Posts

Showing posts from August, 2019

‘సాహో’ డే-2 కలెక్షన్స్.. ప్రభాస్ బాక్సాఫీస్ ప్రభంజనం

Image
‘బాహుబలి’గా ప్రపంచాన్ని గెలిచివచ్చిన ఇప్పడు ‘సాహో’ అంటూ మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా ముందు నుండి ఉన్న ప్రీ రిలీజ్ హైప్ వల్ల ఆ సినిమా మొదటి రోజు అసాధారణమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అన్ని భాషలు, అన్ని స్క్రీన్స్ కలుపుకుని మొదటి రోజు ఏకంగా రూ. 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఆ టాక్‌తో ఆక్యుపెన్సీ తగ్గకుండా ఈ రేంజ్ కలెక్షన్స్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే ‘సాహో’ ప్రభంజనం మొదటిరోజుకే పరిమితం అనుకున్నారు అంతా. కానీ రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్‌ని కలెక్షన్స్ వరదతో ముంచెత్తింది ‘సాహో’. హిందీ వెర్షన్ వరకు మొదట రోజు రూ. 24 కోట్లకు పైగా కొల్లగొట్టిన ‘సాహో’ సెకండ్ డే చాలా వరకు డ్రాప్ చూపిస్తుంది అనుకున్నారు అంతా. కానీ, అందరి అంచనాలు తప్పని నిరూపిస్తూ వీకెండ్ అడ్వాంటేజ్‌ని వాడుకుంటూ ఏకంగా రూ. 26 కోట్ల షేర్‌‌ని రాబట్టింది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఫస్ట్ వీకెండ్‌లో ‘సాహో’ హిందీ వెర్షన్ నుండే రూ. 70 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. Also Read: అలాగే తెలుగులోనూ రెండో రోజు ‘సాహో’ ప్రభంజనం

Saaho Collections: ‘సాహో’ ఫస్ట్ డే వంద కోట్లు.. ప్రభాస్ వరుస రికార్డ్!

Image
టాక్‌తో సంబంధం లేకుండా ‘సాహో’ తొలిరోజు రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా శుక్రవారం నాడు భారీగా విడుదలైన ‘సాహో’ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా రికార్డ్ ఓపెనింగ్స్ సాధించింది. దేశవ్యాప్తంగా ‘సాహో’ మూవీ తొలి రోజు వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ప్రభాస్ కెరియర్‌లో వరుసగా రెండోసారి వందకోట్లు సాధించిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ‘బాహుబలి2’ కూడా తొలి రోజు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. దీంతో ప్రభాస్ వరస చిత్రాలతో వంద కోట్ల క్లబ్‌లో చేరారు. ఏరియాలవారిగా ఈ కలెక్షన్ల రిపోర్ట్ ఇలా ఉంది... నైజాం: 14. 1 కోట్లు ఆంధ్రప్రదేశ్: 42. 2 కోట్లు కర్ణాటక: 13. 9 కోట్లు తమిళనాడు: 3. 8 కోట్లు కేరళ: 1.2 కోట్లు హిందీ (బాలీవుడ్): 29.6 కోట్లు టోటల్ ఇండియా గ్రాస్ 104.8 కోట్లు టోటల్ ఇండియా షేర్ 68. 1 కోట్లు కాగా.. హిందీలో 29.6 కోట్లు షేర్ సాధించి 2019లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘సాహో’ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మరోవైపు నైజాం ఏరియాలో బాహుబలి రికార్డ్‌

RDX Love Teaser: అపరిచితులతో సెక్స్.. పాయల్ సేఫ్టీ టిప్స్‌కి మిలియన్ల వ్యూస్

Image
‘ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు మన ఒంట్లో ఫీలింగ్స్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. తప్పుదు అనుకుంటే సేఫ్టీలైనా అందుబోటులో ఉంచుకోవాలి’.. ఇది స్వాతి పుస్తకంలో డాక్టర్ సమరం చెప్పే సెక్స్ టిప్స్ కాదూ.. వాత్సాయన కామసూత్రం అంతకంటే కాదు. ‘ఆర్ఎక్స్ 100’ హాట్ బ్యూటీ లేటెస్ట్ మూవీ ‘RDX Love’ చిత్రానికి సంబంధించిన టీజర్‌లోనూ బూతు పురణం ఇది. ఆర్ ఎక్స్ 100లో మితిమీరి అందాలను ప్రదర్శించి తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకుపోతా అంటూ హిట్ కొట్టిన పాయల్.. ‘RDX Love’ మరోసారి గ్లామర్ డోస్ పెంచింది. గ్లామర్ డోస్ అంటే మితిమీరి అందాలు ప్రదర్శించడమే కాదు.. బరితెగించి సెక్స్‌లో సేఫ్టీలు కూడా వాడేస్తుంది. ముద్దులు, హగ్‌లకు లెక్కేలేదు.. ఎక్కడెక్కడో చేతులు పెట్టించుకుంటూ కామక్రీడలో బౌండరీలు దాటేస్తోంది పాయల్. ‘అలా అక్కడ ముద్దు పెట్టుకుంటే బాగుంటుందా? అని ఒక అమ్మాయి ఆసక్తిగా అడుగుతుంటే స్వర్గం కనిపిస్తుంది అని వాత్సాయనుడుకి నిలువెత్తు కటౌట్ లాంటి హీరో.. పాయల్‌తో రసకేళిలో పోటీ పడుతున్నాడు. అర్ధరాత్ర పూట తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి పోలీసులకు దొరికిన పాయల్‌ని.. ఎక్కడ నుండి వస్తున్నావ్ అంటే.. ‘తను సేఫ్టీ కావాలంటే తీసుకువస్తున్నాను

తగ్గనంటున్న చిరు.. ఆ రోజు ‘వార్’కి సిద్ధమే!

Image
మెగాస్టార్ డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ ఎప్ప్పుడో కంప్లీట్ చేసుకుంది. సినిమాలో బలమైన కంటెంట్ ఉంది. బాలీవుడ్‌కి సైతం బాగా పట్టే పేట్రియాటిక్ కంటెంట్ ఉంది. అందుకే దాన్ని నేషనల్ ప్రాజెక్ట్‌గా మలచాలని భావించిన రామ్ చరణ్ అనుకున్నట్టుగానే 250 కోట్ల రూపాయల ఖర్చుతో ‘సైరా’ని నిర్మించాడు. మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చినా అనుకున్న టైంలోనే సినిమాని పూర్తి చేసారు. ఈ సినిమాని బాలీవుడ్‌లో రిలీజ్ చెయ్యడానికి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ కూడా ముందుకు వచ్చింది. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఆనవాయితీ ప్రకారం బాలీవుడ్‌లో ఒక ఈవెంట్ చేసి మరీ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. ఆ టీజర్‌లోనే అక్టోబర్ 2న రిలీజ్ అని స్పష్టం చేశారు. అయితే బాలీవుడ్‌లో బడా ప్రొడక్షన్ హౌస్ అయిన యష్ రాజ్ ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘వార్’ కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. యూత్‌లో, మాస్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసింది. హాలీవుడ్ స్టైల్ మేకింగ్‌తో, హై‌వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో సూపర

‘గూఢచారి’ని దాటేసిన ‘ఎవరు’.. అబద్ధమంటూ శేష్‌పై నిర్మాత ఫైర్!

Image
హీరోగా, క్రియేటివ్ పార్ట్‌ను లీడ్ చేస్తూ నటించిన సినిమా ‘ఎవరు’. రెజీనా, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలైంది. ఆద్యంతం ఊహించని మలుపులతో సాగుతూ ఆకట్టుకున్న ఈ థ్రిల్లర్‌కి అన్ని వర్గాల నుండి మంచి ఆదరణ లభించింది. యూనానిమస్ హిట్ టాక్ రావడంతో ‘ఎవరు’ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాతో పాటు విడుదలైన శర్వానంద్ ‘రణరంగం’కి ప్లాప్ టాక్ రావడం, థియేటర్స్‌లో వేరే ఏ సినిమా పోటీగా లేకపోవడంతో ‘ఎవరు’ కలెక్షన్స్ పరంగా సత్తా చాటింది. అయితే, రెండు వారాల గ్యాప్‌లో బరిలోకి దిగిన ‘సాహో’ అంచనాలు అందుకోకపోవడంతో అడివి శేష్ సోషల్ మీడియాలో మళ్ళీ తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం మొదలు పెట్టాడు. దానిలో భాగంగా ‘ఎవరు’ తన గత సినిమా ‘గూఢచారి’ కలెక్షన్స్‌ను కూడా దాటేసి తన కెరీర్ బెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది అని ట్వీట్ చేసాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే అడివి శేష్ పెట్టిన ఈ ట్వీట్‌కి ఊహించని రిప్లై ఇచ్చాడు ‘గూఢచారి’ సినిమా నిర్మాత అభిషేక్ నామా. అడివి శేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ‘గూఢచారి’ సినిమానే అంటూ చెప్పుకొచ్చాడు. అలా కాకుండా ‘ఎవరు’ పెద్ద హిట్ అయితే ఆ సినిమా బ

saaho: 100 కోట్లు దాటేసిందహో...!

Image
ఇదెక్కడి సినిమారా బాబూ అని కొందరు… ప్రభాస్ మళ్లీ గట్టిగా కొట్టాడని మరికొందరు.. ఇలా ఎవరికి వారు సొంతంగా రివ్యూలు రాసేసుకున్నారు. కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద తన పనిని తాను చేసుకుపోయింది. తొలిరోజు కలెక్షన్ల వర్షం కురిపించింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్లు(గ్రాస్) వసూళ్లు రాబట్టిందని చిత్రవర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ‘సాహో’ 130 కోట్ల స్పెషల్ పోస్టర్ కూడా బయటకు వచ్చేసింది. 2019 బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా నిలిచింది. సినిమా బాగాలేదన్న క్రిటిక్సే రూ.130కోట్లు వసూళ్లు సాధించని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తుండడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించారు. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, అరుణ్ విజయ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ తదితరులు సహాయ పాత్రలు పోషించారు. మరో రెండు వారాలు కలెక్షన్ల జోరు ఇలాగే కొనసాగితే నిర్మాతలు పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చేసినట్లే..!

Namratha: సమంత.. మహేశ్‌తో నా ఫొటో చూశావా..

