆ లిస్టులో చేరిపోయారు. అభిమానుల‌తో క‌లిసి స్క్రీన్ ముందు వేసిన స్టెప్పుల వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఈ వీడియోను త‌మ‌న్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి, త్రివిక్ర‌మ్‌కు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు చెప్పారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో త‌మ‌న్ వ‌ర్క్ చేసిన రెండో సినిమా ఇది. ప‌వ‌న్ ర

Pawan Kalyan : ఏడోసారి ఆ మైల్ స్టోన్ ట‌చ్ చేసిన‌ ప‌వ‌ర్ స్టార్‌.. ‘భీమ్లా నాయ‌క్’ స్ట్రోమ్ మామూలుగా లేదు!

Image
పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘భీమ్లా నాయ‌క్’. ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లైన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సినిమా వ‌సూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఇక యు.ఎస్ విష‌యానికి వ‌స్తే.. ఫిబ్ర‌వ‌రి 24నే ‘భీమ్లా నాయ‌క్’ ప్రీమియ‌ర్స్ ప‌డ్డాయి. అక్క‌డ ప్రీమియ‌ర్ షోస్ వ‌సూళ్లు 867000 డాల‌ర్స్‌గా ట‌చ్ అయ్యింది. శుక్ర‌వారానికి ఇది వ‌న్ మిలియ‌న్ డాల‌ర్స్‌ను ట‌చ్ చేసిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇలా ఓవ‌ర్ సీస్‌లో వ‌న్ మిలియ‌న్ మార్కును ట‌చ్ చేసిన సినిమాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఏడోది. సినిమాకు స‌క్సెస్ టాక్ రావ‌డంతో ఇక సినిమా వ‌సూళ్ల ప‌రంగా ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేయ‌నుందో చూడాలి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఆరు కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్ర‌దేశ్‌లో టికెట్ రేట్స్ త‌క్కువ‌గా ఉన్నాయి. తెలంగాణ త‌ర‌హాలో అక్క‌డ మంచి టికెట్ రేట్స్ ఉండుంటే.. సినిమా వ‌సూళ్ల ప‌రంగా మ‌రింతగా దూసుకెళ్ల‌ద‌ని సినీ స‌ర్కిల్స్ టాక్‌. తెలుగు రాష్ట్

రాధే శ్యామ్ లవ్ సాంగ్ వైరల్.. ప్రేమ పక్షులు ప్రభాస్- పూజా హెగ్డే స్పెషల్ అట్రాక్షన్

Image
'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో హీరోగా రూపొందిన కొత్త సినిమా 'రాధే శ్యామ్'. దాదాపు రెండేళ్లకు పైగానే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 11వ తేదీన గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. రీసెంట్‌గా ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుతున్నారు. అదేవిధంగా ప్రమోషన్స్‌పై ప్రత్యేక శ్రద్ద పెడుతూ ప్రభాస్ అభిమానుల్లో ఆతృత పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా లవ్ సాంగ్ 'ఈ రాతలే' రిలీజ్ చేయడంతో క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది. జస్టిన్ ప్రభాకరణ్ కంపోజ్ చేసిన ఈ పాటను యువన్ శంకర్ రాజా, హరిణి ఆలపించగా.. కృష్ణకాంత్ లిరిక్స్ రాశారు. విదేశాల్లోని అందమైన లొకేషన్స్‌లో షూట్ చేశారు. హీరో, హీరోయిన్లు ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమలో పడటంతో పాటు ప్రేమ పక్షులుగా ప్రభాస్, అట్రాక్టివ్ లుక్స్ ఈ పాటలో హైలైట్ అయ్యాయి. మొత్తంగా చూస్తే ఈ సాంగ్ యూత్ ఆడియన్స్‌కి, ప్రభాస్ అభిమానులకు విజువల్ ట్రీట్‌ అని చెప్పుకోవచ్చు. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కిన ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తెస

బ్యాక్‌బోన్ ఆఫ్ భీమ్లా నాయక్ అదే! హరీష్ శంకర్ కామెంట్స్ వైరల్

Image
నేడు (ఫిబ్రవరి 25) '' సినిమా విడుదలైంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా భీమ్లా నాయక్‌ మేనియానే కనిపిస్తోంది. ప్రీమియర్స్ మొదలుకొని మార్నింగ్ షో, మ్యాట్నీ షోస్ జనంతో నిండిపోయాయి. నటన విశ్వరూపం చూసి హుషారెత్తిపోతున్నారు ఫ్యాన్స్. మరోవైపు రివ్యూలు సైతం పాజిటివ్ గానే రావడంతో 'భీమ్లా నాయక్' హవా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ వరుస ట్వీట్స్ పెట్టారు డైరెక్టర్ . మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోశియుమ్' తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ భారీ రేంజ్‌లో ఈ సినిమాను రూపొందించింది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు పవన్ కళ్యాణ్. డానియల్ శేఖర్‌గా రానా పోటీపడి నటించారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కనిపించాయి. అయితే ఈ మూవీ తొలి షో చూసిన హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్, రానా, తమన్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. థియేటర్లలో పవన్ కళ్యాణ్ గర్జించారని, సాగర్ కె చంద్ర, త్రివిక్రమ్ చాలా గొప్ప సినిమా తీశారని హరీష్ శంకర్ అన్నారు. సినిమాకు తమన్ మ్యూజిక్ వెన్నుముక అని తెలుపుతూ చిత్ర

