Posts

Showing posts from September, 2021

‘సలార్’ చేయడం వల్ల ఆ ఫీలింగ్ వస్తుంది.. పాన్ ఇండియా సినిమాపై శృతి హాసన్ కామెంట్స్

Image
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి . ఒక నటిగానే కాదు, గాయినిగా, సంగీత దర్శకురాలిగా ఆమె ప్రేక్షకులను అలరించింది. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ వరుస నిమిాలు చేస్తూ.. ఒకప్పుడు నెం.1 హీరోయిన్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, సినిమాలకు బ్రేక్ ఇచ్చింది శృతి అయితే ఈ ఏడాది మళ్లి వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇప్పటికే ‘క్రాక్’, ‘వకీల్‌సాబ్’ సినిమాలతో రెండు హిట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇక శృతి హాసన్ నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘’. యంగ్ రెబల్‌స్టార్ హీరోగా.. ‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన ఒక ఏడాదిలో తెలుగు, తమిళ, హింది భాషల్లో ఒక సినిమా చేయాలని ఒక నియమం పెట్టుకున్నాను అని.. అలా చేయడం ద్వారా అన్ని భాషల్లో కథ, మరియు పాత్రలపై పట్టు సంపాదించే అవకాశం ఉంటుదని తన నమ్మకం అని పేర్కొంది. అయితే కొన్ని అనుకోని కారణాల వల

రిపబ్లిక్‌ ఫస్ట్ రివ్యూ: గత రాత్రి చూశా.. ఆ మాట మీ నుంచే వినాలనుంది.. సింగర్ స్మిత కామెంట్స్

Image
మెగా మేనల్లుడు హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘రిపబ్లిక్’. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై భారీ రేంజ్‌లో భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన ఈ సినిమాలో సాయి తేజ్ కలెక్టర్ పాత్ర పోషించారు. పొలిటికల్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. చిత్ర ప్రమోషన్స్ ద్వారా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ నేడు (అక్టోబర్ 1న) ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు ఒకరోజు ముందుగానే ఈ మూవీ చూసి సినిమా ఎలా ఉందనే విషయమై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాచురల్ స్టార్ నాని ఈ సినిమాపై, సాయి తేజ్ నటనపై ప్రశంసలు గుప్పించారు. ఈ క్రమంలోనే స్పందిస్తూ 'రిపబ్లిక్' ఎలా ఉందనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ''రిపబ్లిక్ సినిమా దేవ కట్టా మరో ప్రస్థానం అవుతుంది. గత రాత్రి ఈ సినిమా చూశా. రియల్లీ మైండ్‌ బ్లోయింగ్‌. రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ఎంజాయ్‌ చేయాల్సిన సినిమా ఇది. నాకైతే చాలా బా

ఇది మరీ దారుణం.. ప్యాంట్ కిందకు లాగి సీక్రెట్ టాటూ చూపించిన ఆండ్రియా!

Image
బోల్డ్ బ్యూటీ చేసే నటన, అందాల ఆరబోత మామూలుగా ఉండదు. కోలీవుడ్, టాలీవుడ్‌లో ఆండ్రియాకు మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ భామ సినిమాలతో ఫేమస్ అయినా కూడా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇక మరీ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో వ్యవహారంలో ఆండ్రియా పర్సనల్ పిక్స్ లీకవ్వడం, సుచి లీక్స్‌తో రచ్చ రచ్చ జరిగింది. అలా ఆండ్రియా వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉండేవి. ఆండ్రియా చివరగా దళపతి విజయ్ మాస్టర్ సినిమాలో కనిపించింది. విలు విద్యను ప్రత్యేకంగా నేర్చుకుని మరీ దుమ్ములేపింది. ఆర్చరీ ప్రాక్టిస్ సెషన్‌కు సంబంధించిన వీడియోలను కూడా ఆండ్రియా షేర్ చేసింది. ఆ వీడియోలు నెట్టింట్లో బాగానే వైరల్ అయ్యాయి. అలా నెట్టింట్లో ఆండ్రియా చేసే సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది. ఆమె అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఇక విశ్వరూపం సినిమా సమయంలోనూ కమల్ హాసన్, ఆండ్రియా రొమాన్స్ గురించి విపరీతంగా హాట్ టాపిక్ అయింది. ఆండ్రియా షేర్ చేసే ఫోటోలు ఎప్పుడూ కూడా వైరల్ అవుతుంటాయి. ఇక స్వతాహాగా ఆండ్రియా సింగర్, ర్యాపర్ కావడంతో సినిమాల్లో తన సత్తా చాటుతూ ఉంటుంది. తాజాగా ఆండ్రియా

Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. 'ఆచార్య' నుంచి కీలక అప్‌డేట్

Image
కరోనా కష్టకాలం నుంచి సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వాయిదాపడ్డ సినిమాలు ఒక్కొక్కటిగా సెట్స్ మీదకొచ్చి షూటింగ్స్ ఫినిష్ చేసుకుంటున్నాయి. ఈ లిస్టులో , పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు నటిస్తున్న పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. వీటి కోసం వేయికన్నులతో ఆతృతగా ఎదురుచూస్తోంది టాలీవుడ్ లోకం. ఈ నేపథ్యంలో తాజాగా మెగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న ఓ వార్త మెగా అభిమానులను హుషారెత్తిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా '' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తూనే చిత్రంలో ఎంతో కీలకమైన సిద్ద పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే టాకీ పార్టు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ జరుగుతోందని విన్నాం. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్న అప్‌డేట్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి. అయితే ఈ చిత్ర రిలీజ్ విషయంలో మాత్రం గందరగోళం నెలకొంది. దసరా కానుకగా విడుదల కానుందని, లేదు లేదు ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించబోతున్నారని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆచార్య' రిలీజ్ విషయంలో

అండర్‌వేర్‌ని అలా చూసి అడ్డంగా బుక్ అయింది.. రష్మికను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Image
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేస్తూ.. బిజీబిజీగా ఉంది హీరోయిన్ . ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ నటి.. ఆ తర్వాత ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే ఈ క్రమంలో ఆమెకు ఎంత మంది అభిమానులు పుట్టుకొచ్చారో.. అంతే మంది విమర్శకులు తయారు అయ్యారు. ఆమె ఏ మని చేసినా అందులో ఏదో ఒక తప్పు వెతికి పట్టుకొని ట్రోల్ చేసేవాళ్లు చాలా మందే ఉన్నారు. అలా ఆమె చాలా సందర్భాల్లో ఆమె ట్రోల్స్‌ని ఎదురుకుంది. అయితే తాజాగా మరోసారి రష్మిక ట్రోలర్స్‌కి అడ్డంగా దొరికిపోయింది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె ఓ అండర్ వేర్ యాడ్‌లో నటించింది. ఇందులో యోగా ట్రైనర్‌గా రష్మిక, ఆమె స్టూడెంట్‌గా విక్కీ కనిపించారు. సాధారణంగానే అండర్ వేర్ యాడ్లు అంటే అందులో ఎంతో కొంత బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఇందులో కూడా అలాంటి పిక్‌నే చూపించారు. విక్కీ యోగా చేస్తుంటే.. ఆయన ధరించిన అండర్ వేర్‌ను రష్మిక.. కొంటెగా చూడటం. ఆయన అండర్ వేర్‌ను చూసేందుకు ఆమె కొన్ని ప్రయత్నాలు చేయడం ఈ యాడ్‌లో చూపించారు. అయితే ఈ యాడ్‌లో వ

అల్లు రామలింగయ్య జయంతి.. విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు వారసులు

Image
టాలీవుడ్‌లో అల్లు బ్రాండ్‌ను సపరేట్‌గా క్రియేట్ చేయాలని, తమ మార్క్ చూపించాలని తెగ తాపత్రయపడుతున్న సంగతి తెలిసిందే. మెగా హీరో అనే ట్యాగ్ నుంచి అల్లు అర్జున్ ఎప్పుడో దూరమైపోయాడు. మెగా అనే పదాన్ని బన్నీ ఎక్కువగా వాడటం లేదు. ఇక అల్లు స్టూడియో అంటూ అల్లు అరవింద్ భారీ ప్లాన్‌తోనే ముందుకు వెళ్తున్నాడు. అల్లు ఎంటర్టైన్మెంట్, అల్లు స్టూడియో అంటూ అల్లు అరవింద్, బన్ని కలిసి మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. గత ఏడాది అంగరంగ వైభవంగా ప్రారంభించిన అల్లు స్టూడియో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే శతజయంతి వేడుకుల మీద మెగా అభిమానులు కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ తన తాతకు నివాళి అర్పించారు. అల్లు రామలింగయ్య గారి శతజయంతి సందర్భంగా అల్లు స్టూడియోలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లు బాబీ, అల్లు శిరీష్‌లతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించాను. ఆయన మా ప్రతిష్ట, గౌరవం.. వాటిని అల్లు స్టూడియోలోని మా జర్నీతో ముందుకు కొనసాగిస్తామని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మొదటి పార్ట్ ఈ క్రిస్మస్ కానుకగా రాబోతోంది. ఇక అల్లు శిరీష్ అయితే

‘కొండపొలం’ నుంచి ఆహ్లాదకరమైన పాట.. రకుల్‌, వైష్ణవ్‌ల రొమాన్స్ అదుర్స్

Image
‘ఉప్పెన’ సినిమాతో మంచి సక్సెస్ అందుకు నటుడు నటిస్తున్న తాజాగా చిత్రం ‘’. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అడవి నేపథ్యంలో సాగే విభిన్న కథతో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ పెంచే క్రమంలో ట్రైలర్‌ను వదిలారు. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘ఓబులమ్మ’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తాజాగా ‘శ్వాస’ అంటూ సాగే మరో మెలోడీని కూడా వదిలింది చిత్ర యూనిట్. ‘శ్వాసలో హద్దుల్ని దాటలన్న ఆశ. ఆశలో.. పొద్దుల్ని మరిచే హాయి మోశా’ అంటూ సాగే ఈ పాటని యామిని, రోహిత్ పాడారు. ఈ పాటకు సంగీతంతో పాటు సాహిత్యం కూడా అందించారు. ఇక పాటలో అద్భుతమైన లోకేషన్ల నడుమ రకుల్ ప్రీత్, వైష్ణవ్ తేజ్‌ల మధ్య రొమాన్స్‌ని చూపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. పాట ఎంతో వినసోంపుగా ఉంది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించిన విషయం అంద

