Posts

Showing posts from December, 2021

Chiranjeevi : ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్‌.. ఊర‌మాస్ లుక్‌లో చిరంజీవి.. ‘భోళా శంక‌ర్’ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Image
మెగాస్టార్ తన ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులకు కొత్త సంవత్సరం ట్రీట్‌ను ఇచ్చారు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. లిస్టులో భోళా శంక‌ర్ సినిమా కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా నుంచి కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా చిత్ర యూనిట్ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. మోష‌న్ పోస్ట‌ర్‌లో చిరంజీవి యంగ్ లుక్‌లో ఆక‌ట్టుకుంటున్నారు. చేతికి క‌డియం, తాయెత్తులు క‌ట్టుకుని ప‌క్కా ఊర‌మాస్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో రివేంజ్ డ్రామా కూడా న‌డుస్తుంటుంది. చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో ప్ర‌ముఖ హీరోయిన్ కీర్తి సురేష్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భాటియా క‌నిపించ‌నుంది. కోల్‌క‌త్తా బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. ఇందులో చిరంజీవి రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అందులో ఓ మాస్ లుక్‌కి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ను కొ

Sunil: రాజా రవీంద్రని మేనేజర్‌గా తీసేసిన సునీల్.. డైరెక్ట్‌గా నన్నే కలవండి అంటూ అసలు విషయం రివీల్

Image
నటుడిగానే చాలామందికి పరిచయం. అయితే ఆయన చాలామంది హీరో, హీరోయిన్లకు మేనేజర్ కూడా. దాదాపు 10 మంది హీరోలకు మేనేజర్ ఈయనే. వారిలో రవితేజ, రాజ్ తరుణ్, సునీల్, మంచు విష్ణు లాంటి హీరోలు ఉన్నారు. అయితే ఇటీవల తనని మేనేజర్‌గా తీసేశాడంటూ కామెంట్స్ చేశారు రాజా రవీంద్ర. ‘నన్ను మేనేజర్‌‌గా ఎందుకు తీసేశాడో సునీల్‌నే అడగండి.. హీరో నుంచి విలన్ రోల్, ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలు బాగా బిజీ అయ్యాడు. నేను ప్రొడక్షన్‌లో బిజీగా ఉండటంతో నన్ను ఒత్తిడి చేయడం ఎందుకులే అని పర్సనల్ అటెన్షన్ ఎక్కువ ఉంటే బాగుండు అని ఫీల్ అయ్యాడు. నేను మాట్లాడతాలే అని మర్చిపోయేవాడిని దానికి ఫీల్ అయ్యాడు. అన్నా కొంచెం గ్యాప్ తీసుకుంటా అని అన్నాడు.. అంతకు మించి నాకు ఏం చెప్పలేదు కానీ... నాకు ఇలా అర్ధమైంది’ అని సునీల్ మేనేజర్‌గా తప్పుకున్నట్టు ధృవీకరించారు రాజా రవీంద్ర. అయితే ఈ ఇష్యూపై సునీల్ రియాక్ట్ అయ్యారు. ‘పుష్ప’ మూవీలో మంగళం శీనుగా నెగిటివ్ రోల్‌లో భయపెట్టేసిన సునీల్ కెరియర్ ఊపందుకుంది. వరుస సినిమాలో బిజీ అయ్యారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. ‘క్యారెక్టర్ నచ్చితే ఏదైనా చేస్తాను.. అదీ ఇదీ అని ఏం లేదు..

RRR బడ్జెట్ గుట్టు చెప్పిన సునీల్ నారంగ్.. తెలంగాణలో భారీ చిత్రాల టికెట్ రేట్స్‌పై క్లారిటీ ఇచ్చేశారుగా !

Image
సినిమా థియేట‌ర్స్‌లో టికెట్ రేట్స్ పెంచుకోవ‌డంపై ఇటీవ‌ల తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో మ‌ల్టీప్లెక్స్‌ల‌లో ఈ శుక్ర‌వారం విడుద‌లైన సినిమాల‌కు టికెట్ ధ‌ర‌ను రూ320కు పైగా విక్ర‌యించారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. దీనిపై వెంట‌నే తెలంగాణ ఫిల్మ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ స్పందించింది. సినిమా టికెట్ రేట్ల విధానంపై ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవోనెం120 అంద‌రికీ ఆమోద యోగ్యంగా ఉంద‌ని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్‌ల‌కు తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసింది. ప్ర‌ముఖ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ‘‘చిన్న సినిమాలు వారి టికెట్ ధరలను రూ.50-150 వరకు అమ్ముకోవచ్చు. అన్ని సినిమాలకు ఒకేలా టికెట్ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించి అమ్మితే ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కి రావాలంటే భ‌య‌ప‌డ‌తాడు. అలా కాకుండా చిన్న బ‌డ్జెట్ సినిమాల‌కు ఒక‌లా, మీడియం బ‌డ్జెట్ సినిమాల‌కు ఒక‌లా, పెద్ద బ‌డ్జెట్ సినిమాల‌కు ఒక‌లా టికెట్ రేట్స్ నిర్ణ‌యించుకుంటే బావుంటుంది. కొంద‌రు శుక్ర‌వారం ఎక్కువ రేట్స్‌కు థియేట‌ర్స్‌లో టి

వ్యాక్సిన్ వేయించుకున్నా కోవిడ్ బారిన ప‌డ్డాను : విశ్వక్ సేన్‌

Image
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు కోవిడ్ 19 సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా తెలియ‌జేశారు. దేశంలో మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ స‌హా ప‌లు సినీ ప‌రిశ్ర‌మ‌లోని సెల‌బ్రిటీలు కోవిడ్ బారిన ప‌డుతున్నారు. ‘‘ఇటీవ‌లే నాకు క‌రోనా పాజిటివ్ అని తెలిసింది. నాకు నేనుగా ఐసోలేట్ అయ్యాను. డాక్ట‌ర్స్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాం. వ్యాకిన్ వేయించుకున్న‌ప్ప‌టికీ క‌రోనా వైర‌స్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. మాస్కులు వేసుకుని తగు జాగ్ర‌త్త‌లు తీసుకోండి. మీ ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు’’ అన్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ‘పాగ‌ల్’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విశ్వక్ సేన్‌ ఇప్పుడు ‘ఓరి దేవుడా’ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. అలాగే ‘అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమాతో పాటు ‘గామి’ అనే సినిమాల‌లోనూ విశ్వక్ సేన్‌ న‌టిస్తున్నారు.

‘పుష్ప’ డిలీటెడ్ సీన్.. సోషల్ మీడియాలో హ్యూజ్ రెస్పాన్స్

Image
ఐకాన్ స్టార్ హీరోగా న‌టించిన చిత్రం ‘పుష్ప ది గ్రేట్‌’. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రం బన్నీ కెరీర్‌లోనే టాప్ మూవీగా నిలిచింది. డిసెంబర్ 17న సినిమా విడుదలైంది. అల్లు అర్జున్, సుకుమార్ చేసిన తొలి పాన్ ఇండియా మూవీ కూడా ఇదే కావ‌డం విశేషం. శుక్ర‌వారం చిత్ర యూనిట్ సినిమాలో నుంచి డిలీజ్ చేసిన వాటి నుంచి ఓ సీన్‌ను రిలీజ్ చేసింది. సినిమాలో మిల్లులో ప‌నిచేయ‌డానికి వెళ్లిన పుష్ప (అల్లు అర్జున్‌) అక్క‌డ య‌జ‌మానిని చూసి భ‌య‌ప‌డ‌క‌పోవ‌డం.. ఆ కార‌ణంగా ప‌ని నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం స‌న్నివేశం గుర్తుండే ఉంటుంది. ఆ త‌ర్వాత సీన్‌ను కూడా సుకుమార్ చిత్రీక‌రించారు. కానీ సినిమా ఎడిటింగ్‌లో క‌త్తిరించేశారు. ఇప్పుడు ఆ స‌న్నివేశాన్ని రిలీజ్ చేశారు. రెడ్డ‌ప్ప అనే వ్య‌క్తి పుష్ప త‌ల్లి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఇచ్చిన అప్పును వ‌డ్డీతో స‌హా క‌ట్ట‌మ‌ని అడుగుతాడు. నా కొడుకు మిల్లులో ప‌నికి చేరాడు. క‌ట్టేస్తామ‌ని ఆమె చెప్పినప్పుడు మీవాడు ప‌ని ఎప్పుడో మానేశాడ‌ని అంటాడు. అప్పుడు త‌ల్లి పుష్ప‌ను ప్ర‌శ్నిస్తున్నా ప‌ట్టించుకోకుండా వెళ్లిపోతాడు. త‌ర్వాత ఇంట్లోని గేదెన

Bangarraju: ముహూర్తం పెట్టేసిన నాగార్జున.. కొత్త ఏడాది సరికొత్తగా!

Image
సీనియర్ హీరో హీరోగా '' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం విడుదలై సూపర్ హిట్ సాధించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, పోస్టర్స్, ఇతర అన్ని అప్‌డేట్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర టీజర్ అప్‌డేట్ ఇచ్చారు నాగార్జున. 'బంగార్రాజు' సినిమా టీజరు డేట్‌ అనౌన్స్‌ చేస్తూ కొత్త పోస్టర్ షేర్ చేశారు నాగార్జున. ఈ సినిమా టీజర్‌‌ను రేపు ఉదయం 11 గంటల 22 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌లో నాగార్జున, ఆయన తనయుడు లుక్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో జీ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో నాగార్జున, నాగ చైతన్యలు తాత మనవడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుండటం ఆసక్తికర అంశం. నాగ చైతన్య జంటగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటిస్తోంది. రొమాన్స్, ఎమోషన్స్, అన్నిరకాల కమర్షియల్ అంశాలతో ఈ సినిమా ర

అదృష్టం, కష్టం కాదు.. నన్ను నేను నమ్ముకుంటా: ఓ 'గాలోడు' సుడిగాలి సుధీర్!!