RGV: భీమ్లా నాయక్ భూకంపం..! పవన్ కళ్యాణ్ యాక్టింగ్‌పై వర్మ రివ్యూ

Image
మొత్తానికి 'భీమ్లా నాయక్' సినిమా విడుదలైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడింది. నేడే (ఫిబ్రవరి 25) ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్‌ మేనియా నడుస్తోంది. జనంతో థియేటర్స్ కిటకిటలాడుతున్నాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తుండగా.. కొందరు మాత్రం విజువల్స్‌పై పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వివాదాస్పద వీరుడు రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగి తన రివ్యూ ఇచ్చేశారు. గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ టార్గెట్‌గా పలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ఆర్జీవీ.. తాజాగా పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాపై స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఎలా ఉంది? పవన్, రానాల నటన సంగతేంటి? అనే అంశాలను తీసుకొని రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని బట్టి చూస్తే ఈ సినిమాపై వర్మ సానుకూలంగా స్పందించినట్లు కనిపిస్తోంది. భీమ్లా నాయక్ సినిమా మూవీ ఓ మెరుపు లాంటిదని పేర్కొన్న వర్మ.. పవన్ కళ్యాణ్ ఓ సునామీ అనేశారు. ఇక రానా అయితే పవన్‌తో పాటీ పడీ నటించారని చెబుతూ ఆయనకు ఫుల్ మార్క్స్ వేసేశారు. అంతేకాదు భ

Poonam Kaur : అక్కా బావ సినిమా హిట్టు.. స్క్రీన్ షాట్ వదిలిన పూనమ్ కౌర్

Image
పవర్ స్టార్ సినిమా అంటే ఫస్ట్ డే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్ల వద్ద జాతరలా ఉంటుంది. ఇక సినిమా మీద అంచనాలు ఆకాశన్నంటాయి. దీనికి తోడు నేటి ఉదయం నుంచి కూడా ట్విట్టర్‌లో పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. ఇక రివ్యూలు సైతం భీమ్లా నాయక్‌కు అనుకూలంగానే వచ్చాయి. సినిమా అదిరిపోయింది.. బొమ్మ హిట్టు అని కామెంట్లు వస్తున్నాయి. ఒరిజినల్ సినిమాతో పోలిక పెట్టాల్సిన అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని మార్చేశారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్, యాటిట్యూడ్, రానా స్వాగ్, తమన్ మ్యూజిక్ ఇలా అన్నీ కూడా దుమ్ముదులిపేశాయి. అయితే భీమ్లా నాయక్ సినిమా మీద పరోక్షంగా కౌంటర్లు వేస్తోంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో రాజకీయాలు, సినిమాలు అంటూ ఏదో కౌంటర్ వేసింది. ఇక పవన్ కళ్యాణ్ స్పీచ్ మీద వర్మ వేసిన ట్వీట్‌ మీద పూనమ్ కౌర్ సెటైర్ వేసింది. ఆడవాళ్లను ఆయుధాలుగా మార్చుకుంటారని దర్శకుల మీద పూనమ్ కౌంటర్ వేసింది. ఇక తాజాగా పూనమ్ కౌర్ ఓ వాట్సప్ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. అందులో ఇలా ఉంది.. ఓ వ్యక్తి స్టేటస్ పెట్టుకున్

చరిత్ర కోసం మీరు కాదు.. మీ కోసం చరిత్ర దేవర.. పవన్‌పై బండ్ల గణేష్

Image
సినిమా అంటే.. హడావిడే ఎక్కువగా ఉంటుంది. బండ్ల గణేష్ స్పీచ్‌లు లేనదే.. పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్లు జరగవు. బండ్లన్న స్పీచులకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. బండ్ల గణేష్‌కు, ఆయన మాటల తూటాలకు పవర్ స్టార్స్ ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. అతని పొగడ్తలకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బండ్లన్న కూడా ఫ్యాన్స్ అయిపోతుంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బండ్ల గణేష్ వస్తాడా? లేదా? అని వారం ముందే చర్చలు ప్రారంభించేశారు. అయితే బండ్ల గణేష్ పేరు మీదుగా లీకైన ఆడియో సంచలనంగా మారింది. అందులో త్రివిక్రమ్ మీద చేసిన ఆరోపణలు, వాడిన పదజాలం దారుణంగా ఉంది. అయితే ఇప్పుడు బండ్ల గణేష్, త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ ఉందని అర్థమవుతోంది. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదంటూ బండ్లన్న ఖండించాడు. అయితే భీమ్లా నాయక్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ కనిపించలేదు. ఆహ్వానం అందలేదేమో.. ఏం జరిగిందో గానీ మొత్తానికి బండ్లన్న రాకపోవడం, ఆయన స్పీచు లేకపోవడంతో అభిమానులు హర్ట్ అయ్యారు. దీంతో బండ్లన్న ఎక్కడ అంటూ అభిమానులు హంగామా చేసేశారు ‘మా దేవర నటించిన భీమ్లా నాయక్ దెబ్బకి బాక్సులు బద్దలవ్వాలని రికార్డులు చిరిగిపోవాలని దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు స్వాగతం పలక