అక్రమాస్తుల కేసులో చిక్కుకున్న వడివేలు.. స్టార్ కమెడియన్‌కు షాక్ ఇచ్చిన కోర్టు

Image
తమిళ హాస్య నటుడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. 200లకుపైగా చిత్రాల్లో నటించిన ఆయన తన కామెడీతో అందరి చేత నవ్వులు పూయించారు. అయితే గత కొలంగా అవకాశాలు రాకపోవడం.. ఇతర కారణాల వల్ల ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన ఊహించని చిక్కుల్లోపడ్డారు. అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కావాలని ఆయనకు ఎగ్మూర్ న్యాయస్థానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. గతంలో వడివేలు ఇంట్లో ఐటీ దాడులు నిర్వహించిన అధికారులు ఆయన తాంబారం సమీపంలో 3.5 ఎకరాల స్థలాన్ని రూ.1.93 కోట్లకు విక్రయించి దాన్ని లెక్కల్లో చూపించనట్లు గుర్తించారు. అయితే తాను 2007లో కొనుగోలు చేసిన ఈ స్థలం విషయంలో తన సహ నటుడు సింగముత్తు తనని మోసం చేశాడని.. తన ప్రమేయం లేకుండానే ఆ స్థలాన్ని విక్రయించాడని వడివేలు ఆరోపించారు. అంతేకాక.. సింగముత్తుపై ఆయన క్రైం బ్రాంచి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే అప్పటి నుంచి ఈ కేసు ఎగ్మూర్ కోర్టులో నడుస్తోంది. గతంలోనే విచారణకు రావాలని కోర్టు వడివేలుకు సమన్లు పంపింది. కానీ, ఆయన కొన్ని అనుకోని కారణాల వల్ల అప్పట్లో విచారణకు హాజరు కాలేకపోయారు. గురువారం ఈ కేసు పిటీషన్ విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో సింగముత్తు తరఫు

భార్యతో కలిసి మహేష్ తొలిసారిగా అలా.. స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్న స్టార్ కపుల్

Image
సూపర్‌స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఆయన కుటుంబానికి కేటాయించాల్సిన సమయాన్ని కచ్చితంగా కేటాయిస్తారు. సినిమాల నుంచి బ్రేక్ దొరికినప్పుడల్లా.. తన భార్య , పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఆయన విదేశాలకు విహారయాత్రలకు వెళ్తుంటారు. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం కరోనా ఉంటడంతో.. ఖాళీ సమయాల్లో ఎక్కువగా ప్రయాణాలు చేయకుండా.. ఇంట్లోనే ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు మహేష్. ఇక మహేష్ మరియు నమ్రతలది ప్రేమ వివాహం అన్న విషయం అందరికి తెలిసిందే. ‘వంశీ’ అనే సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు.. ఆ సినిమాతోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎలాంటి విబేధాలు లేకుండా.. అన్యోన్యంగా ఉంటూ.. అదర్శ జంటగా నిలిచారు వీరిద్దరు. ఇక మహేష్‌బాబు సామాజిక సేవా పనులు.. ఇతర వ్యవహారాలు అన్ని నమ్రతనే దగ్గరుండి చూసుకుంటారు. ఆయనకు సంబంధించిన అప్‌డేట్స్ అన్ని ఆమె ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా అందిస్తుంటారు. అయితే తొలిసారిగా మహేష్ మరియు నమ్రతలు కలిసి ఓ ఫోటోషూట్ నిర్వహించారట. ప్రమ

రిపబ్లిక్ ట్విట్టర్ రివ్యూ : సాయి ధరమ్ తేజ్ పర్ఫామెన్స్ హైలెట్

Image
సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్యా రాజేష్, రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి నటీనటులతో లాంటి దర్శకుడు సినిమా తీస్తున్నాడంటే సాధారణ ప్రేక్షకుడికి సైతం అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటి అనే సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ వంటి వాటితో అద్భుతంగా మౌత్ టాక్ తెచ్చుకుంది. ఇక తీరా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో బైక్ ప్రమాదానికి గురయ్యారు. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. హీరో అలా ఉన్నా కూడా.. ఆయన కోరిక, సంకల్పం మేరకు ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. అయితే ఈ మూవీని ఇండస్ట్రీలోని సెలెబ్రిటీలకు ముందుగానే చూపించారు. వారంతా కూడా తేజూ నటనను మెచ్చుకున్నారు. ఇక ఇప్పటికే కొన్ని చోట్ల ప్రివ్యూలు కూడా పడ్డాయి. నెటిజన్లు కూడా రిపబ్లిక్ చిత్రాన్ని వీక్షించినట్టున్నారు. వారు కూడా తేజూ నటన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవా కట్టా విజన్‌ను సాయి ధరమ్ తేజ్ ద్వారా చూపించారు.. తద్వారా ఆయన కెరీర్‌లోనే ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చేట్టు చేశారు. ప్రస్తుతం మన సమాజంలోనే కొన్ని సమస్యలను చూపించారు.. సిస్టింలోని లొసుగులను ఎత్తిచూపారు అంటూ ఓ నెటిజన్ సినిమా గురించి చెప్పుకొచ్చాడు. నువ్ ఈ సిస్టింలో ఉండలేకపోతే.. సిస్

‘గతంలో అలా ఎప్పుడు చూసుండరు..’ ‘అఖండ’లో తన పాత్ర గురించి హీరో శ్రీకాంత్

Image
మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన సినిమాలో హీరోని ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తారో.. విలన్‌ని కూడా అంతే పవర్‌ఫుల్‌గా చూపిస్తారు. ఇక హీరో, విలన్ మధ్య ఉండే డైలాగ్స్, ఫైట్స్ అయితే.. ప్రేక్షకులతో థియేటర్‌లో విజిల్స్‌ వేయిస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా ఇప్పటివరకూ వచ్చిన బోయపాటి సినిమాల్లో హీరోలకు ఎంత క్రేజ్ వచ్చిందో విలన్ పాత్రలు చేసిన నటులకు అంతే క్రేజ్ వచ్చింది. తాజాగా బోయపాటి సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు . గతంలో నాగ చైతన్య నటించిన ‘యుద్ధం శరణం’ అనే సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. కానీ, ఈ సినిమా అంతగా ఆడలేదు. ఇప్పుడు మరోసారి ఆయన బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘’ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి బాలకృష్ణకు సంబంధించిన అప్‌డేట్స్ వచ్చాయి కానీ, శ్రీకాంత్ పాత్రకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. తాజాగా శ్రీకాంత్ నటించిన మరో సినిమా ‘ఇదే మా కథ’. ఈ సినిమాలో భూమిక, సుమంత్ అశ్విన్, తన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. బైక్ రైడింగ్ ఆధారంగా ఈ సినిమా సాగుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇచ

ఆడవాళ్ల గురించి ఆలోచించేదెవరు?.. అంతా అలాంటి వారే.. పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్

Image
ట్వీట్లు, ఆమె వేసే కౌంటర్లు, పరోక్షంగా చెప్పే మాటలు, ఇచ్చే హింట్లు ఎవ్వరికీ అర్థం కావు. ఆమెకు ట్వీట్లు వేయడం, వెంటనే వాటిని డిలీట్ చేయడం అలవాటే. ఆమె గురూజీ అంటూ ట్వీట్లు పరోక్షంగా వేయడం, ఇండస్ట్రీలోని పెద్దలు అంటూ కౌంటర్లు వేయడంతో ఎక్కువగా ఆమె వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అలాంటి పూనమ్ కౌర్ పేరు ఈ మధ్య పంజాబీ అమ్మాయి, నటి అంటూ పోసాని క‌ృష్ణ మురళీ పరోక్షంగా పేరు ఎత్తేశాడు. ఇక పంజాబీ నటి అంటూ ట్విట్టర్ ప్రపంచం మొత్తం పూనమ్ కౌర్‌ను టార్గెట్ చేశారు. ఇక పూనమ్ కౌర్‌ కూడా ఈ విషయంలో పరోక్షంగా స్పందించింది. దాసరి గారు గుర్తుకు వస్తున్నారని, ఆయన్ను మిస్ అవుతున్నాను.. ఇండస్ట్రీలో గురువు అంటే ఆయన ఒక్కరే అని పూనమ్ కౌర్ ఎమోషనల్ అయింది. మరొక పోస్ట్‌లో అత్యాచారం, బాధితురాలు, అంటూ కొన్ని సందేశాత్మక వీడియోలను షేర్ చేసింది. అత్యాచారం చేసిన వాడు సిగ్గుపడాలి కానీ.. నేను ఎందుకు సిగ్గుపడాలి.. నేను ఏం తప్పు చేశాను అంటూ ఓ మహిళ ఆవేదన చెందుతున్న వీడియోను పూనమ్ కౌర్ షేర్ చేసింది. ఇక తాజాగా మరోసారి అలాంటి ఓ నర్మగర్భంగా ఉన్నటువంటి ట్వీట్ వేసింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ట్వీట్ వేసిందో సరిగ్గా అర్థం కావడం లేదు. కానీ ఆ

భార్య వియోగం ఎంతో దుర్భరం.. నటుడు ఉత్తేజ్‌ భార్య సంస్మరణ సభలో మెగాస్టార్

Image
టాలీవుడ్ నటుడు ఉత్తేజ్‌ ఇంట కొద్ది రోజుల క్రితం తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన సతీమణి పద్మావతి ఈ నెల 13వ తేదీన క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనతో సహా ఆయన కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే పద్మావతి మరణించిన సమయంలో ఉత్తేజ్‌ను ఓదార్చేందుకు సినీ ప్రముఖులు ఎందరో తరలి వచ్చారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్లు భగవంతుడిని ప్రార్థించారు. ఇక ఉత్తేజ్‌ను తన సోదరుడిగా భావించే మెగాస్టార్ కూడా వెళ్లి.. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. చిరంజీవిని చూడగానే.. ఉత్తేజ్ తన బాధని ఆపకోలేకపోయారు. ఆయన్ని గట్టిగా పట్టుకొని బోరున విలపించారు. ఉత్తేజ్ కుమార్తె కూడా చిరంజీవి భుజంపై వాలి పెదనాన్న పెదనాన్న అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. అయితే గురువారం (సెప్టెంబర్ 30) నాడు పద్మావతి సంస్మరణ సభ హైదరాబాద్‌లోని ఫిలిమ్ నగర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై.. పద్మావతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమెకు నివాళులు అర్పించారు. మెగాస్టార్‌ని చూడగానే ఉత్తేజ్ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి.. తన సందేశాన్ని తెలియజేశారు. అన్ని విధ