Image
'జబర్దస్త్' షోతో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడగట్టుకున్నాడు . బుల్లితెరపై రాణిస్తూ కూడా స్టార్ హీరో రేంజ్ పాపులారిటీ సంపాదించవచ్చు అని నిరూపించిన ఆయన ఆ క్రేజ్ క్యాచ్ చేసుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై అలరిస్తున్నాడు. మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన ఈ సుడిగాడు హీరో అవతరమెత్తి 'గాలోడు' మూవీ చేస్తున్నాడు. బుల్లితెరపై వచ్చిన క్రేజ్ వెండితెరపై కూడా రావాలని ఆరాటపడుతూ విలక్షణ కథలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే 'గాలోడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా ఇందులో డిఫరెంట్ మాస్ లుక్‌లో కనిపించి సడెన్ షాకిచ్చాడు ఈ సుడిగాలి సుధీర్. కేవలం 52 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌లో సుధీర్ లుక్స్, హీరోయిజం బాగా ఎలివేట్ చేసి చూపించారు. "అదృష్టాన్ని నమ్ముకున్నవాడు కష్టాల పాలవుతాడు .. కష్టాన్ని నమ్ముకున్నవాడు అదృష్టవంతుడవుతాడు. కానీ నేను ఈ రెండిటినీ నమ్ముకోను.. నన్ను నేను నమ్ముకుంటాను" అనే డైలాగ్‌తో అదరగొట్టేశాడు సుధీర్. ఇది పక్కా మాస్ మూవీ అని టీజర్ ద్వారా చెప్పకనే చెప్

ఆ వంద కోట్లు ఎక్కడున్నాయి? తాజా ఇష్యూపై రామ్ చరణ్ ఫన్నీ రియాక్షన్

Image
సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల రెమ్మ్యూనరేషన్ మ్యాటర్స్ ఎప్పుడూ హాట్ టాపికే. హీరోగాని, హీరోయిన్ గాని ఓ సినిమాతో భారీ హిట్ రాబట్టారంటే చాలు వారి వారి రెమ్మ్యూనరేషన్ మ్యాటర్స్ వెలుగులోకి వస్తుంటాయి. కొందరు డైరెక్టుగా పారితోషికం పెంచేస్తే.. ఇంకొందరి విషయంలో మాత్రం ఓ రేంజ్ రూమర్స్ పుట్టుకొస్తుంటాయి. గత కొన్ని రోజులుగా మెగా పవర్ స్టార్ విషయంలో అదే జరుగుతోంది. రామ్ చరణ్ రెమ్మ్యూనరేషన్ మ్యాటర్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై ఫన్నీ రియాక్షన్ ఇచ్చారు చెర్రీ. విడుదలకు ముందే రామ్ చరణ్ రేంజ్ పెరిగిందని.. ఆయన తన తదుపరి సినిమాకు వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో ఇదే విషయమై చెర్రీని ఓ మీడియా వారు ప్రశ్నించగా ఆయన ఫన్నీగా రియాక్ట్ అయ్యారట. అసలు వంద కోట్లు ఎక్కడున్నాయి? ఉన్నా కూడా నాకెవరిస్తారు? అని రిటర్న్ క్వశ్చన్ వేస్తూ తన రెమ్మ్యూనరేషన్ విషయమై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశారట. ప్రస్తుతం రామ్ చరణ్ RRR సినిమా ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా జనవరి 7న పలు భాషల్లో ప్రేక్ష

LIGER Glimpse: వి ఆర్ ఇండియన్స్ అంటూ గర్జించిన విజయ్ దేవరకొండ.. వీడియో అదుర్స్

Image
హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లైగర్' మూవీ నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా వదిలి విజయ్ దేవరకొండ అభిమానుల్లో జోష్ నింపారు. పూరీ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసిన ఈ వీడియో విడుదలైన క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇండియన్ బాక్సర్‌గా విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ ఎంట్రీ హైలైట్ అయింది. ముంబై చాయ్ వాలా బాక్సింగ్ పోటీకి వెళ్లి 'వి ఆర్ ఇండియన్స్' అంటూ గొంతెత్తి చెప్పడం సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. పవర్‌‌ఫుల్‌ బాడీతో విజయ్ దేవరకొండ రింగ్‌ లోకి దిగే సీన్‌ రోమాలు నిక్కబొడిచేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజయ్ మ్యానరిజం ఈ వీడియోలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. మొత్తానికి విజయ్ దేవరకొండ కొత్త సంవత్సర కానుక అదిరిందని చెప్పుకోవచ్చు. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న లైగర్ సినిమాకు 'సాలా క్రాస్ బ్రీడ్' అనే పవర్‌ఫుల్ ట్యాగ్ లైన్‌ పెట్టారు పూరి. బాక్సింగ్ నేపథ్యంలో భారీ రేంజ్‌లో ఈ సినిమాను రూపొందించారని తాజాగా విడుదలైన గ్లింప్స్‌తో అర్థమవుతోంది. చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తు

Ajith : అజిత్ ‘వలిమై’లో టాలీవుడ్ హీరో కార్తికేయ సరికొత్త విలనిజం.. చూస్తే వణుకుపుడుతుందిగా!

Image
మారుతున్న ట్రెండ్‌ను ఫాలో అవుతూ మాస్ ఇమేజ్ ఉన్న సినిమాల్లోనే కాకండా డిఫ‌రెంట్ సినిమాల్లో న‌టించాల‌ని నేటి త‌రం క‌థానాయ‌కులు భావిస్తున్నారు. అలా డిఫ‌రెంట్ మూవీస్‌లో న‌టించ‌డానికి రెడీ అంటున్న యంగ్ టాలీవుడ్ హీరో కార్తికేయ‌. తొలి చిత్రం ‘RX 100’తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈయ‌న కెరీర్ ప్రారంభంలోనే నానికి విల‌న్‌గా న‌టించారు. ‘నానిస్ గ్యాంగ్ లీడ‌ర్’ చిత్రంలో కార్తికేయ విల‌న్‌గా క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత తెలుగులో విల‌న్‌గా న‌టించే అవ‌కాశాలు రాలేదో లేక చేయ‌న‌ని అన్నాడో తెలియ‌దు కానీ.. కోలీవుడ్‌లో మాత్రం ప్రతినాయ‌కుడిగా క‌నిపించ‌డానికి సై అన్నారు. ఆ సినిమా ఎవ‌రితో కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో కుమార్ న‌టించిన ‘వ‌లిమై’. అజిత్ కుమార్‌కు త‌మిళ‌నాడులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమా ‘వ‌లిమై’లో విలన్ అంటే కూడా క్రేజ్ ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన కార్తికేయ ఏమాత్రం కాద‌న‌కుండా వ‌లిమైలో విల‌న్‌గా న‌టించారు. ఈ చిత్రం సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న భారీ రేంజ్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. హెచ్. వినోద్ ఈ మూవీని డైరెక్ట్ చేశ

ఎన్టీఆర్ డిప్రెష‌న్‌.. ఓపెన్‌గా స‌మ‌స్య‌ను చెప్పిన తార‌క్‌

Image
టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు. కోట్లాది మంది అభిమానుల ప్రేమ ఆయ‌న సొంతం. న‌ట‌న‌, డాన్సులు, యాక్ష‌న్‌, యాక్టింగ్ ఇలా ఏదైనా త‌న‌దైన శైలిలో ప్రేక్ష‌కుల‌ను మెస్మరైజ్ చేయ‌డం ఆయ‌న నైజం. ఆయ‌నే ఎన్టీఆర్‌. అభిమానులు ముద్దుగా యంగ్ టైగ‌ర్ అని, ద‌గ్గ‌రి వారు ప్రేమ‌గా తార‌క్ అని పిలుచుకుంటుంటారు. అలాంటి స్టార్ హీరో డిప్రెష‌న్‌కు గుర‌య్యారా? ఎప్పుడు..ఎందుకు? అస‌లు అంత‌లా తార‌క్‌ను ఇబ్బంది పెట్టిన విష‌య‌మేంటి? అనే సందేహాలు రాక మాన‌వు. అస‌లేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం తార‌క్ హీరోగా న‌టించిన చిత్రం RRR. ఇందులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌రో హీరోగా న‌టించారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి డైరెక్ట్ చేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో జ‌న‌వ‌రి 7న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌తో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్భంలో తార‌క్ త‌న కెరీర్‌లో త‌ను ఫేస్ చేసిన ప‌లు విష‌యాల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చ‌విచూసిన ఒడిదొడుకులు.. దాన్ని ఆయ‌న అధిగ‌మించిన తీరు, దానికి తార‌క్‌కు అండ‌గా నిల‌బ‌డిన‌వారి గురించి చెప్పారు. రెండో సినిమాకే స్టార్ ఇమేజ్

ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత.. గాయని చిత్ర సంతాపం

Image
ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన ఆయన వయసు 58 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కైతప్రమ్ విశ్వనాథన్ ఇక లేరని తెలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1963 సంవత్సరం కేరళలోని కైతప్రమ్ అనే గ్రామంలోని ఓ సంగీత కుటుంబంలో జన్మించారు విశ్వనాథన్. సంగీత అధ్యాపకుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ''కన్నకి, తిలక్కం'' సహా 20కి పైగా చిత్రాలకు సంగీత సారథ్యం వహించారు. తిరువనంతపురం లోని స్వాతి తిరునల్ మ్యూజిక్ కాలేజ్ నుంచి ‘గాన భూషణం’ అనే బిరుదు పొందారు. కైతప్రమ్ విశ్వనాథన్ సంగీతం అందించిన కన్నకి చిత్రం 2001లో కేరళ స్టేట్ అవార్డు పొందింది. క్లాసికల్, ఫోక్ మ్యూజిక్ అందించి పలువురి ప్రశంసలు అందుకున్నారాయన. విశ్వనాథన్‌కు భార్య గౌరి, ముగ్గురు పిల్లలున్నారు. ఆయన మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. విశ్వనాథన్ అకాల మరణం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. గాయని తన ట్విట్టర్ ఖాతా ద్వారా కైతప్రమ్

ఇంద్ర భ‌వ‌నంలాంటి మోహ‌న్‌బాబు కొత్త ఇల్లు.. చూస్తే వావ్ అనాల్సిందే!

Image
టాలీవుడ్ విలక్ష‌ణ న‌టుడు మంచు మోహ‌న్‌బాబు. హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, నిర్మాత‌గా ఆయ‌న త‌న‌దైన గుర్తింపును ద‌క్కించుకున్నారు. ఇప్పుడు ఎక్కువ‌గా సినిమాలు చేయ‌డం లేదు. చాలా సెల‌క్టివ్‌గానే ఉంటున్నారు. హైద‌రాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉంటున్న ఆయ‌న ఆ మ‌ధ్య శంషాబాద్‌లో స‌రికొత్త ఇల్లును క‌ట్టుకున్నారు. ఏదో ఆషామాషీగా కాదండోయ్ ఇంద్ర భ‌వ‌నంలా పెద్ద భ‌వంతిని నిర్మించుకున్నారు. స్మిమ్మింగ్ పూల్ వంటి సౌకర్యం కూడా ఇందులో ఉంది. సిటీకి దూరంగా ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఉన్న ఈ ఇల్లు గురించి విశేషాల‌ను ఆయ‌న కుమార్తె ల‌క్ష్మీ మంచు త‌న యూ ట్యూబ్ ఛానెల్‌లో ‘మా నాన్న హోం టూర్ ’ అనే ప్రోగ్రామ్‌లో వివ‌రించారు. మోహ‌న్‌బాబు ఇష్ట‌ప‌డి క‌ట్టుకున్న 6వ ఇల్లు ఇది. చెన్నైలో రెండు ఇళ్లు, తిరుప‌తిలో రెండు ఇళ్లు, హైద‌రాబాద్‌లో రెండు ఇళ్లు ఆయ‌న క‌ట్టుకున్నారు. చుట్టు ప‌క్క‌ల చెట్లు, మొక్క‌లు మ‌ధ్య‌లో విశాల‌మైన భ‌వంతి చూడ‌టానికి ఎంతో అద్భుతంగా ఉంది. ఇంట్లోని ప‌లు విశేషాల‌ను ఆమె వివ‌రించారు. ఇంట్లో మొత్తంగా లోయ‌ర్ గ్రౌండ్‌, గ్రౌండ్, ఫ‌స్ట్‌.. సెకండ్ ఫ్లోర్స్ .. నాలుగు ఫ్లోర్స్ ఉన్నాయి. అందులో మోహ‌న్‌బాబు క

పుష్ప 13 డేస్ కలెక్షన్స్.. టార్గెట్ 146 కోట్లు.. క్లీన్ హిట్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే!