త్రివిక్రమ్‌నే టార్గెట్ చేసిందా.. పూనమ్ కౌర్ ట్వీట్ అర్థమదేనా?

Image
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఉన్నాడా?లేదా? అసలు వచ్చాడా? అనే అనుమానం అందరిలోనూ కలిగింది. బండ్ల గణేష్ ఆడియో లీక్ ఎఫెక్ట్ అని.. అందుకే త్రివిక్రమ్ మాట్లాడలేదని, సైలెంట్‌గా ఉండిపోయాడని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక వైపు ఉంటే.. ఇక స్పీచు మీద రామ్ గోపాల్ వర్మ వేసిన ట్వీట్, దాని మీద పూనమ్ స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎంతో సటిల్డ్‌గా మాట్లాడాడు. ఎక్కడా గాడి తప్పకుండా.. భీమ్లా నాయక్ ఈవెంట్‌లో మాట్లాడేశాడు. దీని మీద వర్మ ట్వీట్ వేశాడు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచుల్లో ఇదే బెస్ట్ స్పీచ్.. ఎంతో ఎమోషనల్‌గా అనిపించింది అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. వర్మ వేసిన ట్వీట్ మీద కౌంటర్ వేసింది. అయితే వర్మ వేసిన ట్వీట్‌ను రీట్వీట్ వేస్తూ పూనమ్ కౌర్ స్పందించింది. ఓ డైరెక్టర్ ఎదుటి వారి జీవితాలను పూర్తిగా నాశనం చేస్తాడు.. ఓ మూల నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తాడు.. బయటి జనాలు తిడుతుంటే.. సైలెంట్‌గా ఉంటాడు అని చెప్పుకొచ్చింది. ఇక ఇంకో డైరెక్టర్ అయితే ఎదుటివారిని తక్కువ చేస్తాడు.. ట్విట్టర్‌లో నవ్వుతుంటాడు. ఆ ఇద్దరూ కూడా అమ్మాయిలను ఆయుధాలుగా వాడుకుంటారు అని అనేసింది. ఇందులో

Bheemla Nayak మొదటి రోజే సునామీ.. ఎంత రాబట్టనున్నాడంటే?

Image
మొదటి రోజు దుమ్ములేపేట్టు కనిపిస్తోంది. దెబ్బకు మరోసారి రికార్డులు బద్దలయ్యేట్టు కనిపిస్తోంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, నటన, రానా పర్ఫామెన్స్ అదిరిపోయాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ రిపోర్టులు వచ్చేశాయి. ప్రీ బుక్స్, అడ్వాన్స్ బుకింగ్స్‌తో సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని అందరికీ అర్థమైంది. అయితే సినిమాకు గనుక పాజిటివ్ రిపోర్ట్స్ వస్తే ఈ కలెక్షన్లు మరింత పెరిగే చాన్స్ ఉంటుందని అంతా భావించారు. మొత్తానికి టాక్ అదిరిపోయింది. సినిమా మొదటి రోజు రికార్డ్ కలెక్షన్లను కొల్లగొట్టబోతోందని అర్థమవుతోంది.అయితే ఏపీలో థియేటర్ల సమస్య, నో బెనిఫిట్ షోలు, నో టికెట్ హైక్స్ ఉన్నాయి. దీంతో అక్కడే కలెక్షన్లలో కాస్త తేడా కొట్టేలా ఉంది. ప్రీమియర్స్‌తోనే భీమ్లా నాయక్ మూవీ 700k డాలర్లను రాబట్టేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మొదటి రోజు ముప్పై కోట్ల మేర గ్రాస్ కొల్లగొట్టేట్టు తెలుస్తోంది. ఈ దెబ్బతో రికార్డుల మోత మొదలైనట్టే. ఇక ఈ వీకెండ్‌లోనే సినిమా బ్రేక్ ఈవెన్‌కు కూడా దగ్గర్లో వచ్చేలా ఉంది. అసలే ఈ సినిమాకు రెండు వారాలు టైం ఉంది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అ