రాజు తలుచుకుంటే, వరాలకు కొదవా?.. సీఎంపై అల్లు అరవింద్ కామెంట్స్

Image
ప్రస్తుతం టాలీవుడ్, ఏపీ ప్రభుత్వం మధ్య జరుగుతున్న వివాదాలు, నెలకొన్న సమస్యల అందరికీ తెలిసిందే. ఆన్ లైన్ టికెటింగ్ విధానం, వంద శాతం ఆక్యుపెన్సీ, రోజూ మూడు ఆటలే అనే విధానం మీద చర్చలు జరుగుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కామెంట్లతో ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కి పడింది. ఏపీ ప్రభుత్వం మీద, మంత్రుల మీద చేసిన కామెంట్లకు అందరూ షాక్ అయ్యారు. ఇండస్ట్రీకి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధం లేదని నిర్మాతలు కూడా ప్రకటించారు. అలా మొత్తానికి కొందరు నిర్మాతలు, మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. అలా ఓ వైపు జరుగుతూనే ఉంది. అయితే తాజాగా అఖిల్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌‌లో మాట్లాడారు. తమ పరిస్థితిని అర్థం చేసుకోండని ఏపీ సీఎం జగన్‌కు అల్లు అరవింద్ విన్నవించుకున్నారు. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌కు ఇది మొదటి ఫంక్షన్‌. దీని తర్వాత ప్రీరిలీజ్‌ వేడుక, విడుదలైన తర్వాత సక్సెస్‌మీట్‌ తప్పకుండా ఉంటుందని అన్నాడు. గీతాఆర్ట్స్‌లో విజయవంతమైన చిత్రాలు మేము కాదు ఇచ్చింది.. ప్రేక్షకులు మాకు ఇచ్చారని, తెలుగు ప్రేక్షకుల గొప్పదనాన్ని చెప్పాడు. మన వాళ్లను చూసి బాలీవుడ్ వాళ్లు కూడా సినిమాలు విడ

టుడే ఇన్‌స్టా హిట్స్: సునీత నవ్వులు.. రాశీ హోయలు.. రెటిరో లుక్‌లో అవికా

Image
నవ్వులతో మురిపిస్తున్న ఏ పాట అయినా సరే.. తన మధుర స్వరంగా ప్రేక్షకులను మంత్రముద్గుల్ని చేయడంలో సింగర్ సునీత ముందుంటారు. ఎన్నో సంవత్సరాలుగా తన గానామృతంతో ఆమె తెలుగు వారిని అలరిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో సునీత చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా తన నవ్వులతో మురిపిస్తూ... కొన్ని పిక్స్ షేర్ చేశారు ఆమె. అతనిపై పంచ్ వేసిన భాను యాంకర్‌గా ప్రేక్షకులకు పరిచయమై.. ఇప్పుడు వెండితెరపై తన భవిష్యత్తును పరీక్షించుకొనేందుకు రెడీ అవుతోంది భాను శ్రీ. ఇక బిగ్‌బాస్ షో తర్వాత ఈ భామకు మరింత పాపులారిటీ పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె ‘నల్లమల్ల’ అనే సినిమాలో నటిస్తోంది. అయితే సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటే భాను.. తాజాగా తన హెయిర్‌స్టైలిస్ట్‌తో కలిసి పన్నీగా ఓ రీల్ చేసి.. దాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. స్టైలిష్ లుక్‌లో రాశీ హోయలు.. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. అనతికాలంలోనే దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి రాశీ ఖన్నా. ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు.. బాలీవుడ్ సినిమాతో కూడా ఈ భామ బిజీగా ఉంది. తాజాగా స్టైలిష్‌లుక్‌లో హోయలు పోతూ.. కొన్ని పిక్స్‌ని పంచుకుం

‘నల్లమల’ టీజర్‌.. అసూయ పడ్డాను అంటూ దేవా కట్టా కామెంట్స్

Image
బిగ్ బాస్ షోతో , బాగానే ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ ఇంట్లో స్నేహితుల్లా మారిన ఆ ఇద్దరూ ఇప్పుడు హీరో హీరోయిన్లుగా మారారు. అంటూ ఈ ఇద్దరూ ఇప్పటికే దుమ్ములేపేశారు. ఏమున్నవే పిల్ల ఏమున్నవే అంటూ ఒకే ఒక్క పాటతో నల్లమల సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశాడు. అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రవి చరణ్ ‌దర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్‌ను తాజాగా దర్శకుడు దేవా కట్టా విడుదల చేశాడు. ఈ ఈవెంట్‌కు రావడం అంత ఇష్టం లేకపోయినా వచ్చాను అని అసలు విషయం చెప్పేశాడు. అయితే టీజర్‌లో అమిత్ చెప్పిన డైలాగ్స్, చివర్లో పులి ఉండే షాట్ బాగుంది. ఏమున్నవే పిల్లా అనే పాటను తన ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్ సమయంలో విన్నాను అని, అలాంటి పాట నాకు ఎందుకు లేదు అని అసూయ పడ్డానంటూ దేవా కట్టా చెప్పుకొచ్చాడు. అయితే ఈ చిత్రంలో అద్భుతమైన నటీనటులున్నారని దేవా కట్టా అన్నాడు. ఇక దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ సినిమా గురించి ఓ రెండు విషయాలు చెబుతానని అన్నాడు. అడవిని అడవి తల్లి.

Most Eligible Bachelor : 9 వేల రాత్రులు కలిసి పడుకోవాలి.. అదరగొట్టేసిన పూజా

Image
అక్కినేని, కలసి నటించిన ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలైంది. అందులో ‘9 వేల రాత్రులు కలిసి పడుకోవాలి, వందల వెకేషన్స్, కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి.. అలాంటి పార్ట్నర్ ఎక్కడ ఉంటాడు’.. ‘నీకు ఎలాంటి అమ్మాయి కావాలి.. పెళ్లి అంటే ఏంటో కూడా తెలీదు’.. ‘నేనూ ఒకప్పుడు ఆ చీకటి నుంచి వెలుతురుకు వచ్చాను..ఓ హోప్‌ను పట్టుకుని.. ఆ హోప్‌ను పట్టుకోవడం పట్టుకోకపోవడం అనేది నీ ఇష్టం’, లోకం సర్దుకుపోమంటుంది.. మందను వదిలి.. కొత్త దారి వెతికి నేను వెళ్తున్నా.. మీరూ రండి’ అనే డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక ఈ చిత్రం విడుదల కోసం ఎన్ని రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. కరోనా దెబ్బ మీద దెబ్బ కొడుతుండటంతో వాయిదాలు పడుతూనే వచ్చింది. అలా వాయిదాలు పడుతున్న ప్రతీసారి సినిమాను మరింత మెరుగ్గా దిద్దినట్టు కనిపిస్తోంది. డబ్బింగ్ పనులు కూడా ఈ మధ్యే ముగిశాయి. ఇక పూజా హెగ్డే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడంతో ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే పూజా హెగ్డే, అఖిల్ మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో చాలా మంది హీరోయిన్లు కనిపిస్తున్నారు. ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్

‘‘రిపబ్లిక్’ సినిమా చూశాను.. ఆ ప్రార్థనల ఫలితమే తిరిగొచ్చింది..’ హీరో నాని కామెంట్స్

Image
హీరో హీరోగా దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘’. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై భారీ రేంజ్‌లో భగవాన్, జె.పుల్లారావు నిర్మించారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 1న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో సినిమా విడుదల వాయిదాపడుతుంది అని అంతా భావించారు. సాయి ధరమ్ పూర్తిగా కోలుకొనే వరకూ సినిమాను విడుదల చేయరు అని అంతా అనుకున్నారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ.. సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు అయి సాయి ధరమ్ తేజ్‌కు తమ మద్దతు తెలిపారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో కూడా ఈ సినిమాకు తన మద్దత

కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నా.. చిరంజీవి ఎమోషనల్

Image
మెగాస్టార్ తన మేనళ్లుడు రిపబ్లిక్ సినిమా గురించి బాగానే తాపత్రయపడుతున్నాడు. సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం జరగడం, ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాడు. కొందరు కోమాలోనే ఉన్నాడని అంటే.. ఇంకొందరు అయితే మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. అలా తేజూ ఆరోగ్య పరిస్థితి మీద గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడని, త్వరగా కోలుకుంటున్నాడని నాగబాబు చెప్పేశాడు. అయితే సాయి ధరమ్ తేజ్ చిత్రం అక్టోబర్ 1న విడుదల కాబోతోంది. ఈ మేరకు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను పూర్తి చేసేసింది. దర్శకుడు, హీరోయిన్ ఇలా అందరూ మీడియా ముందుకు వచ్చారు. మెగా హీరోలు కూడా సాధ్యమైనంత వరకు రిపబ్లిక్ చిత్రాన్ని ముందకు తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ సెలెబ్రిటీలకు స్పెషల్ షో వేసినట్టు తెలుస్తోంది. తాజాగా చిరంజీవి రిపబ్లిక్ సినిమా గురించి ఓ పోస్ట్ పెట్టేశాడు. ‘సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ అందరి ఆశీస్సులు రిపబ్లిక్ చిత్ర విజయం రూపంలో అందుతాయని ఆశిస్తూ, ఆ చిత్ర యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన సినిమా ఎగ్జిబిషన్ సెక్టార్‌కి ‘రిపబ్లిక్’ చిత్ర విజ

సినీపరిశ్రమలో మరో విషాదం.. తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్

Image
గత ఏడాదిన్నర కాలంగా సినిమా, టీవీ పరిశ్రమల్లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. యువ హీరోలు, హీరోయిన్లు.. వివిధ కారణాల వల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. అయితే ఇందులో ఎక్కువశాతం మంది ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడవటం తీవ్ర బాధకు గురి చేస్తోంది. తాజాగా కన్నడ సినీ పరిశ్రమలో కూడా ఇలాంటి విషాదకర ఘటనే చోటు చేసుకుంది. కన్నడ టీవీ నటి బెంగళూరులోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుంది. కుంబల్గోడు ప్రాంతంలోని ఆమె అపార్ట్‌మెంట్‌లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె చాలా సమయం వరకూ ఆమె తలుపు తెరుచుకోకపోవడంతో.. బలవంతంగా ఆమె అపార్డ్‌మెంట్ తలుపులు బద్దతుకొట్టి లోపలికి వెళ్లిన వారికి ఆమె విగతజీవిగా కనిపించింది. దీంతో పాటు ఆమె రాసిన నాలుగు పేజీల.. సూసైడ్ నోట్ కూడా దొరికింది. అయితే ఆమె రాసిన సూసైడ్ నోట్‌లో తన చావుకి ఎవరు కారణం కారు అని.. వ్యక్తిగత కారణాల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది. ఇంగ్లీష్, కన్నడ భాషల్లో రాసిన సూసైడ్ నోట్ ద్వారా పోలీసులు ప్రాధమిక విచారణ ప్రారంభించారు. ఆమె తోటి నటీనటులు, కుటుంబ సభ్యులను వాళ్లు విచారిస్తున్నారు. ముఖ్యంగా తన కుటుంబసభ్యులను ‘క్షమించండి’ అంటూ

