ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత.. గాయని చిత్ర సంతాపం

ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన ఆయన వయసు 58 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కైతప్రమ్ విశ్వనాథన్ ఇక లేరని తెలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1963 సంవత్సరం కేరళలోని కైతప్రమ్ అనే గ్రామంలోని ఓ సంగీత కుటుంబంలో జన్మించారు విశ్వనాథన్. సంగీత అధ్యాపకుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ''కన్నకి, తిలక్కం'' సహా 20కి పైగా చిత్రాలకు సంగీత సారథ్యం వహించారు. తిరువనంతపురం లోని స్వాతి తిరునల్ మ్యూజిక్ కాలేజ్ నుంచి ‘గాన భూషణం’ అనే బిరుదు పొందారు. కైతప్రమ్ విశ్వనాథన్ సంగీతం అందించిన కన్నకి చిత్రం 2001లో కేరళ స్టేట్ అవార్డు పొందింది. క్లాసికల్, ఫోక్ మ్యూజిక్ అందించి పలువురి ప్రశంసలు అందుకున్నారాయన. విశ్వనాథన్‌కు భార్య గౌరి, ముగ్గురు పిల్లలున్నారు. ఆయన మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. విశ్వనాథన్ అకాల మరణం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. గాయని తన ట్విట్టర్ ఖాతా ద్వారా కైతప్రమ్ విశ్వనాథన్ ఫొటో షేర్ చేస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