Tollywood On Saaho: ‘సాహో’ రికార్డులు బద్దలు.. ఎత్తేస్తున్న సెలబ్రిటీలు

‘సాహో’ అంటూ ఆహ్వానం పలుకుతోంది టాలీవుడ్. ‘బాహుబలి’ చిత్రం తరువాత సుమారు రెండేళ్ల గ్యాప్ తీసుకుని ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా సుమారు 10 వేల థియేటర్స్‌లో విడుదల కానున్న యాక్షన్ ప్యాక్డ్ మూవీ ‘సాహో’ చిత్రం కోసం సామాన్య ఆడియన్స్ మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Read Also: ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ.. , సాయి ధరమ్ తేజ్, జగపతిబాబు, నితిన్, రాహుల్ రవీంద్రన్, యూవీ క్రియేషన్స్ తదితురులు ట్వీట్ చేస్తున్నారు. ‘ప్రభాస్ అన్నా.. సుజీత్ అండ్ టీంతో కలిసి రేపు థియేటర్స్‌‌లో మంట పుట్టించబోతున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉండటం వల్ల ఈ సినిమాను చూసే ఛాన్స్ మిస్ అయ్యింది. ఇండియాకి రాగానే ‘సాహో’ చూస్తా’ అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు నేచురల్ స్టార్ నాని. Read Also: ఇక మెగా హీరో సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ.. ‘‘ ‘సాహో’ చిత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. ‘సాహో’ చిత్ర యూనిట్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది’ అంటూ ట్వీట్ చేశారు. హీరో నితిన్ స్పందిస్తూ.. ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకువెళ్లే చిత్రంగా ‘సాహో’ నిలుస్తుంది. ఇలాంటి సందర్భంగా కోసం ఎదురుచూస్తున్నా అంటూ మంటలు పుట్టించే ఎమోజీలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు నితిన్. వీరితో పాటు.. ‘మన్మథుడు 2’ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపే ట్వీట్ చేశారు. రేపు రికార్డు బద్దలు కాబోతున్నాయి. చిత్ర యూనిట్‌కి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. వీరితో పాటు జగపతి బాబు, ప్రభాస్ ఫ్యాన్స్, యూవీ క్రియేషన్స్, చిత్ర యూనిట్ సభ్యులు ‘సాహో’ గురి తప్పదని ఇండస్ట్రీ రికార్డుల్ని బ్రేక్ చేయడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వరస ట్వీట్స్ చేస్తున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