Pawan Kalyan: పవన్ పర్సనల్‌గా ఎందుకు తీసుకుంటున్నారు.. అది ఖచ్చితంగా మూర్ఖత్వమే: తమ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు

Image
‘రిపబ్లిక్’ సినిమా ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు.. అటు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ ఇష్యూ‌పై ఇప్పటికే జనసేన వర్సెస్ వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, దర్శకులు, నిర్మాతలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని ఫిల్మ్ ఛాంబర్‌కి కానీ ఇండస్ట్రీకి సంబంధం లేదని ఫిల్మ్ ఛాంబర్ స్పందిస్తూ అధికారిక ప్రెస్ నోట్ రిలీజ్ చేయగా.. మరికొంత మంది సినీ పెద్దలు మౌనం వహిస్తున్నారు. ఇక దిల్ రాజు మరికొంత మంది సినీ పెద్దలు అయితే పవన్ కళ్యాణ్ ఎవర్ని అయితే సన్నాసి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి మాట్లాడారో ఆయన్నే (మంత్రి పేర్నినాని) వెళ్లి కలిశారు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని తప్పుబట్టడం ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశంగానే అనిపించింది. మొత్తంగా సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ ఇష్యూపై సీనియర్ దర్శక, నిర్మాత స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికలు ఇప్పుడే హాట్ కాదు.. ఇంతకు ముందు కూడా ఇదే హీట్‌తో నడిచాయి. ఈసారి కూడా కాస్త ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. పైగా

నా ఊపిరి పోయేంత వరకు వారితోనే ఉంటా.. మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్ వైరల్

Image
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. నాగబాబు వేసే కౌంటర్లకు మీమర్లు సైతం షాక్ అవుతుంటారు. అలా నాగబాబు తనలో నిద్రపోతోన్న మీమర్‌ను అప్పుడప్పుడూ పైకి లేపుతుంటాడు. తనలో ఉన్న ఆ కోరిక, ఆశే మీమర్లను సైతం కలిసేలా చేసింది. వారిని స్పెషల్‌గా ఇంటికి పిలిపించుకుని మరీ ముచ్చటించాడు. లైవ్‌లోనూ వారితో మాట్లాడాడు. తాజాగా నాగబాబు తన ఇన్ స్టాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ పెట్టేశాడు. దానిలో భాగంగా నాగబాబు తన మేధాశక్తికి పదును పెట్టేశాడు. అందరికీ కౌంటర్ల మీద కౌంటర్లు వేశాడు. ఇక పోసాని చేసిన కామెంట్ల మీదా తన స్టైల్లో స్పందించారు. గురించి గతంలో పోసాని చెప్పిన మంచి విషయాలు, గొప్పగా మాట్లాడిన వీడియోలను షేర్ చేశాడు. అలా నెటిజన్లు రకరకాల వివాదాలపై నాగబాబును ప్రశ్నలు అడిగారు. ఇక ఓ నెటిజన్ అయితే ఏకంగా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదంటే ఎలా మాస్టారు? ప్రజలకు ఎలా సేవ చేస్తారు? అని అడిగాడు. దానికి నాగబాబు తన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. తన సోదరుల మీదున్న ప్రేమను అందరికీ తెలిసేలా చేశాడు. ‘అంటే పాలిటిక్స్‌లో ఉండేనే ప్రజలకు సేవా చేయాలి.. లేదంటే చేయకుండా ఉండాలి అంతేగా. అరరే పెద్ద స

బికినీ ఫోటో షేర్ చేయమన్న నెటిజన్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన అనుపమ

Image
కేరళ బ్యూటీ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. అ ఆ, శతమానంభవతి వంటి చిత్రాలతో అందరినీ కట్టిపడేసింది. హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా అనుపమ మారిపోయింది. అనుపమ ఎప్పుడూ కూడా అందాల ప్రదర్శకు చాన్స్ ఇవ్వదు. చీరకట్టులో కనిపించే అనుపమ.. అప్పుడప్పుడు మోడ్రన్ దుస్తుల్లోనూ మెరుస్తుంటుంది. కానీ ఎప్పుడూ కూడా తన శరీర భాగాలను ప్రదర్శించదు. అలా అనుపమ కట్టూబొట్టూ అంటే అభిమానులకు ఎంతో ఇష్టం. అయితే అనుపమ చీరకట్టుకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇక అనుపమ తన అభిమానుల కోసం ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. ఇక ఆమె పెట్టే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతుంటుంది. తాజాగా ఆమె అలాంటి ఓ సెషనే ఇన్ స్టాలో పెట్టేసింది. అందులో నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు. అయితే అందులో దాదాపు రెగ్యులర్ క్వశ్చన్స్ ఉన్నాయి. తెలుగులో చేస్తోన్న ప్రాజెక్ట్‌లు ఏంటి? కొత్త సినిమాలు ఏంటి? ఏం ఇష్టం.. ఏం చేస్తున్నారు.. తమిళం, తెలుగులో మాట్లాడండి అని ఇలా రకరకాలుగా నెటిజన్లు ప్రశ్నలు సంధించారు. అయితే ఓ నెటిజన్ మాత్రం చిరాకు తెప్పించినట్టున్నాడు. బికినీలో ఉన్న ఫోటోను పంపు అని అడిగేశాడు. దీన

జనసేన.. పావలా గాడు అంటూ శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఉరేసుకుంటావో, చస్తావో నీ ఇష్టం! అటాక్

Image
అనే పేరు వింటేనే అంతెత్తున లేచే శ్రీ రెడ్డి.. మరోసారి సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపింది. వైసీపీ కార్యకర్త, సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడుమ మాటల తూటాలు పేలుతున్న ఈ సమయంలో సంచలన తార రంగంలోకి దిగింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు కాస్త బ్రేక్ ఇచ్చి దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసి నెట్టింట వీరంగం సృష్టించింది. ఈ వీడియోలో శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. ''ఈ పావలా గాడికి ఏం ప్యాకేజ్ అందిందో తెలియదు గానీ.. ప్రతిసారి ఎనకాల జనసేన గుర్తు వేసుకొని ఓ సభ లాంటిది పెట్టి.. ఒక నలుగురు ఆడ పిల్లలను ముందు సీట్లలో కుర్చోబెట్టుకొని, పది మంది ఈలలు వేసే బ్యాచులను డబ్బులిచ్చి పిలిపించుకొని... నీ వెనకాల తెలంగాణాలో ఓ యూనివర్సిటీలో నువ్వు ఎవ్వరిని పోషిస్తున్నావో, ఏ అల్లరి మూకని, చిల్లర మూకని నువ్వు పోగుచేసి బ్లాక్ మెయిల్ చేయడానికి మెయిన్‌టైన్ చేస్తున్నావో ఆ గ్రూపులను వాళ్ళ పేర్లతో సహా నేను బయటపెడతా. నువ్వు చిల్లర మూకలతో ఎలా అయితే దాడులు చేపిస్తున్నావో అవి మేము చేయించలేమా? అలాంటివి మేము చేయించాలంటే పెద్ద విషయమా? కోడి కత్తులంటావు కాసేపు.. వేల కోట్లంటావు క

మొదటి సినిమాకు అంతే.. జానీకి అలా.. అల్లు అరవింద్‌పై పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్

Image
పవర్ స్టార్ రెమ్యూనరేషన్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రిపబ్లిక్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఒకరికి పది కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారనుకోండి అంటూ అనేశాడు. అందులో ట్యాక్సులు కూడా పోతాయంటూ ఏదో లెక్కలు చెప్పేశాడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి హాట్ టాపిక్ అవుతోంది. ఇక పోసాని మురళికృష్ణ చేసిన కామెంట్లు కూడా నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. యాభై కోట్లు అంటూ పోసాని అసలు విషయం చెప్పేశాడు. అయితే యాభై కోట్లు తీసుకుంటాడు అంటూ.. నిర్మాతల వ్యవహారంలోకి దూరుతాడు అంటూ పవన్ కళ్యాణ్ మీద పోసాని కామెంట్లు చేశాడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కూడా తన రెమ్యూనరేషన్‌ల గురించి మాట్లాడుతూ అసలు విషయం చెప్పుకొచ్చాడు. తన మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్ గురించి తెలిపాడు. ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవహారం తాను మాట్లాడితే తనకు ఏం లాభం రాదు అని తాను మాట్లాడింది నిర్మాత, థియేటర్ల ఓనర్ల కోసమే అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశాడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో గురించి చెప్పేశాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి సినిమాకు నెలకు ఐదు వేల రూ

అఖిల్ సినిమాపై ఆసక్తి రేపుతున్న మరో అప్‌డేట్.. తొలిసారిగా అలాంటి పాత్రలో పూజా

Image
‘’.. సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కేయాలని కుతూహలంగా ఉన్నాడు అక్కినేని వారసుడు అఖిల్. ఈ మేరకు యంగ్ హీరోయిన్ పూజా హెగ్డేతో జతకలిసి ఈ సినిమాకు సంబంధించిన రొమాంటిక్ అప్‌డేట్స్ ఇస్తూ అట్రాక్ట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ నుంచి విడుదల అయిన ‘లెహరాయి’ లిరికల్ సాంగ్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాటలో అఖిల్, పూజా హెగ్డేల మధ్య కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ గురించి కూడా అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం సాయంత్రం 6.10 గంటలకు విడుదల అవుతుందంటూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్‌గా ఓ విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే.. సినిమాలో పాత్రకు సంబంధించిన వార్త. ఈ సినిమాలో పూజా వర్క్ ఎలా ఉంది తన రోల్ ఏంటి? ఎలా కష్టపడింది అన్న వాటిపై అఖిల్ మరియు దర్శకుడు లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. పూజా ఈ సినిమాలో ఒక స్టాండప్ కమెడియన్ రోల్‌లో కనిపిస్తుందని భాస్కర్ తెలిపారు. అయితే ఆమె.. ఎంతో వర్క్ విషయంలో చాలా ఏకాగ్రతతో ఉంటుంది అని.. మనస్పూర్తిగా ఈ సినిమాలో ఆమె నటించింది అంటూ అఖిల్.. పూజాపై ప్రశంసల వర్షం కుర

పిల్లల్నికనే ప్లాన్‌లో సమంత-నాగ చైతన్య.. రూమర్లకు చెక్ పెడుతూ కీలక నిర్ణయం!!