Image
సినీ ప్రముఖులు సోషల్‌మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలకు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ మహేశ్ బాబు, సమంత, ఎన్టీఆర్ లాంటి స్టార్ సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా సమంత తన భర్త నాగచైతన్యను ఆలింగనం చేసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఫొటోకు ‘మై చై అక్కినేని’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటో చూసిన నమ్రత వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో మహేశ్‌ను ఆలింగనం చేసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు. దీనికి సమంత పేరుని ట్యాగ్ చేస్తూ.. ‘సేమ్ సేమ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇందుకు సమంత బదులిస్తూ.. ‘మీ ఇద్దరూ బెస్ట్ కపుల్’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. సమంత, మహేశ్ కలిసి ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సామ్.. తన కుటుంబంతో కలిసి స్పెయిన్‌లోని ఐబిజాలో విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క సూపర్‌‌స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ కశ్మీర్‌లో ఉన్నారు. మహేశ్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చిత్రీకరణ అక్కడే జరుగుతోంది. ఈరోజు మహేశ్ కుమారుడు గౌతమ్ ఘట్టమనేని 13వ పుట్టినరోజు జరుపుకొంటుడడంతో అక్కడే గ్రాండ్‌గా సెలబ్

Saaho Review: కామన్ సెన్స్ లేదా.. ‘సాహో’ బాలేదంటారా? యాంకర్ రవి ఫైర్

Image
‘సాహో’ సినిమా బాలేదంటూ నెగిటివ్ ప్రచారం చేసేవారిపై ఫైర్ అయ్యారు . దయచేసి సినిమా చూసి రివ్యూ ఇవ్వాలని.. వెయ్యిలో ఒకడికి సినిమా నచ్చకపోతే దాన్ని హైలైట్ చేయడం సరికాదని.. మీకు నచ్చకపోతే పోయేది రూ. 200 వందలే.. కాని కష్టపడి సినిమా తీసిన వాళ్లకు వందల కోట్లు నష్టం వస్తాయన్నారు’ యాంకర్ రవి. ఈ నెగిటివ్ రివ్యూస్‌పై ఫైర్ అవుతూ తన ఫేస్ బుక్‌ ద్వారా వీడియో వదిలారు రవి. ఇందులో రవి మాట్లాడుతూ.. ‘‘జై’ ..‘డార్లింగ్ ప్రభాస్ కంగ్రాట్స్, దర్శకుడు సుజీత్‌కి కంగ్రాట్స్.. యూవీ క్రియేషన్స్‌కి వారి ధైర్యానికి మెచ్చుకోవాలి. రూ. 350 కోట్లతో సినిమా తీయడం చిన్న విషయం కాదు. అయితే డార్లింగ్‌పై ఇంత ఖర్చుపెట్టారు కాబట్టి ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తాయి. నేను సినిమా చూశా.. అదిరిపోయింది సాహో సినిమా నా స్నేహితులతో కలిసి చూశా. నాకు చాలా బాగా నచ్చింది. ఇంటర్నేషనల్ స్టాడర్డ్స్‌తో సినిమా చూపించారు. మన తెలుగు సినిమా ఈ స్థాయికి వెళ్లడం చాలా గర్వంగా ఉంది. నా గ్యాంగ్‌ని తీసుకుని ఈ సినిమాకు వెళ్లాను. నాతో పాటు వాళ్లందరికీ సినిమా చాలా బాగా నచ్చింది. ఈ వీడియో చేయడానికి రీజన్ ఇదే. . నేను ఈ మధ్య చాలా విషయాల్లో రియాక్ట్ కావడం మానేశా. వ

Disha patani: మా అన్నయ్య దిశాను ప్రేమించలేదు

Image
టైగర్ ష్రాఫ్, .. ముంబయిలోని ఏ రెస్టారెంట్‌లో చూసినా ఈ జంట ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి. మీడియా వర్గాలు ప్రశ్నిస్తే.. అయ్యో మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదు అంటారు. కానీ కలిసి తిరగడం మాత్రం మానరు. ఈ నేపథ్యంలో టైగర్ సోదరి కృష్ణా ష్రాఫ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సోదరుడి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ‘నేను అస్సలు అబద్ధాలు చెప్పను. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. మా అన్నయ్య 100 పర్సెంట్ సింగిల్‌గానే ఉన్నాడు. ఒకవేళ నాకు అవకాశం ఉంటే.. దిశా పటానీని ఆదిత్య రాయ్ కపూర్‌తో జత చేయిస్తాను’ అని తెలిపారు. గతంలో టైగర్‌ను ఓ అభిమాని ప్రశ్నిస్తూ… ‘మీరు దిశా పటానీతో డేటింగ్‌లో ఉన్నారా?’ అని అడిగారు. ఇందుకు టైగర్ సమాధానమిస్తూ.. ‘నాకు అంత సీన్ లేదు’ అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ ప్రశ్న దిశా పటానీకి ఎదురైంది. ‘మీరు టైగర్ ప్రేమలో ఉన్నారన్న విషయాన్న ఒప్పుకోవచ్చు కదా.. మీ జంట చూడటానికి బాగుంటుంది’ అని ఓ అభిమాని దిశాకు సలహా ఇచ్చాడు. ఇందుకు దిశా ఆన్సర్ ఇస్తూ.. ‘నేను చాలా కాలంగా టైగర్‌ను మనసు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. తనన

‘సాహో’పై జోకులు.. కట్టప్ప అందుకే చంపాడట!

Image
ఎ న్నో అంచనాలతో విడుదలైన ‘సాహో’ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన నేపథ్యంలో నెటిజనులు ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. సినిమా చూసిన తర్వాత అంతా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మీమ్స్‌తో రివ్యూలు ఇవ్వడం ప్రారంభించారు. ఎక్స్‌పెక్టేషన్స్‌కు రియాలిటీకి మధ్య ఎంత తేడా ఉంటుందో చెబుతూ జోకులు పేలుస్తున్నారు. కొందరు నెటిజనులు ‘బాహుబలి’ సినిమాకు ముడిపెట్టి ‘సాహో’ను ట్రోల్ చేస్తున్నారు. కట్టప్ప బాహుబలిని చంపాడని అసలు కారణం ఏమిటో తెలిసిపోయిందని, బాహుబలి ‘సాహో’ చిత్రం చేయకూడదనే చంపేశాడని కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ సినిమాపై ప్రస్తుతం మిశ్రమ స్పందనే నడుస్తోంది. చాలామంది సినిమా బాగాలేదని ట్రోల్ చేస్తున్నా.. కొందరు మాత్రం సినిమాలోని కొన్ని సన్నివేశాలు బాగా నచ్చేశాయని చెబుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఇక ఫ్యాన్స్‌ అయితే పండుగ చేసుకుంటున్నారు. సినిమా బ్లాక్‌బాస్టర్ అని అంటున్నారు. ఈ సినిమాకు తొలి రోజు వసూళ్లు బాగానే ఉన్నా.. మున్ముందు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా చూసిన నె

మంచువారి చిన్నమ్మాయి.. సెలబ్రేషన్స్ స్టార్ట్

Image
తెలుగు సినీ పరిశ్రమలోని పెద్ద కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ ఒకటి. మంచువారింట ఏ సంబరం జరిగినా అది ప్రత్యేకమే. మంచు విష్ణు, విరానికా దంపతులకు ఇటీవల నాలుగో సంతానంగా పాప జన్మించిన విషయం తెలిసిందే. ఈ పాపకు ఐరా విద్య అని నామకరణం చేశారు. తన మూడో కూతురు ఫొటోను ఇటీవల సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అప్పుడే పేరు కూడా వెల్లడించారు. అయితే, తాజాగా విష్ణు భార్య విరానికా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు. మొత్తం నాలుగు ఫొటోలను విరానికా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో తమ నలుగురు పిల్లలతో మంచు విష్ణు దంపతులు కనిపించారు. అలాగే నలుగురు తోబుట్టువులు కలిసి అందంగా ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను ప్రముఖ ఫొటోగ్రాఫర్ స్మరిత విన్నకోట తీశారు. కుటుంబ సభ్యులంతా వైట్, లైట్ పింక్ డ్రెస్సుల్లో మెరిసిపోతున్నారు. ఐరా.. నాన్న భుజంపై హాయిగా నిద్రపోతోంది. అమ్మ హస్తాల్లో ఇమిడిపోయింది. అక్కల మధ్య హాయిగా బజ్జొని చూస్తోంది. Also Read : కాగా, విష్ణు దంపతులకు తొలి సంతానంగా కవల ఆడపిల్లలు వివియానా, అరియానా జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత అవ్రామ్‌ జన్మించాడు. దీంతో, మంచువారింట వారసుడు పుట్టేశాడని అభిమాన

‘సాహో’ రెస్పాన్స్.. అక్కడ లీస్ట్ 4 స్టార్స్!!

Image
ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించిన ‘సాహో’ శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా ఇమేజ్‌తో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిజల్ట్ ఏంటి?, రెస్పాన్స్ ఏంటి? అంటే మాత్రం ఒక్కో దగ్గర ఒక్కో రకమైన మాట వినిపిస్తుంది. ఇది చాలా తక్కువ సినిమాలకు మాత్రమే ఇలా జరుగుతుంది. నేటివిటీ, లోకల్ లాంగ్వేజ్, డొమెస్టిక్ స్టార్డమ్ లాంటి ఫ్యాక్టర్స్ వల్ల సాధారణంగా ఇలాంటి టాక్ వస్తుంటుంది. కానీ ‘సాహో’ లాంటి యూనివర్సల్ అప్పీల్ ఉన్న కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాకు ఒక్కో దగ్గర ఒక్కో రకమయిన టాక్ రావడం మాత్రం విచిత్రం. తెలుగు నుండి నేషనల్ హీరోగా ఎదిగాడు కాబట్టి ఇక్కడ ప్రభాస్‌కి ఉండే ఫ్యాన్‌బేస్ వేరు. పైగా ప్రభాస్ ఫ్రెండ్లీ నేచర్ వల్ల అందరి హీరోల ఫ్యాన్స్ కూడా ప్రభాస్ సినిమాపై సాఫ్ట్ కార్నర్‌తో ఉంటారు. అందుకే అతని సినిమా మరీ బాగాలేకపోతే తప్ప ఫ్లాప్ అనే మాట అంత తొందరగా స్ప్రెడ్ కాదు. అయితే ‘సాహో’కి మాత్రం తెలుగు‌ స్టేట్స్‌లో మొదటి రెండు ఆటలకు టాక్ ఒక మోస్తరుగా ఉంది అనే వచ్చింది. సినిమా మరీ తీసికట్టుగా ఉంది అనే మాట ఎక్కడా పెద్దగా వినిపించలేదు. కానీ సాయంత్రం నుండి జనరల్ ఆడియ

