saaho: 100 కోట్లు దాటేసిందహో...!
ఇదెక్కడి సినిమారా బాబూ అని కొందరు… ప్రభాస్ మళ్లీ గట్టిగా కొట్టాడని మరికొందరు.. ఇలా ఎవరికి వారు సొంతంగా రివ్యూలు రాసేసుకున్నారు. కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద తన పనిని తాను చేసుకుపోయింది. తొలిరోజు కలెక్షన్ల వర్షం కురిపించింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్లు(గ్రాస్) వసూళ్లు రాబట్టిందని చిత్రవర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ‘సాహో’ 130 కోట్ల స్పెషల్ పోస్టర్ కూడా బయటకు వచ్చేసింది. 2019 బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్గా నిలిచింది. సినిమా బాగాలేదన్న క్రిటిక్సే రూ.130కోట్లు వసూళ్లు సాధించని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తుండడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించారు. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, అరుణ్ విజయ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ తదితరులు సహాయ పాత్రలు పోషించారు. మరో రెండు వారాలు కలెక్షన్ల జోరు ఇలాగే కొనసాగితే నిర్మాతలు పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చేసినట్లే..!
Comments
Post a Comment