Image
హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ఏం మాయ చేశావే’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ జంట.. ఆ సినిమాతోనే ప్రేమలో పడ్డారు. ఇక చాలాకాలం ప్రేమలో మునిగి తేలిన వీళ్లు.. 2017లో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆ తర్వాత కూడా వాళ్లిద్దరు జంటగా పలు సినిమాల్లో నటించి.. ప్రేక్షకులను అలరించారు. అయితే గత కొంతకాలంగా మాత్రం వీరిపై విపరీతంగా రూమర్లు పుట్టుకొచ్చాయి. కొంతకాలం క్రితం సమంత తన సోషల్‌మీడియా ఖాతాల్లోంచి ‘అక్కినేని’ అనే పదాన్ని తొలగించి కేవలం ‘ఎస్’ అనే అక్షరాన్ని పెట్టుకుంది. దీంతో సమంత, నాగ చైతన్యలు విడాకులు తీసుకుంటున్నారు అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక ఇటీవల విడుదల అయిన నాగ చైతన్య సినిమా ‘లవ్‌స్టోరి’ సినిమా ప్రీ రిలీజ్, సక్సెస్ వేడుకలకు సమంత హాజరు కాకపోవడంతో.. ఈ వార్తలకు మరింత ఊతాన్నిచ్చాయి. అంతేకాక.. సమంత, చైతన్యకు విడాకులు ఇచ్చి.. ముంబైకి షిఫ్ట్ అవుతుంది అని కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై సమంత కొద్ది రోజుల క్రితం సమంత క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్ తనకు ఇళ్లు వంటిది అని.. దాన్ని వదిలి ఎక్కడకు వెళ్లను అంటూ అంటూ ఆమె స్పష్టం చేసింది. తాజ

పవన్ కళ్యాణ్‌ని చెప్పుతో కొట్టగలను.. మహా అయితే చంపుతారు అంతే కదా! రాళ్లదాడి అనంతరం పోసాని రియాక్షన్

Image
హైదరాబాద్ అమీర్ పేట్‌లోని ఎల్లారెడ్డిగూడలో ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడటం కలకలం సృష్టించింది. నిన్న (బుధవారం) అర్ధరాత్రి సమయంలో కొందరు ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు. పోసానిని దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. పోసాని Vs పవన్ కళ్యాణ్ మాటల యుద్ధం నడుస్తున్న ఈ తరుణంలో పోసాని ఇంటిపై రాళ్ళ దాడి జరగడం సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ దాడిపై పోసాని రియాక్ట్ అవుతూ తన ఇంటిపై రాళ్లదాడి చేసింది పవన్‌ కళ్యాణ్ అభిమానులేనని ఆరోపించారు. ఏం జరిగినా తనకైతే ఎలాంటి భయం లేదని అన్నారు. ''నాకు నచ్చిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు.. నేను చచ్చిపోయే వరకు జగన్ తోనే ఉంటా. గొప్ప ప్రజాసేవకుడైన జగన్ గారిని అరేయ్, ఒరేయ్ అనడం సరికాదు. పవన్ కళ్యాణ్‌వి మొదటి నుంచి సైకో బుద్ధులే. ఆయన ఎవ్వరినైనా ఏమైనా అనొచ్చు కానీ ఆయన్ను మాత్రం ఎవ్వరూ ఏమనకూడదు. తన సినిమా షూటింగుల్లో కూడా ఆవేశానికి లోనై అందరికీ కొట్టడం పవన్‌కి అలవాటు. మొదటినుంచి ఆయనది రెచ్చగొట్టే ధోరణి. ఇలాంటోడు రాజకీయాలకు పనికిరాడు. నాయకుడు ఎలా ఉంటాడో కార్యకర్తలు కూడా అలాగే ఉ

పోసాని దంపతులపై బండ బూతులు.. దొరికితే చంపేస్తాం అంటూ బెదిరింపులు.. కీలక విషయాలు చెప్పిన వాచ్‌మెన్

Image
సినీ రచయిత, వైసీపీ కార్యకర్త పోసాని కృష్ణ మురళి- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేదికపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన రచ్చ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు పోసాని. దీంతో క్రమంగా ఈ ఇష్యూ వ్యక్తిగత దూషణ వరకు వెళ్లింది. తన భార్యాపిల్లలను లాగుతూ పవన్ ఫ్యాన్స్ ఇష్టారీతిలో కామెంట్స్ చేస్తున్నారని పోసాని ఆరోపిస్తున్న తరుణంలో ఆయన ఇంటిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ అమీర్‌పేటలోని ఎల్లారెడ్డి గూడలో ఉన్న పోసాని ఇంటిపై కొందరు దాడికి పాల్పడ్డారు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఆయన ఇంటిపై రాళ్లు, ఇటుకలు విసిరారు. పోసాని దంపతులను బండ బూతులు తిడుతూ పోసాని ఇంటి పరిసరాల్లో తిరిగారు. ఈ విషయాన్ని పోసాని ఉంటున్న ఇంటి వాచ్‌మెన్ చెప్పారు. వారిని చూసి భయంతో తాము బయటకు రాలేదని వాచ్‌మెన్ తెలిపారు. పోసాని కృష్ణమురళి ఇంట్లో గత పదేళ్లుగా పని చేస్తున్నామని, అయితే పోసాని దంపతులు గత 8 నెలలుగా ఇక్కడ ఉండటం లేదని వాచ్‌మెన్ చెప్పారు. తాము తెలిసిన

బ్రేకింగ్: పోసాని ఇంటిపై రాళ్లదాడి.. అర్ధరాత్రి రెచ్చిపోయిన దుండగులు

Image
సినీనటుడు ఇంటిపై బుధవారం కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అమీర్‌పేటలోని ఎల్లారెడ్డిగూడలో ఉన్న ఆయన నివాసంపై మంగళవారం అర్ధరాత్రి కొందరు రాళ్లు విసిరారు. అంతేకాకుండా పోసానిని దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. ఈ ఘటనతో వాచ్‌మెన్ కుటుంబం భయాందోళనకు గురయ్యారు. ఎల్లారెడ్డిగూడలో పోసానికి ఇల్లుంది. అయితే 8 నెలలుగా ఆయన కుటుంబంతో సహా వేరే చోట నివాసముంటున్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో వాచ్‌మెన్ కుటుంబం నివాసముంటోంది. Also Read: గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా రాళ్లదాడికి పాల్పడటంతో వాచ్‌మెన్ కుటుంబం భయాందోళనకు గురైంది. ఈ ఘటనపై బుధవారం వారు ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. రాళ్లదాడిని తాము ప్రత్యక్షంగా చూశామని కొందరు స్థానికులు చెబుతున్నారు. పోసాని ఇంట్లో ఉన్నారనుకునే దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సినీ టిక్కెట్ల విషయమై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం విమర్శలు చేయడంపై పోసాని తీవ్రస్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం పోసాని, జనసేన కార్యకర్తల మధ్య యుద్ధంగా

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై థమన్ అప్‌డేట్.. ‘అతనికి థాంక్స్’ అంటూ ట్వీట్

Image
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు . కామెడీ, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లో ఆయన నటనతో ప్రేక్షకులను అలరిస్తారు ఆయన. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఈ నెల 10వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. ఐకియా-కేబుల్‌బ్రిడ్జ్ దాటిన త‌ర్వాత మైండ్‌స్పేస్ జంక్ష‌న్ ప్రాంతంలో సాయితేజ్ ప్ర‌యాణిస్తున్న బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్లు ఆయన్ని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం జరిగింది అని తెలియగానే మెగా ఫ్యామిలీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అంటూ వాళ్లు కంగారు పడ్డారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు.. ఇతర కుటుంబ సభ్యులు ఆయన్ని వెళ్లి పరామర్శించి.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్పారు. ఆ తర్వాత వైద్యులు ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించి.. సాయి ధరమ్ కాలర్ బోన్‌ విరిగిందని.. దానికి శస్త్ర చికిత్స చేశామని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు సాయి ధరమ్ ఆరోగ్యం గురించి వాళ్లు అభిమానులుకు అప్‌డేట్స్ ఇస్తున్నారు. అయితే తాజాగా మ్యూ

వావ్! బండ్ల గణేష్.. ప్రచారంలో కూడా వెరైటీ.. ప్రకాష్ రాజ్ ట్వీట్‌ని భలే వాడేశాడే!!

Image
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు హంగామా షురూ అయింది. అక్టోబర్ 10వ 'మా' ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. అధ్యక్ష పోటీలో ఉన్న మంచు విష్ణు, , సీవీఎల్ నరసింహా రావు తమ తమ ప్యానల్ సభ్యులతో సహా విచ్చేసి నామినేషన్స్ నమోదు చేశారు. ఇక 'మా' జనరల్ సెక్రటరీ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూడా తన నామినేషన్ వేసి ప్రచార రథం చేపట్టారు. అయితే ప్రచారంలో కూడా ఆయన చూపుతున్న విలక్షణత పలువురి దృష్టిని లాగేస్తోంది. తమ ప్యానల్‌కు ఓటు వేయాలని అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా కోరుతూ తన ప్యానల్ వివరాలతో కూడిన పోస్టర్ షేర్ చేశారు. ఈ మేరకు మా హితమే.. మా అభిమతం.. మనస్సాక్షిగా ఓటేద్దాం.. మా ఆశయాలను గెలిపిద్దాం అంటూ చేతులు జోడించిన ఎమోజీలను షేర్ చేశారు. దీంతో ఈ ట్వీట్ చూసిన బండ్ల గణేష్ దాన్నీ రీ- ట్వీట్ చేస్తూ వెరైటీ చాటుకున్నారు. ఓన్లీ వన్ ఓట్ ఫర్ బండ్ల గణేష్ ఫర్ జనరల్ సెక్రటరీ అంటూ చేతులు జోడించిన ఎమోజీని షేర్ చేస్తూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్‌నే రీ ట్వీట్ చేశారు బండ్ల గణేష్. దీంతో ఇది చూసి బండ్లన్న.. ప్రకాష్ రాజ్ ట

Love Story: ముద్దు సీన్‌పై సాయి పల్లవి క్లారిటీ.. అలా కానిచ్చేశారు! అసలు విషయం రివీల్

