‘సలార్’ చేయడం వల్ల ఆ ఫీలింగ్ వస్తుంది.. పాన్ ఇండియా సినిమాపై శృతి హాసన్ కామెంట్స్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి . ఒక నటిగానే కాదు, గాయినిగా, సంగీత దర్శకురాలిగా ఆమె ప్రేక్షకులను అలరించింది. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ వరుస నిమిాలు చేస్తూ.. ఒకప్పుడు నెం.1 హీరోయిన్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, సినిమాలకు బ్రేక్ ఇచ్చింది శృతి అయితే ఈ ఏడాది మళ్లి వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇప్పటికే ‘క్రాక్’, ‘వకీల్‌సాబ్’ సినిమాలతో రెండు హిట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇక శృతి హాసన్ నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘’. యంగ్ రెబల్‌స్టార్ హీరోగా.. ‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన ఒక ఏడాదిలో తెలుగు, తమిళ, హింది భాషల్లో ఒక సినిమా చేయాలని ఒక నియమం పెట్టుకున్నాను అని.. అలా చేయడం ద్వారా అన్ని భాషల్లో కథ, మరియు పాత్రలపై పట్టు సంపాదించే అవకాశం ఉంటుదని తన నమ్మకం అని పేర్కొంది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఒక్కోసారి ఏడాదికి ఒకే సినిమా చేయాల్సి వస్తుందని ఆమె తెలిపింది. అయితే సలార్ పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఐదు భాషల్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ సినిమాలో నటిస్తే.. ఒకే సారి ఐదు భాషల్లో సినిమా చేసిన ఫీలింగ్ ఉంటుందని.. ఈ సినిమా ఒప్పుకోవడానికి ఇది కూడా ఒక కారణం అని ఆమె తెలిపింది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘రాజమన్నార్’ అనే మరో కీలక పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