ఈ డ్రెస్‌లో వాణీ కపూర్ మతిపోగొట్టేస్తుందట

Image
హీరోయిన్ అనగానే ముందుగా మనల్ని ఆకర్షించేది ఆమె ఫిగర్ ఆ తర్వాత దుస్తులు. ఈ విషయంలో మన భారతీయ నటీమణలు హాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోరు. ఇక వర్కవుట్స్ చేసే నటీమణుల ఫిగర్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు. వారు ఎలాంటి దుస్తులు వేసుకున్నా సెక్సీగా కనిపిస్తారు. ఇప్పుడు నటి గౌను ఒకటి సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘వార్’ సినిమాలో వాణి బ్లూ కలర్ గౌను ధరించే సన్నివేశం ఒకటి ఉంది. దానిని ఎలెక్టిక్ ఎల్లీ సాబ్ గౌను అంటారు. లెబనీస్‌కు చెందిన ఎల్లీ సాబ్ అనే ఐకానిక్ ఫ్యాషన్ డిజైనర్‌ ఈ గౌనును డిజైన్ చేశారు. ఈమె హాలీవుడ్ సెలెబ్రిటీస్ బియాన్సే, కేట్ మిడిల్టన్, నికోల్ కిడ్మన్, ఏంజిలినా జోలీ, ఎమీలియా క్లార్క్, కెండల్ జెన్నర్, టేలర్ స్విఫ్ట్‌లకు ఫ్యాషన్ డిజైనర్‌గా వ్యవహరిస్తుంటారు. ఆమె డిజైన్ చేసిన డ్రెస్‌నే బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ అనైతా ష్రాఫ్.. వాణీ కపూర్ కోసం తెప్పించారు. సినిమాలో ఈ గౌను ధరించే సన్నివేశం వాణీ కపూర్ ప్రేక్షకుల మతి పోగొట్టడం ఖాయమని అనైతా అంటున్నారు. ‘సినిమాలో వాణీ ఎల్లీ సాబ్ గౌను వేసుకుంటారు. ఆమెను సినిమాలో వీలైనంత సెక్సీగా చూపించాను. ఇందులో ఫ్యాషన్‌కు ఎక్కవ ప్రాధాన్యత ఇచ్

హీరోయిన్స్ ఆ పని చెయ్యకతప్పదా..?

Image
కథానాయిక.. సినిమాల్లో ఈ పదానికి చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. కానీ, ఇది ఒక్కప్పటి మాట. ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోతకు పరిమితం అవుతున్నారు అనేది నిజం. నటించే సత్తా ఉన్నా సరయిన అవకాశం రాక వచ్చిన గ్లామర్ పాత్రలు చేసే వాళ్ళు కొందరయితే, సినిమాల్లో ఉండాలి అనుకుని ఫిక్స్ అయ్యి నటన సరిగా రాక వచ్చిన పాత్రలే చేసుకుని పోయేవాళ్లు మరికొందరు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించే కొద్ది మంది హీరోయిన్లలో సమంత, అనుష్క, నయనతార, కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి వాళ్ళను ఉదాహరణలుగా చూపించవచ్చు. కానీ వీళ్ళలో ఎక్కువమంది కెరీర్ చరమాంకంలో ఉన్నారు. పైగా వాళ్ళు తమ పెర్సనల్‌ లైఫ్‌ని కూడా బాలన్స్ చేసుకోవడానికి వచ్చిన సినిమాల్లో నుండి తమకి నచ్చిన పాత్రలు మాత్రమే ఎంచుకుని చేస్తున్నారు. అందరికి ఆ అవకాశం ఉండదు. పూజా హెగ్డే ముందు ‘ముకుంద’, ‘ఓ లైలా కోసం’ సినిమాల్లో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ మాత్రమే చేసింది. కానీ ఆమెకి అప్పుడు గుర్తింపు రాలేదు, అవకాశాలు రాలేదు. కానీ ‘DJ’ సినిమాలో బికినీ వేసి మరీ మొహమాటపడకుండా అందాల ప్రదర్శన చెయ్యడంతో ఆ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుసగా అగ్రహీరోల

సమంత వేసుకున్న పొట్టి డ్రెస్ అంత ఖరీదా..!

Image
అక్కినేని వారి కోడలు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి స్పెయిన్‌లోని ఇబిజా ఐల్యాండ్స్‌లో హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు. తన మావయ్య కింగ్ నాగార్జున బర్త్‌డే నిమిత్తం అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఇబిజాకు వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం ఇబిజా కాల్మాలో నాగార్జున పుట్టినరోజు వేడుక జరిగింది. భార్య అమల, కుమారులు నాగచైతన్య, అఖిల్, కోడలు సమంతలతో కలిసి నాగార్జున తన 60వ పుట్టినరోజును జరుపుకున్నారు. అయితే, మావయ్య పుట్టినరోజు వేడుకలో సమంత వేసుకున్న డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాగార్జున బర్త్‌డే పార్టీలో సమంత పింక్ కలర్ వన్-షోల్డర్ షిమ్మర్ డ్రెస్‌ వేసుకున్నారు. ఈ పొట్టి డ్రెస్‌లో స్విమ్మింగ్ పూల్ వద్ద నిలబడి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు విపరీతమైన స్పందన వచ్చింది. అయితే, సమంత వేసుకున్న డ్రెస్ ఖరీదు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ డ్రెస్ ఖరీదు అక్షరాలా రెండు లక్షల రూపాయలని అంటున్నారు. అందుకే ఈ డ్రెస్ హాట్ టాపిక్‌గా మారింది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యామిలీ ఫొటోను కూడా షేర్ చేసినప్పటికీ తన ఫొటో మాత్రం బాగా వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే, తన మావయ్య నాగార్జునకు పుట్టినరోజు శు

Vidya balan: నా భర్తను డబ్బులు అడగలేను.. అందుకే..

Image
ఇప్పటివరకు బాలీవుడ్ నటి ఎందరో దర్శక, నిర్మాతలతో కలిసి పనిచేశారు. ఆమె భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ కూడా పేరున్న నిర్మాతే. కానీ ఆయన నిర్మాణంలో ఇప్పటివరకు విద్య ఒక్క సినిమాలో కూడా నటించింది లేదు. అలా ఎందుకు అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ‘ఎందుకంటే.. అది టూ మచ్ అయిపోతుంది. నేను నటిస్తున్న సినిమా దర్శకుడు, నిర్మాతతో ఏవన్నా సమస్యలు వస్తే వారితో నేను వాదిస్తాను. గొడవపెట్టుకోను కానీ నా వాదనలో న్యాయం ఉంటుంది. ఒకవేళ నా భర్త నిర్మాణంలో పనిచేయాల్సి వస్తే ఆయనతో ఏదన్నా సమస్య ఎదురైనప్పుడు గొడవ పడుతూనే ఉంటాను. మా వివాహబంధంలో ఎలాంటి సమస్యలు రాకూడదన్నది నా అభిప్రాయం. మేం ఇద్దరం చాలా స్క్రిప్ట్స్ చేయాలని అనుకున్నాం. కానీ పారితోషికం విషయంలో మాత్రం ఆయనతో గొడవపడలేను. నా భర్తగా కాకుండా ఓ నిర్మాతగా.. విద్య నీకు ఇంతే పారితోషికం ఇస్తానని ఆయన అన్నప్పుడు.. కాదు నాకు ఎక్కువ కావాలని అడుగుతాను. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే మాటా మాటా పెరిగి గొడవకు దారితీస్తుంది. అలాంటి సంఘటనలు మా మధ్య జరగకూడదని అనుకుంటున్నాను’ అని వెల్లడించారు విద్య. ఇటీవల విడుదలైన ‘మిషన్ మంగళ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చ

సమంత లాస్ట్ సినిమా ఇదేనా

Image
తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేసుకుని పిల్లల కోసం రెండేళ్ల పాటు విరామం తీసుకోవాలనుకుంటున్నారట అగ్ర కథానాయిక . ప్రస్తుతం తన కుటుంబంతో కలిస స్పెయిన్‌లో విహరిస్తున్న సమంత.. తిరిగి భారత్ వచ్చాక ‘96’ రీమేక్‌లో నటిస్తారు. ఈ సినిమా తర్వాత ఆమె ప్రముఖ నటుడు సోనూ సూద్ తెరకెక్కిస్తున్న పీవీ సింధు బయోపిక్‌లో బ్యాడ్మింటన్ ఛాంపియన్ పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ సినిమా తర్వాత పిల్లల కోసం సమంత తన కెరీర్‌కు టెంపరరీగా ఫుల్‌స్టాప్ పెడతారట. అదీకాకుండా నాగార్జున, నాగచైతన్య, సమంత కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వదంతులన్నింటికీ సమాధానం కావాలంటే సమంత హైదరాబాద్‌కు వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘96’ సినిమాను తెలుగులో దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సమంతకు జోడీగా శర్వానంద్ నటిస్తున్నారు. ప్రేమ్ కుమార్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

సాహో కలెక్షన్లు ఎంత రాబట్టిందో తెలుసా..

Image
సినిమా రివ్యూల మాట ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాహో తొలిరోజు రూ.23 కోట్ల వసూళ్లు రాబట్టింది. ముంబయి బాక్సాఫీస్ వద్ద రూ.24 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు తెలిపారు. తమిళ వెర్షన్‌లో రూ.11 కోట్లు రాబట్టింది. మలయాళ వెర్షన్‌కు సంబంధించి కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది. క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ కలెక్షన్లు ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే సాహోపై నెగిటివ్ ప్రచారం జరిగితే మాత్రం రెండు వారాలు కూడా సినిమా థియేటర్‌లో నిలవదని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. సినిమా రిచ్‌గా ఉన్నప్పటికీ స్క్రీన్‌ప్లే దగ్గర బెడిసికొట్టిందని చాలా మంది అన్నారు. ముంబయి, గుజరాత్, మరాట్వాడా ప్రాంతాల్లో సాహోకు మంచి స్పందన వస్తోంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో రెండు వేల ప్రింట్స్ ఆలస్యంగా వచ్చాయి. బాహుబలి తర్వాత హిందీలో బెస్ట్ డబ్డ్ వెర్షన్‌గా నిలిచింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్వాతంత్ర దినోత్సవానికే విడుదల కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాలేదని వాయిదా వేశారు. సాహో విడుదలకు ముందు మిషన్ మంగళ్, బాట్లా

Saaho: ప్రభాస్ దొంగ అంటున్న బాలీవుడ్ నటి

Image
భారీ అంచనాల మధ్య సాహో సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుడ్, బ్యాడ్ రివ్యూలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబడుతోంది. అయితే సినిమా విడుదలైన రోజే వివాదంలో పడింది. సినిమాలోని ‘బేబీ వోంట్ యూ టెల్ మీ’ అనే పాటలో బ్యాక్‌గ్రౌండ్‌లో డిజైన్ మీకు గుర్తుందా? ఆ డిజైన్‌ను షైలో శివ్ సులేమాన్ అనే ఆర్టిస్ట్ రూపొందించినదట. ఈ విషయాన్ని షైలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ.. తాను రూపొందించిన అసలు డిజైన్ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ డిజైన్‌ను షైలో 2014లో రూపొందించారట. తన క్రియేటివిటీని దొంగిలించి కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదని వాపోయారు. దీనిపై బాలీవుడ్ నటి లీసా రే స్పందిస్తూ.. ‘ఇలా ఒకరి పనితనాన్ని దొంగిలించేవారికి వ్యతిరేకంగా నిలబడి ఖండించాల్సిన సమయం వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదు. భారీ సినిమాను తెరకెక్కించిన ఓ నిర్మాణ సంస్థ ఒకరి ఆర్ట్ వర్క్‌ను దొంగిలించడం కరెక్ట్ కాదు. దీనిని దొంగతనం అంటారు. ప్రపంచంలో ఎక్కడా వీటిని సహించరు’ ‘ఆర్ట్ వర్క్‌ను ఉపయోగించడానికి ముందు (నిర్మాణ సంస్థ) ఒక్కసారి కూడా షైలో అనుమతి తీసుకోలేదు. కనీసం ఆమె పనితనాన్ని వాడుకున్నందుకు క్రెడిట్ కూడా ఇవ్వలేదు. క్రియేటర్లను అందరూ దై

Samantha: సమంత బీచ్‌లో బికినీ.. మళ్లీ వదిలేసిందిగా!