Image
అక్కినేని వారసుడు, యంగ్ హీరో నాగ చైతన్యతో కలిసి చిందులేసే అవకాశాన్ని పర్ఫెక్ట్‌గా వాడుకుంది. 'లవ్ స్టోరీ' సినిమాలో తనదైన స్టెప్పులతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయి థియేటర్స్‌లో ఈలల మోత మోగించింది. వెండితెరపై నాగ చైతన్య- సాయి పల్లవి కెమిస్ట్రీ చూసి మురిసిపోయారు తెలుగు ప్రేక్షకులు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీని శేఖర్ కమ్ముల తెరకెక్కించిన విధానం, అక్కడక్కడా షూట్ చేసిన రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ఆడియన్స్‌ని మైమరిపించాయి. కమర్షియల్ హంగులు, భారీ యాక్షన్ సీన్లు, పెద్ద హీరోల జోలికి పోకుండా తనదైన శైలిలో సినిమాలు చేసే శేఖర్ కమ్ముల.. లవ్ స్టోరీతో అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. తన రెగ్యులర్ పంథానే ఫాలో అవుతూ క్లాస్, మాస్ ఆడియన్స్ దృష్టిని లాగేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ముందునుంచి చర్చల్లో నిలుస్తున్న అంశం నాగ చైతన్య- సాయి పల్లవి . నిజానికి ముద్దు సీన్లంటే ఎంతో దూరం ఉండే సాయి పల్లవి ఈ కిస్ ఎలా ఒప్పుకుంది? అనే టాక్ జనాల్లో ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. అయితే తాజాగా దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చేసింది సాయి పల్లవి. తాను నాగ చైతన్యను ముద్దు పెట్టుకోలేదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఇలాంటి సన్నివేశాల్లో న

ఇది జీవితాంతం గుర్తు పెట్టుకునే జ్ఞాపకం.. దీనంతటికీ మీరే కారణం!! నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్

Image
అక్కినేని నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది 'లవ్ స్టోరీ' సినిమా. కరోనా తర్వాత థియేటర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అనే సందేహాలకు తెర దించుతూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. విడుదలైన అన్ని సెంటర్లలో క్లాస్, మాస్ ఆడియన్స్ మనసు దోచుకుంటూ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ బ్యూటిఫుల్ చూసిన పలువురు సినీ ప్రముఖులు చైతూ, సాయి పల్లవి నటనపై ప్రశంసలు గుప్పించారు. ఈ విజయంతో ఇటు నటీనటులతో పాటు అటు సాంకేతిక వర్గం ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా 'లవ్ స్టోరీ' సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్రయూనిట్.. సక్సెస్ సంబరాలు జరుపుకుంది. , సాయి పల్లవి సహా ఈ చిత్రంలో భాగమైన నటీనటులు, దర్శక నిర్మాతలు అంతా కలిసి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ మేరకు అంతా కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఒదిగిపోయి నవ్వులు చిందించారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ పిక్‌ని తన ట్విట్టర్ వేదికగా పంచుకున్న నాగ చైతన్య.. ''లవ్ స్టోరీ టీమ్ మొత్తానికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీరంతా కలిసి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఇచ్చారు'' అని పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట క్షణాల్ల

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జీవిత ఓపెన్ కామెంట్స్.. బండ్ల గణేష్ భయపడుతున్నారంటూ షాకింగ్ రియాక్షన్

Image
'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ వేదికపై మాట్లాడిన తీరు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఇష్యూ మొదలుకొని, ఏపీ ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడుతూ పవన్ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ వర్గాలు భగ్గుమన్నాయి. పవన్ మాట్లాడిన మాటలను తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ కార్యకర్తలు. ఇక పోసాని ఎంటర్ కావడంతో పరిస్థితి మరో స్టేజికి వెళ్ళింది. వ్యక్తిగత దూషణలతో రచ్చ క్రియేట్ అయింది. ఇలాంటి పరిస్థితుల నడుమ ఆ రోజు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ తన అభిప్రాయం బయటపెట్టారు. సినిమా వేరు.. రాజకీయం వేరు అంటూ 'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ వేదికపై పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరుపై జీవిత స్పందించారు. పవన్ కళ్యాణ్ ఓ పొలిటీషియన్, ఆయనకు ఓ పార్టీ ఉంది.. అలాగే ఆయన ఓ హీరో అని చెప్పిన జీవిత.. ఆయన రాజకీయాల్లో ఉండొచ్చు కానీ మా వరకు ఆయన హీరో మాత్రమే అన్నారు. ఓ హీరోగా పవన్ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని, నిర్మాతలకు, ఇండస్ట్రీకి సాయపడుతూ ఆయన అందరితో ఉంటారని చెప్పారు. సినిమాల పరంగా అయితే పవన్‌తో ఎలాంటి ఇష్యూస్ లేవని జీవిత అన్నారు. అయితే ఓ రాజకీ

పవన్ ఎఫెక్ట్.. పేర్నినానితో కలిసి దిల్ రాజు ప్రెస్ మీట్.. ఆసక్తికర పరిణామంతో కీలక వ్యాఖ్యలు

Image
రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. ఇక ఆ ప్రసంగంలో కులాన్ని కూడా ఎత్తి చూపాడు పవన్ కళ్యాణ్. దిల్ రాజు రెడ్డి అంటూ పదే పదే అన్నాడు. పవన్ కళ్యాణ్ స్పీచ్ కొనసాగుతున్న సమయంలో దిల్ రాజు కొన్ని సార్లు పగలబడి నవ్వేశాడు. ఇంకొన్ని సార్లు ముభావంగా ఉన్నాడు. అయితే దిల్ రాజు పరిస్థితిపై ఆ తరువాత మంత్రి కౌంటర్లు కూడా వేశాడు. కక్క లేక మింగ లేక ఉన్నట్టుందని దిల్ రాజు మీద నాని సెటైర్లు వేశాడు. అయితే తాజాగా మంత్రి పేర్ని నానితో ఇండస్ట్రీ నిర్మాతలు భేటీ అయ్యారు. డీవీవీ దానయ్య, మైత్రి నవీన్, దిల్ రాజు వంటి వారు మంత్రితో చర్చించారు. అనంతరం మీడియాతో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘వకీల్ సాబ్ సినిమా సమయంలోనే జీవోలు రావడం, వాటిపై మిస్ కమ్యూనికేషన్స్ జరిగాయి. అయితే సినిమా అనేది చాలా సున్నితం.. దాని వల్ల ఇబ్బంది పడేది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లు. ఆ ప్రభావం అంతా కూడా మా మీదే పడుతుంది. సినిమా పరిశ్రమను కాంట్రవర్సీగా తీసుకెళ్లకండి. మా సమస్యలు పరిష్కరిస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని సున్నితంగా చూస్తూ మా సమస్యలు పరిష్కరిస్తు

YSRCP: వెంట్రుక పీకి సవాల్ చేసిన పవన్ కళ్యాణ్.. యుద్దం సైజ్‌ ఎలా కావాలో కోరుకోండమ్మా అంటూ పీకే విశ్వరూపం

Image
పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసేనాని కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇప్పటి వరకూ సోషల్ యాక్టివిస్ట్‌గానే ఉన్నానని.. ఇప్పటి నుంచి రాజకీయాలు మొదలుపెడతానంటూ వైసీపీ నాయకులకు సవాల్ చేశారు. నా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరమో.. మీ ఇంటి నుంచి నా ఇంటికి అంతే దూరం అనే విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తించుకోవాలన్నారు. ఈ సందర్భంలో వైసీపీ పార్టీ నాయకులు తనపై చేస్తున్న వ్యాఖ్యల్ని తిప్పికొడుతూ తనదైన శైలిలో ప్రసంగించారు పవన్ కళ్యాణ్. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం కమ్మవారి సమాజాన్ని దాడి చేసుకుంటూ వెళ్లిపోతే ప్రతి ఒక్కరూ ఏదో ఒక కులానికి చెందాలి కదా.. మాకు వేరే ఛాయిస్ లేదు. కాశ్మీర్ పండింట్‌లను తరిమేసినట్టుగా.. ఒక జాతిని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేస్తానంటే తప్పు కదా.. అలా చేయకూడదు.. మానవత్వం కాదు. ఇలాంటి దాడులు, బాధితులకు అండగా ఉంటానని మాట ఇస్తున్నా. వైసీపీ పార్టీకి వాళ్లు నన్ను యుద్దానికి రమ్మని పిలిచారు.. నేను అడగలేదు.. మీరే కవ్వించారు.. మీరే పిలిచారు.. మీరే మా వాళ్లని కొట్టారు.. మా ఆడ బిడ్డల ఒంటిపై చేయి వేశారు.. అక్రమ కేసులు పెట్టారు. ఎస్‌సి ఎస్టీ అబ్రాసిటీ కేసులు పెట్టిస్తున్నారు. మీలాంటి వాళ్లని ఆంధ్రప

Allu Arjun: అల్లు అర్జున్‌కు గన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ఫ్యాన్.. ఆ గన్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?

Image
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగులో ఉన్న క్రేజేంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే కెరీర్ ప్రారంభం నుంచి తెలుగుతో పాటు మ‌ల‌యాళంలోనూ అభిమానుల‌ను సంపాదించుకున్నారు. బ‌న్ని సినిమాల‌న్నీ మ‌ల‌యాళంలో అనువాద‌మ‌వుతుంటాయి. అలా అనువాద‌మైన తెలుగు చిత్రాల‌న్నీ అక్క‌డ ఘ‌న విజయాన్ని సాధించిన‌వే. మ‌లయాళ సినీ ఇండ‌స్ట్రీలో అగ్ర హీరోల‌కు ఎంత క్రేజ్ ఉంటుందో తెలుగువాడైన అల్లు అర్జున్‌కు కూడా ఉందన‌డంలో సందేహం లేదు. ఓ సంద‌ర్భాన మ‌ల‌యాళ ముఖ్య‌మంత్రి కేర‌ళ‌లో జ‌రిగే ప‌డ‌వ ఉత్స‌వాల‌కు అల్లు అర్జున్‌ను ప్ర‌త్యేక అతిథిగా ఆహ్వానించ‌గా బ‌న్నీ హాజ‌ర‌య్యారు. మ‌ల‌యాళంలో ఇంత క్రేజ్ ఉన్న అల్లు అర్జున్‌, ఓ మ‌ల‌యాళ అభిమాని ఓ గ‌న్‌ను బ‌హుమ‌తిగా అందించారు. అయితే స‌ద‌రు అభిమాని ఇండియాలో కాకుండా,యు.ఎ.ఇలో ఈ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను అందించ‌డం విశేషం. కొన్నాళ్లు ముందు యు.ఎ.ఇకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. బన్నీ యు.ఎ.ఇలో ఉన్నాడ‌నే సంగ‌తి తెలుసుకున్న దుబాయ్‌కు చెందిన మ‌ల్టీ మిలియ‌నీర్ రియాజ్ కిల్ట‌న్ అక్క‌డ‌కు వెళ్లి క‌లుసుకున్నాడు. స‌రే! బ‌న్నీకి ఈ గిఫ్ట్ ఇవ్వ‌డం వెనుక‌, అస‌లు క‌థేంటో తెలుసా..బ‌న్నీకి అందించిన గిఫ్ట్ 160 స