Image
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన 'పుష్ప' మూవీ వసూళ్ల పరంగా భేష్ అనిపించుకుంటోంది. విడుదలైన రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ రానురాను పుంజుకొని ప్రపంచవ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతున్నాడు పుష్పరాజ్. తొలి 10 రోజులు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాగా, గత రెండు మూడు రోజులుగా వసూళ్ళలో డ్రాప్ కనిపిస్తోంది. మరి ఈ 13 రోజుల్లో ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం 'పుష్ప' వసూళ్లు ఎలా ఉన్నాయి? బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంతా ఎంత రాబట్టాలి? అనే దానిపై ఓ లుక్కేద్దామా.. పుష్ప AP - TG డే వైజ్ కలెక్షన్స్ డే 1 - 24.9Cr డే 2 - 13.70Cr డే 3 - 14.38Cr డే 4 - 6.92Cr డే 5 - 3.87Cr డే 6 - 2.08Cr డే 7 - 1.39Cr డే 8 - 2.38Cr డే 9 - 3.43Cr డే 10 - 3.41Cr డే 11 - 1.05Cr డే 12 - 69L డే 13 - 42L టోటల్ AP - TG : 78.62Cr (121.68 Cr గ్రాస్) 13వ రోజు ఏరియాలవారిగా రిపోర్ట్ నైజాం: 18 లక్షలు సీడెడ్: 8 లక్షలు ఉత్తరాంధ్ర: 4 లక్షలు ఈస్ట్ గోదావరి: 3 లక్షలు వెస్ట్ గోదావరి: 2 లక్షలు గుంటూరు: 3 లక్షలు కృష్ణా: 2 లక్షలు నెల్లూరు: 2 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి టోటల్ 4

NBK 107.... బాలయ్యను ఢీ కొట్టనున్న సీనియర్ హీరో!

Image
2021 ఏడాది బాల‌కృష్ణ అభిమానుల‌కు పెద్ద పండ‌గే అని చెప్పాలి. ఎందుకంటే ఆయ‌న హీరోగా న‌టించిన అఖండ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ స‌క్సెస్ వారిలో స‌రికొత్త ఎన‌ర్జీని నింపింద‌న‌డంలో సందేహం లేదు. ఇదే స్పీడులో ఇప్పుడు బాల‌కృష్ణ త‌న త‌దుప‌రి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి రెడీ అయిపోయారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై NBK 107గా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటు బాల‌కృష్ణ అఖండ‌తో స‌న్సేష‌నల్ హిట్ కొట్ట‌గా, గోపీచంద్ మ‌లినేని కూడా ఈ ఏడాది క్రాక్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. ఇక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప ది రైజ్‌తో మ‌రో విజ‌యాన్ని ద‌క్కించుకుంది. ఇలా మూడు హిట్ కాంబినేష‌న్స్ చేస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నార‌ట‌. ఇంత‌కీ ఎవ‌రా సీనియ‌ర్ హీరో అని అనుకుంటున్నారా? జ‌గ‌ప‌తిబాబు కాదులెండి.. యాక్ష‌న్ కింగ్

శ్యామ్ సింగ రాయ్ 6 డేస్ కలెక్షన్స్.. ఆల్‌మోస్ట్ సంగం వసూళ్లు డ్రాప్..! ఇదీ టోటల్ రిపోర్ట్

Image
నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్యామ్ సింగ రాయ్' సినిమా డిసెంబర్ 24వ తేదీన విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. తొలి రోజే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దగ్గరకు చేరుకుంది. కాకపోతే 5వ రోజుతో పోల్చితే 6వ రోజు కలెక్షన్స్‌లో 45 శాతం మేర డ్రాప్ కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా 6 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దామా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు కలెక్షన్ వివరాలు నైజాం: 20 లక్షలు సీడెడ్: 6 లక్షలు ఉత్తరాంధ్ర: 4 లక్షలు ఈస్ట్ గోదావరి: 4 లక్షలు వెస్ట్ గోదావరి: 2 లక్షలు గుంటూరు: 2 లక్షలు కృష్ణా: 2 లక్షలు నెల్లూరు: 2 లక్షలు AP-TG డే 6 కలెక్షన్స్: 42 లక్షలు (68 లక్షల గ్రాస్) మొత్తంగా చూస్తే ఈ 6 రోజుల్లో శ్యామ్ సింగ రాయ్ వసూళ్ల వివరాలు నైజాం: 7.46 కోట్లు సీడెడ్: 1.97 కోట్లు ఉత్తరాంధ్ర: 1.67 కోట్లు ఈస్ట్ గోదావరి: 77 లక్షలు వెస్ట్ గోదావారి: 62 లక్షలు గుంటూరు: 92 లక్షలు కృష్ణా: 70 లక్షలు నెల్లూరు: 48 లక్షలు మొత్తంగా AP-TG 6 డేస్ కలెక్షన్స్: 14.61 కోట్లు (24.78 కోట్ల గ్రాస్) కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇం

Year Ender 2021: టాలీవుడ్‌ని హీటెక్కించిన వివాదాలు.. జనాల్లో హాట్ ఇష్యూ అయిన టాపిక్స్ ఇవే..

Image
2020లో కరోనా అంటూ ఓ మహమ్మారి వైరస్ భారతదేశంలోకి ప్రవేశించి 2021లో కూడా ప్రజలందరినీ భయాందోళనకు గురిచేసింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ కరోనా దెబ్బకు అతలాకుతలమైంది. అయినప్పటికీ ఏ చిన్న అవకాశం దొరికినా షూట్స్ కంప్లీట్ చేస్తూ ఎలాగోలా ఈ ఏడాది కొన్ని బిగ్గెస్ట్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు తెచ్చారు టాలీవుడ్ దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో నెలకొన్న కొన్ని ఇబ్బందులు, వివాదాలు, కొంతమంది సెలబ్రిటీల పర్సనల్ విషయాలు జనాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అవేంటో ఓ సారి చూద్దామా.. వకీల్ సాబ్ ఎంట్రీ- ఏపీ ప్రభుత్వ తీరు రెండేళ్ల రాజకీయ ప్రయాణం చేసిన అనంతరం 2021- ఏప్రిల్ 9న 'వకీల్ సాబ్' సినిమాతో తిరిగి వెండితెరపై అలరించారు పవన్ కళ్యాణ్. అయితే ఈ సినిమా టికెట్ రేట్స్ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయింది. ఈ చిత్ర బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడమే గాక, టికెట్ రేట్లను పెంచుకునే అవకాశాన్ని లేకుండా చేయడంతో వివాదం రాజుకుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఈ ఇష్యూపై బండ్ల గణేష్ రియాక్ట్ అవుతూ వకీల్‌ సాబ్‌ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై సినీ పెద్దలెవరూ స్పందించరా? అని కామెంట్ చేయడం చర్చల్లో

కిన్నెరసాని ట్రైలర్: కారణం లేని ప్రేమ, గమ్యం లేని ప్రయాణం చాలా గొప్పవి కదా!!

Image
'విజేత' సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్.. 'కిన్నెరసాని' అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌‌గా అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఈ సినిమా రూపొందుతోంది. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్, శుభమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మహతి సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. 2022 జనవరి 26న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌ చేపడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా కిన్నెరసాని ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ వీడియో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ తెచ్చుకోగా తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమా పట్ల ఆసక్తి నెలకొల్పింది. ఈ ట్రైలర్ చూస్తుంటే మర్డర్ మిస్టరీ ప్రధానంగా ఈ సినిమా రూపొందించారని అర్థమవుతోంది. రెండు నిమిషాల 7 సెకనుల నిధితో కూడిన ఈ ట్రైలర్‌లో డైలాగ్స్ హైలైట్ అయ్యాయి. ''నీ ముందున్న సముద్రపు అలలను చూడు. కోపగించుకొని సముద్రాన్ని వదిలి వెళ్లి పోతున్నట్లున్నాయి. కానీ సముద్రం వాటిని వదలదు.. నేను కూడా అంతే'' అంటూ ట్రైలర

టికెట్స్ రేట్లు తగ్గించడం కాదు.. రాజమౌళికి రివార్డ్ ఇవ్వాలి: ఆర్జీవీ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Image
తెలుగోడి సత్తా ఏంటనేది ప్రూవ్ చేస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన ఘటన సొంతం. తెలుగు కళాకారుల్లో ఎంతో టాలెంట్ ఉందని, భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించి భారీ వసూళ్లు రాబట్టవచ్చని 'బాహుబలి' సినిమాతో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చేశారు జక్కన్న. ఇదే విషయాన్ని ప్రస్తావనకు తెస్తూ ఆంధ్ర ప్రదేశ్ టికెట్స్ రేట్స్ ఇష్యూపై తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు . ఈ మేరకు రాజమౌళిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ టికెట్స్ రేట్స్ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నాని లాంటి సినీ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, వాటిపై ఏపీ పొలిటీషియన్స్ వేసిన కౌంటర్స్ తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ ఇష్యూ లోకి ఎంటరైన రామ్ గోపాల్ వర్మ.. ఎప్పటిలాగే లాజిక్స్ మాట్లాడుతూ ఏపీ టికెట్ రేట్స్‌కి దర్శక ధీరుడు రాజమౌళికి లింక్ పెడుతూ మాట్లాడారు. హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ స్పైడర్ మ్యాన్‌కి పెట్టిన ఖర్చులో 100వ వంతుతో రాజమౌళి బాహుబలి సినిమా తీశాడు. ఈ సినిమాతో తన బాహుబలి సినిమా హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీని మిం

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై రాజమౌళి క్రేజీ కామెంట్స్.. మెగా, నందమూరి అభిమానులతో గోల పెట్టించిన జక్కన్న