Image
అక్కినేని కోడలు ఆరబోతలో అస్సలు తగ్గడం లేదు.. మామ అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీ ట్రిప్‌లో ఉన్న హాట్ అవతారం ఎత్తింది. సెగలు రేపే ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చూస్తూ తన ఫ్యాన్స్‌ను ఊరిస్తోంది. ఆగస్టు 29తో 60 ఏట అడుగుపెట్టిన తన మామ నాగార్జున బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించింది సమంత. ఇందుకోసం నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య, అఖిల్ అందరితో కలిసి స్పెయిన్‌లోని ఐబిజాకు వెళ్లారు. అక్కడ రిసార్ట్‌లో బస చేసిన సమంతకు బీచ్ గాలి చల్లగా తగిలే సరికి హాట్ అవతారంలోకి మారిపోయింది. బికినీతో బీచ్ పక్కనే ఉన్న రిసార్ట్‌లో ఓ కుర్చీపై కూర్చొని థైస్ షో చేసింది. తన విశాలమైన థైస్‌ను కెమెరాకు బంధీని చేసి ఆమె సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ పోజు కొట్టింది. ఆ తరువాత ఈ పిచ్చ హాట్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌లో చేసి లైక్‌లు, కామెంట్స్‌, షేర్‌లను రాబట్టే పనిలో పడింది. సమంత షేర్ చేసిన స్పెయిన్ వెకేషన్ హాట్ పిక్స్ ఇవే.

చిరంజీవి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం.. తప్పిన ప్రమాదం

Image
మెగాస్టార్ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. నుంచి హైదరాబాద్ వస్తున్న విస్తారా ఎయిలైన్స్ విమానం సాంకేతిక లోపం రావడంతో పైలెట్ అప్రమత్తమయ్యారు. టేకాఫ్ అయిన అరగంటకే మళ్లీ విమానాన్ని వెనక్కు తిప్పి ముంబై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో ఫ్లైట్‌లో మొత్తం 120మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో సాంకేతిక కారణంతోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది.. పైలట్ వెంటనే సమస్యను గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రయాణికులంతా విమానాశ్రాయంలోనే పడిగాపులు కాయగా.. తర్వాత మరో విమానం ఏర్పాటు చేసి వారిని హైదరాబాద్ పంపారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు చిరంజీవి ఫోటోను సోషల్ మీడియాతో పాటూ వాట్సాప్‌లో తన స్నేహితులకు షేర్ చేశారు.

ప్రభాస్ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. కుర్చీలను విరగొట్టి ధ్వంసం

Image
అరెరె.. ఫ్యాన్స్‌కి కోపం వచ్చింది. అవును మరి.. ప్రభాస్ సినిమా అంటే ఏడాదికో.. రెండేళ్లకో విడుదల కాదు. ప్రభాస్ ఏదైనా ప్రాజెక్ట్ పట్టుకున్నారంటే రెండు నుండి ఐదేళ్లు పట్టేస్తుంది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్‌కి కాస్త నిరుత్సాహమే అయినా.. ఈసారి నుండి ఏడాది ఒకటైనా సినిమా చేస్తానని ప్రామిస్ చేసిన ప్రభాస్ ‘సాహో’తో మళ్లీ మాట తప్పారు. ఈ సినిమాకి కూడా రెండేళ్లు టైం తీసుకున్నారు ప్రభాస్. పోని ఎట్టకేలకు సినిమా పూర్తైంది.. తమ అభిమాన నటుడ్ని రెండేళ్ల తరువాత వెండితెరపై చూసేందుకు థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకులకు షో క్యాన్సిల్ అనడంతో ఒళ్లుమండింది. సహనం కోల్పోయారు. దీంతో చేతికి అందిని కుర్చీలను గాల్లోకి ఎగరేశారు. కుర్చీలను ఇరగొట్టి, ఫర్నిచర్ ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో జరిగింది. బెనిఫిట్ షో క్యాన్సిల్ చేయడంతో సహనం కోల్పోయి తమ ప్రతాపం చూపించారు. కాగా భారీ అంచనాల నడుమ శుక్రవారం నాడు థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన వస్తోంది. అభిమానుల అంచనాలకు అందుకోవడంలో ‘సాహో’ విఫలం అయ్యింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రన్ రాజా

Prabhas Next Movie: ‘సాహో’ సీక్వెల్.. ఏ ధైర్యంతో ప్రభాస్?

Image
అవును మరి.. రూ. 50-60 కోట్లతో సినిమా ఎవరైనా తీస్తారు.. రూ. 350 కోట్లతో సినిమా తీయాలంటే ఓ రేంజ్‌ ఉండాలి. ‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్‌కి ఆ రేంజ్ వచ్చింది కాబట్టే.. ధైర్యం చేశారు. అది కూడా ఏదో చిన్నాచితకా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ.. రన్ రాజా రన్‌తో హిట్ అందుకున్న 26 ఏళ్ల యువ దర్శకుడు సుజీత్‌కి బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చాడు . చిన్న దర్శకుడితో ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేయాలంటే.. హీరోకి నిజంగానే గట్స్ ఉండాలి. సినిమా హిట్టా.. ఫట్టా.. యావరేజ్ అన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే ధైర్యం చేసినోడో వెండితెరపై నిజమైన హీరో. క్లిక్ అయితే ఇంటర్నేషనల్ రేంజ్.. లేదంటే మళ్లీ హిట్ వేట మొదలుపెట్టాల్సిందే. తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రూ.350 కోట్లు భారీ బడ్జెట్ పెట్టి ‘సాహో’ చిత్రాన్ని రూపొందించారు యూవీ క్రియేషన్స్. డార్లింగ్‌పై ఉన్న నమ్మకంతో ముందు వెనుక ఆలోచించకుండా మనోడి మార్కెట్ స్టామినా చూసి భారీ ఖర్చుపెట్టేశారు. ఈ ఖర్చును తిరిగి రాబట్టేందుకు ప్యాన్ ఇండియా చిత్రంగా ‘సాహో’ను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. Read Also: అయితే ఈ సినిమాను చూసిన మెజారిటీ

Saaho: షాకిచ్చిన అమెరికా బాక్సాఫీస్ కలెక్షన్లు

Image
అయిపోయింది.. అంతా అయిపోయింది..ఏదైతే జరగకూడదు అని ప్రభాస్ అభిమానులు అనుకున్నారో అదే జరిగింది. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహోకు అమెరికా బాక్సాఫీస్ కలెక్షన్లు షాక్ ఇచ్చాయని ట్రేడ్ ఎనలిస్ట్‌లు అంటున్నారు. తొలిరోజు(గురువారం) అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘సాహో’ 820,000 డాలర్లు మాత్రమే రాబట్టింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5.8కోట్లు. సూపర్‌స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో అట్టర్ ఫ్లాప్‌గా నిలిచిన ‘స్పైడర్’ తొలిరోజు 1 మిలియన్ డాలర్లన్నా రాబట్టింది. కానీ ‘సాహో’ ఆ మాత్రం కూడా రాబట్టలేకపోయిందట. స్క్రీన్‌ ప్లే బాలేకపోవడం, అనవసరమైన ట్విస్ట్‌లు సినిమాకు మైనస్ పాయింట్‌గా నిలిచాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే కలెక్షన్లు ఎలా ఉన్నా అమెరికన్ బాక్సాఫీస్ వద్ద సినిమాకు మంచి స్పందనే వస్తోందని మరికొందరు అంటున్నారు. బాహుబలి సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని ప్రభాస్ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దాంతో సినిమాకు బీభత్సంగా హైప్ వచ్చేసింది. ఎంతకాదన్నా తొలిరోజు వసూళ్లు ఓ రేంజ్‌లో ఉంటాయని అనుకుంటారు అభిమానులు. వారు అనుకున్న కలెక్షన్‌కు రూపాయి తగ్గినా సినిమా ఫ్లాపైందన్న నిర్ణయానికి వచ్

Saaho: తరణ్ ఆదర్శ్ అన్‌బేరబుల్ రివ్యూ.. ఏకేస్తోన్న రెబల్ ఫ్యాన్స్

Image
బాలీవుడ్‌కు చెందిన సినీ విమర్శకుడు, విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఇచ్చే రివ్యూలకు ట్విట్టర్‌లో ఫాలోయింగ్ ఎక్కువే. ఆయన చాలా నిజాయతీగా తన నిర్ణయాన్ని చెబుతుంటారని టాక్. అలాంటి తరణ్ ఆదర్శ్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించేలా ‘సాహో’ రివ్యూ ఇచ్చారు. అదొక పనికిమాలిన సినిమాగా తీసిపారేశారు. కేవలం 1.5 స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు కోపం కట్టలు తెంచుకుంది. ట్విట్టర్‌లో ఆదర్శ్‌ను ఏకిపారేస్తున్నారు. ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించిన ‘సాహో’ చిత్రం భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు అంచనాలకు తగ్గట్టుగా లేదంటున్నారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, భారీతనం ఉన్నా కథ, కథనం పెద్ద మైనస్‌గా మారాయని అంటున్నారు. మరీ అంత ఘోరంగా లేదని, ఒకసారి చూడదగిన సినిమా అని చెబుతున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్‌కు అయితే ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేసింది. సినిమాలో ప్రభాస్ కటౌట్‌ను చూసి వాళ్లు ఊగిపోతున్నారు. ఇలాంటి సినిమాకు మరీ ఘోరంగా రివ్యూ ఇవ్వడం ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. Also Read: ‘‘ఒక్క మాటలో చెప్పే రి