నాకు అన్యాయం చేసింది.. జీవితపై నరేష్ సంచలన కామెంట్స్

Image
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల రచ్చ సోషల్ మీడియాలో ఎంతటి రచ్చకు దారి తీస్తోందో అందరికీ తెలిసిందే. ప్రకాష్ రాజ్, ప్యానెల్స్ మధ్యే ఈ పోటీ జరుగుతోంది. ఇక బండ్ల గణేష్ అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నాడు. ఈ రెండు ప్యానెల్స్ నామినేషన్స్ వేసేశాయి. ఇక మంచు విష్ణు, ఆయన ప్యానెల్ తరుపున మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ఒకే ప్యానెల్ గెలిస్తే మంచిదని, రెండు ప్యాన్సల్స్‌లో మెజార్టీలు గెలిస్తే ఇబ్బందులు ఏర్పడతాయన్నట్టుగా చెప్పుకొచ్చారు. జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్‌ను రఘుబాబు గెలిపించాడు. జనరల్ సెక్రటరీగా గెలిచింది. కానీ ఆమె నాకు అన్యాయం చేసింది. అవన్నీ నేను చెప్పదల్చుకోలేను. నేను ఎవ్వరినీ వ్యక్తి గతంగా నిదించాలని అనుకోవడం లేదు. నమ్మడం, నా పక్కన నిలబెట్టుకోవడం.. నా తప్పు అని నరేష్ సంచలన కామెంట్స్ చేశాడు. ఈ సారి మాత్రం విష్ణు ప్యానెల్‌ను గెలిపించండి అని నరేష్ కోరాడు. ప్రకాశ్‌ రాజ్‌ తనకు మంచి స్నేహితుడని నరేష్ అన్నాడు. మంచు విష్ణు ఇక్కడే అందరికీ అందుబాటులో ఉంటాడని, ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు సరైనవాడని చెప్పుకొచ్చాడు. తనది కృష్ణుని పాత్ర అని, ‘మా’ కోసం మంచు

సమంత వదిన సక్కగా సంసారం చేసుకో.. ఏం జరిగిందో నాకు తెలుసు.. శ్రీరెడ్డి వీడియో వైరల్

Image
నాగ చైతన్య విడాకుల వ్యవహారం నెట్టింట్లో ఎంతగా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారం మీద ఏ ఒక్కరూ నోరు విప్పడం లేదు. అసలు సంగతి ఇదీ అని ఆ ఇద్దరిలో ఎవ్వరూ కూడా ప్రత్యక్షంగా స్పందించడం లేదు. క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ సమంత మాత్రం అప్పుడప్పుడు పరోక్షంగా కొన్ని పోస్ట్‌లు చేస్తోంది. వేధాంత దోరణిలో మాట్లాడుతోంది. ప్రేమ సూక్తులను వల్లిస్తోంది. నిజం ఎప్పటికీ దాగదు అంటూ కామెంట్లు చేస్తోంది. ఇలా సమంత నర్మగర్భంగా చేసే పోస్ట్‌లతో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. సమంత చైతన్య విడాకులు దాదాపుగా ఖరారు అయ్యాయని, సమంతకు భరణంగా దాదాపు 300 కోట్లు చెల్లిస్తున్నారంటూ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విడాకుల రూమర్లపై శ్రీరెడ్డి స్పందించింది. ఎప్పుడూ సమంతను ఏకిపారేస్తూ విమర్శలు చేసే ఈ సారి ఎంతో పద్దతిగా మాట్లాడింది. సమంతకు తోటి అమ్మాయిలా మంచి సలహాలు ఇచ్చింది. ఈ మేరకు శ్రీరెడ్డి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ‘మీ ఇద్దరినీ మేమందరం ఆశీర్వదీస్తున్నాం. మీ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఎంతో మంది స్ఫూర్తిదాయకమైన జంటగా ఉండాలి. మిమ్మల్ని చూసి ఎంతో మంది ఇన్ స్పైర్ అవుతుంటారు. ఏమైనా జరిగి ఉండొచ్చ

లవ్ స్టోరీ 5 డేస్ కలెక్షన్స్.. ఊహించని విధంగా డ్రాప్! కారణం అదేనా..?

Image
అక్కినేని నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా రూపొందిన '' మూవీ కలెక్షన్స్ పరంగా ఫర్వాలేదనిపించుకుంటూ దూసుకుపోతోంది. కరోనా దెబ్బకు కుదేలైన సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో థియేటర్స్‌లో 'లవ్ స్టోరీ' మూవీ రిలీజ్ ట్రేడ్ వర్గాల్లో ఆశలు చిగురింపజేసింది. గత శక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి నాలుగు రోజులు చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబట్టి ఐదో రోజు మాత్రం ఊహించని విధంగా డ్రాప్ అయింది. గులాబ్ తుఫాన్ కారణంగా కలెక్షన్స్ కాస్త తగ్గినట్లు చెబుతున్నారు ట్రేడ్ పండితులు. నాలుగో రోజు 2.52 కోట్ల షేర్ అందుకున్న లవ్ స్టోరీ సినిమా ఐదో రోజున కేవలం 1.26 కోట్ల షేర్ సాధించింది. ఈ డ్రాప్‌కి కారణం వర్షాలే అని తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్‌కి దగ్గరలో ఉన్న ఈ సినిమా ఈ వీకెండ్ ముగిసే సరికి లాభాల్లోకి వస్తుందని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి నాలుగు రోజుల రిపోర్ట్ చూస్తే.. Day 1- 7.13 కోట్లు, Day 2- 5.08 కోట్లు, Day 3- 5.19 కోట్లు, Day 4- 2.52 కోట్లు, Day 5- 1.26 కోట్లు, మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ నాలుగు రోజుల్లో లవ్ స్టోరీకి 21.18 కోట్లు నికర, 34 కోట్లకుపైగా గ్ర

పెళ్లి సందD 'మధురా నగరిలో' సాంగ్ రిలీజ్: దొరక్క దొరక్క దొరికింది తళుక్కు చిలక ఇది..

Image
గత 25 ఏళ్ల క్రింద ‘పెళ్లి సందడి’ పేరుతో సినిమా తీసి రికార్డులు తిరగరాసిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇప్పుడు మోడ్రన్ ప్రేక్షకుల కోసం మోడ్రన్ ''తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రోషన్, శ్రీ లీల హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమాకు గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌‌‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'మధురా నగరిలో' అంటూ సాగిపోతున్న మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. మాస్ మహారాజ్ రవితేజ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సాంగ్ లాంచ్ చేస్తూ పెళ్లి సందD యూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు. ''దొరక్క దొరక్క దొరికింది తళుక్కు చిలక ఇది..'' అంటూ క్లాస్ బీట్‌తో రూపొందిన ఈ పాటలో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, రాఘవేంద్రుడి మార్క్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. కీరవాణి బాణీలు పాటలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్ బ్యానర్స్‌పై కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌ సమర్పణలో రూపొందుతు

ఆ దేవుడే ఇలా చేసి ఉంటాడు.. ఇండస్ట్రీలో ఆయనలాంటి వారొక్కరే.. పూనమ్ కౌర్ ఎమోషనల్

Image
సాయి ధరమ్ తేజ్‌కి యాక్సిడెంట్ జరగడం ఏంటో.. ఆయన సినిమా రిపబ్లిక్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రావడం ఏంటో.. ఆ ఈవెంట్‌లో రాజకీయ కామెంట్లు చేయడం ఏంటో గానీ.. వాటికి ప్రతి స్పందనగా వైసీపీ మంత్రులు రియాక్ట్ అవ్వడం వరకు బాగానే ఉంది. ఆ తరువాత పోసానీ కృష్ణమురళీ ఎంట్రీ ఇచ్చి నానా రచ్చ చేసేశాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోని ఓ పంజాబీ అమ్మాయి అంటూ పేరు ఎత్తడం, ఆమెకు జరిగిన అన్యాయం, ప్రేమ, పెళ్లి, గర్భం, అబార్షన్ అంటూ కొత్త టాపిక్‌ను లైన్‌లోకి తెచ్చాడు. అలా మొత్తానికి టాపిక్ అంతా కూడా చుట్టూ చేరింది. పంజాబీ నటి అంటే అందరూ కూడా పూనమ్ కౌర్‌ అనే అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ విషయం గురించి గతంలో ఎన్నో సార్లు చర్చలు జరిగాయి. కత్తి మహేష్ ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ అంటూ ఎన్నెన్నో ఆరోపణలు చేశాడు. పూనమ్ కౌర్ సైతం ఎన్నో సందర్భాల్లో నర్మగర్భంగా ట్వీట్లు వేస్తూ టాలీవుడ్ టాప్ దర్శకుడు, పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేస్తూ వచ్చేది. కొన్ని సందర్భాల్లో అయితే పవన్ కళ్యాణ్‌ను వెనుకేసుకుని వచ్చేది. గురూజీ అంటూ ఇండస్ట్రీలోని ఓ దర్శకుడిని పూనమ్ దారుణంగా ఏకిపారేసింది. అయితే ఇప్పుడు పూనమ్ కౌర్ వార్

నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి.. భార్య స్నేహా రెడ్డిపై అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్

Image
టాలీవుడ్ క్రేజీ కపుల్స్‌లో ఒకటి అల్లు అర్జున్- జోడీ. మార్చి 6, 2011న అంగరంగ వైభవంగా ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట పదేళ్లుగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయిస్తుంటారు స్టైలిష్ స్టార్. ఈ జంటకు 2014లో కొడుకు అయాన్, 2016లో కూతురు అర్హ పుట్టారు. ఏ మాత్రం వీలు కుదిరినా భార్యాపిల్లలతో ఫ్యామిలీ టూర్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు . అయితే నేడు (సెప్టెంబర్ 29) అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా భార్యకి ఎంతో స్పెషల్‌గా విషెస్‌ చెబుతూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ మెమరబుల్, స్పెషల్ ఫొటో షేర్ చేశారు అల్లు అర్జున్. ''నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ లాంటి వ్యక్తి నా జీవితంలో భాగం పంచుకోవడం నిజంగా నా అదృష్టం. ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకల్లో నీతో గడపాలని కోరుకుంటున్నాను. హ్యాపి బర్త్‌ డే క్యూటీ'' అని పేర్కొన్నారు అల్లు అర్జున్. బన్నీ పెట్టిన ఈ పోస్ట్ చూసి పలువురు సినీ ప్రముఖులు, ఆయన ఫ్యాన్స్ స్నేహాకు బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్