Image
దర్శక ధీరుడు రాజమౌళిది ఎల్లలు దాటిన క్రేజ్. బాహుబలి సిరీస్‌తో తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన జక్కన్న.. మరో ప్యాన్ ఇండియా మూవీ RRRతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఆ అంచనాలకు రెట్టింపు చేసేలా చిత్ర ప్రమోషన్స్ చేపడుతున్నారు . ఇందులో భాగంగా గత వారం మొత్తం బాలీవుడ్‌లో ప్రోమోట్ చేసిన టీమ్ నిన్న (సోమవారం) రాత్రి కేరళలో సందడి చేసింది. కేరళలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఏర్పాటు చేసి అక్కడి అభిమానుల్లో జోష్ నింపారు రాజమౌళి. ఈ వేదికపై రాజమౌళి మాట్లాడుతూ.. ''నిర్మాత దానయ్య గారు నాతో ఓ సినిమా చేసేందుకు 13 సంవత్సరాలుగా ఎదురుచూశారు. ఆయనతో బిగ్గెస్ట్ సినిమా చేస్తానని చెప్పి RRR చేశాను. నా కోసం ఇన్ని సంవత్సరాలు ఎదురుచూసినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. నేను చేసిన సినిమాల గురించి దేశవ్యాప్తంగా చెప్పుకోవడం చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. నేను రూపొందించిన ‘ధీర, ఈచ, బాహుబలి’ చిత్రాలకు కేరళ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు RRR సినిమాకు అంతకుమించిన ఆదరణ లభిస్తుందని నమ్ముతున్

ఉత్త చేతులతో ఇండస్ట్రీకి వచ్చి కోట్లు సంపాదించా.. ఆ విషయం చెబుతూ శ్రీ విష్ణు ఎమోషనల్

Image
కెరీర్ ఆరంభం నుంచే వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు యంగ్ హీరో శ్రీ విష్ణు. సినిమా సెలక్ట్ చేసుకోవడంలో ఆయనకంటూ ఓ స్టైల్ ఉంటుందని ఇప్పటిదాకా చేసిన సినిమాలతో ప్రూవ్ చేశారు. అలాంటి మరో విలక్షణ కథ ''తో ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేసేందుకు సిద్దమయ్యారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తేజ మర్ని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 31న థియేటర్లలో ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేదికపై హీరో శ్రీ విష్ణు మాట్లాడిన మాటలు అందరినీ అట్రాక్ట్ చేశాయి. దర్శకుడు తేజ చాలా టాలెంటెడ్ అని చెప్పిన శ్రీ విష్ణు.. దాదాపు షూటింగ్ మొత్తం కూడా గోదావరి జిల్లాలోనే జరిగిందని, ఈ సినిమా చూశాక ఇది మా గోదావరి జిల్లాల గొప్పతనం అని అక్కడి జనం కాలర్ ఎగరేసి చెప్పుకుంటారని నమ్మకంగా చెబుతున్నా అన్నారు. 55 రోజులపాటు కంటిన్యూస్‌గా షూట్ చేశామని, ఈ చిత్ర నిర్మాణంలో నిర్మాతలు చాలా ఫ్రీడమ్ ఇచ్చారని, అవుట్‌పుట్ చాలా అద్భుతంగా రావడానికి కారణం నిర్మాతలే అని తెలిపారు. ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ ఇరగదీశారని, సినిమా చూశాక అది మీరే చ

Roja: హీరో నాని మాటలపై ఎమ్మెల్యే రోజా కౌంటర్స్.. పవన్‌ కళ్యాణ్‌పై పరోక్ష విమర్శ

Image
ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల రగడ రోజు రోజుకు ముదురుతోంది. సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు సినీ ప్రముఖులు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా విడుదలకు ముందు హీరో చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. నాని మాట్లాడిన తీరుపై ఇప్పటికే పలువురు వైసీపీ లీడర్స్ విరుచుకుపడగా.. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, ఎమ్మెల్యే మీడియా ముందు నాని వ్యాఖ్యలపై కౌంటర్స్ వేశారు. థియేటర్లలో సినిమా టికెట్ రేట్ల తగ్గింపుతో థియేటర్లలో వచ్చే కలెక్షన్స్ కంటే ఆ పక్కన ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్స్ బెటర్‌గా ఉన్నాయని, టికెట్ ధరలు పెంచినా కూడా సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని నాని అన్నారు. దీంతో ఒక్కసారిగా ఏపీ టికెట్స్ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. నాని వ్యాఖ్యలను కొందరు సినీ ప్రముఖులు సపోర్ట్ చేస్తుండగా.. వైసీపీ లీడర్స్ మాత్రం విరుచుకు పడుతున్నారు. తాజాగా సీన్ లోకి ఎమ్మెల్యే రోజా వచ్చి సినిమా టికెట్ల వ్యవహారంపై నాని మాటలు చాలా బాధాకరని అన్నారు. థియేటర్స్ కలెక్షన్స్ కంటే కిరాణా కొట్టు కలెక్షన్స్ బెటర్‌గా ఉందని అనుకున్నపుడు నాని గారు క

2021 Rewind: సక్సెస్‌ఫుల్ సినీ ఎంట్రీ.. వచ్చి రాగానే వెండితెరపై సత్తాచాటిన హీరోలు వీరే..

Image
సినిమా అనే రంగుల ప్రపంచంలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఎంతో టాలెంట్ ఉంటే తప్ప అవకాశాలు తలుపుతట్టవు. అయితే కొందరు హీరోలకు తమ తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు కాస్త టైం పట్టినా కొందరు హీరోలు మాత్రం తొలి సినిమాతోనే తమ మార్క్ చూపెడుతుంటారు. మరి ఈ ఏడాది (2021)లో అలాంటి హీరోలు ఎవరు? వారి వారి సినిమాలు ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యాయో ఓ లుక్కేద్దామా.. ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై తనదైన యాంకరింగ్ చేస్తూ ప్రతి ఇంటి సభ్యుడికి సుపరిచితమైన యాంకర్ ప్రదీప్ ఈ ఏడాదే హీరోగా పరిచయమయ్యారు. ఇప్పటికే పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ వెండితెరపై కూడా తన టాలెంట్ చూపించిన ప్రదీప్.. ఈ ఏడాది ఆరంభంలోనే హీరోగా వెండితెరపై కాలుమోపారు. ఆయన హీరోగా కొత్త దర్శకుడు మున్నా తెరకెక్కించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హీరోగా తొలి సినిమాతోనే ప్రదీప్ టాలెంట్ బయటపడిందనే టాక్ వచ్చింది. వైష్ణవ్ తేజ్ మెగా మేనల్లుడిగా, సాయి ధరమ్ తేజ్ సోదరుడిగా బలమైన బ్యాక్‌గ్రౌండ్‌తో వెండితెరపై కాలు మోపిన యంగ్ హీరో వైష్ణవ్ తేజ్.. తన తొలి సినిమా 'ఉప్పెన'తో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నారు

మంచు మనోజ్‌కి కరోనా పాజిటివ్.. స్వయంగా వెల్లడించిన హీరో

Image
గత రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీని కరోనా భయం వెంటాడుతూనే ఉంది. వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత కొన్ని నెలల పాటు కరోనా కేసులు నమోదు కాకున్నా అంతలోనే తిరిగి ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటం మరోసారి గుబులు పుట్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ముగిసిందనుకునే లోపే ఒమిక్రాన్ రూపంలో మరో వేరియంట్ పలు దేశాలను వణికిస్తోంది. రీసెంట్‌గా కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, యాక్షన్ కింగ్ అర్జున్ కరోనా బారిన పడి చికిత్స తీసుకోగా తాజాగా తనకు కరోనా సోకిందంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ''నాకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన ప్రతి ఒక్కరు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. డోంట్ వర్రీ.. మీ అందరి ప్రేమతో ఆరోగ్యంగా తిరిగివస్తా. వైద్యులు, న‌ర్సులంద‌రికీ నేను ప్రత్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను'' అని మంచు మ‌నోజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో మనోజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నెటిజన్లు కామెంట్స్ చేస

బీ రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. భీమ్లా నాయక్‌ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్

Image
రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన వరుస సినిమాలకు కమిటై తన అభిమానుల్లో ఉరకలేసే ఉత్సాహం నింపిన సంగతి తెలిసిందే. రీ- ఎంట్రీ తర్వాత వకీల్ సాబ్ రూపంలో భారీ హిట్ పట్టేసిన పవన్.. తన తదుపరి సినిమాలు చకచకా కంప్లీట్ చేస్తున్నారు. దీంతో ఆయా సినిమాల కోసం అశేష ప్రేక్షకలోకం ఆతృతగా ఉంది. ఆ లిస్టులో మొదటిది ''. పవన్ కళ్యాణ్, రానా జంటగా నటించిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు మాటల్లో చెప్పలేం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చారు చిత్ర నిర్మాత నాగ వంశీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘టైటిల్‌ సాంగ్‌, ‘లాలా..భీమ్లా’ పాటలు, పవన్ మాస్‌ లుక్‌ పోస్టర్‌ల భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సాంగ్స్ అయితే ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పవన్ ఫ్యాన్స్ ఊగిపోయే కొత్త అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను లాలా..భీమ్లా Dj వర్షన్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అది కూడా కొత్త సంవత్సర కానుకగా. 31 డిసెంబర్ రాత్రి 7 గంటల 2 నిమిషాలకు లాలా..భీమ్లా Dj వర్షన్ విడుదలకు కానుందని, ఈ పాటతో బ్లాస్టింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోండని తెల

ఆర్ధిక కష్టాల్లో కుటుంబం.. డబ్బు సాయం కోరిన నెటిజన్.. యాంకర్ ప్రదీప్ రియాక్షన్ వైరల్

Image
ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. ఏ విషయాన్నైనా సామాజిక మాద్యమాల ద్వారా వ్యక్తపరచడం చాలా సులువైంది. మరీ ముఖ్యంగా ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సామాన్యులకు సెలబ్రిటీలకు మధ్య వారధిగా మారాయి. తమ మనసులోని మాటలను, రిక్వెస్ట్‌లను సెలబ్రిటీల ముందుకు తీసుకెళ్లడం సులభతరం చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ నెటిజన్ యాంకర్ కోరుతూ ట్వీట్ పెట్టాడు. దీనిపై ప్రదీప్ రియాక్ట్ అయిన తీరు ఆయన్ను వార్తల్లో నిలిపింది. బుల్లితెరపై సక్సెస్‌ఫుల్ యాంకర్‌గా దూసుకుపోతున్న ప్రదీప్.. అప్పుడప్పుడు తన మంచి మనసును చాటుకుంటూ ఉంటారు. ఆపదలో ఉన్న వారి పట్ల జాలి చూపిస్తూ చేతనైనంత సాయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తన కుటుంబ పరిస్థితి బాగోలేదని, కరోనా కారణంగా నాన్న చనిపోవడంతో ఆర్థికంగా కుంగి పోయామని తెలుపుతూ ఓ బీటెక్ విద్యార్ధి ట్వీట్ చేశాడు. ఈ మేరకు యాంకర్ ప్రదీప్‌ని ట్యాగ్ చేస్తూ సాయం కోరాడు. కరోనా కారణంగా నాన్న చనిపోవడంతో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న తాను, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తన సిస్టర్ చాలా కష్టాల్లో ఉన్నామని తెలిపిన నెటిజన్ మీ నుంచి కొంత డబ్బు సాయం కావాలని కోరాడు. తమ కుటుంబ ప