Payal Rajput: అవకాశాల కోసం సెక్స్ చేసే టైప్ కాదు

Image
టాలీవుడ్‌లో పాయల్ హాట్ కేక్‌లా మారిపోయారు. తొలి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’ తోనే హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆమెను వరుస అవకాశాలు చుట్టుముడుతున్నాయి. ఆమె నటిస్తున్న ‘ఆర్ డీ ఎక్స్ లవ్’ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ మోతాదును మరింత పెంచేశారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా పాయల్ క్యాస్టింగ్ కౌచ్, మీటూ గురించి మాట్లాడారు. ‘ఆర్ ఎక్స్ 100 సినిమా విడుదలయ్యాక ఓ నిర్మాత పెద్ద చిత్రాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి కోరిక తీర్చమన్నాడు. కానీ నేను ఈ సెక్సువల్ ఫేవర్స్‌కు పూర్తి వ్యతిరేకిని. అందుకే వీటిని ఎప్పుడూ ఖండిస్తుంటాను. చెప్పాలంటే నేను పంజాబ్, ముంబయిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. మున్ముందు కూడా ఎదురవుతుంటాయని అనుకుంటున్నాను. మీటూ ఉద్యమానికి తెరలేచినప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ ఘటనలు ఇంకా జరుగుతున్నాయి. అయితే నాకు వీటి గురించి మాట్లాడే ధైర్యం ఉంది. ‘ఆర్ ఎక్స్ 100’లో బోల్డ్ సన్నివేశాల్లో నటించినంత మాత్రాన అవకాశాల కోసం వేరొకరితో సెక్స్‌కి ఒప్పుకొంటానని కాదు’ అని వెల్లడించారు. ‘ఆర్ డీ ఎక్స్ లవ్’తో పాటు పాయల్ ‘వెంకీ మామ’ చిత్రంలో వెంకటేశ్‌కు జోడీగా నటిస్తున

‘సాహో’ విషయంలో రుజువైన సెంటిమెంట్స్!!

Image
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఏర్పడిన భారీ క్రేజ్ వల్ల మంచి ఓపెనింగ్స్ కూడా వస్తున్నాయి. కానీ, ఈ సినిమాపై విడుదలకు ముందు రోజు నుంచే కాస్త నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది అన్నది వాస్తవం. అయితే, దానికి కారణం యాంటీ ఫ్యాన్సో, మరొకరో కాదు.. సినిమా ఇండస్ట్రీలో బలంగా నమ్మే సెంటిమెంట్స్.‌ ఇండస్ట్రీ జనాలతో పాటు సినిమాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న ప్రేక్షలకు కూడా ఈ సెంటిమెంట్ అనే పదం ప్రభావం సినిమాపై ఎంతలా ఉంటుందో బాగా తెలుసు. ‘సాహో’ విషయంలో మాత్రం ఒక సెంటిమెంట్ కాదు, చాలా సెంటిమెంట్స్ రుజువయ్యాయి అనిపిస్తుంది. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది రాజమౌళి హీరో‌కి హిట్ లేకపోవడం. క్లియర్‌గా చెప్పాలి అంటే రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా చేసిన హీరోకి హిట్ రావడం అనేది ఆల్మోస్ట్ ఫిక్స్. ఇప్పటివరకు అదే జరిగింది. కానీ ఆ తరవాత ఆ హీరో చేసిన సినిమా హిట్ మార్క్‌ని అందుకోలేకపోవడం అనేది కూడా ఒక ఫిక్స్డ్ సెంటిమెంట్ అని ఒప్పుకోవాలి. దానికి కారణాలు ఏమైనా కానీ ఇప్పటివరకు ఇదే సెంటిమెంట్ కొనసాగింది. Also Read: రాజమౌళితో జూనియర్ ఎన్టీఆర్ మూడు సినిమాలు చేశారు. రాజమౌ

ఆత్మహత్య చేసుకున్న నటి

Image
సినిమాల్లో నటించేందుకు ముంబయికి వచ్చిన పర్ల్ పంజాబీ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎంతో కాలంగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ఏదీ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది. అందులోనూ ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గురువారం అర్థరాత్రి ముంబయిలోని ఓషివారా ప్రాంతంలో తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన గురించి అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డ్ మాట్లాడుతూ.. ‘గురువారం అర్థరాత్రి 12 నుంచి 12.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాకు రోడ్డుపై ఎవరో అరుస్తున్నట్లుగా అనిపించింది. ఏం జరిగిందో తెలుసుకుందామని వెళ్లాను. నేను తిరిగి వచ్చేసరికి అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తు నుంచి అరుపులు వినిపించాయి. నేను పైకి వెళ్లేసరికి ఆ యువతి దూకేశారు’ అని తెలిపారు. పర్ల్ పంజాబీ మెంటల్‌గా డిస్టర్బ్ అయివున్నారని తరచూ ఆమె తన తల్లితో గొడవ పడుతండేవారని పోలీసులు తెలిపారు. గతంలోనూ రెండు మూడు సార్లు ఆత్మహత్యకు పాల్పడితే సకాలంలో హాస్పిటల్‌కు తరలించడం వల్ల బతికారని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

‘సాహో’.. భారీ బడ్జెట్ సినిమాలకు మోగిన అలారం!

Image
చాలాకాలంగా జాతీయ స్థాయిలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న సినిమా పేరు ‘సాహో’. ఆ సినిమాకి అంత హైప్ రావడానికి కారణం ‘బాహుబలి’ లాంటి భారీ విజయం అందుకున్న ప్రభాస్ నటించిన చిత్రం కావడం మాత్రమే కాదు.. ఈ సినిమాకి ‘బాహుబలి’కి మించి బడ్జెట్ పెట్టి, ‘బాహుబలి’ని దాటేలా మార్కెటింగ్ చెయ్యడం కూడా. అయితే ఎలాంటి సంచలనం సృష్టిస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకుల నిరీక్షణకు తెర దించుతూ ‘సాహో’ థియేటర్లలో వచ్చింది. ‘సాహో’ ఎలాంటి ఫలితం అందుకుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది అనే విషయాలు పక్కనబెడితే ఇది ఒక్క విషయంలో మాత్రం పెద్ద సినిమాల నిర్మాణానికి సంబంధించి ఒక స్ట్రాంగ్ హింట్ అయితే ఇచ్చింది. అదే బడ్జెట్ కంట్రోల్. ‘సాహో’కి రూ. 350 కోట్ల బడ్జెట్ అని స్వయంగా ప్రభాస్ చెప్పడంతో అసలు ఈ సినిమాలో అంత విషయం ఏముంది?, విజువల్ వండర్ అనే పదానికి న్యాయం చెయ్యదగ్గ కంటెంట్ ఏముంది? అనే ఆతృత అందరిలో పెరిగింది. కానీ తీరా సినిమా చూస్తే మాత్రం అంత ఖర్చు పెట్టాలని పెట్టారు తప్ప, ఆ రేంజ్ బడ్జెట్‌ని మోసే శక్తి ఆ కథకి లేదని అర్థమైంది. Also Read: వాస్తవానికి ‘సాహో’లో వాడిన విజువల్ ఎఫెక్ట్స్ ఆ స్క్రీన్‌ప్లే ఆర్డర్‌కి అవసరం లేదు అనిపిస్తుంది. ‘

కన్నడ నటుడిని చితకబాదిన జనం

Image
కన్నడ నటుడు వివాదాస్పదంలో చిక్కుకున్నారు. గురువారం కర్ణాటకలోని నాపోక్లు ప్రదేశంలో ఆయన న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కేఎస్‌ఆర్టీసీ ఎదుట నిలిపి ఉన్న కారును ధ్వంసం చేశారు. అతని ప్రవర్తన చూసిన స్థానికులు నిలదీశారు. మాట వినకపోయేసరికి పట్టుకుని చితకబాదారు. విషయం తెలిసి స్థానిక మీడియా వర్గాలు అక్కడి చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఆయన ఎందుకు అలా ప్రవర్తించారన్న విషయం తెలియరాలేదు. ఒకవేళ తాగి అలా ప్రవర్తించారా.. లేక సదరు కారు యజమానితో వ్యక్తిగత కక్షలు ఏమన్నా ఉన్నాయా అన్న కోణంలో కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకట్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని ఎస్పీ కొడాగు తెలిపారు.

కృతి సనన్‌కు అద్దె గర్భం కష్టాలు

Image
టాలీవుడ్ అట్టర్ ఫ్లాప్ అయినా బాలీవుడ్‌లో మాత్రం మంచి స్టార్‌డంను సంపాదించుకున్నారు నటి కృతి సనన్. ‘బరైలీ కీ బర్ఫీ’, ‘లుకా చుప్పి’ వంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే.. ‘మిమి’. సరోగసీ (అద్దె గర్భం) అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతోంది. ‘లుకా చుప్పి’ సినిమాకు దర్శకత్వం వహించిన లక్ష్మణ్ ఉతేకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ‘అనుకోకుండా జరిగే మిరాకిల్స్‌తో నిండినదే జీవితం. ముందెప్పుడూ చూడని మరో ప్రయాణానికి సిద్ధం కండి. ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది’ అని పేర్కొంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందలో కృతి ఓ చిన్నారికి తల్లి పాత్రలో నటిస్తున్నారు. చూడబోతే మరోసారి లక్ష్మణ్, కృతి కలిసి బ్లాక్ బస్టర్‌ను తమ ఖాతాలో వేసుకోబోతున్నారనే అనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో సరోగసీ కేసులు బాగా ఎక్కువైపోయాయి. సన్నీ లియోనీ, ఫరా ఖాన్, షారుక్, గౌరీ దంపతులు, కరణ్ జోహార్ తదితరులు సరోగసీ ద్వారా పిల్లలను పొందారు.

Saaho Full Movie: రిలీజైన గంటల్లోనే ఆన్‌లైన్లో ‘సాహో’.. బుద్ధి చూపించిన తమిళ్ రాకర్స్!

