ప్రభాస్ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. కుర్చీలను విరగొట్టి ధ్వంసం

అరెరె.. ఫ్యాన్స్‌కి కోపం వచ్చింది. అవును మరి.. ప్రభాస్ సినిమా అంటే ఏడాదికో.. రెండేళ్లకో విడుదల కాదు. ప్రభాస్ ఏదైనా ప్రాజెక్ట్ పట్టుకున్నారంటే రెండు నుండి ఐదేళ్లు పట్టేస్తుంది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్‌కి కాస్త నిరుత్సాహమే అయినా.. ఈసారి నుండి ఏడాది ఒకటైనా సినిమా చేస్తానని ప్రామిస్ చేసిన ప్రభాస్ ‘సాహో’తో మళ్లీ మాట తప్పారు. ఈ సినిమాకి కూడా రెండేళ్లు టైం తీసుకున్నారు ప్రభాస్. పోని ఎట్టకేలకు సినిమా పూర్తైంది.. తమ అభిమాన నటుడ్ని రెండేళ్ల తరువాత వెండితెరపై చూసేందుకు థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకులకు షో క్యాన్సిల్ అనడంతో ఒళ్లుమండింది. సహనం కోల్పోయారు. దీంతో చేతికి అందిని కుర్చీలను గాల్లోకి ఎగరేశారు. కుర్చీలను ఇరగొట్టి, ఫర్నిచర్ ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో జరిగింది. బెనిఫిట్ షో క్యాన్సిల్ చేయడంతో సహనం కోల్పోయి తమ ప్రతాపం చూపించారు. కాగా భారీ అంచనాల నడుమ శుక్రవారం నాడు థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన వస్తోంది. అభిమానుల అంచనాలకు అందుకోవడంలో ‘సాహో’ విఫలం అయ్యింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రూపొందించింది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