ఉ అంటావా మావ.. ఉఊ అంటావా మావ.. ఇరగదీసిన జూనియర్ సమంత.. వీడియో వైరల్

Image
సోషల్ మీడియా కారణంగానే ఫేమ్ కూడగట్టుకొని జూనియర్ సమంతగా నెటిజన్లకు సుపరిచితమైంది . అదే పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తనదైన ఆటతీరుతో బుల్లితెర ఆడియన్స్ మనసు దోచుకుంది. దీంతో బిగ్‌బాస్ షో తర్వాత ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. అప్పటిదాకా కొందరికే తెలిసిన అషు రెడ్డి.. బిగ్ బాస్ తర్వాత ప్రతి ఒక్కరికీ చేరువైంది. సినిమా ఆఫర్లు కూడా పెట్టేస్తూ బిగ్ సెలబ్రెటీగా మారింది. ఇక మరోవైపు తన అసలైన అస్త్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలతో నెటిజన్లను ఫిదా చేస్తోంది అషు రెడ్డి. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా సెన్సేషన్ అవుతున్న సాంగ్ 'ఉ అంటావా మావ... ఉఊ అంటావా మావ' పాటకు స్టెప్పులేసింది అషు. ఆమె చేసిన ఈ సాంగ్ ప్రోమో వీడియో రిలీజ్ చేయడంతో ఆన్ లైన్ మాధ్యమాలు షేక్ అవుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ మూవీలోని ‘ఉ అంటావా మావ... ఉఊ అంటావా మావ’ పాట ఎంతటి సంచలనాలు సృష్టిస్తుందో చూస్తున్నాం. హీటు పుట్టించే మేకోవర్‌తో సమంత కాలుకదిపిన ఈ ఐటెం సాంగ్ దేశవ్యాప్తంగా మారు మోగుతోంది. పలువురు ఈ సాంగ్ స్పూఫ్ వీడియోలు

Kodali Nani : సినిమాలెందుకు కిరాణా కొట్లు పెట్టుకోండి... నానికి కొడాలి నాని కౌంటర్!

Image
తెలుగు చిత్ర కథానాయకుడు నానిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి కొడాలి కౌంట‌ర్ వేశారు. నాని హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ‌రాయ్‌’. సినిమా విడుద‌ల స‌మ‌యంలో ఏపీలోని థియేట‌ర్ టికెట్స్ రేట్ల‌పై నాని మాట్లాడుతూ పెద్ద థియేట‌ర్స్‌లో వ‌చ్చే క‌లెక్ష‌న్స్ కంటే ప‌క్క‌నున్న కిరాణా కొట్ల‌కే ఎక్కువ క‌లెక్ష‌న్స్ వస్తున్నాయ‌ని, సినిమా టికెట్ రేట్స్‌ను త‌గ్గించ‌డం ప్రేక్ష‌కుల‌ను అవ‌మానించిన‌ట్లేనిన అన్నారు. ఆ వ్యాఖ్య‌లు పెద్ద దుమారంగా మారాయి. ఆంధ్ర ప్ర‌దేశ్‌కు చెందిన నాయ‌కులు నాని తీరుని విమ‌ర్శించారు. అయితే రీసెంట్‌గానూ నాని టికెట్ రేట్స్‌పై మాట్లాడిన సంద‌ర్భం, అర్థం వేర‌ని, కానీ అది బ‌య‌ట‌కు వ‌చ్చిన తీరు పూర్తిగా మ‌రోలా ఉంద‌ని, నెగిటివ్‌గా తీసుకోవ‌ద్ద‌ని దిల్ రాజు కూడా వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే ప్ర‌భుత్వ పెద్ద‌లు నాని చేసిన వ్యాఖ్య‌ల‌ను అంత సులువుగా మ‌ర‌చిపోలేక‌పోతున్నార‌ని తెలుస్తుంది. మంగ‌ళ‌వారం ఏపీ మంత్రి చేసిన వ్యాఖ్య‌లే అందుకు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తున్నాయి. ఏపీలో సినిమా థియేట‌ర్స్ టికెట్ రేట్స్‌.. నాని వ్యాఖ్య‌లపై కొడాలి నాని మాట్లాడుతూ ‘‘ టికెట్ రేట్స్‌ను మేం ఎక్క‌డా త‌గ్గించ లేదు. గ‌తంలో ఉన్న‌

సుకుమార్‌తో చిరంజీవి మీట్.. అల్లు అర్జున్ నటనపై మెగాస్టార్ కామెంట్స్

Image
ప్యాన్ ఇండియా మూవీ 'పుష్ప' విజయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ను మెగాస్టార్ అభినందనలతో ముంచెత్తారు. ఇటీవలే ‘పుష్ప’ సినిమా వీక్షించిన చిరంజీవి.. ఆ వెంటనే సుకుమార్‌ని ప్రత్యేకంగా తన ఇంటికి ఆహ్వానించి ప్రశంసించారు. సినిమా తనకు బాగా నచ్చిందని చెబుతూ సుక్కు ప్రతిభను కొనియాడారు. అన్ని భాషల్లో పుష్ప సినిమాకు లభిస్తున్న ఆదరణ పట్ల తనకెంతో ఆనందంగా ఉందని చెప్పిన చిరంజీవి.. సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన చాలా బాగుందని, సినిమాలోని ప్రతి అంశం ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు. దర్శకుడుగా సుకుమార్ పడిన తపన, కష్టం ప్రతి ఫ్రేములో కనిపించిందని, అందుకు తగ్గ ప్రతిఫలం బ్లాక్‌బస్టర్ రూపంలో వచ్చిందని సుకుమార్‌పై చిరంజీవి ప్రశంసలు గుప్పించారు. అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. మొదటిసారి అల్లు అర్జున్ ఊర మాస్ లుక్కులో కనిపించి కిక్కిచ్చారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హాట్రిక్ సినిమాగా ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూ

ఎన్టీఆర్ -చ‌ర‌ణ్ గొడ‌వ‌పై RRR Pre Release Eventలో రాజ‌మౌళి క్లారిటీ !

Image
తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన చిత్రం . రెండు భిన్న ధ్రువాలు వంటి హీరోల‌తో పాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ.. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ బాష‌ల్లో రూపొందిన ఈ చిత్రం మ‌రో ఐదు భాష‌ల్లో అనువాద చిత్రంగా రిలీజ్‌కి సిద్ధ‌మైంది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా ఎప్పుడో పూర్తి చేసేసిన రాజ‌మౌళి అండ్ టీమ్‌ ఇప్పుడు ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకే రేంజ్ ఇమేజ్‌.. బాక్సాఫీస్ స్టామినా ఉన్న ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కులతో రాజ‌మౌళి సినిమా అన‌గానే ముందు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అసలు ఎలా హ్యాండిల్ చేస్తారోన‌ని కూడా అంద‌రూ భావించారు. కానీ రాజ‌మౌళి అస‌లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. సినిమా రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య స్నేహ బంధం చాలా ఎక్కువైంది. ప‌లు సంద‌ర్భాల్లో ఇద్ద‌రూ త‌మ మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని తెలియ‌జేసిన సంగ‌తి కూడా విదితమే. ఓ స

సమంత గోవా వెకేషన్.. ప్రకృతి అందాల నడుమ ఆ ఇద్దరితో ఎంజాయ్

Image
ఇటీవలే నాగ చైతన్యతో విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించిన .. ప్రస్తుతం తన కెరీర్ పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. విడాకుల అనంతరం రూటు మార్చిన ఈ ముద్దుగుమ్మ పుష్పలో ఐటెం సాంగ్ చేసి తనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. మరోవైపు సినిమాల విషయంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తూ టాలీవుడ్ సహా బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాలకు సైన్‌ చేస్తోంది. విడాకుల తాలూకు వ్యవహారాన్ని పూర్తిగా మరచిపోయేలా దేశాన్ని చుట్టి వస్తూ పలు పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తోంది సమంత. ఈ క్రమంలోనే ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం తన స్నేహితులతో కలిసి గోవా వెళ్ళింది. తన బెస్ట్‌ఫ్రెండ్‌ శిల్పారెడ్డి సహా మరో ఫ్రెండ్‌తో కలిసి గోవా టూర్‌ చేస్తోంది సామ్. ఇక ఎప్పటిలాగే ఇందుకు సంబంధించిన ఫోటోలను #goayoubeauty అనే ట్యాగ్‌ లైన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అక్కడి ప్రతి ఎంజాయ్ మూమెంట్ అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సమంత షేర్ చేసిన ఫొటోల్లో తన ఇద్దరూ స్నేహితురాళ్ళతో కలిసి స్విమ్‌సూట్‌లో దర్శనమిచ్చింది సమంత. దీంతో ఈ ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఇంకా కేవలం నాలుగు రోజులే

చచ్చిపోయా.. ఆ వీడియో షేర్ చేస్తూ సమంత రియాక్షన్! మనసులోని స్ట్రాంగ్‌ ఫీలింగ్స్ బయటపెట్టిందిలే..

Image
పట్టలేని ఆనందం వచ్చినా, ఆపుకోలేని దుఃఖం వచ్చినా.. చచ్చిపోయారా బాబు అనేది సాధారణంగా సగటు మనిషి నోట పలికే మాట. స్టార్ హీరోయిన్ కూడా అచ్చం అలాగే ఫీల్ అవుతోంది. తాను రీసెంట్‌గా చేసిన ఐటెం సాంగ్ రెస్పాన్స్ చూసి ఆనందం తట్టుకోలేక 'డెడ్' అనేసింది సామ్. ఈ మేరకు తనలోని స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆ ఒక్క పదం రూపంలో బయటపెడుతూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది సమంత. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీర్చిదిద్దిన 'పుష్ప' సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ''ఉ అంటావ మావ.. ఉ ఊ అంటావ మావ'' అంటూ హీటెక్కించింది సామ్. దీంతో జనరల్‌గా సుక్కు ఐటెం సాంగ్‌కి ఉండే డిమాండ్‌ని 100 రెట్లు పెంచేసింది ఈ సాంగ్. అల్లు అర్జున్‌తో కలిసి సమంత చేసిన డాన్సింగ్ మూమెంట్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక యూట్యూబ్‌లో ఈ సాంగ్ సృష్టిస్తున్న అలజడి అంతాఇంతా కాదు. ఎక్కడ చూసినా ఈ సాంగ్ మోత మోగుతోంది. చిన్న- పెద్ద అనే వయసు బేధం, ఆడ- మగ అనే లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరి పెదాలపై ఇదే సాంగ్ కదలాడుతోంది. ఎంతోమంది ఈ పాటను స్ఫూప్‌ వీడియోలు చేశారు. సాంగ్ రీక్రియే