Image
ఇటీవల తెలుగులో వచ్చి విజయం సాధించిన మజిలీ, జెర్సీ సినిమాలను తమ వెబ్‌సైట్లో లీక్ చేశారు. ఇది ఆ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపింది. దీంతో ఇప్పుడు ‘మహర్షి’ సినిమా విషయంలోనూ కలెక్షన్లపై ప్రభావం చూపుతోందేమోనని నిర్మాతలు ఆందోళన పడుతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలకు నిద్రపట్టకుండా చేస్తోంది తమిళ్ రాకర్స్. సినిమా ఇండస్ట్రీలను పట్టి పీడిస్తున్న ఈ వెబ్‌ సైట్‌ను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఐఎస్‌పీ)ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఆదేశించినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవల మహేష్ బాబు కెరీర్‌లో 25వ చిత్రంగా విడుదలైన ‘మహర్షి’ని థియేటర్లో విడుదలైన కొన్ని గంటలకే తమిళ్ రాకర్స్ ఆన్‌లైన్‌లో లీక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సాహో మూవీని సైతం విడుదలైన కొన్ని గంటలకే తమిళ్ రాకర్స్ లీక్ చేయడం గందరగోళానికి దారితీసింది. Also Read: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ లేటెస్ట్ మూవీ సాహో నేడు(ఆగస్టు 30న) తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 10 వేల థియేటర్స్‌లో విడుదలైంది. బాహుబలి మూవీ అనంతరం ప్రభాస్ నటించిన మూవీ కావడం, హాలీవుడ్ రేంజ్ టేకింగ్స్‌

Athiya Shetty: క్రికెటర్‌తో లింక్.. నటిని ఇరికించిన నిర్మాత

Image
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె ఆథియా శెట్టి.. కేఎల్ రాహుల్‌కి మధ్య ఏదో ఉందని ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత విక్రమ్ ఫడ్నిస్.. ఆథియాను ఆటపట్టించాలనుకున్నారు. ఆథియా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘మీ జీవితంలోని టైమింగ్‌ను నమ్మండి’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌పై విక్రమ్ కామెంట్ చేస్తూ.. ‘ఆథియా.. ఈ మధ్యకాలంలో నువ్వు బాగా హైపర్ అయిపోతున్నావ్. కేఎల్ వద్దకు వెళ్దామా. అదే.. కౌలాలంపూర్’ అని పరోక్షంగా రాహుల్ గురించి కామెంట్ చేశారు. దాంతో ఆథియాకు ఒళ్లుమండింది. ‘నిన్ను బ్లాక్ చేయాల్సిన సమయం వచ్చింది’ అని సమాధానం ఇచ్చారు. విక్రమ్ అక్కడితో ఆగలేదు. ‘నేను అంపైర్‌కు ఫిర్యాదు చేస్తాను. నీ వికెట్ పడిపోయాక పెవిలియన్‌కు చేరుకోవాల్సిందే’ అంటూ ఆటపట్టించారు. తనపై వస్తున్న వదంతులపై రాహుల్ మాట్లాడుతూ.. ‘నేను న్యూస్‌ పేపర్సే చదవను. కాబట్టి నా గురించి ఎవరేం రాస్తున్నారో తెలీదు. నా వ్యక్తిగత జీవితాన్ని పర్సనల్‌గానే ఉంచుకోవాలని అనుకుంటున్నాను. నా దృష్టంతా క్రికెట్ మీదే ఉంది. ఒకవేళ నేను ప్రేమలో

Sri Reddy: ‘సాహో’ని ఫ్లాప్ అంటున్నది ఆ హీరో ఫ్యాన్సే: పుల్ల పెట్టిందిగా!

Image
దాదాపు రెండున్నరేళ్ల శ్రమ.. వందలాది కోట్లు.. స్టార్ క్యాస్టింగ్.. హాలీవుడ్ టెక్నీషియన్లతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌తో ‘సాహో’ చిత్రాన్ని రూపొందించారు యువ దర్శకుడు సుజీత్. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ‘రన్ రాజా రన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 26 ఏళ్ల అనంతపురం కుర్రాడి స్టఫ్ తెలుసుకుని పిలిచి మరీ సినిమా ఆఫర్ ఇచ్చారు ప్రభాస్. రెండో చిత్రంతోనే స్టార్ దర్శకులు ఎవ్వరూ సాహసం చేశారు దర్శకుడు సుజీత్. సుమారు రూ. 350 కోట్లతో భారీ యాక్షన్ ప్యాక్డ్ మూవీని హైటెక్నికల్ వాల్యూస్‌తో రూపొందించారు. ఇక భారీ అంచనాలతో నేడు విడుదలైన ఈ చిత్రానికి మిక్స్ టాక్ వస్తోంది. అయితే కొంతమంది ట్విట్టర్‌లో పనికట్టుకుని ‘సాహో’ ఫ్లాప్ అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. Read Also: ఈ నెగిటివ్ ట్వీట్లను తన వివాదానికి ఆయుధంగా మార్చుకుంది వివాదాస్పద నటి . ‘సాహో’ మూవీ ఎలా ఉంది అంటూనే.. కొంతమంది ఈ సినిమా ఫ్లాప్ అంటూ కామెంట్ చేస్తున్నారు.. వాళ్లు ఎవరో నాకు తెలుసు వాళ్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పీకే ఫ్యాన్స్ గొర్రెల్లారా? మారరా ఏంట్రా మీరు, ప్రభాస్ మూవీపై పడి ఏడుస్తున్నారు అంటూ తనదైన శైలి

Saaho: ఫ్యాన్స్‌కు శ్రద్ధా కపూర్ వార్నింగ్

Image
‘డై హార్డ్ ఫ్యాన్స్’ రచ్చ చేయడానికి సమయం ఆసన్నమైంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సాహో’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో పైరసీ బాబులకు శ్రద్ధా వార్నింగ్ ఇచ్చారు. ‘వరల్డ్ సాహో డే వచ్చేసింది. చెమట, రక్తం ధారపోసి ఈ భారీ చిత్రాన్ని ఎంతో నిబద్ధతతో చిత్రీకరించాం. ఇదంతా కేవలం రెప్పపాటు సమయంలో జరిగిపోలేదు. మీ ప్రేమాభిమానాలతో ఎన్నో అవాంతరాలను ఛేదించి పూర్తిచేయగలిగాం. ఇప్పుడు ‘సాహో’ సినిమా డై హార్డ్ ఫ్యాన్స్‌ది. స్పాయిలర్స్‌ని స్ప్రెడ్ చేయకండి. సాహో సినిమాను మీ దగ్గర్లోని థియేటర్లలోనే చూడండి. పైరసీకి నో చెప్పండి. ఒకవేళ ఎవరైనాసినిమా పైరసీ చేసినట్లు తెలిస్తే వెంటనే నేను ఇచ్చిన పైరసీ ఆర్గనైజేషన్‌కు సమాచారం అందించండి’ అని పేర్కొన్నారు. 2019లో విడుదలైన దాదాపు అన్ని బాలీవుడ్ చిత్రాలు పైరసీ బారిన పడినవే. సాహో సినిమాకు అలాంటి సమస్యలు ఎదురుకాకూడదని చిత్రబృందం అన్ని చర్యలను తీసుకుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కించారు. ఇందులో నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మహేశ్ మంజ్రేకర్, చుంకీ పాండే తదితరులు కీలక

ఖుష్బూ మేడమ్.. రజనీకాంత్ ఎలా ఉంటారో తెలీదా

Image
సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే.. ఆమె తలైవా రజనీకాంత్‌నే గుర్తుపట్టలేకపోయారు. అసలేం జరిగిందంటే.. తన స్నేహితురాలితో కలిసి విహారయాత్ర నిమిత్తం లండన్ వెళ్లారు. అక్కడ ఓ షాపింగ్ సెంటర్‌కు వెళ్లగా.. మొబైల్ బ్యాక్ కవర్స్ కనిపించాయి. కవర్‌పై తమీమ్ బొమ్మ ఉంది. ఆ డిజైన్ కాస్త చూడటానికి రజనీకాంత్‌ను పోలి ఉంది. దాంతో వెంటనే ఖుష్బూ ఆ ఫోన్ బ్యాక్ కవర్ ఫొటో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘లండన్‌లోని ఆక్స్‌ఫోర్డ్ స్ట్రీట్‌లోని దుకాణంలో నాకు ఏం కనిపించిందో చూడండి.. మన సూపర్‌స్టార్ రజనీకాంత్’ అని పేర్కొంటూ.. రజనీ కూతురు సౌందర్య రజనీకాంత్‌ను కూడా ట్యాగ్ చేసింది. కానీ ఫోన్ కవర్ వెనక ఉన్నది తలైవా కాదు. తమీమ్. అది గుర్తించిన నెటిజన్లు.. ఖుష్బూని ఓ ఆటాడుకున్నారు. ‘చెన్నైలో ఉంటూ తలైవా ఎలా ఉంటారో కూడా తెలీదా?’ అంటూ తిట్టిపోశారు. తప్పు గమనించిన ఖుష్బూ వెంటనే ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ‘ఓకే.. ఆయన మన రజనీకాంత్ కాదు. నన్ను సరిద్దిన స్నేహితులందరికీ ధన్యవాదాలు. తప్పుని ఒప్పుకుంటూ నేను, సరిదిద్దిన మీరు ఎదుగుతున్నాం. తప్పుల నుంచి నేర్చుకుంటున్నాను’ అని ప

Jacqueline Fernandez: ‘సాహో’.. బ్యాడ్‌ బాయ్‌ భామ రూ. 2 కోట్లుకు న్యాయం చేసిందా?

Image
థియేటర్స్‌లో ‘సాహో’ మేనియా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ థియేటర్స్ వద్ద చూసినా ప్రభాస్ అభిమానుల కోలాహలంతో సందడిగా ఉంది. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రం ఇప్పటికే పలుచోట్ల ప్రదర్శితం కావడంతో సినిమా ఎలా ఉంది? ప్రభాస్ బాహుబలి రికార్డ్‌లను బ్రేక్ చేశాడా? సుజీత్ డైరెక్షన్ బాగుందా? యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉన్నాయి? లాంటి చర్చలతో పాటు ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో మెరిసిన శ్రీలంక సుందరి జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌‌పై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ‘సాహో’ చిత్రంలో బాగా పాపులర్ అయిన సాంగ్ ఏదైనా ఉంది అంటే.. అది ఆమె ప్రభాస్‌తో ఆడిపాడిన బ్యాడ్ బాయ్ సాంగ్. ‘సాహో’ ప్రీ రిలీజ్ సందర్భంగా విడుదల చేసిన ఈ సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేసింది. కాగా ఈ సాంగ్ కోసం ఈ భామ ఏకంగా రూ. 2 కోట్ల పారితోషికంగా తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఒక్కసాంగ్‌కి రూ. 2 కోట్లా అంటూ చాలా మంది నోరెళ్లబెట్టారు. అయితే ఈ బ్యాడ్ బాయ్ సాంగ్‌ను వెండితెరపై చూసిన ప్రేక్షకులు అందచందాలకు ఫిదా అవుతున్నారు. తన అందచందాలతో అదరహో అనిపించింది జాక్వలిన్. తన ఒంపుసొంపుల వయ్యారాల

Vishal: పెళ్లి ఆగిందా.. కాబోయే భార్య పోస్ట్ ఇది

Image
విశాల్, అనీశాల వివాహం రద్దైందని చాలా కాలంగా వదంతులు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం అనీశా తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా నుంచి డిలీట్ చేయడమే. పెళ్లి ఆగిపోయిందని ఎన్ని పుకార్లు వస్తున్నా వీరిద్దరూ స్పందించలేదు. అయితే విశాల్‌కు బర్త్‌డే విషెస్ చెప్పి ఈ వదంతులకు ఫుల్‌స్టాప్ పెట్టారు అనీశా. ‘హ్యాపీ బర్త్‌డే స్టార్. నువ్వు స్టార్‌గా మెరవడానికే పుట్టావు. నీకు జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. నాకు ఆ నమ్మకం ఉంది. నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అని పేర్కొంటూ విశాల్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అయితే.. నడిగర్ సంఘానికి ఓ కార్యాలయం నిర్మించేంతవరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అనీశాతో కూడా చర్చించానని ఇందుకు తాను కూడా ఒప్పుకుందని విశాల్ అన్నారు. అయితే ఇదే విషయంలో ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చి పెళ్లిని రద్దు చేసుకున్నాయని కోలీవుడ్ వర్గాలు అన్నాయి. మొత్తానికి అనీశా ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చేసింది. వర్క్ పరంగా ప్రస్తుతం విశాల్ ‘యాక్షన్’ చిత్రంలో నటిస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా విశాల్‌కు జోడీగా

Prabhas Saaho: ‘సాహో’ హైలైట్స్.. స్టేడియంలో సిక్స్ బాదాడా?