Bheemla Nayak : భీమ్లా నాయక్ ట్విట్టర్ రివ్యూ.. పవన్ కళ్యాణ్ విశ్వరూపం

Image
పవర్ స్టార్ , రానా దగ్గుబాటి నటించిన సినిమా ఎట్టకేలకు నేడు (ఫిబ్రవరి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను తెలుగు నేటివిటీ తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసిన త్రివిక్రమ్.. ఈ సినిమాకు బ్యాక్ బోన్ అయ్యాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఇక నేడు విడుదలైన ఈ మూవీ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. భీమ్లా నాయక్ సినిమా మీద ముందు నుంచీ అంచనాలు భారీగానే ఉన్నాయ్. గ్లింప్స్, పోస్టర్లతోనే సినిమా స్థాయి పెరిగింది. ఇక ఒక్కో పాట మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్ అయితే ఇంకో రేంజ్‌లో ఉంది. దీంతో సినిమా మీద అంచనాలు ఆకాశన్నంటాయి. మొత్తానికి పవర్ స్టార్ అభిమానుల ఆకలి తీర్చే బొమ్మ పడిపోయింది. ఈ సినిమాను చూసి ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు. సినిమా చూసిన జనాలు అంతా కూడా ఒకే మాట చెబుతున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో ది బెస్ ఇదేనని, నటన అదిరిపోయిందని, యాటిట్యూడ్ చూపించడంలో పవన్ కళ్యాణ్‌ను మించిన వారు లేరంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్

Pawan Kalyan : యు.ఎస్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ‘భీమ్లా నాయ‌క్‌’ జోరు.. ప్రీమియ‌ర్స్ క‌లెక్ష‌న్స్‌లో సరికొత్త రికార్డ్ దిశ‌గా ప‌వ‌ర్ స్టార్‌!

Image
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’. రానా దగ్గుబాటి కూడా మరో హీరోగా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృత‌గా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఒక రోజు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. అన్ని చోట్ల ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. టికెట్స్ హాటు కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవ‌ర్ సీస్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా భీమ్లా నాయ‌క్ జోరు చూపిస్తున్నాడు. ప్రీమియ‌ర్ వ‌సూళ్ల‌లో భీమ్లా నాయ‌క్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు యు.ఎస్‌లో.. 325 లొకేషన్స్‌లో రిలీజ్ అవుతుంది. ఇన్ని లొకేష‌న్స్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 618000 డాల‌ర్స్‌ను రాబ‌ట్టుకుంది. అంటే ప్రీమిర్స్ ద్వారానే నాలుగు కోట్ల‌కు పైగానే ఇప్ప‌టికే భీమ్లా నాయ‌క్ రాబ్ట‌టేశాడు. వ‌న్ మిలియ‌న్ దిశ‌గా అడుగులేస్తున్నాడు. క‌రోనా మూడు వేవ్స్ దెబ్బ‌కు తెలుగు సినిమాల ఓవ‌ర్ సీస్ మార్కెట్ బాగానే దెబ్బ‌తింది. అఖండ‌, పుష్ప సినిమాలు బాగానే అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. అయితే అవి రిలీజ్ త‌ర్వాత‌నే మంచి వ‌సూళ్ల‌ను

Bheemla Nayak : గాడ్ ఫాదర్ .. భీమ్లా నాయక్ కలిస్తే.. అరుదైన వీడియో షేర్ చేసిన రామ్ చరణ్

Image
మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈరోజు ఉద‌యం ప‌ది గంట‌ల‌కు త‌న సోష‌ల్ మీడియాలో ఓ అరుదైన వీడియోను షేర్ చేస్తాన‌ని తెలిపారు. దీంతో అంద‌రూ ఆయ‌న హీరోగా న‌టించిన RRR లేదా ఆచార్య సినిమాకు సంబంధించిన ఏదైనా వీడియోను షేర్ చేస్తారేమోన‌ని భావించారు. కానీ ఆయ‌న షేర్ చేసిన వీడియో చూసి ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు థ్రిల్ అవుతున్నారు. ఇంత‌కీ అంద‌రూ అంత‌లా థ్రిల్ అయ్యేలా రామ్ చ‌ర‌ణ్ షేర్ చేసిన వీడియో ఎవ‌రిదో తెలుసా.. తండ్రి , బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ది. అస‌లు ఏం జ‌రిగింది అనే వివ‌రాల్లోకి వెళితే.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన చిత్రం భీమ్లా నాయ‌క్‌. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఆ సినిమా సెట్స్‌ను చిరంజీవి ప్ర‌త్యేకంగా విజిట్ చేశారు. అది కూడా ఆయ‌న షూటింగ్ చేస్తున్న గాడ్ ఫాద‌ర్ సినిమా డ్రెస్‌లోనే. ఇంత‌కీ చిరంజీవి వేసుకున్న డ్రెస్ ఏదో తెలుసా? ఖైదీ నెం.786 అనే ఖైది డ్రెస్‌. చిరంజీవి రాక‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ తెగ ఎంజాయ్ చేశారు. అలాగే త‌ర్వాత గాడ్ ఫాద‌ర్ సెట్స్‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజిట్ చేశారు. ఆయ‌న‌కు తోడుగా త్రివిక్ర‌మ్ కూడా వ‌చ్చారు ఆ స‌మ‌యంలో చిరంజీవి సినీ ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖులతో

Valimai Movie : అజిత్ ‘వలిమై’ సినిమా థియేటర్‌పై పెట్రొల్ బాంబులతో దాడి.. అసలు ఏం జరిగింది!