తారక్‌ది చైల్డిష్ మెంటాలిటీ.. చరణ్ లాంటి మైండ్ సెట్ ఎక్కడా చూడలేదు: రాజమౌళి ఓపెన్ కామెంట్స్

Image
కెరీర్ ఆరంభంలో ఉన్న తారక్‌తో పోల్చితే ఇప్పటి తారక్‌లో ఎన్నో వేరియేషన్స్ చూస్తున్నాం. అంచెలంచెలుగా తన నటన, డాన్స్ ప్రతిభను మెరుగుపర్చుకొని అశేష ప్రేక్షకాదరణ పొందుతున్నారు . అయితే తారక్‌లోని ఆ ట్రాన్స్‌ఫర్‌మేషన్, ఆ ఎనర్జీకి కారణం దర్శక ధీరుడు అంటుంటారు. ఎప్పుడైతే 'యమ దొంగ' సినిమాలో తారక్ రూపాన్ని మార్చేస్తూ తెరపై ప్రెజెంట్ చేశారో అప్పటినుంచి జర్నీ తిరుగేలేకుండా సాగుతోంది. తాజాగా అలాంటి తారక్‌పై అదే రాజమౌళి ఓపెన్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్, హీరోలుగా భారీ మల్టీస్టారర్ సినిమా RRR రూపొందించి పలు భాషల్లో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు జక్కన్న. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్ చేపడుతున్న ఆయన.. గత రాత్రి చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయ నిధి స్టాలిన్, శివ కార్తికేయన్, ఆర్బీ చౌదరిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ వేదికపై RRR సినిమాను ఉద్దేశిస్తూ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాకంటే తానే సీనియర్‌ అని తారక్‌ ఎప్పుడూ గొడవ పడుతుంటాడని, తారక్‌ ప్రేమను తట్టుకోవటం చాలా కష్టమని రాజమౌళి అన్నారు. ఉదయం 7

RRR Pre Release Event : చనిపోయే వరకు ఆ బంధాన్ని కొనసాగిస్తా.. ఎన్టీఆర్‌పై చెర్రీ కామెంట్స్

Image
రాజమౌళి, , రామ్ చరణ్‌లు ప్రస్తుతం సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. సోమవారం నాడు చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు ఉదయ నిధి స్టాలిన్, శివ కార్తికేయన్, ఆర్బీ చౌదరిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. రాజమౌళితో ఉన్న బంధం, ఎన్టీఆర్‌తో తనకున్న రిలేషన్ మీద మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘ముందుగా ఇక్కడకు ఎంతో దూరం నుంచి వచ్చిన తారక్ సోదరులు, అభిమానులకు థ్యాంక్స్. నిజంగా ఏ సిటీకి వెళ్లినా కూడా మన బ్రదర్స్ మారడం లేదు. ఇక్కడకు వచ్చినవారందరికీ థ్యాంక్స్. లైకా ప్రొడక్షన్ సుభాస్కరణ్ గారికి థ్యాంక్స్. ఆయనతో ఎప్పటి నుంచో పని చేయాలని అనుకున్నాను. కానీ ఇలా ఆర్ఆర్ఆర్‌తో కుదిరింది. మాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత దానయ్య గారికి థ్యాంక్స్. మా గురువు అనాలా? ప్రిన్సిపాల్ అనాాలా? గైడ్ అనాలా?.. నాకు మొదటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన గారికి చాలా థ్యాంక్స్. మా ఇద్దరినీ కలిపి ఓ సినిమా తీసినందుకు థ్యాంక్స్. రాజమౌళి గారి గురించి చెప్పాలంటే ఒక స్టేజ్ సరిపోదు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సర్.. మరీ ముఖ్యంగా లాంటి బ్రదర్‌ను ఇచ్చినందుకు థ్యాంక్స్ సర్. అలాగే రాజమౌళి గారి టీం ఎం

RRRలో ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్‌ రెండు సింహాల్లా ఉన్నారు : హీరో శివ కార్తికేయన్

Image
తమిళంలో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న శివ కార్తికేయన్ రెమో, డాక్ట‌ర్ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను కూడా ప‌ల‌క‌రించారు. మ‌న తెలుగు వారికి కూడా ఆయ‌న సుప‌రిచితుడే. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ గురించి ఆయ‌న మాట్లాడుతూ RRR సినిమాను ప్ర‌శంస‌ల‌తో ఆకాశానికెత్తేశారు. ‘‘నేను రాజమౌళిగారికి పెద్ద ఫ్యాన్. RRR సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాల‌ని న‌న్ను ఆహ్వానించ‌గానే చాలా ఆనంద‌మేసింది. ఎప్పుడెప్పుడు ఈవెంట్‌కు వ‌స్తామా? అని ఎదురుచూశాను. రాజ‌మౌళిగారు డైరెక్ట్ చేసిన మ‌గ‌ధీర సినిమా చూడ‌గానే ఆయ‌నకు అభిమానిగా మారిపోయాను. ఈగ సినిమా చూసి ఓ చిన్న ఈగ‌తోనే ఇంత పెద్ద సినిమా చేశారుగా ఇక మ‌నలాంటి హీరోల‌తో ఎలాంటి సినిమాలు చేస్తారోన‌ని అనుకున్నాను. ఆయ‌న ఎలాంటి సినిమాలు చేస్తున్నారో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇక ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌గారి గురించి చెప్పాలంటే ఇద్ద‌రినీ రెండు సినిమా సింహాలైన అనుకోండి లేదా పులులైన అనుకోండి. ఇద్ద‌రూ ఇద్ద‌రే. RRR ట్రైల‌ర్‌లో ఒక్కొక్క‌రినీ ఒక్కొక్క షాట్‌లో చూస్తుంటే గూజ్ బమ్స్ వ‌చ్చేస్తున్నాయి.

RRR Pre Release Event : దానయ్యను ఆడుకున్న రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్!

Image
రాజమౌళి, , రామ్ చరణ్‌లు ప్రస్తుతం సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. సోమవారం నాడు చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు ఉదయ నిధి స్టాలిన్, శివ కార్తికేయన్, ఆర్బీ చౌదరిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఉండగా , ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నవ్వుతూ ఉన్నారు. తమిళంలో ఆర్ఆర్ఆర్ సినిమాను లైకా ప్రొడక్షన్ రిలీజ్ చేస్తోంది.. సుభాస్కరణ్‌ను థ్యాంక్స్ అంటూ తమిళంలో మాట్లాడేశాడు. ఆ తరువాత మళ్లీ తెలుగులోకి స్పీచ్‌ను మార్చేశాడు. ఇక దానయ్య మాట్లాడుతూ ఉన్నంత సేపు అందరూ పగల బడి నవ్వేశారు. ఈ సినిమాను నిర్మించే అవకాశం ఇచ్చిన రాజమౌళి గారికి, మా ఎన్టీఆర్ గారికి, మా గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. రామ్ చరణ్ అభిమాన సోదరులకి, ఎన్టీఆర్ అభిమానుల సోదరులకు థ్యాంక్స్ అని చెప్పి హడావిడిగా దిగిపోతాడు దానయ్య. అయితే అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పండి అని యాంకర్లు దానయ్యను అడుగుతూనే ఉంటారు. దానయ్య మాత్రం చకచకా దిగేసి వస్తాడు. ఇంకో మైకు తీసుకుని చెప్పండి అని యాంకర్లు అంటుంటారు. దీంతో చివరకు మైక్ తీసుకుని.. అందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ తమిళ ఆడియెన్స్‌ను ఉద్దేశించి చెబుతాడు. ఇక దానయ్య ప్రసంగం

బండ్ల గణేష్‌పై అరెస్ట్‌ వారెంట్ జారీ

Image
నటుడు, నిర్మాత మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఆయ‌న‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అసలేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకి వెళితే.. ఒంగోలు ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంక‌టేశ్వ‌ర్లు అనే వ్య‌క్తికి బండ్ల గ‌ణేష్ రూ.1 కోటి 25 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్‌ను ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అయ్యింది. దీనిపై స‌ద‌రు జెట్టి వెంక‌టేశ్వ‌ర్లు కోర్టును ఆశ్ర‌యించారు. విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ ప‌లుసార్లు ఆదేశాలు వెళ్లిన‌ప్ప‌టికీ బండ్ల గ‌ణేష్ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు జ‌డ్జి బండ్ల గ‌ణేష్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజ‌రు ప‌ర‌చాలని పోలీసుల‌కు ఆదేశాల‌ను జారీ చేశారు. ఇది వ‌ర‌కు ఇలాంటి కేసులోనే పోలీసులు బండ్ల గ‌ణేష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రు ప‌రిచారు. గ‌తంలో క‌డ‌ప జిల్లాకు చెందిన మ‌హేష్ అనే వ్య‌క్తి ద‌గ్గ‌ర 1కోటి 30 ల‌క్ష‌ల రూపాయ‌లు అప్పు తీసుకుని చెల్లించ‌లేదు. మ‌హేష్ ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని చెప్పినా ఆయ‌న విన‌క‌పోవ‌డంతో క‌డ‌ప‌జిల్లా మెజిస్ట్రేట్ బండ్ల గ‌ణేష్‌పై నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

నా జీవితంలోని బిగ్గెస్ట్ మిస్టరీల్లో ఇదొకటి! ప్రభుత్వాలపై రామ్ గోపాల్ వర్మ సెటైర్స్

Image
విషయం ఏదైనా సరే కుండబద్దలు కొట్టాలంటే తర్వాతే ఎవరైనా. అను నిత్యం సమాజాన్ని పరిశీలిస్తూ జనం పోకడ, ప్రభుత్వాల తీరుపై ఓ కన్నేయడం ఆర్జీవీ నైజం. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో వార్తల్లో నిలవడమే కాదు సమాజ పరిస్థితులపై రియాక్ట్ అవుతూ పతాక శీర్షికల్లో పేరు రాయించుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలోనే తాజాగా పలు రాష్ట్రాల్లో విధించిన నైట్ కర్ఫ్యూపై రియాక్ట్ అవుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు రామ్ గోపాల్ వర్మ. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో విలవిల్లాడిపోయిన భారతదేశాన్ని మరోసారి రూపంలో వణికిస్తోంది కరోనా వైరస్. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు ప్రజల్లో ఆందోళన నింపుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ సూచనలతో పలు రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను కఠినతరం చేశాయి. మహారాష్ట్ర సహా హర్యానా, గుజరాత్, యూపీ, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలు విధించాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఇదే ఇష్యూపై ట్విట్టర్ వేదికగా తనదైన స్టైల్ రియాక్షన్ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. ''రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విదిస్తే వైరస్ వ్యాప్తి తగ్గుతుంద