Image
‘సాహో’.. ఫీల్ గుడ్ మూవీకి ముందు వచ్చే స్మోకింగ్ యాడ్ లాంటివాడు. కంటెంట్ కరెక్ట్‌గా ఉన్నా.. విజువల్ చాలా డిస్ట్రబింగ్‌గా ఉంటుంది అంటూ ట్రైలర్‌తో ఆసక్తిరేపి ప్రేక్షకుల్ని థియేటర్స్ వైపుకు తీసుకురాగలిగారు. ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ఇంటర్నేషనల్ స్టార్‌గా మారారు . దీంతో ఆయన చిత్రాలకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌కు తగ్గట్టే ‘రన్ రజా రన్’ ఫేమ్ సుజీత్ ‘సాహో’ అనే భారీ ప్రాజెక్ట్‌కు మూవీని రూపొందించారు. యూవీ క్రియేషన్స్‌లో సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. గురువారం అర్ధరాత్రి నుండి పలుచోట్ల ‘సాహో’ మూవీ ప్రదర్శితం కావడంతో సోషల్ మీడియాలో ‘సాహో’ మేనియా నడుస్తోంది. Read Also: ‘సాహో’ మూవీ హైలైట్స్.. ✦ అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి పాత్రలో ప్రభాస్‌ ✦ క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్‌ పాత్రలో శ్రద్ధ కపూర్‌ ✦ గ్యాంగ్‌స్టర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ కథను అల్లిన దర్శకుడు సుజీత్. ✦ హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు. ✦ ఛేజింగ్స్ సీన్స్, చివరి ఇరవై నిమిషాల యాక్షన్ పార్

‘సాహో’ ట్విట్టర్ రివ్యూ.. భయపెడుతోన్న ఆడియన్స్ టాక్!

Image
బహుశా ఓ తెలుగు సినిమాకు ఇప్పటి వరకు ఈ స్థాయిలో హైప్ రాలేదు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకే పరిమితం. కొన్ని సినిమాలు దక్షిణాది రాష్ట్రాల్లో విడుదలయ్యాయి. కానీ, ‘బాహుబలి’ తెలుగు సినిమా గమనాన్ని మార్చింది. పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ‘బాహుబలి’ సిరీస్ ద్వారా ప్రభాస్‌ నేషనల్ హీరో అయిపోయారు. దేశ వ్యాప్తంగా ఆయనకు విపరీతంగా ఫ్యాన్స్ పెరిగారు. అందుకే, ‘సాహో’ మొదటి నుంచి వార్తల్లో నిలిచింది. విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది. విపరీతమైన బజ్ ఏర్పడింది. Also Read: సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో’ సినిమా ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ శుక్రవారం విడుదలైంది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, ఆ ఫీడ్‌బ్యాక్ చూస్తుంటే నిజంగా భయమేస్తోంది. పాజిటివ్ కామెంట్ల కన్నా.. నెగిటివ్ ఫీడ్‌బ్యాకే ఎక్కువగా వస్తోంది. ఈ సినిమాకు రూ.350 కోట్లు ఎందుకు పెట్టారంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టేంతగా క

Q నెట్ కుంభకోణం: సినీ ప్రముఖులకు బిగుస్తున్న ఉచ్చు.. మరోసారి నోటీసులు

Image
క్యూ నెట్ కేసులో సినీ సెలబ్రిటీలకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసు విచారణను విచారణ వేగవంతం చేసిన సైబరాబాద్ పోలీసులు బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులకు మరోసారి నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్న వారిలో షారుక్ ఖాన్, బొమన్ ఇరానీ, జాకీ ష్రాఫ్, వివేక్ ఒబెరాయ్, అనిల్ కపూర్ తదితరులు ఉన్నారు. సంచలనం సృష్టించిన క్యూనెట్ కేసులో పోలీసులు ఇప్పటికే ఒకసారి నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు పంపించారు. అయితే.. ఈ నోటీసులకు కొంత మంది నటీనటులకు స్పందించకపోగా.. మరి కొంత మంది సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మరోసారి నోటీసులు పంపించారు. టాలీవుడ్ స్టార్లు అట్లు శిరీష్, పూజాహెగ్డే కూడా నోటీసులకు వివరణ ఇవ్వనట్లు తెలుస్తోంది. క్యూనెట్‌ను ప్రమోట్ చేసినందుకు గాను సినీ ప్రముఖులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఐపీసీ 420, 406,506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. క్యూనెట్‌లో పెట్టుబడులు పెట్టవద్దంటూ కేంద్రం ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. క్యూనెట్‌ వ్యవహారంలో ఇప్పటివరకు 38 కేసులు నమోదు చేసి, 70 మందిని అరెస్టు చేసినట్లు సైబరాబా

Saaho Intro Scene: ప్రభాస్ ఇంట్రో సీన్ లీక్.. సిక్స్ ప్యాక్‌లో గూస్‌బమ్స్

Image
అభిమానులు ఎప్పుడెప్పుడా అని రెండేళ్లుగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. భారీ అంచనాల నడుమ ప్రభాస్ నటించిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ ‘సాహో’ విడుదలైంది. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించిన ‘సాహో’ చిత్రం ప్యాన్ ఇండియా చిత్రంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 10 వేల థియేటర్స్‌లో విడుదలైంది. Read Also: బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్‌లో మరింత హైప్ తీసుకువచ్చారు. ప్రభాస్ స్టైలిష్ లుక్స్‌కి యువ దర్శకుడు సుజీత్ హాలీవుడ్ రేంజ్ టేకింగ్ సినిమా స్థాయిని పెంచింది. Read Also: విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ‘సాహో’.. దుబాయ్‌లో ఇప్పటికే పలు చోట్ల ప్రదర్శితం కావడంతో సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు నెటిజన్లు. కొంత మంది సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉందని.. మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తమ అభిమాన నటుడ్ని ఎప్పుడెప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూసిన ఫ్యాన్స్.. ‘సాహో’లో ప్రభాస్ ఇంట్రో సీన్‌ని షూట్ చేసి రోమాలు నిక్కబొడుచుకునేట్టు

Nagarjuna: నాగ్ అంటే క్రష్.. మన్మథుడి బిగి కౌగిలిలో అనసూయ విష్

Image
అవును మరి.. నాగార్జున అంటే ఎవరికి మాత్రం క్రష్ ఉండదు. అందులోనూ అతడు టాలీవుడ్ మన్మథుడు.. పైగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అంటూ ఆడిపాడినోడు ఎలా మర్చిపోతుంది. అందుకే ‘నా ఫేవరేట్ క్రష్’ నాగార్జున సార్‌కి హ్యాపీ బర్త్ డే అంటూ తనదైన శైలిలో ఫొటో వదిలింది హాట్ యాంకర్, జబర్దస్త్ లేడీ అనసూయ భరద్వాజ్. నేడు (ఆగస్టు 29) నాగార్జున బర్త్ డే కావడంతో విషెష్ అందిస్తూ ట్వీట్ ఇంట్రస్టింగ్ ట్వీట్ చేసింది అనసూయ. ఈ సందర్భంగా ‘ఎవర్ గ్రీన్ ఛార్మింగ్ మన్మథుడు నాగార్జున గారికి జన్మదిన శుభాకాంక్షలు.. ఈ ఏడాది మీకు బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ మీ బుజ్జీ’ అంటూ నాగార్జునతో బిగి కౌగిలిలో ఉన్నఫొటోలను షేర్ చేసి విషెష్ అందించింది అనసూయ. గతంలో నాగార్జున హోస్ట్ చేసిన ‘మీలో ఎవరుకోటీశ్వరుడు’ కార్యక్రమానికి వెళ్లిన అనసూయ.. నాగ్‌తో కలిసి సందడి చేసింది. ఆ ఫొటోలను ఇప్పుడు షేర్ చేసింది అనసూయ. ఈ ట్వీట్స్‌కి #HBDTrendSetterNag, #HBDKingNagarjuna హ్యాష్ ట్యాగ్స్‌ను తగిలించి సోషల్ మీడియాలో వదిలిపెట్టింది అనసూయ.

Tollywood On Saaho: ‘సాహో’ రికార్డులు బద్దలు.. ఎత్తేస్తున్న సెలబ్రిటీలు

Image
‘సాహో’ అంటూ ఆహ్వానం పలుకుతోంది టాలీవుడ్. ‘బాహుబలి’ చిత్రం తరువాత సుమారు రెండేళ్ల గ్యాప్ తీసుకుని ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా సుమారు 10 వేల థియేటర్స్‌లో విడుదల కానున్న యాక్షన్ ప్యాక్డ్ మూవీ ‘సాహో’ చిత్రం కోసం సామాన్య ఆడియన్స్ మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Read Also: ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ.. , సాయి ధరమ్ తేజ్, జగపతిబాబు, నితిన్, రాహుల్ రవీంద్రన్, యూవీ క్రియేషన్స్ తదితురులు ట్వీట్ చేస్తున్నారు. ‘ప్రభాస్ అన్నా.. సుజీత్ అండ్ టీంతో కలిసి రేపు థియేటర్స్‌‌లో మంట పుట్టించబోతున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉండటం వల్ల ఈ సినిమాను చూసే ఛాన్స్ మిస్ అయ్యింది. ఇండియాకి రాగానే ‘సాహో’ చూస్తా’ అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు నేచురల్ స్టార్ నాని. Read Also: ఇక మెగా హీరో సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ.. ‘‘ ‘సాహో’ చిత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. ‘సాహో’ చిత్ర యూనిట్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది’ అ

Saaho Movie Time: ‘సాహో’ ఫస్ట్ షో ఎక్కడో తెలుసా?