Image
కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన అజిత్ లేటెస్ట్ మూవీ ‘’. ఫిబ్రవరి 24న సినిమా విడుదలైంది. టాలీవుడ్ స్టార్ కార్తికేయ ఇందులో విల‌న్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. వ‌లిమై విడుద‌లైన త‌ర్వాత పెద్ద ఎత్తున ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఈ సంబ‌రాల్లో ఆప‌శ్రుతి చోటు చేసుకుంది. అస‌లు ఏం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకి వెళితే..కోయంబ‌త్తూరులోని గంగ వ‌ల్లి మ‌ల్టీప్లెక్స్‌లో అజిత్ వ‌లిమై సినిమా రిలీజ్ అయ్యింది. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకుంటున్నారు. అదే స‌మ‌యంలో అనుకోకుండా ముగ్గురు దుండ‌గులు థియేట‌ర్‌లో పెట్రోల్ బాంబుల‌తో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు అభిమానుల‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. బైక్ వ‌చ్చి స‌ద‌రు దుండ‌గులు బాంబుల‌తో దాడి చేశారు. వారిని ప‌ట్టుకోవ‌డానికి అజిత్ అభిమానులు ప్ర‌య‌త్నించారు. కానీ దుండ‌గులు త‌ప్పించుకున్నారు. విష‌యం తెలిసిన వెంట‌నే పోలీసులు అక్క‌డికి చేరుకుని విచార‌ణ‌ను ప్రారంభించారు. అస‌లు ఇలా పెట్రోలు బాంబుల‌తో సినిమా రిలీజ్ రోజున దాడి చేయ‌డం అనేది అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. అజిత్ హీరోగా న‌టించిన వ‌లిమై చిత్రంలో టాలీవుడ్ స్టార్ కార్తికేయ సైకో విల‌న్‌గా న‌టించార

Andhra Pradesh Restrictions : ‘భీమ్లా నాయ‌క్‌’ వ‌ర్సెస్ ఏపీ ప్ర‌భుత్వం.. ఆంక్ష‌లు షురూ!

Image
ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’. మ‌రో హీరో రానా ద‌గ్గుబాటి.. డానియ‌ల్ శేఖ‌ర్ అనే పాత్ర‌లో న‌టించారు. శివ‌రాత్రి సంద‌ర్భంగా సినిమా ఫిబ్ర‌వ‌రి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ‘భీమ్లా నాయ‌క్‌’ రిలీజ్‌కి ఏపీ ప్ర‌భుత్వం ఆంక్ష‌ల‌ను మ‌రోసారి థియేట‌ర్స్ య‌జ‌మానుల‌కు గుర్తు చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎక్క‌డా స్పెష‌ల్ షో వేయ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేసింది. అలా వేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలియ‌జేసింది. అలాగే టికెట్ రేట్స్ కూడా ప్ర‌భుత్వం విధించిన ధ‌ర‌ల‌ ప‌రిమితిలోపే ఉండాల‌ని పేర్కొంది. ‘భీమ్లా నాయ‌క్‌’ సినిమాకు సంబంధించి స్పెష‌ల్ షోస్‌, టికెట్ ధ‌ర‌లు త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌త్యేక‌మై దృష్టి పెట్టాల‌ని రెవెన్యూ శాఖ‌కు ఆదేశాల‌ను జారీ చేసింది ఏపీ ప్ర‌భుత్వం. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే 1952 సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టం ద్వారా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలియ‌జేస్తూ త‌హ‌సీల్దారులు వారి ప‌రిధిలోని సినిమా థియేట‌ర్స్‌కు నోటీసులు పంపించారు. అదే స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం ‘భీమ్లా నాయ‌క్‌’ సినిమాకు ఐదో ఆట‌కు ప్ర‌త్యేక‌మైన అనుమ‌తిని ఇచ్చింది. ఫిబ్ర

భీమ్లా నాయక్ ట్రైలర్: పవన్ కళ్యాణ్ నటనపై రామ్ చరణ్ కామెంట్

Image
పవర్ స్టార్ హీరోగా ఫిబ్రవరి 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది భీమ్లా నాయక్ మూవీ. టాలీవుడ్ భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ సినిమాలో రానా కీలకపాత్ర పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ఇతర అప్‌డేట్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోగా.. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ భారీ రేంజ్ వ్యూస్ రాబడుతోంది. ఈ ట్రైలర్ చూసిన తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రియాక్ట్ అవుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ''భీమ్లా నాయక్ ట్రైలర్‌లో ఆ పవర్ అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ గారి ప్రతీ డైలాగ్, యాక్షన్ పవర్ఫుల్గా ఉంది. నా మిత్రుడు రానా నటన, కనిపించిన తీరు సూపర్బ్. త్రివిక్రమ్, సాగర్ కె చంద్ర, నిత్య మీనన్, సితార ఎంటర్టైన్మెంట్స్, తమన్కు ఆల్ ది బెస్ట్'' అంటూ ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు రామ్ చరణ్. బాబాయ్ పవన్ కళ్యాణ్ మూవీ ట్రైలర్పై అబ్బాయి రామ్ చరణ్ ఇచ్చిన ఈ రివ్యూ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో 'భీమ్లా నాయక్' మూవీ రూపొందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిం

ముంబైలో ఆలీ భార్య.. ఛార్మీ ఎమోషనల్ పోస్ట్

Image
పూరి జగన్నాథ్, ఛార్మీలు గత రెండేళ్లుగా ముంబైలోనే ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. లైగర్ పనుల కోసం ఈ ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. మధ్యలో కరోనా, లాక్డౌన్ వంటివి రావడంతో పూర్తిగా అటే ఫిక్స్ అయిపోయారు. ఈడీ పిలిచిందని మధ్యలో పూరీ, ఛార్మీలు హైద్రాబాద్‌కు వచ్చారు. అయితే ఇప్పుడు ముంబైకి తన బార్య జుబేదాతో కలిసి ఆలీ వెళ్లినట్టు కనిపిస్తోంది. మామూలుగానే ఆలీకి, పూరికి మధ్య ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయి. పూరి సినిమాల్లో ఆలీకి ప్రత్యేక పాత్రలుంటాయి. ఇక పూరి ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో ఆలీ ఆదుకున్న సంగతి తెలిసిందే. ఆలీ గురించి పూరి పలు వేదికల్లో ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఆలీ ముంబైకి ఎందుకు వెళ్లాడో తెలీదు గానీ.. చెప్పిన విషయం మాత్రం వైరల్ అవుతోంది. ఆలీ భార్య ఎక్కువగా యూట్యూబ్‌లో సందడి చేస్తుంటుంది. వంటల వీడియోలు, హోం టూర్ వీడియోలంటూ బాగానే ఫేమస్ అయింది. ఇక ఆలీ తన తోటీ ఆర్టిస్ట్‌లకు ఇంట్లోని భోజనం అంటూ బిర్యానీని వడ్డిస్తుంటాడు. అలా జుబేదా చేసే బిర్యానీకి నెట్టింట్లో చాలానే మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇప్పుడు పూరి, ఛార్మీలకు జుబేదా స్పెషల్‌గా వంట చేసి వడ్డించినట్టుంది. ఇదే విషయాన్ని ఛార్మీ

గుర్తుతెలియని వ్యక్తులు ఇంటికి తన మూడో భార్య బండారం బయటపెట్టిన నరేష్

Image
తన మూడో భార్య రమ్య రఘుపతికి తనకి ఎలాంటి సంబంధం లేదంటూ వివరణ ఇచ్చారు సినీ నటుడు . లక్షల్లో అప్పులు తీసుకుని తిరిగి చెల్లించడం లేదంటూ కొంతమంది బాధితులు మంగళవారం నాడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై ఛీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకి తనకి ఎలాంటి సంబంధం లేదంటూ తన మూడో భార్య గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు నరేష్. ‘రమ్య రఘుపతి గారి ఫైనాన్సియల్ ఇష్యూస్ మీడియాలో బ్లాస్ట్ కావడంతో నాకు వరుసగా ఫోన్లు వస్తున్నాయి.. నా బంధువులు, మీడియా మిత్రులు జరిగిన దానిపై నిజానిజాలు తెలుసుకోవడానికి ఫోన్లుచేస్తున్నారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. జరిగిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలా జరిగిందని నాకు నిన్నమొన్నటి వరకూ తెలియదు. రమ్య రఘుపతికి నాకు పెళ్లై దాదాపు తొమ్మిదేళ్లు అవుతుంది.. పెళ్లైన రెండు మూడేళ్లే మేం విడిపోయాం.. వేరుపడి ఐదేళ్లుపైనే అయ్యింది.. ఇలాంటి సమస్యలు ఉన్నాయి.. మరింత పెరుగుతుందనే కారణంతోనే మేం విడిపోయాం. విడిపోయిన తరువాత ఎవరికి వారే గౌరవంగా మా బతుకు మేం బతుకుతున్నాం. ఆమెకు నాకు ఎటువంటి సంబంధం లేదు.. వేరు వేరుగా ఉన్నాం. ఆమెకు సంబంధించి హిందూపూర్ ఇ

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ లెక్కలు.. ఏరియా వైజ్ డీటైల్ రిపోర్ట్!!