ఆమెకు సపోర్ట్ చేస్తే.. ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా.. నాగబాబు సంచలన కామెంట్స్

Image
మెగా బ్రదర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక నాగబాబు కౌంటర్లు వేసేందుకు రంగంలోకి దిగిన తలపండిన దిగ్గజ మీమర్లు సైతం షాక్ అవ్వాల్సిందే. మీమ్స్, ట్రోల్స్ వేయడంలో నాగబాబు ఎంతటి సమర్థుడో అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కాస్త స్లో అయిన నాగబాబు మళ్లీ లైన్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూల మీద నెటిజన్లు ప్రశ్నలు వేయడం, నాగబాబు తన స్టైల్లో కౌంటర్లు వేయడం జరిగింది. ఈ క్రమంలో మెగా అభిమానులు ఎక్కువగా పోసానీ మీడియా సమావేశం మీదే ప్రశ్నలు సంధించారు. ఇక పవన్ కళ్యాణ్‌ను గతంలో పోసానీ పొగిడిన వీడియోలను పెడుతూనే తన ఉద్దేశ్యం ఏంటో నాగబాబు చెప్పేశారు. అప్పుడు అలా మాట్లాడిన వాడే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు అంటూ కౌంటర్లు వేసేశాడు. అయితే ఓ నెటిజన్ మాత్రం , ఐపీఎల్ గురించి ప్రశ్నించాడు. ఈ రెంటిలో దేన్ని ఫాలో అవుతున్నారు అని అడిగేశాడు. అయితే ఆ ప్రశ్నకు నాగబాబు తన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. బిగ్ బాస్ చూడకుండా ఐపీఎల్ చూస్తూ.. నా బిడ్డలాంటి ప్రియాంక సింగ్‌కి సపోర్ట్ చేస్తే.. ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా మావా.. అంటూ సెటైర్ వేశాడు. బిగ్ బాస్ షో ప్రారంభ సమయంలోనే నాగబాబు ఓ వీడి

Samantha Ruth Prabhu: అవన్నీ రూమర్లే.. ఎట్టకేలకు నోరు విప్పింది.. మొదటిసారి స్పందించిన సమంత

Image
అక్కినేని నాగచైతన్య, అక్కినేని మధ్య మనస్పర్దలు వచ్చాయని, విడాకులు తీసుకుని విడిపోనున్నారని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా స‌మంత హైద‌రాబాద్ విడిచిపెట్టేయ‌నుంద‌ని, ముంబైలో సెటిల్ అవుతుంద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే అటు నాగ‌చైత‌న్య‌, ఇటు స‌మంత ఎవ‌రూ ఈ వార్త‌ల‌పై స్పందించ‌లేదు. మీడియా, అభిమానులు వివిధ మాధ్య‌మాల ద్వారా ప్ర‌శ్నించిన‌ప్ప‌టికీ ఇద్ద‌రూ స‌మాధానాన్ని దాట‌వేశారు. అయితే ల‌వ్‌స్టోరి ప్ర‌మోష‌న్స్ స‌మయంలో, ల‌వ్‌స్టోరి స‌క్సెస్ త‌ర్వాత కూడా స‌మంత ఎక్క‌డా క‌నిపించలేదు. దీంతో అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు, మీడియా.. చైత‌న్య‌, సామ్ విడిపోవ‌డం ప‌క్కా అని ఫిక్స్ అయిపోయారు. మీడియాకు క‌న‌ప‌డ‌కుండా, ఒక‌వేళ క‌న‌ప‌డినా స‌మాధానాన్ని దాట‌వేస్తూ వ‌చ్చిన స‌మంత ఎట్ట‌కేల‌కు రీసెంట్‌గా త‌న‌పై వ‌స్తున్న రూమ‌ర్స్‌కు క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నాన్ని చేసింది. వివ‌రాల్లోకెళ్తే.. సినిమాల‌కు సంబంధం లేకుండా స‌మంత త‌న సంపాద‌న‌తో సాకి అనే డ్రెస్ స్టోర్‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కంపెనీ స్టార్ట్ చేసి ఏడాది పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా, ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన ప్ర

పోసాని కృష్ణ మురళిపై మెగా డాటర్ ఫైర్.. మెంటల్‌ ఆస్పత్రిలో వేయండి అంటూ నిహారిక షాకింగ్ కామెంట్స్

Image
'రిపబ్లిక్' ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌పై జనసేనాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ వైసీపీ కార్య‌క‌ర్త‌, టాలీవుడ్ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్‌తో నీకు పోలికేంటి అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై మెగా డాటర్ మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పోసాని కృష్ణ మురళిని వెంటనే మెంటల్‌ ఆస్పత్రిలో చేర్పించాలంటూ సంచలన కామెంట్స్ చేశారు. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా మెంటల్ కృష్ణ అంటూ నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ 'రిపబ్లిక్' సినిమా వేదికపై ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని నిహారిక చెప్పారు. జగన్‌ని పవన్ విమర్శించారనే పోసాని అలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. పోసాని ఓ మానసిక రోగి అని, ఆయన్ను వెంటనే మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఇష్యూపై, పోసాని తీరుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాంటి వారిని అస్సలు వదలొద్దని న

NagaBabu - Posani: పేర్నినాని చెత్త‌ కుప్ప‌, పోసానిని కుక్కతో పోల్చిన నాగబాబు... మీమ్స్, వీడియోలతో వైసీపీ నేత‌ల‌కు ఘాటు రిప్లయ్

Image
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ చేసిన వ్యాఖ్య‌ల‌పై వైసీపీ కార్య‌క‌ర్త‌, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి త‌న‌దైన శైలిలో ఘాటుగా స్పందించిన సంగ‌తి తెలిసిందే. మాటలు హ‌ద్దులు దాటేసి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే కాదు, పోసాని ఓ అడుగు ముందుకేసి ప‌వ‌న్‌ను చెప్ప‌లేని బూతు మాట‌ల‌తో దూషించాడు. దీనిపై ఇప్ప‌టికే పోసాని కృష్ణ‌ముర‌ళిపై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కేసులు పెట్టారు. ఇప్పుడు పోసాని వ‌ర్సెస్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అన్న‌ట్లు వ్య‌వ‌హారం త‌యారైంది. సోష‌ల్ మీడియాలో అనుకూల వ్య‌తిరేఖ పోస్టులు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. పోసాని ప‌వ‌న్‌పై చేసిన విమ‌ర్శ‌ల‌కు బ‌దులిస్తూ ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు ఆస్క్ మీ అంటూ ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చారు. మీమ్స్, వీడియో సెటైర్స్‌తో విరుచుకుప‌డ్డారు. అనేక ప్ర‌శ్న‌ల‌కు మీమ్స్‌తోనే స‌మాధానం ఇచ్చారు. ఆన్‌లైన్ టికెట్స్‌ను ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌డంపై అభిమానులు అడిగిన ప్ర‌శ్నకు నాగ‌బాబు స‌మాధానమిస్తూ విక్ర‌మార్కుడు సినిమాలో ర‌వితేజ‌, బ్ర‌హ్మానందం దోచేసిన సొమ్మును పంచుకునే సంద‌ర్భంలో చిన్న‌ప్ప‌ట్నుంచి చూస్తున్న ఎప్పుడైనా స‌మానంగా పంచావురా.. మోసం చేసినోడెవ‌డు బాగుప‌డ‌డురా అని బ్ర‌హ్మ

వెంకీ మామ వదిలిన 'నాట్యం' సాంగ్.. మరో 'స్వర్ణ కమలం' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Image
డాన్స్ ప్రధాన భూమికగా గతంలో వచ్చిన 'స్వర్ణ కమలం' మూవీ తెలుగు ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోయింది. మళ్ళీ ఇన్నేళ్లకు అదే బాటలో 'నాట్యం' అనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. డాన్సింగ్ నేపథ్యంలో రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా . ఈ సినిమాతో ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాఫ‌ర్‌గా, ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌గా, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకొని అక్టోబ‌ర్ 22న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్, టీజ‌ర్‌కు ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇటీవ‌ల న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ఆవిష్క‌రించిన ఫస్ట్ సాంగ్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో చేతుల మీదుగా మరో సాంగ్ 'పోనీ పోనీ' లిరికల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. ''రేవంత్ దర్శకత్వంలో డాన్సర్ సంధ్య నటించిన నాట్యం సినిమా నుంచి ఈ పోనీ పోనీ సాంగ్ రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. విలక్షణ కథకు ఎమోషన్స్ కలగలిపి రూపొందించారు. చ

మన జర్నీ ఆగొద్దు.. మా ప్రయాణం నిలిచిపోతుందని ఎంతో ఫీల్ అయ్యా.. నాగ చైతన్య కామెంట్స్ వైరల్

Image
నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన '' సినిమా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది. సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంతా ఊహించినట్లుగానే మంచి సక్సెస్ అందుకోవడంతో హైదరాబాద్‌లోని హోటల్ 'ట్రైడెంట్'లో గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో , సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్ కాగా.. ముఖ్య అతిథిగా నాగార్జున విచ్చేశారు. ఈ సందర్భంగా వేదికపై నాగ చైతన్య మాట్లాడుతూ.. ''నా ప్రతి సినిమా విడుదలైన తొలిరోజు ప్రేక్షకుల స్పందన ఏంటి? క్రిటిక్స్‌ ఏమంటున్నారు? అని తెలుసుకుంటా. వాటిని బట్టి ముందుకెళ్తుంటా. కొవిడ్‌ కారణంగా కొన్నాళ్లు దీనికి దూరమయ్యా. ఈ నెల 24న ‘లవ్‌ స్టోరీ’ విడుదల కావడంతో ఎంతో ఆనందించా. థియేటర్‌కి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా థ్యాంక్స్‌. దర్శకుడు శేఖర్‌ కమ్ముల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. దర్శకుడు శేఖర్ కమ్ముల గారి కంటెంట్, ఆయనకున్న గుడ్ విల్ ఎంత ఉందో ఇవాళ లవ్ స్టోరీ సక్సెస్ చూపిస్తోంది. మన జర్నీ ఆగొద్దు, ఇకపైనా మంచి సినిమాలు చేద్దాం. ఈ సినిమా విడుదలతో మా ప్ర