Image
‘సాహో’ సినిమా కోసం సినిమా లవర్స్ అంతా ఎంతలా ఎదురుచూస్తున్నారో అందరికి తెలిసిందే. ఆ వెయిటింగ్‌కి తగ్గ స్టఫ్ కూడా ఆ సినిమాలో ఉంది అనేది టీజర్స్ అండ్ ట్రైలర్స్ తోనే అర్ధమైపోయింది. అందుకే ఆ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నిమిషాల వ్యవధిలో వైరల్‌గా మారుతుంది. మరి అంత హైప్ ఉన్న ‘సాహో’కి తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోస్ ప్లాన్ చేసారు. కానీ కొన్ని చోట్ల మాత్రం అనుమతులు రాక ఆపేసారు. Read Also: ఇక ఓవర్సీస్‌లో ఎప్పట్లానే ముందు రోజు ప్రీమియర్స్ అనేది కామన్. నిజానికి ఫస్ట్ షో పడేది అక్కడే కాబట్టి ‘సాహో’ ఫస్ట్ రిపోర్ట్ అక్కడి నుండే రావాల్సి ఉంది. కానీ ఈ సారి సీన్ మారింది. ప్రపంచంలో ‘సాహో’ ఫస్ట్ షో దుబాయ్‌లో పడబోతోంది. ఈ సినిమాకి అక్కడ అంత క్రేజ్ రావడానికి కారణం కూడా ఉంది. ఈ సినిమాలో ఎక్కవ భాగం దుబాయ్ లోనే షూట్ చేసారు. స్టయిలిష్‌గా షూట్ చేసిన ఛేజింగ్ సీన్స్,హై ఆక్టే న్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా తెరకెక్కించ్చింది దుబాయ్ లోనే. పైగా ప్రొడక్షన్ దశలో ఉండగానే అక్కడి మీడియా ఆ సినిమాకి సంబంధించి స్పెషల్ కవరేజ్ ఇచ్చింది. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న టాలీవుడ్ మూవీ అంటూ కితాబులిచ్చింది. అండ్

‘మీకు మాత్రమే చెప్తా’.. ఫస్ట్‌లుక్ ఇదిగో..

Image
రౌడీ బాయ్ తాను నిర్మిస్తున్న తొలి సినిమా టైటిల్ ఇలా ప్రకటించాడో లేదో అప్పుడే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసేశారు. ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. లుక్‌లో తరుణ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఫోన్‌ పట్టుకుని ఏదో షాకింగ్ న్యూస్ విన్నట్లుగా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చాలా ఫన్నీగా ఉంది. పోస్టర్‌ పైన ‘మై బెస్ట్ ఫ్రెండ్స్ సీక్రెట్’ అని రాసుంది. అంటే వీరి ముగ్గురి జీవితాలకు సంబంధించిన రహస్యాల నేపథ్యంలో ఈ సినిమా ఫన్నీగా ఉండబోతోందేమోనని తెలుస్తోంది. ఏదేమైనా విజయ్ హీరోగానే కాకుండా ఈ సినిమాతో మంచి నిర్మాతగా కూడా విజయం సాధించేలా ఉన్నాడు. సినిమా టైటిల్‌తోనే సగం మార్కులు కొట్టేశారు దేవరకొండ. ఇక సినిమా ఎంత ఫన్నీగా ఉంటుందో చెప్పనవసరం లేదు. షమీర్ సుల్తాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ నటించడం లేదని తెలుస్తోంది. బహుశా ఆయన అతిథి పాత్రలో కనిపించవచ్చని ఫిలిం వర్గాలు అంటున్నాయి. ఈ మధ్యకాలంలో కొందరు నటీనటులు తాము నిర్మించే సినిమాల్లో తామే నటిస్తున్నారు. మరి విజయ్ ఆ ట్రెండ్‌ని ఫాలో అవుతారా... లేక కేవలం పెట్టుబడి మాత్రమే పెడతారా అన్నది ఆయనే క్లారిట

Saaho: శ్రద్ధా కపూర్.. ఇక్కడ హిట్టా ఫట్టా..!

Image
యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు్న్న సమయం ఆసన్నమైంది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం ‘సాహో’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా చూడటానికి ఫ్యాన్స్‌కు ఎన్నో కారణాలు ఉన్నాయి. ‘బాహుబలి’ సినిమా తర్వాత దాదాపు రెండేళ్లు కేటాయించి ప్రభాస్ నటించిన చిత్రమిది. పైగా ఇందులో హీరోయిన్ ఇక్కడి అమ్మాయి కాదు. భారీ బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు అందులోని నటీనటుల స్థాయి కూడా అదే రేంజ్‌లో ఉండాలి. అందుకే జోరు మీదున్న బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేసుకున్నారు. అయితే తొలి తెలుగు సినిమా కావడంతో శ్రద్ధ కూడా తన స్థాయికి తగ్గట్టు పారితోషికం అడిగారు. ఈ సినిమా కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ రూ.6 కోట్లని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆమె అందంతో ఎక్కడి అభిమానులనైనా ఆకట్టుకోగలరు కానీ.. పరిచయం లేని భాషలో నటించి ప్రాంతీయ ఫ్యాన్స్‌ను సంతృప్తి పరచడం అంత చిన్న విషయం కాదు. మొన్న విడుదలైన ట్రైలర్‌లో శ్రద్ధ నటన అభిమానులకు నచ్చిందనే అనిపిస్తోంది. అయితే సినిమా శ్రద్ధ వల్లే హిట్టవుతుందని చెప్పలేం. ఎందుకంటే ప్రభాస్ అక్కడ. అతన్ని డామినేట్ చేసేవారు సినిమాలో ఎవ్వరూ లే

వేలల్లో పలుకుతున్న ‘సాహో’ టికెట్ రేట్లు

Image
‘సాహో’.. ఈ సినిమాకి ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది కొత్తగా చెప్పక్కర్లేదు. వందల కోట్ల బడ్జెట్‌తో టాలీవుడ్‌లో తెరకెక్కిన వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ ఇది. కేవలం యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే కాదు, సినిమాలో అంతకుమించి మ్యాటర్ ఉంది అనే మాట ఒక రేంజ్‌లో హల్చల్ చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా క్లయిమాక్స్ అయితే ఇప్పటివరకు చూడని నెక్స్ట్ లెవెల్ కంటెంట్‌తో రెడీ అయ్యింది అనేది టాక్. దీంతో ఈ సినిమాపై ఒక రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. అంచనాలకు ఆకాశానికి తాకడంతో ఈ సినిమా మొదటి రోజు, మొదటి ఆట చూసి ఆ మజా ఎంజాయ్ చెయ్యాలి అనే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు చాలా మంది ఈ లిస్ట్‌లో ఉన్నారు. అందుకే ఈ సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో టికెట్స్‌కి ఒక రెక్కలు వచ్చాయి. హైదరాబాద్‌లోని భ్రమరాంభలో ఉదయం 5 గంటల షో టికెట్ కాస్ట్ అక్షరాలా రెండువేలు పలుకుతుంది. ఇక ప్రభాస్ సొంత ఊరు అయిన భీమవరంలో క్రేజ్ అనే మాట క్రేజీగా మారింది. అక్కడ సాహో సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆల్రెడీ ఊరంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ర్యాలీ చేసారు ప్రభాస్ అభిమానులు. అలాగే అక్కడ ఉదయం అయిదుగంటల ఆట ప్లాన్ చేస్తున్నారు. దాని టికెట్ కాస్ట్ ఏకంగా మూడ

ఏపీలో ‘సాహో’ మిడ్‌నైడ్ ప్రీమియర్స్.. తెలంగాణ అభిమానుల్లో నిరాశ

Image
తెలుగు సినిమా బాక్సాఫీసు బద్దలైపోడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సాహో’ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల సందడి మొదలైపోయింది. ముఖ్యంగా ఏపీలో ‘సాహో’ మేనియా ఎక్కువగా కనిపిస్తోంది. ప్రభాస్ అభిమానులు ఎక్కువగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన అవసరంలేదు. ఇదిలా ఉంటే, ఏపీలో ఈరోజు అర్ధరాత్రి నుంచే ‘సాహో’ ప్రీమియర్ షోలు మొదలైపోతున్నాయి. భీమవరం తదితర చిన్న పట్టణాల్లో ఈరోజు రాత్రి 1 గంట నుంచి ప్రీమియర్ షోలు ప్రారంభంకానున్నాయి. విజయవాడ, కర్నూలు లాంటి పెద్ద పట్టణాల్లోనూ ప్రీమియర్ షోలు వేస్తున్నారు. టిక్కెట్టు ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు, ప్రీమియర్ షోలపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. ప్రభుత్వం నిర్ణయం కోసం మేకర్లు ఎదరుచూస్తున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో శుక్రవారం ఉదయం 5 గంటలకు ప్రీమియర్ షోలు వేస్తున్నారని తెలిసింది. అయితే అప్పటికే ఏపీలో ఒక షో పూర్తయిపోతుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభాస్ అభిమానులు క

KGF 2: కన్నడ స్టార్ యశ్‌కు షాక్

Image
బ్లాక్ బస్టర్ విజయం అందుకు ‘కేజీఎఫ్’ సినిమాకు సీక్వెల్ రాబోతున్న చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. కర్ణాటకలోని సెనైడ్ హిల్స్ ప్రాంతంలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. షూట్ కోసం భారీ సెట్‌ను ఏర్పాటుచేశారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ కారణంగా వాతావరణం కాలుష్యం అవుతోందంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి స్థానిక జేఎంఎఫ్‌సీ (జుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్) న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం వెంటనే చిత్రీకరణ నిలిపివేయాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. దీనిపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది. 2021 వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీరా అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా గురించి సంజయ్ మాట్లాడుతూ.. ‘అధీరా సినిమాలో చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్. ‘అవెంజర్స్’ సినిమాలో థానోస్ ఎంత పవర్‌ఫుల్లో నా పాత్ర కూడా అలాగే ఉంటుంది. చాలా కాలంగా ఇలాంటి పాత్ర కోసమే ఎదురుస్తున్నాను’ అని వెల్లడించారు. అయితే కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రీకరణ కూడా కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ల్‌లోనే జరిగింది. అప్పుడు రాని సమస్య ఇప్పుడు ఎందుకు