Image
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా 'భీమ్లా నాయక్'. టాలీవుడ్ భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. మరోవైపు ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమాకు నెలకొన్న డిమాండ్ దృష్ట్యా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన రిపొర్ట్స్ ద్వారా అర్థమవుతోంది. ఏరియా వైజ్ ప్రీ- రిలీజ్ బిజినెస్ చూస్తే.. నైజాం: 35 కోట్లు సీడెడ్: 16.50 కోట్లు ఉత్తరాంధ్ర: 9 కోట్లు ఈస్ట్ గోదావరి: 6.40 కోట్లు వెస్ట్ గోదావరి: 5.40 కోట్లు గుంటూరు: 7.20 కోట్లు కృష్ణా: 6 కోట్లు నెల్లూరు: 3.25 కోట్లు మొత్తంగా AP-TG రాష్ట్రాల్లో కలిపి 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 9 కోట్లు, ఓవర్సీస్‌లో మరో 9 కోట్ల బిజినెస్ జరిగినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. వరల్డ్ వైడ్‌గా చూస్తే 106.75 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో 108 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగుతున్నాడు భీమ్లా

ఆ మాటతో బుక్కైన అషు రెడ్డి..! ఛాన్స్ దొరికిందని రెచ్చిపోతున్న నెటిజన్లు

Image
సోషల్ మీడియాతోనే నేమ్, ఫేమ్ కొట్టేసింది . ఆ తర్వాత బిగ్ బాస్ షోతో ఆ పాపులారిటీని రెట్టింపు చేసుకొని కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకుంది. జూనియర్ సమంతగా పెరు తెచ్చుకున్న ఈ బ్యూటీ నెట్టింట చేసే అల్లరి మామూలుగా ఉండదు. నిత్యం తన ఫోటోషూట్లతో నెట్టింట మంట పెట్టడం అషు హ్యాబీ. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో షూట్‌పై, దానిపై ఆమె జోడించిన ట్యాగ్ లైన్‌పై రెచ్చిపోయి కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్న అషూ రెడ్డి హాట్‌ ఫోటోషూట్‌లతో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది. చాలా డిఫరెంట్‌గా ఫొటోలకు పోజులిస్తూ ఆ ఫోటో షూట్స్ అభిమానులతో పంచుకుంటోంది. అయితే ఆమె షేర్ చేస్తున్న ఫోటోషూట్లను నెటిజన్లు, మీమర్స్ దారుణమైన కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. కాగా, తాజాగా అల్ట్రా మోడ్రన్ స్టైల్‌లో టార్న్‌ డెనిమ్‌ షర్ట్‌ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చిన అషూ.. 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో' అని ఒక పెద్దాయన చెప్పాడంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇది చూసి నెటిజన్లు ఆమెపై అటాక్ చేస్తున్నారు. 'పాపం వీధి కుక్కలు దాడిచేసాయేమో చొక్కా మొత్తం చినిగింది' అంటూ ఫన్నీ క

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

Image
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ మలయాళ నటి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 74సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం రాత్రి (ఫిబ్రవరి 22) కేరళలోని త్రిపుణితురలో తుది శ్వాస విడిచారు. ఇటీవలే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో మంగళవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. దాదాపు 50 ఏళ్ల సినిమా కెరీర్‌లో ఆమె 550కి పైగా సినిమాల్లో నటించారు. మలయాళం సినిమా కమర్షియల్ అండ్ ఆర్ట్ స్కూల్ రెండింటిలోనూ బాగా రాణించారు ఈ లెజండరీ నటి. చివరిగా కేరళకు చెందిన సంగీత నాటక అకాడమీకి ఆమె ఛైర్ పర్సన్‌గా ఆమె పనిచేశారు. లలిత నటనకు గాను రెండు జాతీయ అవార్డులు, నాలుగు రాష్ట్ర పురస్కారాలు లభించాయి. మలయాళ చిత్ర నిర్మాత భరతన్‌ను పెళ్లాడింది లలిత. వీరికి సిద్ధార్థ్ భరతన్ అనే కుమారుడు, శ్రీకుట్టి భరతన్ ఆమె కుమార్తె ఉన్నారు. లలిత మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలువురు సినీ ప్రముఖులు ఆమె మరణం పట్ల సోషల్ మీడియా వేదికగా త