2021 Best Songs: ఈ ఏడాది సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన పాటలివే.. రికార్డులు తిరగరాస్తూ!

Image
కరోనా దెబ్బకు కుదేలైన సినీ ఇండస్ట్రీలో 2021లో కొన్ని బెస్ట్ సినిమాలు విడుదలయ్యాయి. కరోనా టెన్షన్ నుంచి పూర్తిగా బయట పడకపోయినా తమ తమ సినిమాలపై ఉన్న కాన్ఫిడెన్స్‌తో కొంతమంది నిర్మాతలు ధైర్యం చేసి పలు సినిమాలను ప్రేక్షకుల ముందుంచారు. అయితే అలా విడుదలైన, షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల కాబోతున్న సినిమాల్లో కొన్ని సాంగ్స్ రికార్డులు తిరగరాస్తూ ఆన్‌లైన్ వేదికపై హంగామా చేశాయి. ఈ ఏడాది తెరకెక్కిన సినిమాల్లోని కొన్ని పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ సంగీత ప్రియులను ఉర్రూతలూగించాయి. మరి ఆ సూపర్ హిట్ పాటలేవో ఓ సారి చూసేద్దమా.. తొలిసారి అలా కనిపించి ఇండస్ట్రీని షేక్ చేసిన సమంత స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి స్పెషల్ సాంగ్ చేసి ఇండస్ట్రీతో పాటు యూట్యూబ్‌ని షేక్ చేసింది. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేసింది సామ్. ఉ అంటావా మావ.. ఉఊ అంటావా మావ అంటూ మాస్ బీట్‌తో సాగిపోయిన ఈ పాట ఆన్ లైన్ మాద్యమాలపై గత రికార్డులు తిరగరాసింది. విడుదలైన 24 గంటల్లోనే 12.39 మిలియన్ వ్యూస్ రాబట్టి సరికొత్త ఫీట్ అందుకుంది. హుషారెత్తించిన భీమ్లా నాయక్.. టైటిల్ సాంగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

మెగా క్యాంప్ రిక్వెస్ట్‌...కీర్తి సురేష్ భర్తగా మారుతున్న యంగ్ హీరో!

Image
టాలీవుడ్ యంగ్ హీరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌కి భ‌ర్త‌గా మార‌బోతున్నార‌ట‌. అదేంటి? హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉందిగా! అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకుంటుంద‌నే సందేహం కూడా చాలా మందికి రావ‌చ్చు. ఇంత‌కీ ఈ ప్ర‌పోజ‌ల్ పంపిందెవ‌రో తెలుసా? మెగాస్టార్ చిరంజీవికి చెందిన క్యాంప్ అని సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న గుస‌గుస‌లు. ఇంత‌కీ కీర్తి సురేష్ భ‌ర్త‌గా మార‌బోతున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రంటే.. నాగ శౌర్య‌. నాగ శౌర్య‌తో కీర్తి సురేష్ పెళ్లి జ‌ర‌గ‌నుందా? అంటే అవునండోయ్ అన‌క త‌ప్పదు మ‌రి. అయితే రియ‌ల్ లైఫ్‌లో కాదులెండి.. రీల్ లైఫ్‌లో. అదే ఇక్క‌డ అస‌లు మెళిక. అస‌లేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకి వెళితే, మెగాస్టార్ న‌టిస్తోన్న 155వ చిత్రం ‘భోళా శంకర్’. అన్నా చెల్లెల మధ్య అనుబంధం ప్రధానంగా సాగే సినిమా ఇది. ఇందులో చిరంజీవి చెల్లెలుగా ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే మరో హీరోయిన్ తమన్నా ఇందులో చిరంజీవికి జోడీగా నటించనుంది. ఇందులో కీర్తి సురేష్‌కి పెళ్లి చూపుల స‌న్నివేశం ఉంది. అందులో పెళ్లి కొడుకుగా న‌టించ‌డానికి ఎవ‌రినో పెట్ట‌లేరు. ఎందుకంటే, కీర్తి సురేష్ జోడీగా క‌నిపించాలంటే ఆ మ

Pushpa Making Video: తెర వెనుక పుష్పరాజ్ కష్టం.. అబ్బుర పరుస్తున్న ఆన్ లొకేషన్ సీన్స్

Image
స్టైలిష్ స్టార్ మాస్ గెటప్ వేస్తే ఆ బీభత్సం ఎలా ఉంటుందనేది ప్రేక్షకులకు నేరుగా చూపించేశారు సుకుమార్. ఆయన దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ రోల్ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు బన్నీ. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ హ్యూజ్ రెస్పాన్స్ వస్తుండటంతో చిత్రయూనిట్ ఆనందంలో మునిగితేలుతోంది. ఈ నేపథ్యంలో మేకింగ్‌ వీడియో రిలీజ్ చేసి తెర వెనుక పుష్పరాజ్ సహా చిత్రబృందం పడిన కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. సోషల్ మీడియా వేదికగా ఆదివారం విడుదల చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పుష్పరాజ్ యాక్షన్ సీన్స్ మొదలుకొని, సాంగ్స్ మేకింగ్, కీలక సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన దృశ్యాలు చూపించారు. అడవిలో వేసిన సెట్స్‌, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్ల సమన్వయం ఇలా అన్ని కోణాలను టచ్ చేస్తూ ఈ వీడియో వదిలారు. పుష్ప సెట్స్‌పై ఉండగా ఈ మూవీ షూటింగ్ చూసేందుకు వచ్చిన దర్శకుడు వి.వి. వినాయక్‌, అల్లు అర్జున్‌ తనయ అర్హలను ఈ వీడియోలో చూపించి బన్నీ అభిమానులను మరింత హూషారెత్తించారు. అల్లు అర

అనుష్కతో నవీన్ పోలిశెట్టి.. ఫస్ట్ లుక్‌ రిలీజ్.. జాతి రత్నం డబుల్ ట్రీట్!!

Image
విలక్షణ కథలతో సెలక్టెడ్ సినిమాలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు హైదరాబాదీ కుర్రోడు . లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెలుగుతెరపై కాలుమోపిన ఈ కుర్ర హీరో రీసెంట్‌గా 'జాతి రత్నాలు' సినిమాతో తెగ అట్రాక్ట్ చేశారు. తనదైన నాచురల్ నటనతో ఆకట్టుకొని అన్నివర్గాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఈ మూవీ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా కాస్త గ్యాప్ తీసుకొని మరీ కథల ఎంపిక చేసుకున్నారు నవీన్. ఈ నేపథ్యంలోనే ఒకేసారి రెండు సినిమాలతో బరిలోకి దిగుతున్నారు. నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి ఆయన రెండు కొత్త సినిమాల ప్రకటన రావడం విశేషం. పుట్టిన రోజున ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇచ్చిన నవీన్.. ఓ సినిమాలో అనుష్కతో తెర పంచుకోబోతున్నారు. శెట్టి చేయబోయే తదుపరి సినిమాలో నవీన్ భాగం కాబోతున్నట్లు తెలుపుతూ అధికారిక ప్రకటన చేసింది యూవీ క్రియేషన్స్ బ్యానర్. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆయన అభిమానుల్లో జోష్ నింపారు మేకర్స్. రా రా కృష్ణయ్య దర్శకుడు మహేష్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారని, ఇందులో అనుష్క శెట్టి నాలుగు పదుల వయసులో ఉన్న మహిళగా

మోసాన్ని ప్రశ్నించినందుకు తప్పుడు కేసు పెట్టారు: క‌రాటే క‌ళ్యాణి

Image
కొన్నాళ్లు ముందు సైదాబాద్ ప‌రిధిలోని సింగ‌రేణి కాల‌నీలో ఓ మైన‌ర్ బాలిక హ‌త్య‌కు గురైంది. ఆ హ‌త్య‌కు సంబంధించిన వివ‌రాల‌ను క‌ళ్యాణి వెల్ల‌డించే ప్ర‌య‌త్నాలు ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. దీనికి సంబంధించిన ఏల్ల‌మ్మ బండ‌లోని తూటం శెట్టి నితేష్ అనే వ్య‌క్తి రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రైవేటుగా కంప్లైంట్ దాఖ‌లు చేశారు. కంప్లైంట్‌ను ప‌రిశీలించిన కోర్టు క‌రాటే క‌ళ్యాణిపై కేసు న‌మోదు చేయాల‌ని జ‌గ‌ద్గిరి గుట్ట పోలీసులను ఆదేశించింది. ఆదేశాల ప్ర‌కారం పోలీసులు క‌ళ్యాణిపై కేసు న‌మోదు చేశారు. దీనిపై న‌టి కరాటే క‌ళ్యాణి వివ‌ర‌ణ ఇస్తూ మాట్లాడారు. ఓ ఆధ్యాత్మిక సంస్థ హిందూ మ‌తం పేరుతో ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బులు వ‌సూల చేస్తుంటే ప్ర‌శ్నించినందుకు త‌న‌పై త‌ప్పుగా వార్త‌లు రాయించి ట్రోల్ చేస్తున్నారంటూ క‌ళ్యాణి మండిపడ్డారు. క‌రాటే క‌ళ్యాణి మాట్లాడుతూ ‘‘శివ‌శ‌క్తి ఆధ్యాత్మిక చైత‌న్య వేదిక అనే సంస్థ‌ను స్టార్ట్ చేసిన క‌రుణాక‌ర్ సుగుణ‌, క‌ళ్యాణ్ కుమార్ చెట్ల‌ప‌ల్లి వంటి తొమ్మిది దీన్ని స్టార్ట్ చేశారు. కొంత మందిని బ‌య‌ట‌కు పంపేసి ఐదుగురు మాత్ర‌మే ఇప్పుడు డైరెక్ట‌ర్స్‌గా ఉంటూ వ‌స్తున్నారు. వీళ్లు 2020లో ఆఫీస్ స్టార్ట

Manchu Lakshmi : కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది!.. మంచు లక్ష్మీ ట్వీట్ వైరల్

Image
నెట్టింట్లో ఎంతటి ట్రోలింగ్‌కు గురవుతుందో అందరికీ తెలిసిందే. మంచు లక్ష్మీ షేర్ చేసే ఫోటోలు, వేసే ట్వీట్లు, చేసే కామెంట్లు అన్నీ కూడా వైరల్ అవుతుంటాయి. ఇక మంచు లక్ష్మీ కనిపెట్టే కొత్త పదాలు, వాటిపై సోషల్ మీడియాలో జరిగే చర్చలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్య మంచు లక్ష్మీ కొత్త విద్యలు నేర్చుకుంటోంది. కలరి విద్యను మంచు లక్ష్మీ ప్రత్యేకంగా నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే మంచు లక్ష్మీ తన కొత్త సినిమా కోసమే ఇలాంటి విద్యల్లో ట్రైనింగ్ తీసుకుంటోందని తెలుస్తోంది. తాజాగా మంచు లక్ష్మీ కొన్ని ట్వీట్లు వేసింది. ఇన్ని రోజులు ఫ్యామిలీతో కలిసి ఉన్నాను.. ఇకపై నా కోసం కొంత సమయం కేటాయించుకునేందుకు వెళ్తున్నాను అంటూ చెప్పేసింది. కానీ ఎక్కడికి వెళ్తుందనే విషయాన్ని మాత్రం వెళ్లడించలేదు. ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో ఎదురుచూసిన మంచు లక్ష్మీ.. ఆకలి వేయకపోయినా కూడా అక్కడ తినేసిందట. ఎందుకంటే ఆ ఫ్లైట్ టికెట్ కొనేందుకు తన కిడ్నీలు అమ్ముకునేంత పరిస్థితి వచ్చిందట. అందుకే ఆ టికెట్ డబ్బులకు న్యాయం చేసేందుకు అలా ఆకలి కాకపోయినా కూడా తింటున్నానని చెప్పుకొచ్చింది. మంచు లక్ష్మీ వేసిన ఆ ట్వీట్‌కు జనాలు రకరకాలుగా రియాక