Valimai Pre Release Event : రిలీజ్ డేట్ మరిచిపోయిన హీరో.. కార్తికేయ క్షమాపణలు

Image
సినిమాపై తమిళ నాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో హీరోగా అజిత్ దుమ్ములేపుతుంటే.. విలన్‌గా నటించాడు. దీంతో తెలుగులోనూ ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇక నిర్మాత బోనీ కపూర్ అవ్వడంతో హిందీలోనూ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాడు. బైక్ చేజింగ్, రేస్, యాక్షన్ సీక్వెన్స్‌లు అందరినీ కట్టి పడేసేలా ఉన్నాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 24న రాబోతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు (మంగళవారం ఫిబ్రవరి 22) జరిగింది. ఈ ఈవెంట్‌లో కార్తికేయ మాట్లాడుతూ.. ఓ తప్పు చేశాడు. సినిమా విడుదల తేదీని మరిచిపోయాడు. ఫిబ్రవరి 24న అని చెప్పాల్సింది. కానీ నవంబర్ 24న అంటూ నోరు జారేశాడు. ఆ తరువాత ఎప్పటికో తన తప్పు తెలుసుకుని.. సరి చేసుకున్నాడు. ఇందాక మాట్లాడుతూ విడుదల తేదీని తప్పుగా చెప్పానట.. నవంబర్ 24 అని చెప్పానట. క్షమించండి అని అన్నాడు. వలిమై సినిమా ఫిబ్రవరి 24న రాబోతోందని సరి చేసుకున్నాడు. ఇందాక ఏదో కన్ఫ్యూజన్‌లో ఉన్నాను.. నవంబర్ 24 అంటే అది నా పెళ్లి రిసెప్షన్ రోజు అంటూ కార్తికేయ చెప్పుకొచ్చాడు. మొత్తానికి తన స్పీచులో ఇటు పవర్ స్టార్, అటు తలా అభిమానులను కవర్

Amitabh Bachchan : ప్రభాస్‌ అండ్ టీమ్‌కి అమితాబ్ అదిరిపోయే గిఫ్ట్... థాంక్స్ చెప్పిన ‘రాధే శ్యామ్’ యూనిట్

Image
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌పై బాలీవుడ్ సూప‌ర్ స్టార్‌.. షెహ‌న్ షా అమితాబ్ త‌న ప్రేమ‌ను చూపించారు. ఇంత‌కీ బిగ్ బి ప్ర‌భాస్‌పై త‌న ప్రేమ‌ను ఎలా వ్య‌క్తం చేశార‌నే వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌భాస్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్‌’. ఈ పాన్ ఇండియా సినిమా మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వ‌తుంది. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకుంటున్నాయి. ఈ సినిమాకు ఓ వాయిస్ ఓవ‌ర్ ట్రాక్ ఉంది. దాన్ని ఎవ‌రితో చెప్పించాల‌ని టీమ్ ఎంత‌గానో మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతూ వ‌చ్చింది. చివ‌ర‌కు ఆ కోరిక‌ను బిగ్ బి తీర్చేశారు. చిత్రానికి అమితాబ్ త‌న వాయిస్ ఓవ‌ర్‌ను అందించారు. ఈ విష‌యాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ‌, హీరోయిన్ పూజా హెగ్డే త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియ‌జేశారు. ‘‘ఆయ‌న త‌న నెరేష‌న్‌తో ఎపిక్ ల‌వ్ స్టోరిని మ‌రింత ఎపిక్‌గా మార్చినందుకు ధ‌న్య‌వాదాలు’’ అంటూ ‘రాధే శ్యామ్’ టీమ్ బిగ్ బికి థాంక్స్ చెప్పింది. మ‌రి తెలుగు స‌హా త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఇదే నెరేష‌న్‌ను ఎవ‌రు ఇచ్చార‌నేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌, అమితాబ్ క‌లిసి Project K సి

భీమ్లా నాయక్ ట్రైలర్ సునామీ.. RRR రికార్డులను చెరిపేస్తూ ఊచకోత

Image
హీరోగా రూపొందుతున్న 'భీమ్లా నాయక్' సినిమా విడుదలకు ముందే రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ అందుకోగా తాజాగా నిన్న (సోమవారం) రాత్రి విడుదల చేసిన ట్రైలర్ ఆన్ లైన్ వేదికలపై హంగామా చేస్తోంది. గత సినిమాల రికార్డులు చెరిపేస్తూ సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే RRR రికార్డును దాటేసి సరికొత్తగా తన పేరు లిఖించుకున్నాడు భీమ్లా నాయక్. ట్రైలర్ టాక్ ఎలా ఉన్నప్పటికీ ఈ వీడియోకు భారీ రేంజ్ రెస్పాన్స్ దక్కుతోంది. సామాజిక మాధ్యమాలను హోరెత్తిస్తూ లక్షల్లో లైకులు తెచ్చుకుంటోంది. అంతకుముందు వచ్చిన బిగ్ బడ్జెట్ సినిమాల రికార్డ్స్ అధిగమిస్తోంది. మొదట టాలీవుడ్‌లో అత్యదిక వేగంగా 100K లైక్స్ అందుకున్న ట్రైలర్‌గా రికార్డును నమోదు చేసిన భీమ్లా నాయక్.. ఆ తర్వాత 200K, 500K, 600K, 700K, 800K, 1M లైక్స్ కూడా చాలా వేగంగా అందుకొని మిగతా సినిమాల రికార్డులను బ్రేక్ చేశాడు. కాగా, రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ సినిమా RRR ట్రైలర్ 4 గంటల 12 నిమిషాల్లో 800K లైక్స్ అందుకొని రికార్డు క్రియేట్ చేయగా.. ఇప్పుడు భీమ్లా నాయక్ దాన్ని అధిగమించాడు. కేవలం 1 గంట