అల్లు రామలింగయ్యను అందుకే జైలులో పెట్టారు.. ఎవ్వరికీ తెలియని సీక్రెట్ రివీల్ చేసిన రామ్ చరణ్

Image
నట వారసత్వం నేటికీ కొనసాగుతోంది. ఓ వైపు అల్లు ఫ్యామిలీ హీరోలతో పాటు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు వెండితెరపై భారీ హిట్స్ రాబడుతున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ సినిమా RRR మూవీ పూర్తి చేశారు రామ్ చరణ్. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించారు. జనవరి 7న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. దేశంలో ప్రధాన నగరాలను చుట్టేస్తూ RRR ప్రమోషన్స్ చేస్తున్నారు రాజమౌళి అండ్ టీమ్. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తాత అల్లు రామలింగయ్య గురించిన ఓ రహస్యాన్ని బయట పెట్టారు. తన తాతయ్య స్వాతంత్ర్య సమరయోధుడని చెప్పిన చెర్రీ.. ఆ రోజుల్లో ఆయన హక్కులపై పోరాటం చేశారని, ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసని తెలిపారు. ఆ పోరాటంలో ఆయన జైలు పాలయ్యారని, 15 రోజులకు పైగా ఆయన్ని జైలులో ఉంచారని తన కుటుంబ సభ్యుల్లో కూడా కొద్ది మందికి మాత్రమే తెలుసంటూ ఓపెన్ అయ్యారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన గోండు వీరుడు కొమురం భీం, ఆంధ

మెగా ఫ్రేమ్‌పై మంచు లక్ష్మి రియాక్షన్ వైరల్.. ఆ పిక్ చూశాక నెటిజన్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే..!

Image
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది తెలుగు తెరకు పరిచయమయ్యారు. మెగా బ్రాండ్‌కి వారి వారి టాలెంట్ యాడ్ చేసి ఎవరికివారు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు. అయితే బయట ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటీకీ ఫ్యామిలీ పరంగా ఏకంగా ఉంటూ ప్రతి పండగ రోజున, స్పెషల్ డే రోజున మీట్ కావడం మెగా కుటుంబానికి అలవాటు. ఇలా ఇప్పటికే పలుసార్లు మీట్ అయిన మెగా హీరోలు మరోసారి క్రిస్టమస్ సందర్భంగా కలుసుకొని ఎంజాయ్ చేశారు. మెగా ఫ్యామిలీ అంతా కలిసి క్రిస్టమస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీలోని యంగ్ జనరేషన్ హీరోలంతా ఒక్క చోట కెమెరాకు పోజిచ్చారు. ఈ ఫొటోను అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా కొన్ని నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ, నిహారిక, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, నిహారిక భర్త చైతన్య సహా వారి కజిన్స్ కనిపించారు. దీంతో ఈ పిక్‌ చూసి కన్నుల పండగగా ఫీల్ అవుతున్న మెగా ఫ్యాన్స్ తెగ షేర్ చేసుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే అల్లు స్నేహా రెడ్డి షేర్ చేసిన ఈ పిక్ చూసి మంచువారమ్మాయి,

ట్రెయిన్ టికెట్స్‌తో సినిమా టికెట్స్‌ని పోల్చిన హీరో నిఖిల్ .. థియేటర్స్ మూతపడటంపై ఆవేదన!

Image
కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత సినిమా థియేట‌ర్స్‌కు జ‌నాలు వ‌స్తారో రారో అని సినీ ఇండ‌స్ట్రీ టెన్ష‌న్ ప‌డింది. అయితే మంచి సినిమాలు రావ‌డంతో థియేట‌ర్స్‌కు ప్రేక్ష‌కులు వ‌చ్చి సినిమాల‌ను ఆద‌రించారు. దీంతో అంద‌రిలో ఓ ధైర్యం వ‌చ్చింది. కానీ.. అదే స‌మ‌యంలో ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సినిమా టికెట్ రేట్స్‌ను త‌గ్గిస్తూ జీవోను జారీ చేసింది. సినిమా టికెట్స్ ధ‌ర మ‌రి త‌గ్గిపోవ‌డంతో సినిమా థియేటర్స్‌ను న‌డ‌ప‌లేక ఏపీలో చాలా చోట్ల థియేట‌ర్స్ య‌జ‌మానులు మూసివేశారు. మ‌రో వైపు రాష్ట్రంలో టికెట్స్ రేట్స్‌ను పెంచుకునేలా ప్ర‌భుత్వం జీవోను జారీ చేసింది. దీనిపై సినీ ప‌రిశ్ర‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. ఈ రెండు ప‌రిణామాల‌పై సినీ ఇండ‌స్ట్రీకి చెందిన పలువురు ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. సినిమా టికెట్స్ ధ‌ర‌ను పెంచాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో కూడా ట్విట్ట‌ర్ వేదిగా స్పందించారు. ‘‘ధియేటర్స్ నాకు గుళ్లతో సమానం. ఎప్పుడూ ప్ర‌జ‌ల‌కు ఆనందాన్ని పంచుతుంటాయి. అలాంటి థియేట‌ర్స్ మూత‌ప‌డ‌టం చూస్తుంటే గుండె ప‌గిలిపోతుంది. తెలుగు సినీ

Shyam Singha Roy 2 Days Collections: వీకెండ్‌లో పుంజుకున్న వసూళ్లు! సేఫ్ జోన్‌కి వెళ్లాలంటే..

Image
నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ''. ఈ చిత్రంలో నాని జంటగా సాయి పల్లవి, కృతి శెట్టి నటించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 24వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది. పునర్జన్మల కాన్సెప్ట్ ప్రేక్షకుల చేత భేష్ అనిపించుకోవడమే గాక నాని, సాయి పల్లవి నటన సినిమా మేజర్ అసెట్ అయ్యాయి. అయితే తొలిరోజు డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా రెండు రోజుకు చేరే సరికి కలెక్షన్స్ పరంగా పుంజుకోవడం విశేషం. రెండో రోజుకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.38 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే దాదాపు 13 కోట్లు షేర్ దగ్గరలో ఉంది. వీకెండ్ కావడంతో శనివారం కలెక్షన్స్ కాస్త పుంజుకున్నాయి. అదే జోరు ఆదివారం కూడా ఉండొచ్చని చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఏరియాల వారిగా శ్యామ్ సింగరాయ్ రెండో రోజు వసూళ్లు నైజాం: 2.21 కోట్లు సీడెడ్: 65 లక్షలు ఉత్తరాంధ్ర: 52 లక్షలు ఈస్ట్ గోదావరి: 21 లక్షలు వెస్ట్ గోదావారి: 17 లక్షలు గుంటూరు: 27 లక్షలు కృష్ణా: 20 లక్షలు నెల్లూరు: 15 లక్షలు మొత్తంగా AP-TG డే 2 కలెక్షన్స్: 4.38 కోట్లు (7.1

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ సర్ ప్రైజ్ గిఫ్ట్... న్యూ ఇయర్ రోజున పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి పండగే!

Image
పవర్ స్టార్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘’.ఇందులో రానా ద‌గ్గుబాటి కూడా మ‌రో హీరోగా క‌నిపించ‌నున్నారు. ఈయ‌న పాత్ర పేరు డానియ‌ల్ శేఖ‌ర్‌. ఇద్ద‌రి పాత్ర‌ల‌కు సంబొంధించిన క్యారెక్ట‌ర్స్ ఎలివేష‌న్ ప్రోమోలు కూడా విడుద‌లై మంచి ఆద‌ర‌ణ‌ను పొందాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అంటే ఎలాంటి అంచ‌నాలుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హై ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంతో ఆతృత‌గా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు, సాంగ్స్ ఈ అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచుతూనే వ‌స్తున్నాయి. కాగా.. ఈ అంచాల‌ను మ‌రింత పెంచ‌డానికి మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు. అది కూడా కొత్త సంవ‌త్స‌రం రోజున‌. ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌ను మ‌రింత స్ట్రాంగ్‌గా ఇవ్వాల‌నుకున్నారు. అందు కోసం ‘భీమ్లా నాయక్’ ద‌ర్శ‌క నిర్మాత‌లు ఓ భారీ ప్లాన్ చేశారు. అందులో భాగంగా డిసెంబ‌ర్ 31న ఓ పాట‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. ఆ ఏముందిలే పాటే కదా! అని అనుకోకండి బాబూ.. ఈ పాట‌ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాడారు. సాధార‌ణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ సినిమాలో పాట రిలీజ్ అంటేనే ఫ్యాన్స్ చేసే హంగామా ఓ రేం

‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాలో అలాంటి సీన్.. ప్రాక్టీస్‌ చేసినా వణుకు పుట్టింది: కృతి శెట్టి ఓపెన్

Image
‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది యంగ్ హీరోయిన్ . బేబమ్మ పాత్రతో తనదైన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. యాక్షన్‌తో పాటు రొమాంటిక్ సీన్స్‌లోనూ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్న ఆమెకు ఆ తర్వాత వరుస అవకాశాలు తలుపుతట్టాయి. ఈ క్రమంలోనే రీసెంట్‌గా విడుదలైన నాని ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సినిమా లోనూ కీర్తిగా అదరగొట్టింది ఈ కన్నడ బ్యూటీ. ఈ ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ చిత్రంలో నాని, సాయి పల్లవి నటనలతో పాటు కృతి శెట్టి నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కీర్తిగా తన క్యారెక్టర్‌కి కృతి శెట్టి పూర్తి న్యాయం చేసిందనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ చిత్రంలోని తన రోల్ గురించి, తదుపరి సినిమాల ప్రణాళికల గురించి ఓపెన్ అయింది కృతి. ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సినిమా కోసం తనను తాను చాలా మార్చుకున్నానని, ఇంగ్లిష్‌ సినిమాలు, మోడ్రన్‌ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకుని ఆ స్టైల్లో నటించానని కృతి చెప్పింది. ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెబుదామనుకున్నాని, అయితే వాయిస్‌‌లో బేస్ సూట్‌ కాకపోవడంతో చెప్పలేకపోయానని తెలిపింది. ఇక